టెన్త్, ఇంటర్, జేఈఈ మెయిన్, నీట్, గేట్ పరీక్షల తేదీలు వచ్చేశాయి. దీంతో ఇప్పటినుంచే సరైన ప్రణాళిక వేసుకుంటే తప్ప మంచి స్కోర్ సాధించడం కష్టమని నిపుణులు అంటున్నారు. టైం మేనేజ్మెంట్ ఉండాలని.. వాయిదా వేయడం మానుకోవాలని తెలిపారు. బట్టీ పట్టకూడదు, రివిజన్, ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఫోన్కు దూరంగా ఉండాలి. ప్రిపరేషన్ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
TG: టెట్ దరఖాస్తులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 1,26,085 దరఖాస్తులు అందినట్లు టెట్ ఛైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. పేపర్ 1 కు 46,954, పేపర్ 2కు 79,131 దరఖాస్తులు వచ్చాయి.
ఎలాంటి రాతపరీక్ష లేకుండానే RRB పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 4,116 అప్రెంటిస్ పోస్టులకు గాను అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అర్హులైన వారు రేపటి నుంచి ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 85,320.04 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 84,710.11 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 331.21 పాయింట్ల నష్టంతో 84,900.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 108.65 పాయింట్ల నష్టంతో 25,959.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.89.19గా ఉంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గి రూ.1,25,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 తగ్గి రూ.1,14,700 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.1,000 తగ్గి రూ.1,71,000కు చేరింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
AP: టెట్కు అత్యధికంగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టెట్ దరఖాస్తుకు ఆదివారం చివరి తేదీ కావడంతో సాయంత్రం వరకు 2,58,638 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా, పురుషులు 90,970 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 65 శాతం మంది మహిళలే ఉన్నారు. పేపర్-1ఏ కు 1,01,882, పేపర్-2ఏ కు 1,51,220 దరఖాస్తులు వచ్చాయి.
ఆన్లైన్ షాపింగ్ లవర్స్ కోసం ఫ్లిప్కార్ట్లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. నవంబర్ 28 వరకు ఈ క్రేజీ సేల్ కొనసాగనుంది. ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్లు ఉన్నాయి. Samsung Galaxy S24 5G అసలు ధర రూ.74,999 ఉండగా, ఇప్పుడు దాన్ని కేవలం రూ.40,999కే కొనుగోలు చేయవచ్చు. Poco M7 5G వంటి 5G ఫోన్లు కూడా రూ.10,000 లోపు అందుబాటులో ఉన్నాయి.
TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన MBA పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. MBA (టెక్నాలజీ మేనేజ్మెంట్), MBA (ఈవినింగ్) కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ అధికారి తెలిపారు. యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
చదువుతున్నప్పుడు నిద్ర రావడం అనేది చాలా మంది విద్యార్థులు ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే చదువుకునేటప్పుడు ప్రతి గంటకు చిన్న విరామం (5ని.లు) తీసుకోవాలి. చదువుతున్న గదిలో తగినంత వెలుతురు ఉండాలి. అలాగే ఏకాగ్రతను పెంచడానికి తరచుగా నీరు త్రాగాలి. నిద్ర ఎక్కువగా వస్తే 15-20 నిమిషాలపాటు నిద్రపోయి తిరిగి లేచి చదవాలి. ఇలా చేస్తే ఏకాగ్రత మెరుగుపడి, నిద్ర దూరమవుతుంది.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా వచ్చే నెల 14 వరకు అధికారులు అవకాశం కల్పించారు. పదో తరగతి పాస్ అయిన వారు అప్లై చేసేందుకు అర్హులని తెలిపారు. రూ.18 వేల నుంచి 57 వేల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు ‘IB MTS Recruitment 2025’ను సందర్శించాలని సూచించారు.
TG: గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు HYD అడ్డాగా మారింది. బహుళ జాతి సంస్థలు HYDలో GCCల ఏర్పాటుకు జై కొడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు దేశంలో 88 జీసీసీలు ఏర్పాటు కాగా.. అందులో 46 శాతం వాటాతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో బెంగళూరు ఉంది. కాగా, 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 122 GCCలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్డనెన్స్ ఫ్యాక్టరీ మెదక్(OFMK) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 17 పోస్టులు ఉండగా.. BE/Btech అర్హత గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. Jr.పోస్టులకు అభ్యర్థుల వయసు 21-30 మధ్య, Sr.పోస్టులకు గరిష్ఠంగా 45 ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. B.Tech, BE, MSc, MCA అర్హత కలిగినవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bankofindia.bank.in/
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయసు 18-25 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST, OBC, PwD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉడనుంది. ఈ పోస్టులకు టెన్త్ పాసైన వారు అర్హులు. నెలకు రూ.18 వేల నుంచి రూ.56,900 వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.mha.gov.in/enను సంప్రదించవచ్చు.
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి తక్కువ ధరకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొన్ని భారత కంపెనీలు కొనుగోళ్లు ఆపేశాయి. ఫలితంగా US, పశ్చిమాసియా నుంచి అధిక ధరకు చమురు దిగుమతి చేసుకుంటే, ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది.