• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

నేడు ముద్దనూరులో జాబ్ మేళా

KDP: ముద్దనూరులోని గజ్జల చిన్న రంగారెడ్డి ఐటీఐ కళాశాల ఆవరణలో నేడు జాబ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని జువారి సిమెంట్ కంపెనీ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన వారు అర్హులని ఆయన వెల్లడించారు. ఈ ఆకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.

April 20, 2025 / 07:29 AM IST

JEE మెయిన్స్‌లో వంగర విద్యార్థి సత్తా

VZM: JEE మెయిన్స్‌లో వంగర మండలం విద్యార్థి ప్రతిభకనబరిచాడు. గ్రామానికి చెందిన పారిశర్ల భరద్వాజ్ JEE మెయిన్స్ ఫలితాల్లో 99.59 శాతంతో సత్తా చాటాడు. ఆలిండియా జనరల్ ర్యాంక్ 6,306, ఆల్ ఇండియా ఓబీసీలో 1,326 ర్యాంక్ సాధించాడు. భరద్వాజ్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా విశాఖలో ఉంటున్నారు. భరద్వాజ్‌ను పలువురు అభినందించారు.

April 19, 2025 / 08:44 AM IST

చిత్తూరులో రేపు మెగా జాబ్ మేళా

CTR: గ్రీమ్స్ పేటలోని డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్  ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

April 18, 2025 / 07:00 PM IST

21న ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగ మేళా

కడప: ప్రభుత్వ పురుషుల కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు సంయుక్తంగా ఏపీఎస్ఎస్ఈసీ సౌజన్యంతో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో 21న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.

April 17, 2025 / 08:59 AM IST

నేడు పాలకొల్లులో మెగా జాబ్ మేళా

W.G: గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి. వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ,హెచ్‌డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.

April 17, 2025 / 07:30 AM IST

ఇంటర్ దరఖాస్తుకు గడువు పెంపు

KRNL: కృష్ణగిరి మండల కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువు విద్యాశాఖ ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సి పాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22 నుం చి ఈ నెల 11 వరకు నిర్దేశించగా.. ప్రస్తుతం ఈ నెల 21వ తేదీ వరకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు.

April 13, 2025 / 09:49 AM IST

మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

SRD: మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు సమీపంలోని మైనార్టీ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

April 13, 2025 / 07:44 AM IST

బీటెక్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ లో చూడాలన్నారు.

April 11, 2025 / 11:00 AM IST

DSC అభ్యర్థులకు ముఖ్య గమనిక

కోనసీమ: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా BC సంక్షేమ సాధికారత అధికారి సత్యరమేష్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్ధులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

April 10, 2025 / 07:35 PM IST

ప్రపంచ ఎకానమీ అనిశ్చితి ఎదుర్కొంటోంది: RBI

ప్రపంచ ఆర్థిక దృక్పథం వేగంగా మారుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ‘ప్రస్తుత వాణిజ్య చర్యలు అనిశ్చితులను తీవ్రతరం చేశాయి. ప్రపంచవ్యాప్త పరిస్థితులు రూపాయిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్థిరత్వం సాధించేందుకు ద్రవ్య పరపతి విధానం కీలకపాత్ర పోషిస్తుంది’ అని పేర్కొన్నారు. 

April 9, 2025 / 11:26 AM IST

విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద ప్రతిపాదికన దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ ఓ డాక్టర్ దేవి పేర్కొన్నారు. క్లినికల్ సైకాలజిస్ట్-1, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్-1, ఆప్టోమెట్రిస్ట్-1, ఫార్మసిస్ట్-1, డీఈవో-1, లాస్ట్ గ్రేట్ సర్వీస్-1 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

April 5, 2025 / 11:03 AM IST

7 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

KDP: సింహాద్రిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ స్వర్ణలత తెలిపారు. పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో సీబీఎస్ఈ సిలబస్ బోధన ఉంటుందన్నారు.

April 5, 2025 / 08:10 AM IST

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

KMM: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోదులబండలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. క్వింటాకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.

April 4, 2025 / 12:32 PM IST

రేపే లాస్ట్ డేట్.. APPLY NOW

TG: రాష్ట్రంలో EAPCET-2025 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించండి.

April 3, 2025 / 05:15 PM IST

4న జాబ్ మేళా

NTR: మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏప్రిల్ 4న జాబ్ మేళా నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ల రవి శనివారం తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్ మీడియెట్, ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. జాబ్ మేళాలో 20కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.

March 30, 2025 / 10:33 AM IST