ప్రముఖ ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్వాలా IPO మదుపర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బిడ్డింగ్ తొలి రోజు అంతంత మాత్రంగానే స్పందన లభించింది. రూ. 3,480 కోట్ల ఐపీఓకు తొలి రోజున కేవలం 7 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. నవంబర్ 13తో ఈ సబ్ స్క్రిప్షన్ ముగియనుంది. మరోవైపు ఫిన్టెక్ పైన్ల్యాబ్స్ IPO ఈరోజు ముగిసింది.
ఫోన్లో ఉండే కొన్ని యాప్స్ వల్ల ఛార్జింగ్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ బ్యాటరీని తినేసే యాప్లకు 2026 మార్చి1 నుంచి చెక్ పెట్టనుంది. బ్యాటరీ డ్రెయిన్ చేసే యాప్లకు సంబంధించి ప్లే స్టోర్లో హెచ్చరికలు చూపనుంది. ఈ ఫీచర్ను గూగుల్ ఇప్పటికే శాంసంగ్తో కలిసి పరీక్షించింది.
ఇంటర్నెట్ అవసరం లేని యూజర్లకు ఎయిర్టెల్ షాకిచ్చింది. తన రూ. 189 వాయిస్ – ఓన్లీ ప్లాన్ను రద్దు చేసింది. కేవలం కాలింగ్ ఫీచర్ కావాలనుకునే వారికి ఈ మార్పు భారంగా మారనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ ఎంట్రీ-లెవల్ ప్లాన్ రూ. 199గా మారింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటితో రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB డేటాను అందిస్తుంది.
TG: తొర్రూర్, బహూదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లోని లేఔట్లలో ఇళ్ల నిర్మాణానికి అనువైన 163 ఖాళీ ప్లాట్లను వేలం ద్వారా విక్రయించనున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ MD ప్రకటించారు. ఈనెల 17, 18న పెద్ద అంబర్పేటలోని అవికా కన్వెన్షన్లో ప్లాట్ల వేలం జరుగుతుందని, ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.
వాహన తయారీ సంస్థలు 2025 అక్టోబర్లో తమ ఉత్పత్తుల అమ్మకాలపై ఓ నివేదికను విడుదల చేశాయి. అందులో అత్యధికంగా టాటా నెక్సాన్ 22,083 యూనిట్లు విక్రయించగా.. రెండో స్థానంలో మారుతి సుజుకి డిజైర్ 20,791 యూనిట్లు అమ్ముడు పోయాయి. మారుతి సుజుకి స్విఫ్ట్ 15,542 యూనిట్ల సేల్స్తో 10వ స్థానంలో ఉంది.
AP: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1కే నెల రోజులపాటు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్లలో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు కూడా ఇస్తుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి BSNL ఈ అద్భుతమైన ఆఫర్ను అందిస్తోంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ అని, ఈ నెల 15న ముగుస్తుందని తెలిపింది.
TG: టెట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫైల్ను సీఎం ఆమోదం కోసం పంపారు. ప్రతి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా.. ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే, మరో వారంలో నోటిఫికేషన్ విడుదలకానుంది. కాగా, టెట్కు సంబంధించిన పాత జీవోను సవరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TG: రేపటి నుంచి గ్రూప్-3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. రేపటి నుంచి ఈనెల 26 వరకు.. నాంపల్లి తెలుగు వర్సిటీలో విజేతల పత్రాలను పరిశీలించనున్నారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలని, ఒరిజినల్ సర్టిఫికేట్లనే తీసుకురావాలని కమిషన్ కార్యదర్శి ప్రియాంక సూచించారు.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 494 మంది అతిథి అధ్యాపకులను నియమించనున్నారు. మొత్తం 566 మంది ఉద్యోగులను నియమించుకునేందుకు ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా జీవో జారీ చేశారు. అలాగే, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్లు 72 మందిని నియమించుకునేందుకు ఇంటర్ విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇండియన్ ఎయిఫోర్స్లో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(AFCAT ) నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో అధికారుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్, BE/ B.Tech అర్హత కలిగిన అభ్యర్థులు DEC 9లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు afcat.cdac.in సంప్రదించండి.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్స్ ఎక్స్ట్రీమ్ 125R కొత్త హైఎండ్ వేరియంట్ను విడుదల చేసింది. దీని ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ వేరియంట్లో డ్యూయల్ ఛానెల్ ABS, రైడింగ్ మోడ్లు వంటి ముఖ్య ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఈ అప్డేట్తో మార్కెట్లో అందుబాటులో ఉన్న బైక్లకు పోటీగా నిలవనుంది.
ఉద్యోగం ఉన్నవారికే వ్యక్తిగత రుణాలు ఇస్తారనేది చాలామందిలో అపోహ ఉంటుంది. కానీ ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందేవారు, వ్యాపారం చేసేవారు కూడా పర్సనల్ లోన్ పొందొచ్చు. లోన్ తీసుకునేవారి ఆదాయం స్థిరంగా ఉందా? రీపేమెంట్ చేసే సామర్థ్యం ఉందా? అన్నవే బ్యాంకులు చూస్తాయి. ఇందుకు ITRలు, బిజినెస్ ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది.
✦ 2025లో అధిక మొత్తంలో విరాళం ఇచ్చిన కుటుంబం: శివ్ నాడార్ కుటుంబం✦ 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డ్ గ్రహిత – శ్రీ శ్రీ రవి శంకర్ ✦ కడు పేదరికాన్ని జయించిన తొలి రాష్ట్రం – కేరళ✦ న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన భారత సంతతి – జోహ్రాన్ మమ్దానీ
దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతాన్ని మించే వీలుందని ప్రముఖ ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. GST తగ్గింపు, ఆదాయ పన్ను రాయితీలు వినియోగాన్ని ప్రోత్సహించి, వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం, వాణిజ్యం, ఆతిథ్యం, ఆర్థిక సేవలు, స్థిరాస్తి రంగాలు బలంగా ఉన్నాయని వెల్లడించారు.
TG: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 1000 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించగా.. వచ్చే ఏడాది నుంచి మరో 4,900 స్కూళ్లలో ప్రీ ప్రైమరీని స్టార్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో పాఠశాలలో టీచర్, ఆయాను నియమించనుంది.