TG: రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించరు. కానీ విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి గురువారం సీబీఐ అధికారులు వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు నోటీసులు ఇవ్వడానికి ఆమె ఇంటికి అధికారులు చేరుకున్నారు. దీంతో ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్లు నష్టపోయి 76034.42 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23639.15 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.21గా ఉంది.
13 ఏళ్లలోపు పిల్లల కోసం వాట్సప్ పేరెంట్-మేనేజ్డ్ ఫీచర్ను పరిచయం చేస్తోంది. దీని ద్వారా పిల్లల అకౌంట్లను తల్లిదండ్రులు తమ ఫోన్ల నుంచే నియంత్రించవచ్చు. తనకు ఎవరు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో ఉండాలనేది పెద్దలే నిర్ణయిస్తారు. అయితే, ప్రైవసీ దెబ్బతినకుండా మెసేజ్లు మాత్రం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ పద్ధతిలోనే సురక్షితంగా ఉంటాయి.
TG: రాష్ట్రంలో పాఠశాలలకు హాఫ్ డే స్కూల్స్ షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించింది. మార్చి16నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. 8AM నుంచి 12.30PM వరకు స్కూల్స్ నడపనున్నారు. మధ్యాహ్న భోజనం 12.30కు వడ్డించి.. ఆ తర్వాత విద్యార్థులను ఇంటికి పంపించేస్తారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో 1PM గంట నుంచి 5PM వరకూ ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు.
TG: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈనెల 16 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. రోజురోజుకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాఫ్ డే స్కూల్స్ పెట్టాలని నిర్ణయించింది.
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ఐకూ దేశీయ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఐకూ Z11కు కొనసాగింపుగా iQOO Z11x 5G పేరిట విడుదల చేసింది. ఐకూ Z11x 5G మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 6GB+128GB ధర రూ.18,999, 8GB+128GB వేరియంట్ ధర రూ.20,999, 8GB+256GB వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 124 ఖాళీలు భర్తీ కానున్నాయి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మార్చి 15 వరకు గడువు ఉంది.
భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు సంక్షోభం ప్రభావంతో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.35కు చేరింది. ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో డాలర్కు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా ఈ పతనానికి కారణమైంది.
వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఏసీనే అక్కర్లేదు. రూ.6 వేల బడ్జెట్లోనే బెస్ట్ ఎయిర్ కూలర్లు లభిస్తున్నాయి. బజాజ్ PX 97 టార్క్, క్రాంప్టన్ జెనీ నియో తక్కువ విద్యుత్తును వాడుతూ చిన్న గదులను చల్లబరుస్తాయి. సింఫనీ ఐస్ క్యూబ్ 27 లీటర్ల ట్యాంక్తో వస్తుంది. ఓరియంట్ స్మార్ట్కూల్ Dx, హావెల్స్ ఫ్రెడ్డో ఐ మోడళ్లు హనీకోంబ్ ప్యాడ్లతో అద్భుతమైన కూలింగ్ ఇస్తాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 తగ్గి రూ.1,62,220కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.1,000 తగ్గి రూ.1,48,700గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,90,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
TG: ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 10 లోపు ఫలితాలను విడుదల చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. వీలైతే ఏప్రిల్ 4, 5 తేదీల్లోనే ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాల్యుయేషన్లో ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైతే మరో 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉంది.
ఒప్పంద ప్రాతిపదికన IIT మద్రాస్లో 3 సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు సప్లై డిజైన్, మాగ్నెటిక్ కాంపోనెంట్ డిజైన్ PCB లేఔట్ తయారీలో నైపుణ్యం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు కనీస జీతం రూ.లక్ష. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.