దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 322.88 పాయింట్లు లాభపడి 75,506.24 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 87.45 పాయింట్ల లాభంతో 23,739.30 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.25గా ఉంది.
క్రెడిట్ కార్డు బిల్లులో కేవలం మినిమం డ్యూ చెల్లిస్తే.. మిగిలిన బాకీపై ఏడాదికి 30-50% చక్రవడ్డీ పడి అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. అందుకే మొత్తం బిల్లును పూర్తిగా కట్టేయడమే మంచిది. అప్పులు తీర్చలేక బ్యాంక్తో ‘సెటిల్మెంట్’ చేసుకుంటే భవిష్యత్తులో ఎక్కడా రుణాలు దొరకవు. మీ పాన్ నంబర్పై ఎవరైనా ఫేక్ లోన్లు తీసుకున్నారేమో భీమ్ యాప్లో ఉచితంగా తెలుసుకోవచ్చు.
క్రెడిట్ స్కోరు ఎప్పుడూ 800పైనే ఉండాలంటే కొన్ని ఆర్థిక సూత్రాలు పాటించాలి. లోన్ ఈఎంఐలు, కార్డ్ బిల్లులు గడువులోపే కట్టేయాలి. ఇందుకోసం ఆటో-డెబిట్ ఆప్షన్ ఉత్తమం. క్రెడిట్ కార్డు పరిమితిలో కేవలం 30 శాతం లోపే వాడాలి. అలాగే, మీ క్రెడిట్ చరిత్ర బలంగా కనిపించాలంటే చాలా కాలంగా వాడుతున్న పాత క్రెడిట్ కార్డులను అస్సలు రద్దు చేయకూడదు. ఇవన్నీ పాటిస్తూ మీ క్రెడిట్ స్కోరును పెంచుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు SSC CGL 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారు జూన్ 22లోపు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 29 నుంచి అప్లికేషన్ సవరణకు ఛాన్స్ ఉంది. టైర్-1 పరీక్షలు ఆగస్టు-సెప్టెంబర్లో, టైర్-2 ఎగ్జామ్స్ డిసెంబర్ 2026లో కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి.
సొంతిల్లు, కారు కొనాలనుకునే మధ్యతరగతి వారికి క్రెడిట్ స్కోరే శ్రీరామరక్ష. మీ స్కోరు 800 దాటితే బ్యాంకులు అత్యల్పంగా 7.25 శాతానికే హోమ్ లోన్ ఇస్తాయి. అదే స్కోరు 650 కంటే తగ్గితే వడ్డీ రేటు 8.4 శాతానికి పైగా పెరుగుతుంది. ఉదాహరణకు, రూ.50 లక్షల హోమ్ లోన్పై తక్కువ స్కోరు ఉంటే 20 ఏళ్లలో ఏకంగా రూ.8.5 లక్షలు అదనంగా వడ్డీ కట్టాలి. కారు లోన్లపై కూడా ఇదే ప్రభావం ఉంటుంది.
RRB.. సెక్షన్ కంట్రోలర్ (CEN No.04/2025) పోస్టులకు సంబంధించిన CBAT రీషెడ్యూల్ తేదీని ప్రకటించింది. జూన్ 6న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 24 జరగాల్సిన సీబీఏటీను వాయిదా వెస్తున్నట్లు ఇటీవల ప్రకటించగా తాజాగా కొత్త తేదీని అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనుంది.
RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. మార్చి 13న జరిగిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి RRB పోర్టల్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఫలితాలను, స్కోర్కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కోర్కార్డు డౌన్లోడ్ లింక్ జూన్ 4 వరకు అందుబాటులో ఉంటుంది.
అమెరికాకు చెందిన కార్ల తయారీ కంపెనీ టెస్లాకు చైనాలో ఎట్టకేలకు లైన్క్లియర్ అయ్యింది. తన పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని చైనాలో ప్రారంభిస్తున్నట్లు టెస్లా వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఈ భేటీ అనంతరం టెస్లాకు అనుమతులు రావడం గమనార్హం.
అదనపు ఫీచర్లను అందించడానికి వాట్సాప్ ‘ప్లస్’ అనే కొత్త ఫీచర్ను మెటా తీసుకొచ్చింది. దీనిని సబ్స్క్రైబ్ చేసుకుంటే 20 ఛాట్స్ పిన్ చేసుకోవచ్చు. ఒక్కో కాంటాక్ట్కి ఒక్కో రింగ్టోన్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్లోకి వెళ్లాలి. అందులో వాట్సాప్ ప్లస్ క్లిక్ చేయాలి. ప్రస్తుతం ఈ సేవలు నెలపాటు ఉచితంగా లభిస్తున్నాయి.
బ్యాంక్ కస్టమర్లకు RBI గుడ్న్యూస్ చెప్పింది. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్త డ్రాఫ్ట్ రూల్స్ను విడుదల చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపై రికవరీ పేరుతో వేధిస్తే సహించేదిలేదని తేల్చి చెప్పింది.
UPSC 2026-27లో నిర్వహించే నోటిఫికేషన్ల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల నోటిఫికేషన్లు, దరఖాస్తు చివరి తేదీలు, ఎగ్జామ్ తేదీల వివరాలను ఇందులో పొందుపరిచింది. సివిల్స్, కంబైన్డ్ జియో సైంటిస్ట్, ఇంజినీరింగ్ సర్వీసెస్, CISF, NDA&NA ఎగ్జామినేషన్, IFS, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, CDS తదితర పరీక్షలను UPSC నిర్వహించనుంది. పూర్తి వివరాల కోసం పైన ఫొటోను చూడాలి.
TG: లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు జూన్ 5వ తేదీన విడుదల కానున్నాయి. లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈనెల 23న ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. 25 వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. లాసెట్కు 66,864 మంది దరఖాస్తు చేసుకోగా, 54,374 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
EMIలతో మొబైల్, ట్యాబ్స్ కొనుగోలు చేసిన వారికి RBI ఊరటనిచ్చింది. 2 నెలలు లోన్ కట్టకపోయినా డివైజ్లను బ్లాక్/డీయాక్టివేట్ చేయొద్దని బ్యాంకర్లకు స్పష్టం చేసింది. 90 రోజులు దాటినా స్పందించకపోతే ఫోన్ ఫీచర్లను(ఎమర్జెన్సీ సర్వీసులు మినహా) నిలిపివేయొచ్చని తెలిపింది. బకాయి చెల్లించిన గంటలోపు లాక్ తొలగించాలని, లేదంటే గంటకు రూ.250 చొప్పున కస్టమర్కు ఇవ్వాలని పేర్కొంది.
ఎట్టకేలకూ రూపాయి పతనానికి బ్రేక్ పడింది. దాదాపు 8 రోజుల తర్వాత రూపాయి బలపడింది. డాలర్ మారకపు విలువలో 52 పైసలు బలపడి రూపాయి విలువ 96.30కు చేరింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు తుది దశకు చేరడం, RBI జోక్యంతో తిరిగి రూపాయి పుంజుకుంది.