• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ALERT: నెలకు రూ.50,000 జీతంతో ఉద్యోగాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL).. లికాం స్ట్రీమ్, ఫైనాన్స్ స్ట్రీమ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.24,900 – రూ.50,500 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

October 28, 2025 / 07:28 PM IST

ఒకే రోజు రెండోసారి తగ్గిన బంగారం

ఇవాళ ఒకే రోజు బంగారం ధరలు రెండు సార్లు తగ్గాయి. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,020 తగ్గగా, తాజాగా మరోసారి రూ.1,640 తగ్గి రూ.1,20,820కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ఉదయం రూ.1,850 తగ్గగా, ఇప్పుడు మరోసారి రూ.1,500 తగ్గి రూ.1,10,750 పలుకుతోంది. ఉదయంతో పోలిస్తే, కిలో వెండి ధరలో (రూ.1,65,000) ఎలాంటి మార్పు లేదు.

October 28, 2025 / 04:59 PM IST

ఒకే రోజు రెండోసారి తగ్గిన బంగారం ధరలు

ఇవాళ ఒకే రోజు బంగారం ధరలు రెండు సార్లు తగ్గాయి. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,020 తగ్గగా, తాజాగా మరోసారి రూ.1,640 తగ్గి రూ.1,20,820కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ఉదయం రూ.1,850 తగ్గగా, ఇప్పుడు మరోసారి రూ.1,500 తగ్గి రూ.1,10,750 పలుకుతోంది. ఉదయంతో పోలిస్తే, కిలో వెండి ధరలో (రూ.1,65,000) ఎలాంటి మార్పు లేదు.

October 28, 2025 / 04:59 PM IST

వికీపీడియాకు పోటీగా గ్రోకిపీడియా

ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ వికీపీడియాకు పోటీగా గ్రోకిపీడియాను తీసుకొచ్చారు. ఇది AI ఆధారితంగా పనిచేస్తుంది. వికీపీడియా కంటే 10 రెట్లు బెటర్ అని ప్రకటించారు. మస్క్‌కు చెందిన AI కంపెనీ xAI గ్రోకిపీడియా ప్లాట్‌ఫారమ్‌ను తీసుకొచ్చింది. ఇది Grokకు conversational AI మోడల్. వాస్తవాలను ఆధారంగా తీసుకుని కచ్చితమైన సమాచారం అందించడం దీని ఉద్ధేశమని మస్క్ అంటున్నారు.

October 28, 2025 / 01:41 PM IST

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 66.09 పాయింట్లు లాభపడి 84844.93 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 28.30 పాయింట్ల లాభంతో 25994.35 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.35గా ఉంది.

October 28, 2025 / 09:36 AM IST

ALERT: గడువు పొడిగింపు

AP: రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీని పొడిగించింది. ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అధికారులు అవకాశం కల్పించారు. రూ.1,000 ఫైన్‌తో వచ్చే నెల 6 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి 23 నుంచి ఫస్టియర్, ఫిబ్రవరి 24 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

October 27, 2025 / 08:47 PM IST

జిల్లాలో నిరుద్యోగులకు శుభవార్త

NZB: జిల్లాలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీ.పీ మధుసూదన్ రావు సోమవారం తెలిపారు. ఇంటర్, డిగ్రీ ఉన్న అభ్యర్థులు శివాజీ నగర్‌లో ఈనెల 29న ఉదయం 10.30ల నుంచి మధ్యాహ్నం వరకు ఉద్యోగ మేళాలో పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9959456793, 9948748428కు సంప్రదించాలని పేర్కొన్నారు.

October 27, 2025 / 05:11 PM IST

కార్పొరేటర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే గురజాల

CTR: చిత్తూరు నగరపాలక సంస్థ 1వ వార్డు కార్పొరేటర్ శ్రీకాంత్ తండ్రి జీ.వీ. రామచంద్ర నాయుడు సోమవారం మృతి చెందారు. ఆయన మృతదేహానికి డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తెదేపా నగర అధ్యక్షుడు నరేష్ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం కార్పొరేటర్ శ్రీకాంత్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఫోన్‌లో పరామర్శించారు.

October 27, 2025 / 04:19 PM IST

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే ఇవాళ లాభాల్లో కదలాడుతున్నాయి. ఇవాళ ఉదయం నిఫ్టీ 139 పాయింట్లు పెరిగి 25,934కు చేరింది. సెన్సెక్స్‌  468 పాయింట్లు పుంజుకొని 84,680 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.87.99గా ఉంది.

October 27, 2025 / 10:26 AM IST

BREAKING: తగ్గిన పసిడి ధరలు

పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. ఇవాళ బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 తగ్గి రూ.1,24,480కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,050 తగ్గి రూ.1,14,100 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,70,00గా ఉంది.

October 27, 2025 / 10:02 AM IST

APPLY NOW: ఉద్యోగాలకు నోటిఫికేషన్

అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీ కోసం యూకో బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 532 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 20 నుంచి 28 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

October 26, 2025 / 03:57 PM IST

రేపు దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ మేళా

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సాయికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు పలు సంస్థల ప్రతినిధులు రానున్నట్లు తెలిపారు. సుమారు 50 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంకులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

October 26, 2025 / 10:44 AM IST

‘ ఈనెల 30 వరకు అడ్మిషన్‌లకు అవకాశం’

VKB: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషను ఈనెల 30 వరకు అవకాశం ఉందని తాండూరు నంబర్ వన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ తెలిపారు. వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసినవారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అడ్మిషన్ల పూర్తి వివరాలకు పాఠశాల ఓపెన్ స్కూల్ ఇన్‌ఛార్జ్ మహేష్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

October 26, 2025 / 10:15 AM IST

కార్డెన్ & సెర్చ్ 19 బైకులు స్వాధీనం

MBNR: జడ్చర్ల టౌన్ పరిధిలోని శాంతి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో ఆదివారం ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 150 ఇళ్లను సోదా చేసి, సరైన పత్రాలు లేని 19 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఆరు ఆటో రిక్షాలను ధ్రువీకరణ కోసం నిలిపివేశారు.

October 26, 2025 / 10:05 AM IST

జాబ్ మేళాలో 51 మంది ఎంపిక

కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశేష కృషి చేస్తున్నారు. ప్రతి వారం జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురంలోని ఉపాధి కార్యాలయంలో శనివారం జరిగిన ఉద్యోగ మేళాలో వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో మొత్తం 51 మంది ఎంపికయ్యారు. ఉద్యోగానికి ఎన్నికైన వారికి మంత్రి అభినందనలు తెలిపారు.

October 25, 2025 / 04:05 PM IST