BHPL: గ్రామ సమాఖ్యలకు సొంత భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 248 పంచాయతీల్లో రూ.24.80 కోట్లు నిధులతో నిర్మాణాలు చేపడతారు. ఒక్క గ్రామ సమాఖ్య భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేసింది. 200 గజాల స్థలంలో నిర్మిస్తారు.
MLG: తాడ్వాయి మండలంలో ఓ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మండలంలోని కొడిశెల లింగాల గ్రామాల మధ్య అడవిలో గురువారం రాత్రి కొబ్బరికాయల లోడుతో మేడారం వెళుతుండగా ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని దగ్ధమైనట్లు అటుగా వెళ్లిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (డిసెంబర్ 26) ‘బాక్సింగ్ డే’ సందర్భంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. దీంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కానున్నాయి. అయితే, అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య రికార్డు స్థాయిలో లక్ష మార్కును (1,00,266) దాటింది. అమెరికా, చైనా తర్వాత భారత్ ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. 2015తో పోలిస్తే బంకులు డబుల్ అయ్యాయి. అయితే ఇందులో 90 శాతం వాటా ప్రభుత్వ సంస్థలదే కావడం విశేషం. ప్రైవేట్ కంపెనీలు ఉన్నా, ఇంధన విక్రయాల్లో సర్కారీ వారిదే హవా నడుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.
TG: రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో మరో 198 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 84 ట్రాఫిక్ సూపర్వైజర్స్ ట్రైనీ పోస్టులకు.. 114 మెకానికల్ సూపర్వైజర్స్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు స్వీకరించనుంది. పూర్తి వివరాలు www.tgprb.in వెబ్సైట్ను సంప్రదించండి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రాం వ్యవస్థాపకుడు, CEO పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. 37ఏళ్ల లోపు మహిళలు తన వీర్యం వాడుకుని IVF చేయించుకుంటే తానే ఖర్చులు భరిస్తానని వెల్లడించారు. గత 15ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా తన వీర్యదానంతో దాదాపు 100 మంది పిల్లలు జన్మించారని, వారికి తన సంపదను సమానంగా పంచుతానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. కాగా, ప్రస్తుతం ఆయన సంపద 14-17 బిలియన్ డాలర్లుగా ఉంది.
AP: కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు ఆయనను తన నివాసానికి ఆహ్వానించి, అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం, వీరిద్దరూ కలిసి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాచ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
TG: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఇంటర్ బోర్డు పలు వినూత్న చర్యలు చేపట్టనుంది. వార్షిక పరీక్షలకు రెండు నెలల ముందే తల్లిదండ్రుల వాట్సాప్నకు వారి పిల్లల హాల్ టికెట్లను పంపనున్నారు. హాల్ టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరగుతుందో తల్లిదండ్రులకు చెప్పడమే ప్రధాన ఉద్దేశం.
AI ఫీచర్లతో కెనరా బ్యాంకు కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ, పట్టణాల్లో లావాదేవీలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ యాప్ను రూపొందించింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఇతర UPI యాప్లలో రిజిస్టర్ అయిన కెనరా బ్యాంకు ఖాతాదారులు సైతం సులభంగా మార్చుకోవచ్చు. కెనరా AI 1 PAY పేరుతో కొత్త UPIని ప్రారంభించింది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కిలో వెండి ధర ఇవాళ ఏకంగా రూ.10,000 పెరిగి రూ.2,44,000కు చేరింది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,38,930కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,27,350 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నారు.
AP: 2025-26 విద్యా సంవత్సరానికి నీట్ పీజీ మెడికల్ రివైజ్డ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ని జాతీయ వైద్య కమిషన్ విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకటించామని పీజీ మెడికల్ ఎంట్రన్స్ బోర్డు కార్యదర్శి రీటా సింగ్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది.
AP: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న అతిథి అధ్యాపకుల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం రూ.15.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బకాయిలతో పాటు ఈ ఏడాది డిసెంబరు వరకు గౌరవ వేతనాల కోసం ఈ నిధులను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR-NCL నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టెక్నీషియన్(15), టెక్నికల్ అసిస్టెంట్(19) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 10వ తరగతి+ITI లేదా డిప్లొమా/B.Sc అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మంచి జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ ఇది. ఎంపిక ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12.01.2026.
పాన్-ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. లేకుంటే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు రద్దవుతుంది. ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డు రద్దయితే ITR దాఖలు చేయడం కుదరదు. మీకు రావాల్సిన పన్ను రీఫండ్లు నిలిచిపోతాయి. బ్యాంకు లావాదేవీలు, మ్యూచ్వల్ ఫండ్లు వంటి పెట్టుబడులపై అధిక టీడీఎస్ విధిస్తారు.
తన సంస్థలో ఉద్యోగాల కోసం ఉత్తరకొరియా పౌరుల నుంచి వచ్చిన 1800 అప్లికేషన్లను తిరస్కరించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఈ విషయాన్ని లింక్డిన్ పోస్ట్ ద్వారా అమెజాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ ష్మిత్ తెలిపారు. గతేడాది కాలంలో ఉత్తరకొరియా నుంచి తమ సంస్థకు వచ్చిన అప్లికేషన్ల్లలో 30 శాతం పెరుగుదల కనిపించిందని స్టీఫెన్ పేర్కొన్నారు.