శ్రీకాకుళం జిల్లాలోని మోడల్స్ స్కూల్లలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు ఈ నెల 22వ తేదీ వరకు apms.ap.gov.in వెబ్సైట్ ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయించనున్నారు. 27వ తేదీన వెరిఫికేషన్ నిర్వహించే జూన్లో తరగతులు ప్రారంభిస్తారు.
SKLM: రాష్ట్రంలో ఉన్న 4 RGUKT ట్రిపుల్ ఐటీ (IIIT)లోని ప్రవేశాలకు గత నెల 24వ తేదీని నోటిఫికేషన్ విడుదలైంది. 2025 – 26 ఏడాదికి పదో తరగతి పాసైన విద్యార్థులకు 6 ఏళ్ల బిటెక్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు www.rgukt.in వెబ్ సైట్, ఆన్లైన్లో ఈ నెల 20వతేదీ లోపు ఆప్లై చేసుకోవచ్చు. వివరాలకు అధికారిక వెబ్ సైట్ను చూడండి.
శ్రీకాకుళం జిల్లాకు డీఎస్సీలో 458 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ క్రమంలో జిల్లాలో 22,648 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి 39,235 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తంగా ఒక్కో పోస్టుకు 85 మంది పోటీపడుతున్నారు. కొంచెం కష్టపడితే జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు.
SBI డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలపరిమితుల డిపాజిట్లపై 20 బేసిక్ పాయింట్ల మేర తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని SBI తెలిపింది. 1-2 సంవత్సరాల కంటే తక్కువ 6.70%, 3-5 సంవత్సరాల కంటే తక్కువ 6.75%, 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ 6.85%, సీనియర్ సిటిజన్లకు అన్ని కాలపరిమితులపై అదనంగా 0.50% తగ్గింపు ఉండనుంది.
ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు 14వ రోజు బుధవారం సందడిగా, వినోదంగా కొనసాగాయి. ముందుగా విద్యార్థులతో లైబ్రరీన్ విజయభాస్కర్ రెడ్డి కథలు చదివించడం, కథల్లోని నీతిని వివరించడం పాటలు పాడించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాశక్తిని వెలికి తిసేందుకు, వారిలో దాగి ఉండే ప్రతిభను గుర్తించడం ఏర్పాటు చేశామన్నారు.
ప్రకాశం: డైట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్ -2025 కొరకు ఈ నెల 20వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని డైట్ కళాశాల ప్రిన్సిపల్ సామా సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా ఈ గడువును పొడిగించారని ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ వైపు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లడం.. మరోవైపు పసిడి కొనుగోళ్లు ఊపందుకోవడంతో.. మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.160 పెరిగి రూ.95,620గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరగ్గా రూ.87,650కి చేరింది. కాగా.. కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.1,09,000 ఉంది.
AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి జీతాలు పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375కు పెంచగా, నెలకు అత్యధికంగా రూ.27వేలుగా నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
AP: ఈఏపీసెట్(EAPCET) 2025 పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SKLM: జలుమూరు మండలం కరవంజ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని హెచ్ఎం టి. ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక పాఠశాలలో సైన్స్ తరగతుల సంబంధించి రెమిడీయల్ క్లాసులు నిర్వహించామన్నారు. సెలవు దినాలలో తప్ప మిగిలిన రోజులు ప్రతి సబ్జెక్టు పైన ఆయా ఉపాధ్యాయులతో క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
SKLM: హిరమండలం మండలం కూర్మ వైదిక గ్రామంలో వర్ణాశ్రమ కళాశాలలో చేతివృత్తులపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు ప్రభుదాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పూర్వ వృత్తుల పునరుద్ధరణ, సత్ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహణ, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడం వంటి అనేక అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు శిక్షణ పొందవచ్చు.
kMM: ఉమ్మడి జిల్లా పరిధిలో డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6 సెమిస్టర్లు చదువుతున్న విద్యార్థులు సకాలంలో రుసుములు చెల్లించాలన్నారు. ఈనెల31లోగా పరీక్షల రుసుమును చెల్లించాలని ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డా.మొహ్మద్ జాకిరుల్లా, ప్రాంతీయ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డా.బి.వీరన్న తెలిపారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ఉంటుందని శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ పరిశ్రమలో ఉపాధి, శిక్షణ పొందుటకు అర్హులని తెలిపారు. ఈ అవకాశం అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కృష్ణా: గుడివాడ పట్టణంలోని అక్కినేని నాగేశ్వరావు కళాశాలలో ఈనెల 14వ తేదీన ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
HYD: హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఇంటర్ పాసైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సురేశాబాబు గురువారం తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 840 సీట్లు ఉన్నాయని, దోస్త్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు.