BHPL: గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో దోమల పెరుగుదలపై సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. గ్రామంలో దోమల తీవ్రతతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో సమస్యను పరిశీలించి నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా పంచాయతీ సిబ్బందితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దోమల నివారణ మందును పిచికారీ చేయించారు.