KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరకు నిర్దేశించగా.. ప్రస్తుతం ఈ నెల 21వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు.
SRD: మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు సమీపంలోని మైనార్టీ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.
NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ లో చూడాలన్నారు.
కోనసీమ: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా BC సంక్షేమ సాధికారత అధికారి సత్యరమేష్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్ధులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ప్రపంచ ఆర్థిక దృక్పథం వేగంగా మారుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ‘ప్రస్తుత వాణిజ్య చర్యలు అనిశ్చితులను తీవ్రతరం చేశాయి. ప్రపంచవ్యాప్త పరిస్థితులు రూపాయిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్థిరత్వం సాధించేందుకు ద్రవ్య పరపతి విధానం కీలకపాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద ప్రతిపాదికన దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ ఓ డాక్టర్ దేవి పేర్కొన్నారు. క్లినికల్ సైకాలజిస్ట్-1, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్-1, ఆప్టోమెట్రిస్ట్-1, ఫార్మసిస్ట్-1, డీఈవో-1, లాస్ట్ గ్రేట్ సర్వీస్-1 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
KDP: సింహాద్రిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ స్వర్ణలత తెలిపారు. పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో సీబీఎస్ఈ సిలబస్ బోధన ఉంటుందన్నారు.
KMM: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోదులబండలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. క్వింటాకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.
TG: రాష్ట్రంలో EAPCET-2025 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి.
NTR: మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏప్రిల్ 4న జాబ్ మేళా నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి శనివారం తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్ మీడియెట్, ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. జాబ్ మేళాలో 20కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
KRNL: దేవనకొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 6వ తరగతి, 11వ తరగతుల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
వాట్సాప్ స్టేటస్కు మ్యూజిక్ యాడ్ చేసుకునే కొత్త ఆప్షన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, యాడ్ స్టేటస్పై క్లిక్ చేసి.. నచ్చిన ఫొటోను ఎంచుకోవాలి. దీంతో స్క్రీన్పై క్రాప్, స్టిక్కర్, టెక్స్ట్, ఎడిట్ ఆప్షన్లతో పాటు మ్యూజిక్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి నచ్చిన పాటను ఎంచుకోవచ్చు. అయితే ఫొటోకు 15 సెకన్లు, వీడియోకు 60 సెకన్ల వరకు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు.
కృష్ణా: KRU పరిధిలో ఇటీవల నిర్వహించిన MBA,MCA కోర్సుల 1,3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలపై అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని KRU సూచించింది. రీవాల్యుయేషన్కై ఏప్రిల్ 15లోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ASR: రాజవొమ్మంగిలో ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ఉపాధి APO రెడ్డిబాబు శుక్రవారం తెలిపారు. టెన్త్ ఆపై చదివిన, 18 -35 లోపు వయసు కలిగిన యువతీ యువకులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. ఉపాధి పనులు 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాల వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
దేశవ్యాప్తంగా ర్యాపిడో పింక్ మొబిలిటీ సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. భారత్లో 2 లక్షల మంది మహిళలను కెప్టెన్లుగా మార్చాలని యోచిస్తోంది. రాబోయే మూడేళ్లలో ఈ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మహిళా డ్రైవర్లతో ఈ సేవలను ప్రారంభించగా.. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.