• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

వన్ ప్లస్ 13పై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13 ఫోన్ కేవలం రూ. 57,999కి అందుబాటులో ఉండనుంది. SBI క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లభించే డిస్కౌంట్‌తో కలుపుకొని ఈ ధరకు అందించనున్నట్లు వెల్లడించిది. అంతేకాకుండా, వన్‌ప్లస్ 13ఎస్ రూ.47,999కి, నార్డ్ 5 రూ.28,749కి, నార్డ్ 4 రూ.25,499కి అందుబాటులో ఉండనున్నాయి.

September 17, 2025 / 10:45 PM IST

ఈనెల 20న పెడనలో జాబ్ మేళా

కృష్ణా: పెడనలో ఈనెల 20న జాబ్‌మేళా జరగనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కన్వీనర్ వంగా బాబు ప్రకటించారు. అభ్యర్థులు తప్పనిసరిగా లింక్ ముందస్తు నమోదు చేసుకోవాలని సూచించారు. గూడూరు రోడ్డులోని నాగయ్య జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందని తెలిపారు.

September 17, 2025 / 08:10 AM IST

నవోదయ 11వ తరగతికి ప్రవేశాలు

కృష్ణా: బాపులపాడు(M) వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 11వ తరగతి ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డీ. యదునం దన తెలిపారు. మొదట వచ్చిన వారికి ప్రాధాన్యం క్రమంలో స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నామని ఆయన పేర్కొన్నారు. గణితం, సామాన్యశాస్త్రంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలని, వారు ఈ నెల 23వ తేదీ వరకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

September 17, 2025 / 08:04 AM IST

JNTUలో 198 ఎంటెక్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

HYD: JNTU యూనివర్సిటీలో ఎంటెక్ విభాగానికి సంబంధించి స్పాన్సర్ క్యాటగిరీలో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి 20 వరకు యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలో 198 సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.6 గంటల వరకు అడ్మిషన్లకు సంబంధించి ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన అన్నారు.

September 17, 2025 / 08:00 AM IST

కొయ్యూరు ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈవో

ASR: విధులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కొయ్యూరు ఎంఈవో ఎల్.రాంబాబుపై డీఈవో పీ.బ్రహ్మాజీరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరచుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం డీఈవో కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే ఆ పాఠశాలకు హెచ్ఎంగా వ్యవహరిస్తున్న ఎంఈవో ఆ సమయంలో పాఠశాలలో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

September 17, 2025 / 07:14 AM IST

టీయూ ఎం.ఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్/అక్టోబర్-2025లో నిర్వహించనున్న ఎం.ఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సెప్టెంబర్ 20లోపు ఫీజులు చెల్లించవచ్చని, రూ.100 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే. సంపత్ కుమార్ మంగళవారం తెలిపారు.

September 17, 2025 / 04:03 AM IST

GOOD NEWS: తగ్గిన పాల ధరలు

వినియోగదారులకు మదర్ డైరీ గుడ్‌న్యూస్ చెప్పింది. లీటర్‌పై రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కేంద్రం సవరించిన GST వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అలాగే పనీర్, చీజ్, నెయ్యి, ఐస్ క్రీమ్ వంటి ఇతర ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి.

September 16, 2025 / 04:08 PM IST

నేటి నుంచి MBBS కన్వీనర్‌ కోటా వెబ్‌ఆప్షన్లు

TG: MBBS ప్రవేశాల్లో భాగంగా కన్వీనర్ కోటా కింద విద్యార్థులు ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 18వ తేదీ రాత్రి 11:30 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. సీటు పొందిన విద్యార్థులు రూ.12 వేల రుసుము చెల్లించాలని పేర్కొంది.

September 16, 2025 / 07:13 AM IST

విద్యార్థులకు GOOD NEWS

AP: రాష్ట్రంలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించింది. మొత్తం 9 రోజులపాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 3న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా జూనియర్ కాలేజీలు, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు కూడా వేర్వేరు తేదీల్లో సెలవులు ఇవ్వనుంది.

September 16, 2025 / 07:05 AM IST

ALERT: PGCET కౌన్సెలింగ్‌లో మార్పులు

AP: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, PG అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGCET కౌన్సెలింగ్‌లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 17 వరకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 18 వరకు, వెబ్‌ అప్లికేషన్‌కు ఈనెల 20 వరకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. సీట్ల కేటాయింపు 22న ఉంటుందని పేర్కొన్నారు.

September 16, 2025 / 06:56 AM IST

TGICET: నేడే సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: టీజీఐసెట్-2025 చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఇవాళ విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఈ నెల 20న విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకురావాలని అధికారులు పేర్కొన్నారు.

September 16, 2025 / 06:47 AM IST

ఐటీఆర్‌ దాఖలు గడువు పెంపు

ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది. సోమవారంతో గడువు ముగియగా.. కేవలం ఒక్కరోజు (సెప్టెంబర్ 16) పొడిగించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం ప్రకటించింది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో యూజర్ల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.

September 16, 2025 / 06:38 AM IST

ముగియనున్న ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ పదవీకాలం

ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది. సోమవారంతో గడువు ముగియగా.. కేవలం ఒక్కరోజు (సెప్టెంబర్ 16) పొడిగించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం ప్రకటించింది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో యూజర్ల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.

September 16, 2025 / 06:38 AM IST

భారత్‌లో ఉబర్ హెలికాప్టర్ సర్వీసులు సాధ్యమేనా?

టెక్నాలజీ పరంగా చూస్తే భారత్‌లో ఉబర్ హెలికాప్టర్ సర్వీసులు సాధ్యమే కానీ, కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా డెన్సిటీ ఎక్కువ ఉన్న నగరాల్లో టేకాఫ్, ల్యాండింగ్‌లకు అనువైన హెలిప్యాడ్‌లు కావాలి. డ్రోన్లు, ఇతర గగనతల నియంత్రణల పరంగా భారత ఏవియేషన్ నిబంధనలు కీలకమవుతాయి. ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉండటంతో సేవలు అందుబాటులోకి వచ్చినా, అవి పరిమిత సంఖ్యలో ఉండే అవకాశం ఉంది.

September 15, 2025 / 11:54 PM IST

ప్రభుత్వ సానుకూల స్పందన.. సమ్మె విరమణ

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉన్నత విద్యాసంస్థల జేఏసీ చైర్మన్ రమేష్ బాబు తెలిపారు. ఈ వారంలో రూ.600 కోట్లు, దీపావళికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.

September 15, 2025 / 10:55 PM IST