క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వ్యవస్థను నిషేధించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ పద్ధతిలో గిగ్ కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డైడ్లైన్ను అందుకునేందుకు గిగ్ కార్మికులు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 10 నిమిషాల క్రూరత్వ పద్ధతికి ముగింపు పలకాలని రాజ్యసభలో కోరారు.
భారత్ UPI సేవలు మరిన్ని దేశాలకు విస్తరించనున్నాయి. తాజాగా మరో 8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు వెల్లడించారు. ప్రస్తుతం సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఖతార్, యూఏఈ, మారిషస్ దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీలను అనుమతించేలా మరో 7-8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని నాగరాజు తెలిపారు.
DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ 763 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్ https://www.drdo.gov.in ను సందర్శించండి.
ఈ ఏడాది ఇప్పటికే వడ్డీరేట్లపై త్రిపుల్ బొనాంజా ప్రకటించిన RBI.. మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25శాతానికి దిగొచ్చింది. కాగా, ఈ ఏడాది FEB, APRలో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన RBI.. జూన్లో 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టిన సంగతి తెలిసిందే.
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. మరిన్ని ఒప్పందాల దిశగా అడుగులు వేస్తోంది. టాటా గ్రూప్తో భాగస్వామ్యం అంశాన్ని సరైన సమయంలో వెల్లడిస్తామని గూగుల్ వెల్లడించింది. కాగా, అక్టోబరులో రిలయన్స్ ఇంటెలిజెన్స్తో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికింద 18 నెలల పాటు జియో వినియోగదార్లకు ‘గూగుల్ జెమినై’ తాజా వెర్షన్ను ఉచితంగా అందిస్తోంది.
వెస్ట్రన్ కోల్ఫీల్డ్లో 1,213 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే చివరి రోజు. టెన్త్/ITI/BTech/BE అర్హత గల 18-26 ఏళ్లలోపు వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్లు ముందుగా NATSలో, ITI అప్రెంటీస్లు NAPSలో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://westerncoal.in/
TG: 118 ఏపీపీ(అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పరీక్ష వివరాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 14న ఏపీపీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఏపీపీ పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.
అమెరికన్ డాలర్ దెబ్బకు భారత్ రూపాయి విలవిలలాడుతోంది. భారత కరెన్సీ విలువ జీవనకాల కనిష్టానికి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే 28 పైసలు నష్టపోయి.. ఏకంగా రూ.90.43కి చేరింది. డాలర్ బలపడటం, విదేశీ నిధులు తరలిపోవడంతో రూపాయికి కష్టాలు ఎదురయ్యాయి. దీనివల్ల దిగుమతులు ఖరీదై.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
GNTR: పొన్నూరు శివారులోని VNR ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈ నెల 12వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ నాగ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, పరిసర గ్రామీణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
దేశవ్యాప్తంగా 1232 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ ప్రకటించింది. పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరో వైపు పరిస్థితిని వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఇండిగో తెలిపింది. కొన్ని విమానాల సర్వీసులను రీషెడ్యూల్ చేస్తున్నట్లు చెప్పింది.
TG: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్తో పాటు సమాన వేతనం అమలు చేస్తూ విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో నోటిఫికేషన్ జారీ చేయగా… కొందరిని 2013లో.. మరికొందరిని 2014లో రెండు విడతలుగా నియమించారు. దీంతో వేతనంలో తేడాలు, సీనియారిటీ సమస్యలు తలెత్తాయి. ఈ విషయంలో విచారణ జరిపిన న్యాయస్థానం టీచర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
AP: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వైబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 10 నుంచి రెండు విడతల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.
NZB: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని కమ్మర్పల్లిలోని భవిత కేంద్రం, ప్రాథమిక పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. MEO ఆంధ్రయ్య, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు వినికిడియంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం క్రీడా పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు.
రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోవటంపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువ రూ.90కి చేరటంపై ప్రభుత్వం ఆందోళనేమీ చెందటం లేదని తెలిపారు. దీనివల్ల అటు ద్రవ్వోల్బణంపై గానీ, ఎగుమతులపై గానీ ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు.
CBSE (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. దేశంలోని పలు చోట్ల ఉన్న సీబీఎస్ఈ ఆఫీస్ల్లో ఖాళీగా ఉన్న 124 గ్రూప్-ఎ, బి, సి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించి భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.