TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన MBA పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. MBA (టెక్నాలజీ మేనేజ్మెంట్), MBA (ఈవినింగ్) కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ అధికారి తెలిపారు. యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
చదువుతున్నప్పుడు నిద్ర రావడం అనేది చాలా మంది విద్యార్థులు ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే చదువుకునేటప్పుడు ప్రతి గంటకు చిన్న విరామం (5ని.లు) తీసుకోవాలి. చదువుతున్న గదిలో తగినంత వెలుతురు ఉండాలి. అలాగే ఏకాగ్రతను పెంచడానికి తరచుగా నీరు త్రాగాలి. నిద్ర ఎక్కువగా వస్తే 15-20 నిమిషాలపాటు నిద్రపోయి తిరిగి లేచి చదవాలి. ఇలా చేస్తే ఏకాగ్రత మెరుగుపడి, నిద్ర దూరమవుతుంది.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా వచ్చే నెల 14 వరకు అధికారులు అవకాశం కల్పించారు. పదో తరగతి పాస్ అయిన వారు అప్లై చేసేందుకు అర్హులని తెలిపారు. రూ.18 వేల నుంచి 57 వేల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు ‘IB MTS Recruitment 2025’ను సందర్శించాలని సూచించారు.
TG: గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు HYD అడ్డాగా మారింది. బహుళ జాతి సంస్థలు HYDలో GCCల ఏర్పాటుకు జై కొడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు దేశంలో 88 జీసీసీలు ఏర్పాటు కాగా.. అందులో 46 శాతం వాటాతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో బెంగళూరు ఉంది. కాగా, 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 122 GCCలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్డనెన్స్ ఫ్యాక్టరీ మెదక్(OFMK) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 17 పోస్టులు ఉండగా.. BE/Btech అర్హత గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. Jr.పోస్టులకు అభ్యర్థుల వయసు 21-30 మధ్య, Sr.పోస్టులకు గరిష్ఠంగా 45 ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. B.Tech, BE, MSc, MCA అర్హత కలిగినవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bankofindia.bank.in/
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయసు 18-25 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST, OBC, PwD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉడనుంది. ఈ పోస్టులకు టెన్త్ పాసైన వారు అర్హులు. నెలకు రూ.18 వేల నుంచి రూ.56,900 వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.mha.gov.in/enను సంప్రదించవచ్చు.
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి తక్కువ ధరకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొన్ని భారత కంపెనీలు కొనుగోళ్లు ఆపేశాయి. ఫలితంగా US, పశ్చిమాసియా నుంచి అధిక ధరకు చమురు దిగుమతి చేసుకుంటే, ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది.
బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,700 పెరిగి రూ.1,15,350 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.3,000 పెరిగి రూ.1,72,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
HDFC తమ వినియోగదారులకు అలర్ట్ జారీ చేసింది. నెట్ బ్యాంకింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఈనెల 23న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు మాత్రమే అంటూ పేర్కొంది. నెట్ బ్యాంక్ సర్వీసులను మరింత అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కస్టమర్లకు ముందుగానే మెసేజ్ పంపినట్లు వెల్లడించింది.
AP: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి BSC (హానర్స్) వ్యవసాయం, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 24 నుంచి 30 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.వి.రమణ వెల్లడించారు. పూర్తి వివరాలకు angrau.ac.in వెబ్సైట్లో చూడొచ్చని తెలిపారు.
AP: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి 17,883 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా అప్లై చేసుకున్నారు.
ఒప్పో ఇండియా తాజాగా ఫైండ్ ఎక్స్ 9 సిరీస్లో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. వేరియంట్ని బట్టి దీని ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ ఫోన్లో హాసెల్బ్లాడ్తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్ జెన్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ హై–ఎండ్ గేమింగ్కు సరిపడే పనితీరు కలిగి ఉంది.
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను RBI హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన RBI తాజాగా ఈ లిస్ట్లో 7 ప్లాట్ఫామ్స్ను చేర్చింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్నెట్ FX, క్యాప్ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్ మార్కెట్స్ వంటివి ఉన్నాయి.
AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష ఉంటుంది. రోజూ ఉ. 9.30 నుంచి మ.12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.