బీకాడీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ ఇవాళ కన్నుమూశారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. రతన్ చదివింది 8వ తరగతి అయినా.. తన అద్భుత వ్యాపార వ్యూహాలతో బీకాడీ ఫుడ్స్ను రూ.13 వేల కోట్ల విలువైన కంపెనీగా మలిచారు.
నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం 2031 నాటికి భారత బిలియనీర్ల సంఖ్య 51 శాతం పెరగనుంది. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 313కి చేరుతుందని అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటంతో ప్రతిరోజూ సగటున 89 మంది అల్ట్రా రిచ్ జాబితాలో చేరుతున్నారు. ఇది మన దేశంలో పెరుగుతున్న సంపద సృష్టికి, ఆర్థిక బలానికి నిదర్శనంగా నిలుస్తోంది.
భారత్లోని తమ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. పేయూ భాగస్వామ్యంతో మొబైల్ రీఛార్జ్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరుగా ఈ మెసేజింగ్ యాప్లోనే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్లను చేసుకునే వెసులుబాటును కల్పించింది. దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.
భారత్లోని తమ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. పేయూ భాగస్వామ్యంతో మొబైల్ రీఛార్జ్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరుగా ఈ మెసేజింగ్ యాప్లోనే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్లను చేసుకునే వెసులుబాటును కల్పించింది. దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.
TG: హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (NIMH) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 6 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8 ఇంటర్యూ అనంతరం రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ nimh.nih.govను సందర్శించండి.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 2026 ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో మొత్తం 157 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ exams.nta.nic.in/cuet-pgలో చూసుకోవచ్చు. సవరించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగానే ఈ ఫలితాలను ప్రకటిస్తున్నారు.
AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రెండేళ్ల D.EL.Ed కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ‘డీఈఈసెట్-2026’ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 25 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గడువులోపు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే JEE Advanced 2026 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. JEE Mainలో నిర్ణీత కటాఫ్ పర్సంటైల్ సాధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయగలరు. మే 2 వరకు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు. మే 17న పరీక్ష జరగనుంది.
TG: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా, ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను అధిక ధరలకు కొనాలని తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ప్రైవేటు పాఠశాలల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది.
TG EAPCET-2026 హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఉదయం 11 గంటల నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరుగుతాయి. అలాగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు హాల్ టికెట్లు ఏప్రిల్ 27న విడుదల కానుండగా, పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.
TG: రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని చూస్తే ఆయా పాఠశాలల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా పిల్లలు మధ్యాహ్నం బయటికి వెళ్లకుండా, అలాగే ఈత కోసం బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.
TG, APలోని విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయి. రేపటి నుంచి జూన్ 11 వరకు స్కూళ్లు మూతపడనున్నాయి. దాదాపు 48 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. ఇవాళ పాఠశాలలకు చివరి పని దినం కావడంతో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అందించనున్నారు. కాగా, వేసవి సెలవులు అన్ని ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలకు కూడా వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
NTR: విసన్నపేట జడ్పీ పాఠశాలను డీఈవో చంద్రకళ సందర్శించారు. బడి పిలుస్తుంది వారోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. గత ఏడాదికంటే 20% ఎక్కువగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూశారు.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటో.. ఎడ్జ్ 70 ప్రో పేరిట స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐ, 6.8 అంగుళాల సూపర్ HD ఎక్స్ ట్రీమ్ అమోలెడ్+ డిస్ ప్లే, 144Hz, వెనక వైపు 50MP+ 50MP కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, 6,500mah బ్యాటరీ, IP68 రేటింగ్తో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.38,999గా కంపెనీ నిర్ణయించింది.
TG: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో RTCలో రోజువారి వేతనంతో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 10వ తరగతి పాసైన వారికి డిపో మేనేజర్లు టీమ్స్ మిషన్లపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, డ్రైవర్లకు కనీస విద్యార్హత ఉండి 18 నెలల డ్రైవింగ్పై అనుభవం ఉంటే అవకాశాలు కల్పిస్తున్నారు. రోజువారిగా కండక్టర్లకు రూ.800, డ్రైవర్లకు రూ.1,000 వేతనం ఇస్తున్నారు.