ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దాదాపు 22వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై మైక్రోసాఫ్ట్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్స్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. 100 శాతం ఉద్యోగుల కోత అవాస్తవమని స్పష్టం చేశారు.
బంగారంలాగే వెండి ఆభరణాలకు కూడా హాల్మార్క్ (Hallmark) తప్పనిసరి చేసే యోచనలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెండి ధరలు భారీగా పెరగడంతో నాణ్యత ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెండిపై హాల్మార్క్ స్వచ్ఛందం మాత్రమే కాగా, త్వరలో నిబంధనలు మారే అవకాశం ఉంది.
KMM: ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జరగకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా గతంలో కోడిపందేలు, పేకాట స్థావరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాలని, అదేవిధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
AP: ఈనెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే, బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలో 5 రోజుల పని దినాల కోసం ఈనెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు.
TPT: ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో ప్రాజెక్టు అసోసియేట్-01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. BSc డిగ్రీ ఇన్ సైన్స్/ డిప్లొమా / B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 09. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in /Project_Positions వెబ్ సైట్ చూడాలి.
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(CSL)లో 210 వర్క్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు టెన్త్తోపాటు సంబంధిత ట్రేడ్లో ITI పాసై ఉండాలి. కేటగిరీల వారీగా గరిష్ఠ వయో పరిమితి 45 ఏళ్ల వరకు ఉంది. ఈనెల 23 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
PDPL: గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కోర్టు శిక్షలు విధించింది. మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న 13 మందిని మేజిస్ట్రేట్ దుర్వ వెంకటేష్ ముందు హాజరుపరచగా, 12 మందికి రూ.28 వేల జరిమానా విధించారు. రెండోసారి పట్టుబడిన వ్యక్తికి 5 రోజుల జైలు శిక్ష పడిందని, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు.
TG: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని TSPRB ఛైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. వీటికి జనవరి 20 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పొడిగించబడదని స్పష్టం చేశారు.
ఆధార్ PVC కార్డు పొందేందుకు చెల్లించాల్సిన ధరను పెంచినట్లు ఉడాయ్ ప్రకటించింది. కార్డు ఫీజును రూ.50 నుంచి రూ.75కి పెంచినట్లు తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ధర అమల్లోకి వచ్చినట్లు చెప్పింది. myAadhaar వెబ్సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా చేసే అన్ని కొత్త అభ్యర్థనలకు ఈ ధర వర్తిస్తుందని తెలిపింది. 2020 నుంచి కార్డు ధరలను పెంచడం ఇదే తొలిసారి.
RBIలో 93 కాంట్రాక్ట్(ఫుల్ టైమ్) ఉద్యోగాలకు అప్లై చేయడానికి గడువు ఈ రోజుతో ముగుస్తోంది. పోస్టును బట్టి BSc, MSc, BE, BTech, MTech, CA, MCA, PhD, CMA, MBA, LLB, LLM ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TG: ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో చదివే ఫస్టియర్ విద్యార్థులకు ఊరట లభించింది. గతేడాది నవంబర్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం ప్రైవేట్ కాలేజీలు బంద్ చేపట్టగా.. JNTU పరీక్షలను వాయిదా వేయలేదు. దీంతో వేల మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వారికి ఈనెల 27, 29న ఫస్టియర్ 2వ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని JNTU ప్రకటించింది.
ఆర్థిక కష్టాల సమయంలో పీఎఫ్ ఖాతా నుంచి బీమా ప్రీమియంను చెల్లించేందుకు EPFO వెసులుబాటు కల్పిస్తోంది. యాక్టివ్ పీఫ్ అకౌంట్ ఉన్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని చెప్పింది. అయితే బీమా పాలసీ చందాదారుడి పేరు మీదే ఉండాలని తెలిపింది. జీవిత భాగస్వామి లేదా పిల్లల మీద ఉంటే పాలసీ ప్రీమియంలు, ఇతర ప్రైవేటు బీమా ప్రీమియంలను చెల్లించడానికి వీలు ఉండదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు జనవరి 10 వరకు పొడిగించారు. వివిధ పోస్టులకు గానూ అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. వయసు పోస్టును బట్టి 20-45 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 44 లక్షల వరకు ఉంటుంది. వివరాలకు అధికారిక వెబ్ సైట్ చూడండి.
ATP: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై) కింద గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లీష్పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు DRDA పీడీ టి. శైలజ ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
BPT: మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పంగులూరు మండలం చందలూరులో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో భోజనశాలను ప్రారంభించి, అనంతరం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. మంత్రి రాక సందర్భంగా తమ గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.