• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

రూ. 20 వేల లోపే నథింగ్ ఫోన్

తాజాగా నథింగ్ ఫోన్ కంపెనీ కొత్త మోడల్ ఫోన్ తీసుకువచ్చింది. నథింగ్ ఫోన్ 3ఏ లైట్ ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఫోన్ 3ఏ లైట్ 6.77 అంగుళాల AMOLED డిస్ ప్లే క‌లిగి ఉంటుంది. 50MP (Main) + 8MP (UW) + 2MP (Macro) Rear Camera కూడా ఈ ఫోన్ కు అందిస్తున్నారు. ఇక సెల్ఫీల కోసం 16MP కెమెరా కూడా అందిస్తోంది […]

November 28, 2025 / 09:54 PM IST

సీసీ రోడ్డును ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

W.G: కాళ్ల మండలం కాళ్లకూరులో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శుక్రవారం సాయంత్రం సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉండగా ఇచ్చిన రూ.10 లక్షల నిధులతో ఈ రోడ్డు పూర్తయిందని తెలిపారు. అలాగే రూ. 35 లక్షల వ్యయంతో జిందాల్ పవర్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయనున్న వాటర్ పైప్ లైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.

November 28, 2025 / 08:56 PM IST

బంగారం ధరలు డిసైడ్ చేసే రేంజ్‌కి భారత్!

ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్లను శాసించే స్థాయికి భారత్ ఎదగబోతోంది. రానున్న 10 ఏళ్లలో భారత్ ఈ ఘనత సాధిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం దేశీయంగా బంగారు గనుల తవ్వకాలను భారీగా పెంచబోతున్నామని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత సీఈవో సచిన్ జైన్ తెలిపారు. ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడుతున్న మనం.. సొంతంగా మైనింగ్ పెంచితే.. బంగారం ధరల రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది.

November 28, 2025 / 04:00 PM IST

స్విగ్గీ, జొమాటో గోడౌన్లపై దాడులు

TG: HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్ బాస్కెట్‌కు చెందిన 75 గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేశారు. అక్కడ ఎక్స్‌పైర్ అయిన సరుకులు, కుళ్లిన పండ్లు, కూరగాయలు చూసి అధికారులు షాక్ అయ్యారు. వాటిని సీజ్ చేసి, లాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్ సేకరించారు. నిబంధనలను పాటించని సంస్థలకు సీరియస్ వార్నింగ్‌తో పాటు నోటీసులు జారీ చేశారు.

November 28, 2025 / 02:28 PM IST

BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,28,460కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,17,750 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,83,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

November 28, 2025 / 10:05 AM IST

ALERT: ఎస్సీ గురుకులాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌

TG: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 268 గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎఫ్‌ఆర్‌ఎస్ మొబైల్ యాప్ ఆధారంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో హాజరు స్వీకరిస్తారు.

November 28, 2025 / 04:40 AM IST

ALERT: CTET నోటిఫికేషన్ రిలీజ్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET – 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 8, 2026న నిర్వహిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

November 27, 2025 / 07:08 PM IST

ALERT: 10th అర్హతతో ఉద్యోగాలు

భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 156 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తుకు డిసెంబర్ 8, 2025 చివరి తేదీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

November 27, 2025 / 04:20 PM IST

ధర్మవరం మెగా జాబ్ మేళాలో 81 మందికి ఉద్యోగాలు

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ మేళాలో 10 కంపెనీలు పాల్గొనగా.. 193 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 81 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి బీజేపీ నేత హరీశ్ బాబు నియామక పత్రాలు అందజేశారు.

November 26, 2025 / 08:00 PM IST

‘నవంబర్ 28న రాజమండ్రిలో జాబ్ మేళా’

E.G: రాజమండ్రిలో నవంబర్ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ మేళాలో సెరా కేర్ హప్పి లైఫ్, గూగుల్ పే సంస్థలలోని పలు ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ పూర్తి చేసి 19 – 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులన్నారు.

November 26, 2025 / 06:30 PM IST

IAS.. కేబినెట్ సెక్రటరీగా కావాలంటే..?

దేశ పరిపాలన వ్యవస్థలో అత్యున్నత పోస్ట్‌గా భావించే కేబినెట్ సెక్రటరీ పదవిని చేరుకోవాలని ప్రతి ఒక్క IAS కల. అయితే ఈ పదవి 35 నుంచి 40 ఏళ్ల అత్యుత్తమ సర్వీస్ తర్వాత మాత్రమే దక్కుతుంది. దీనికి ఎంపికయ్యే అధికారికి పదవీ విరమణకు ముందు కనీసం 1-2ఏళ్ల పదవీ కాలం ఉండాలి. అందుకే 21-25ఏళ్ల వయసులో IAS సాధించిన వారికి ఈ పదవీ వచ్చే అవకాశాలు ఎక్కువ.

November 26, 2025 / 06:13 PM IST

జాబ్ మానేసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా?

కార్పొరేట్ జాబ్ వదిలేసి, లాభాల్లో ఉన్న బిజినెస్ వైపు వెళ్లాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి నిపుణుల సలహా ఏంటంటే.. ఉద్యోగం ‘ఫైనాన్షియల్ సెక్యూరిటీ’ ఇస్తుంది. కానీ బిజినెస్ అంటే 24 గంటల పని, రిస్క్ భరించాలి. పోటీని తట్టుకునే సత్తా, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే జాబ్ మానేయండి. లేదంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేవరకు రెండూ బ్యాలెన్స్ చేయడమే సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు.

November 26, 2025 / 05:43 PM IST

మరో స్మార్ట్ సేవింగ్ ప్లాన్‌ తీసుకొచ్చిన BSNL

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే 72 రోజుల పాటు డైలీ 2GB డేలా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇదే తరహా ప్లాన్లను ఇతర టెలికాం కంపెనీలు రూ.700-800 రేంజ్‌లో అందిస్తున్నాయి. 

November 26, 2025 / 12:03 PM IST

BREAKING: మరోసారి పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,27,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.800 పెరిగి రూ.1,17,250 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.2000 పెరిగి రూ.1,76,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

November 26, 2025 / 10:07 AM IST

ఎన్నికల నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి: MLC

JN: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, MLC తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

November 26, 2025 / 06:31 AM IST