సత్యసాయి: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి. సత్యసాయి జిల్లాలో 5,588 మంది పరీక్ష రాయగా.. 3,986 మంది పాసయ్యారు. 71.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.
KRNL: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని MLA శ్యాంబాబు, స్కిల్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ బుధవారం తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకొని, 18 నుంచి 35 ఏళ్ల వయసున్నవారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 16 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
AP: కాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీపీఎస్సీ కాసేపట్లో ఫలితాలను విడుదల చేయనుంది. కాగా, 1:2 నిష్పత్తిలో మౌఖిక పరీక్షలకు ఎంపిక చేయనుంది.
TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఆగస్టు 14 లోపు తరగతులను ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. జూలై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని, ఆగస్టు 14లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 4 విద్యాసంస్థలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని, వాటిపై చర్యలు ఉంటాయని బాలకిష్టారెడ్డి పరోక్షంగా హెచ్చరించారు.
KRNL: జూన్ 12 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవుతున్నందున గ్రామాల నుండి వచ్చే నిరుపేద విద్యార్థులకు సమయానికి విద్యార్థి బస్సు సేవలు అందించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్కి వినతిపత్రం అందజేశారు. ఆదోని డివిజన్లో వందల మంది పేద విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు.
SKLM: జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా 284 మందికి గాను 128 మంది ఇప్పటి వరకు విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపల్ సుధాకరరావు ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సుధా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
E.G: ఈనెల 13న అనపర్తిలోని సాయి మాధవి డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. పదికి పైగా అగ్రశ్రేణి కంపెనీలు పాల్గొని, పదవ తరగతి నుంచి ఆపై విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SKLM: అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో అడ్మిషన్లు ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కో-ఆర్డినేటర్ గుంపుల గ్రేస్ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇటీవల జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించడం జరుగుతుందన్నారు.
CTR: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. చిత్తూరు జిల్లాలో 5,294 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా.. 2,173 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,521 మంది పరీక్షలు రాయగా.. 2,048 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ 41%, సెకండ్ ఇయర్లో 58% ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా 20వ స్థానంలో నిలిచింది.
NDL: నందికొట్కూరుకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఈ పురస్కారం అందించనున్నారు. అఖిల్ 990 (ఎంపీసీ), పి. మేఘన 989 (ఎంపీసీ), పి. సుహానా బేగం 986 (బైపీసీ), ఎం. నవీన్ 980(ఎంపీసీ) మార్కులతో ప్రతిభ చూపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో స్పోర్ట్స్ కోటా కింద 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇవాళ్టితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఇంటర్ పాసైన, 18-23 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.81,100 వరకు వేతనం ఇస్తారు. వెబ్సైట్ cisfrectt.cisf.gov.in
ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిభ అవార్డులకు పొదిలిలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థి షేక్ రబ్బానీ ముస్కాన్కు లభించిందని ఆమె తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో 1000 మార్కులకు 988 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ స్ధానంలో నిలిచింది. దీంతో ప్రతిభ అవార్డుకు ఆమెను ఎంపిక చేయడం జరిగింది.
KKD: ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీలకు అవకాశం ఏర్పడింది. బుధవారం వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పి. రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ఆప్షన్ ఇచ్చుకోవాలని సూచించారు.
ప్రకాశం: ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో ఈనెల 4న క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎంవీ నాగేశ్వరరావు తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేళా జరుగుతుందని చెప్పారు.
కోనసీమ: రామచంద్రాపురంలోని ఉపాధి భవన్లో ఈనెల 3న ఉదయం 9:30 గంటలకు ప్రముఖ కంపెనీలైన కోజెంట్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, మెక్వన్, బెర్గెన్ పైప్ సపోర్ట్ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్, ఉపాధి భవన్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాలో భాగంగా నిర్వహించబడుతుందని పేర్కొంది.