TCL నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. రూ.1.10 లక్షల విలువైన 55 అంగుళాల 4K QLED టీవీ ఇప్పుడు ఏకంగా 66% డిస్కౌంట్తో కేవలం రూ.36,990కే అమెజాన్లో లభిస్తోంది. HDFC కార్డుతో మరో రూ.3,000 తగ్గుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ అట్మాస్ సౌండ్, గూగుల్ టీవీ వంటి హైఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ రేటుకు బెస్ట్ టీవీ కావాలంటే ఇదే ఛాన్స్.
బంగారం ధరలు ఉదయం తగ్గి సాయంత్రానికి భగ్గుమన్నాయి. హైదరాబాద్లో గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. 24 క్యారెట్ల తులం బంగారం రూ.440 పెరిగి ఏకంగా రూ.1,30,750కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,850 వద్ద ఉంది. ఇక వెండి కిలో రూ.2,09,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేట్లు ఉండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.
వరుసగా మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్ 426.86 పాయింట్లు ఎగబాకి 84,818 వద్ద ముగియగా.. నిఫ్టీ 140.55 పాయింట్లు లాభపడి 25,899 వద్ద స్థిరపడింది. ఇన్నాళ్లు పడుతూ లేస్తూ వచ్చిన సూచీలు.. ఈరోజు కొనుగోళ్ల మద్దతుతో గ్రీన్ జోన్లో ముగిశాయి.
VSP: సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో నెలగంట ఉత్సవాన్ని ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 1:01కు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఆలయ సభ్యులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో ఆలయంలో 10 రోజులు పగల్ పత్తు, మరో 10రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మరో ఐదు రోజులు దారోత్సవాలు, ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు తిరుప్పావై పాశురాల పఠనం చేస్తారన్నారు.
VSP: ఫ్రీ బస్ పథకం వల్ల విశాఖలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కాలేజీలు, ఆఫీసు టైముల్లో రద్దీ తీవ్రంగా ఉంది. మొత్తం 736 RTC బస్సుల్లో 575 బస్సులు ఫ్రీ బస్ పథకంలో నడుస్తున్నాయి. ముందుగా 60% పురుషులు, 40% మహిళలు ప్రయాణించగా ఇప్పుడు 75% మహిళలే వస్తున్నారు. మరో 170 బస్సులు పెరిగితే రద్దీ తగ్గుతుందని ఆర్ఎం బి. అప్పలనాయుడు చెప్పారు.
నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఈ నెల 4తో గడువు ముగియగా.. ఇవాళ్టి వరకు అవకాశమిచ్చారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు, లైబ్రేరియన్ తదితర పోస్టులు ఉండగా.. సంబంధిత అకమిక్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించే ఇంటరాక్టివ్ కార్యక్రమం పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జనవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Innovaindia1.MYGOV.IN ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించిన నిర్వహణ తేదీని ఇంకా ప్రకటించలేదు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజును బుధవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ కళాశాలల్లో ఈనెల 20 వరకు ఆలస్యం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. రూ. 200 జరిమానాతో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉందని అధికారులు తెలిపారు.
టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే ఏడాదిలో తన మొదటి ఏఐ-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయనుంది. వీటిని తయారు చేసేందుకు శాంసంగ్, జెంటిల్ మాన్స్టర్స్తో కలిసి పనిచేస్తోంది. జెమిని ఏఐ అసిస్టెంట్తో కూడిన ఆడియో-ఓన్లీ గ్లాసెస్, నావిగేషన్ కోసం డిస్ప్లే-ఎనేబుల్డ్ గ్లాసెస్ను అందుబాటులోకి తీసుకురానుంది. మెరుగైన ఏఐ టెక్నాలజీతో వీటిని తయారు చేస్తోంది.
గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఉన్న 13 భద్రతా బగ్లను గూగుల్ తాజాగా పరిష్కరించింది. వీటిల్లో ఒకదాన్ని ముంబైకి చెందిన ఇంజినీర్ శ్రేయస్ గుర్తించారు. దీనిని ఉపయోగించి హ్యాకర్లు యూజర్ల సున్నితమైన సమాచారాన్ని దోచుకునే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో యూజర్లు క్రోమ్ బ్రౌజర్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
2030 నాటికి భారత్లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధికారులు వెల్లడించారు. ఏఐ, వ్యాపార విస్తరణపై ఈ డబ్బును వెచ్చించనుంది. 2010 నుంచి ఇప్పటివరకు అమెజాన్ భారతదేశంలో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అలాగే, భారత్లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఇప్పటికే ప్రకటించారు.
మీషో షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. NSEలో 46 శాతం ప్రీమియంతో, BSEలో 45.23 శాతం ప్రీమియంతో రూ.161.20 వద్ద లిస్ట్ అయ్యాయి. సాఫ్ట్బ్యాంక్ మద్దతు కలిగిన ఇ-కామర్స్ సంస్థ మీషో రూ.5,421 కోట్ల ఐపీఓ డిసెంబర్ 3 నుంచి 5 మధ్య సబ్స్క్రిప్షన్కు వచ్చింది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.105-111గా నిర్ణయించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 84,789 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 25,856 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.07గా ఉంది.
AP: రాష్ట్రంలో నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(TET) ప్రారంభం కానున్నాయి. రోజూ 2 సెషన్ల(9:30AM-12PM, 2:30PM-5PM)ల్లో ఈ నెల 21 వరకు ఆన్లైన్లో జరగనున్నాయి. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గంట ముందుగానే తమ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు.