చైనా మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో.. రెనో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఒప్పో రెనో-14 ప్రో 5జీ 6.83 అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తోంది. ఒప్పో రెనో-14 5జీ 6.59 అంగుళాల 1.5K OLED డిస్ప్లేతో వస్తోంది. వీటి ధరలు రూ.38వేల నుంచి ప్రారంభం కానున్నాయి.
NTR: ఇబ్రహీంపట్నం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డ్యూక్ బైక్ మరో వాహనాన్ని ఢీకొనడంతో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
GDWL: గద్వాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నుండి పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సిలింగ్ జూన్ 29, 2025 తేదీలలో కూడా కొనసాగుతుంది. పాలిసెట్-2025లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ స్లాట్ బుక్ చేసుకుని, సర్టిఫికేట్ వెరిఫికేషన్/ఆప్షన్లకు హాజరు కావచ్చని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
MNCL: కన్నెపల్లి మండలం KGBV బాలికల కళాశాలలో కొత్తగా బైపీసీ సబ్జెక్టు కాలేజీ కొరకు అప్గ్రేడ్ కావడం జరిగిందని కళాశాల SO పద్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్ క్లాస్ చదివి ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఉంటే బైపీసీలో అడ్మిషన్ పొందవచ్చన్నారు. మొత్తం 40 సీట్ల కొరకు అడ్మిషన్ చేయబడునని తెలిపారు. EAMCET, NEET కోచింగ్ ఇవ్వబడునని పేర్కొన్నారు.
TG: రేపు రాష్ట్రంలో పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్లో చూడవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
NDL: ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వెన్నెల ఈ ఏడాది ఇంటర్ పరీక్షా ఫలితాలలో 976 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. దీంతో వెన్నెలకు అమరావతిలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ వారు బీటెక్లో ఉచిత ప్రవేశాన్ని కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ పిచ్చల మల్లేశ్వర్ రెడ్డి తెలిపారు. పలువురు వెన్నెలను అభినందించారు.
NTR: కంచికచర్ల అగ్నిమాపక సిబ్బంది స్థానిక ఒక పాఠశాలలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ముందుగా ఏటువంటి చర్యలు తీసుకోవాలనే తదితర అంశాలపై అవగాహ కల్పించారు. ప్రమాదంలో ఉన్నవారిని ఎలా రక్షించాలనే అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై విద్యార్థులకు ప్రదర్శన చేసి చూపారు.
సత్యసాయి: మడకశిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, డిగ్రీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. నియోజకవర్గ యువతి, యువకులు మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని సూచించారు.
GNTR: ఖతార్లో వెల్డింగ్ రంగంలో ఉద్యోగాలు చేయాలనుకునే పురుషులకు అవకాశం వచ్చింది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం.. టీఐజీ, ఏఆర్సీ మల్టీ వెల్డర్ పోస్టులకు నెలకు రూ.42 వేల నుంచి రూ.52 వేల వరకు వేతనం లభిస్తుంది. 24-45 ఏళ్ల మధ్య వయసు, 4 ఏళ్ల అనుభవం, ITI అర్హత తప్పనిసరి. వసతి, భోజనం, వైద్య సదుపాయాలు ఉచితం అని తెలిపారు.
NLR: విద్యార్థులు పాఠశాలల్లోనే తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం భుజించాలని ఎంఈఓ రమేష్ కుమార్ తెలిపారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం, పిడూరుపాలెం గ్రామాల్లోని ఎలిమెంటరీ పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. విద్యార్థులు అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం తినేలా చర్యలు తీసుకోవాలన్నారు.
KKD: కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డా. కందుల ఆంజనేయుల మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతానికి పైగా మార్కులు సాదించి, నెట్, సెట్తో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
VSP: ఆంధ్రా యూనివర్సిటీ PG మరియు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి 2024-2026 బ్యాచ్ విద్యార్థుల కోసం IV సెమిస్టర్ B.Ed కోర్సుల ప్రాక్టికల్ రికార్డులు డౌన్లోడ్ చేసుకునే తేదీలను విడుదల చేసింది. ఫైన్ లేకుండా డౌన్లోడ్ చేసుకునే గడువు 24-06-2025 నుండి 07-07-2025 వరకు రూ.2,000 ఫైన్తో 08-07-2025 నుండి 09-07-2025 వరకు రికార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
W.G: IIT అడ్మిషన్లలో ప.గో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 80 మంది సెలెక్టయ్యారు. నూజివీడు క్యాంపస్లో 18, ఆర్కే వ్యాలీలో 12, ఒంగోలు 34, శ్రీకాకుళం 16 మంది చోటు దక్కించుకున్నారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ ఈ నెల 30 నుంచి జూలై 1, శ్రీకాకుళం జులై 2, 3న, ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు 4, 5 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం విడుదలైన ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటారు. పాఠశాలకు చెందిన 15మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ పురుషోది చెప్పారు. నూజివీడు కళాశాలలో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, ఆర్కె వ్యాలీలో ఒక విద్యార్థి ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించారన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఎపీపీసెట్ -2025 పరీక్షల మొదటి రోజు సోమవారం 400 మంది పురుష అభ్యర్థులు హాజరయ్యారని వర్సిటీ VC గంగాధరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య కామన్ ఎంట్రన్స్ పరీక్షలు (APPE Set-2025) నేటి నుంచి ఈనెల 26 వరకు జరుగుతాయన్నారు. సుమారు 2 వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు.