కోనసీమ: ఈ నెల 21న అమలాపురంలోని హైస్కూల్ సెంటర్లో ఉన్న సంబర సెలబ్రేషన్ మీటింగ్ హాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్ధులు ఆరోజు ఉదయం 10 గంటలకు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
TG: రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఇవాళ్టితో ముగియనుంది. టెట్ పేపర్ 1,2 లకు కలిపి మొత్తం 2.38 లక్షల మంది దరఖాస్తు చేశారు. సగటున 80శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈసారి ఇన్ సర్వీస్ టీచర్లు 71,670 మంది దరఖాస్తు చేయడం గమనార్హం. పరీక్ష ఫలితాలు వచ్చే నెల 10-16 తేదీల మధ్య వెల్లడవుతాయి.
దావోస్లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో స్విగ్గీ పుడ్ మార్కెట్ ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ పలు అభిప్రాయాలను పంచుకున్నారు. జాబ్ మార్కెట్కు డెలివరీ పార్ట్నర్లు మూడో పిల్లర్గా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు డెలివరీ ఉద్యోగాలను కేవలం గిగ్ వర్క్గా చూడొద్దని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.950 పెరిగి రూ.1,35,000 వద్ద ఉంది. ఇక వెండి ఏకంగా రూ.12,000 పెరిగి కిలో రూ.3,30,000కు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 25,493 వద్దకు చేరింది. సెన్సెక్స్ 288 పాయింట్లు నష్టపోయి 82,967 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.90.91గా ఉంది.
జర్మనీలో ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్స్ పోస్టుల కోసం అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని టామ్ కామ్ ఎండీ తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలతో పాటు 2-3 ఏళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు టామ్ కామ్ వెబ్ సైట్ లేదా 9440049013, 9440051452 నంబర్లో సంప్రదించండి.
ధరల పెరుగదలలో వెండి దూకుడుగా వెళ్తోంది. ఇది కొనుగోలుదార్లకు ఆందోళన కలిగిస్తుండగా.. పెట్టుబడిదార్లను మాత్రం ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ నెలలోనే వెండి కిలో ధర రూ. 2.40 లక్షల నుంచి రూ. 3.09లక్షలకు పైగా పెరిగింది. దీపావళి సమయంలో ధర బాగా పెరిగినా.. పండగ తర్వాత 2025 అక్టోబరు 27న కిలో వెండి ధర రూ.1.48 లక్షలకు దిగి వచ్చింది.
ఈ నెలలో బ్యాంకులకు వరుసగా 4 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24న(నాలుగో శనివారం), 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం రోజున అధికారిక సెలవులు ఉన్నాయి. ఇక 27న వారానికి 5రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
ATP: నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు విద్యుత్ సమస్యలపై 89777 16661 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎస్ఈ కోరారు.
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో 30 పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగుస్తోంది. 2 Sr సైంటిఫిక్ ఆఫీసర్, 3 Jr సైంటిఫిక్ ఆఫీసర్, 1 Sr సైంటిఫిక్ అసిస్టెంట్, 24 ల్యాబ్ ఆసిస్టెండ్ పోస్టులు ఉండగా.. సంబంధిత డిగ్రీ/PG/PhD ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
JEE మెయిన్స్ సెషన్-2 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 21, 22, 23, 24 తేదీలలో పరీక్షలు జరగనుండగా.. అడ్మిట్ కార్డులు NTA అధికారిక సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఉ.9 గంటల నుంచి మ. 12 గంటల వరకు ఒక పరీక్ష.. మ. 3 నుంచి సా.6 గంటల వరకు మరో పరీక్ష జరగనుంది. అటు 28, 29న జరిగే పేపర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు తర్వాత విడుదల కానున్నాయి.
NLG: మిర్యాలగూడ పట్టణంలోని 38వ వార్డు వినోభానగర్ నందు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భవనం యొక్క నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. మిర్యాలగూడ పట్టణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
TPT: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రేపు నిర్వహించేందుకు NTA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. SGS స్కూల్, గీతం స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్లోకా ఏ బిర్లా స్కూల్లో పరీక్షలు జరగనున్నాయి.1569 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సా. 4.30 వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సా. 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA డిసెంబర్ 2025 సంవత్సరానికి సంబంధించిన UGC-NET ఆన్సర్ కీని విడుదల చేసింది. NTA 85 సబ్జెక్టులకుగానూ డిసెంబర్ 31 నుంచి జనవరి 7వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.