ఒప్పో ఇండియా తాజాగా ఫైండ్ ఎక్స్ 9 సిరీస్లో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. వేరియంట్ని బట్టి దీని ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ ఫోన్లో హాసెల్బ్లాడ్తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్ జెన్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ హై–ఎండ్ గేమింగ్కు సరిపడే పనితీరు కలిగి ఉంది.
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను RBI హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన RBI తాజాగా ఈ లిస్ట్లో 7 ప్లాట్ఫామ్స్ను చేర్చింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్నెట్ FX, క్యాప్ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్ మార్కెట్స్ వంటివి ఉన్నాయి.
AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష ఉంటుంది. రోజూ ఉ. 9.30 నుంచి మ.12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. షాపింగ్ చేసే వారికి ఉపయోగపడేలా ‘ప్రైస్ హిస్టరీ’ అనే కొత్త ఆప్షన్ను అందుబాటులో ఉంచింది. దీనిద్వారా గత 30-90 రోజుల్లో ఒక వస్తువు ధర ఎంత నుంచి ఎంతకు తగ్గింది లేదా పెరిగింది అనేది తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆఫర్ సేల్ సమయాల్లో బాగా ఉపయోగపడుతుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది. మల్టీ స్కిల్డ్ వర్కర్, వెహికల్ మెకానిక్ పోస్టులు ఉండగా.. దరఖాస్తు గడువు ఈ నెల 24తో ముగుస్తోంది. 10th, ITI ఉత్తీర్ణులైన 18-25 ఏళ్లలోపువారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bro.gov.in/
ఆధునిక AI గాఢ్ ఫాదర్ల్లో ఒకరైన కంప్యూటర్ సైంటిస్ట్ యాన్ లెకున్ మెటా నుంచి తప్పుకున్నారు. తన సొంత AI స్టార్టప్ను ప్రారంభించేందుకు మెటాకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టారు. 12 ఏళ్ల తర్వాత తాను మెటాను విడిచిపెట్టనున్నట్లు పేర్కొన్నారు. కాగా, లెకున్ 2013లో మెటాలో వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేశారు.
నిన్నటితో పోలిస్తే ఇవాళ వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి ధర రూ.12,000 తగ్గి రూ.1,61,000లకు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,24,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.200 తగ్గి రూ.1,14,100గా పలుకుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఆ దేశ చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీలైన రోస్నెఫ్ట్, లుక్ఆయిల్పై ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో భారత్, చైనా కొనుగోలుదారులు దూరం కావడంతో ఆ దేశ చమురు ధరలు పతనమైనట్లు తాజాగా అమెరికా ట్రెజరీ శాఖ పేర్కొంది.
ఆర్మ్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్(చెన్నై- AVNL)లో 133 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. జూ.టెక్నీషియన్, జూ.మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు ఉండగా.. సంబంధిత డిగ్రీ, డిప్లొమా గల 21-28 ఏళ్లలోపు అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
AP: మెగా డీఎస్పీ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు సెలవులను మంజూరు చేస్తూ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు సీఎల్స్ 4, ఐచ్ఛిక సెలవు ఒకటి, ప్రత్యేక సీఎల్స్ 2, మహిళా టీచర్లకు అదనపు ప్రత్యేక సెలవు ఒకటి మంజూరు చేశారు.
నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం ధర స్వల్పంగా, వెండి రేటు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.170 తగ్గి రూ.1,24,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.150 తగ్గి రూ.1,14,300 పలుకుతోంది. అలాగే కిలో వెండి ధర రూ.3,000 తగ్గి రూ.1,73,000లకు చేరింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
దేశంలో UPI చెల్లింపుల్లో PhonePe తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. PhonePe ఏకంగా 45.47% మార్కెట్ షేరుతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత Google Pay(34.62%) నిలిచింది. ఈ రెండూ కలిపి 80 శాతానికి పైగా మొత్తం UPI మార్కెట్ను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత Paytm(7.36%), Navi(2.78%), CRED(1.28%) వంటి ప్లాట్ఫామ్లు కూడా కొంతమేర వాటాను కలిగి ఉన్నాయి.
స్వదేశీ సంస్థ ఇండ్కల్ టెక్నాలజీస్ వోబుల్ వన్ పేరిట తన తొలి స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, మీడియా టెక్ 7400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16, వెనక వైపు 50MP+8MP+2MP మ్యాక్రో కెమెరాతో వస్తోంది. 8GB+128GB వేరియంట్ ధరను రూ.22,000గా కంపెనీ నిర్ణయించింది. DEC 12న విక్రయాలు ప్రారంభంకానున్నాయి.
NZB: జాతీయ బార్ కౌన్సిల్ మెంబర్, అసిస్టెంట్ సోలిసిటర్ విష్ణు వర్ధన్ రెడ్డి బుధవారం ఆర్మూర్ బార్ అసోసియేషనను సందర్శించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్య దర్శి జెస్సు అనిల్ కుమార్, సీనియర్ న్యాయవాదులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యుల సమస్యలను విని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
వాట్సాప్లో తీవ్రమైన భద్రతా లోపం ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. దీని వల్ల సుమారు 350 కోట్ల మంది కాంటాక్స్ నంబర్లు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హ్యాకర్లు లేదా ఇతరులు భారీ ఎత్తున ఫోన్ నంబర్లు తస్కరించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వియన్నా పరిశోధకులు తెలిపారు. వెంటనే వాట్సాప్ నిర్వాహకులు ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు.