ASR: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శనివారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పాడేరులో జిల్లా స్థాయి 5కే మారథాన్ రెడ్ రన్ పరుగు పందేలు నిర్వహించామని జిల్లా కుష్టు, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.
ASR: డుంబ్రిగుడ మండలంలోని ఓంబీ, జాకరవలస ప్రాథమిక పాఠశాలలను రెండవ మండల విద్యాశాఖ అధికారి జీ. గెన్ను శనివారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న బోధన తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సకాలంలో విధి నిర్వహణ చేపట్టి విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్పర్సన్ ఎవరు?A) మమతా శర్మB) విజయ కిషోర్ రహత్కర్C) రేఖా శర్మD) లలితా కుమార మంగళం నిన్నటి ప్రశ్నకు జవాబు: 1930NOTE: పోటీ పరీక్షల ప్రత్యేకం
BDK: సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా (జేఎంఈటీ) చేరి వివిధ కారణాలతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి వీలుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ ఆదేశాల మేరకు వారికి మరొక అవకాశాన్ని కల్పించేలా ఉత్తర్వులు శనివారం విడుదల అయ్యాయి.
చిత్తూరు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్, సీడాప్ డీఆర్డీఏ సంయుక్తంగా ఈనెల 10వ తేదీన కార్వేటినగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించబడుతుందని ఐటీఐ ప్రిన్సిపాల్ ఆనంద్ తెలిపారు. మేళాలో 12 కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ ఫెయిల్/పాస్ అయిన 18 నుంచి 35ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు.
TPT: ఎస్వీయూలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మేళాలో ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొని 300 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వర్మ తెలిపారు. హైదరాబాద్కు చెందిన మేధా గ్రూప్ కంపెనీ 300 అప్రెంటిస్ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ ఉత్తీర్ణులై ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన వారు సర్టిఫికెట్లతో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు.
ASR: ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే శక్తి గురువులదేనని కలెక్టర్ దినేష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాడేరు కాఫీ హౌస్లో గురుపూజోత్సవం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముందుగా విద్యార్థినులు వందేమాతరం, భక్తి గీతాలు ఆలపించారు. ఉపాధ్యాయుడు సమాజ అభివృద్దికి మూల పురుషుడని, సమాజ బాగుకు ఆయుధమన్నారు. ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శమన్నారు.
HYD: Ed.CET 2025 సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ తేదీలను పొడిగించినట్లుగా HYD ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. నేటి నుంచి వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైందని, సెప్టెంబర్ 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో, 6వ తేదీన ముగియాల్సిన ప్రక్రియను 8వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.
రోజురోజుకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త తగ్గినా.. ఈ రోజు మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగి రూ. 1,07,620కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 700 పెరిగి రూ. 98,650గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ. 1,000 తగ్గి రూ. 1,36,000కి చేరింది.
HYD: ఓయూ పరిధిలోని సికింద్రాబాద్ పీజీ కాలేజీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో బోధించుటకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. కాలేజీలోని హిందీ, ఇంగ్లిష్, గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
HYD: గణేశ్ విగ్రహాల నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 6న JNTUలో జరగాల్సిన ఫార్మ్-డి మొదటి సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 17న జరుగుతాయని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ గురువారం తెలిపారు. పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడవచ్చన్నారు.
రోజురోజుకు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,06,860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 తగ్గి రూ.97,950 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
ASR: రాష్ట్ర స్ధాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా అరకులోయ మండలం, కంఠబౌసుగూడ జీహెచ్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని శెట్టి రోజారాణి ఎంపికయ్యారు. ఈమె 24 ఏళ్లుగా తెలుగు బోధిస్తున్నారు. ఈమె భోధనలో పలువురు విద్యార్థులు తెలుగులో నూటికి నూరు మార్కులు సాధించారు. బడిమానేసిన పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి మరల బడికి వచ్చేలా చేశారు. పేద విద్యార్ధులను దత్తత తీసుకుని చదివించారు.
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంజీవ్ను జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయన ప్రతినిత్యం పాఠశాలను మంచి వాతావరణంలో తీర్చిదిద్దడంతోపాటు కల్చరల్, స్పోర్ట్స్ యాక్టీవిటీస్ పరంగా మంచి పేరు తెచ్చారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేసింది.