ELR: జిల్లాలో యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సంచాలకుడు ఎం. ఫణి కిశోర్ తెలిపారు. యువకులకు ఫోన్ల మరమ్మతులలో 30 రోజులు, యువతులకు జనపనార సంచుల తయారీలో శిక్షణ ఇస్తామని వివరించారు. పూర్తి వివరాలకు 9948565256 నెంబర్ను సంప్రదించాలని ఫణికిశోర్ సూచించారు.
KRNL: ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 10వ తరగతి, సీనియర్ ఇంటర్ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ. శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 16న ఉదయం 9:30కు చిన్నటేకూరు గురుకులంలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
TG: నీట్ యూజీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసింది. అఖిల భారత కోటాలో భాగంగా మొదటి రౌండ్ కౌన్సెలింగ్ జూలై 21 నుంచి 30 వరకు కొనసాగుతుంది. ఇందులో చేరేందుకు చివరి తేదీ ఆగస్టు 6 కాగా.. 7,8 తేదీల్లో విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాగా, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి.
VZM: డెంకాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న మాథ్స్ లెక్చరర్ పోస్టుకు గెస్ట్ లెక్చరర్గా పని చేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పి.హిమగాయత్రి ఒక ప్రకటనలో కోరారు. సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఈ నెల 15లోగా దరఖాస్తులను తమకు అం...
SRPT: ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 11 శుక్రవారం వరకు ఆఖరి గడువు ఉందని. గురువారం కోదాడ పట్టణంలో ఒక ప్రకటనలో కోదాడ లక్ష్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ కో-ఆర్డినేటర్ సతీష్ తెలిపారు. ఈ విద్యార్హతలు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగ పడతాయన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9542107771 నెంబర్కి సంప్రదించాలని కోరారు.
ATP: JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్సు ప్రారంభమైంది. B.Tech CSE/ECEలో మొదటి 3 సంవత్సరాలు JNTUలో, 4వ సంవత్సరం స్వీడన్లో చదవవచ్చు. వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత వివరించారు. ఆసక్తి గలవారు జూలై 17లోపు దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాలకు JNTU ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించండి.
ADB: మంచిర్యాల డీఈవో యాదయ్య ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈవో యాదయ్య మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు పొందాలని అనుకునే వారు జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో సంప్రదించాలని కోరారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ఓపెన్ స్కూల్లో చేరువారు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
NLG: భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థలో ఈ నెల 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు శిక్షణ పొందుతున్న 24 దేశాలకు చెందిన 37 మంది ప్రతినిధులు బుధవారం నాగార్జునసాగర్ను సందర్శించారు. ప్రధాన డ్యామ్ జలాశయం, జల విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. సాగర్ ప్రాజెక్టు చరిత్రపై ఇరిగేషన్ అధికారులు వారికి వివరించారు.
ATP: అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జూలై 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆర్. కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు. 750కుపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) మే నెలలో నిర్వహించిన సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ స్కోరు కార్డులు, మెరిట్ జాబితాలను తెలుసుకోవడానికి వెబ్సైట్ను సందర్శించవచ్చని ICAI తెలిపింది. రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు.
సత్యసాయి: హిందూపురం ఎన్ఎస్పీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో 140 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. సుమారు 300 మంది నిరుద్యోగులు మేళాలో పాల్గొన్నారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డా. ప్రగతి తెలిపారు. 15 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి, 140 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని చెప్పారు.
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ స్టడీ సెంటర్ ప్రారంభం అయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొహమ్మద్ వాజీద్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9573194525, 9491109275 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
చైనా మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో.. రెనో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఒప్పో రెనో-14 ప్రో 5జీ 6.83 అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తోంది. ఒప్పో రెనో-14 5జీ 6.59 అంగుళాల 1.5K OLED డిస్ప్లేతో వస్తోంది. వీటి ధరలు రూ.38వేల నుంచి ప్రారంభం కానున్నాయి.
NTR: ఇబ్రహీంపట్నం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డ్యూక్ బైక్ మరో వాహనాన్ని ఢీకొనడంతో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
GDWL: గద్వాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నుండి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సిలింగ్ జూన్ 29, 2025 తేదీలలో కూడా కొనసాగుతుంది. పాలిసెట్-2025లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ స్లాట్ బుక్ చేసుకుని, సర్టిఫికేట్ వెరిఫికేషన్/ఆప్షన్లకు హాజరు కావచ్చని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.