బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కిలో వెండి ధర ఇవాళ ఏకంగా రూ.10,000 పెరిగి రూ.2,44,000కు చేరింది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,38,930కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,27,350 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నారు.
AP: 2025-26 విద్యా సంవత్సరానికి నీట్ పీజీ మెడికల్ రివైజ్డ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ని జాతీయ వైద్య కమిషన్ విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకటించామని పీజీ మెడికల్ ఎంట్రన్స్ బోర్డు కార్యదర్శి రీటా సింగ్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది.
AP: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న అతిథి అధ్యాపకుల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం రూ.15.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బకాయిలతో పాటు ఈ ఏడాది డిసెంబరు వరకు గౌరవ వేతనాల కోసం ఈ నిధులను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR-NCL నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టెక్నీషియన్(15), టెక్నికల్ అసిస్టెంట్(19) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 10వ తరగతి+ITI లేదా డిప్లొమా/B.Sc అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మంచి జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ ఇది. ఎంపిక ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12.01.2026.
పాన్-ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. లేకుంటే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు రద్దవుతుంది. ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డు రద్దయితే ITR దాఖలు చేయడం కుదరదు. మీకు రావాల్సిన పన్ను రీఫండ్లు నిలిచిపోతాయి. బ్యాంకు లావాదేవీలు, మ్యూచ్వల్ ఫండ్లు వంటి పెట్టుబడులపై అధిక టీడీఎస్ విధిస్తారు.
తన సంస్థలో ఉద్యోగాల కోసం ఉత్తరకొరియా పౌరుల నుంచి వచ్చిన 1800 అప్లికేషన్లను తిరస్కరించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఈ విషయాన్ని లింక్డిన్ పోస్ట్ ద్వారా అమెజాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ ష్మిత్ తెలిపారు. గతేడాది కాలంలో ఉత్తరకొరియా నుంచి తమ సంస్థకు వచ్చిన అప్లికేషన్ల్లలో 30 శాతం పెరుగుదల కనిపించిందని స్టీఫెన్ పేర్కొన్నారు.
2025లో ఆన్లైన్ ఆర్డర్లకు సంబంధించిన నివేదికను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఇందులో ముంబైకి చెందిన ఓ వినియోగదారుడు ఈ ఏడాది 3 వేల సార్లు ఆర్డర్ చేసినట్లు తెలిపింది. దేశంలో ఇదే అత్యధికమని స్విగ్గీ పేర్కొంది. అలాగే, హైదరాబాద్కు చెందిన ఓ కస్టమర్ రూ.47 వేలతో 65 బాక్సుల డ్రైఫ్రూట్స్ బిస్కెట్లు ఆర్డర్ చేసినట్లు సమాచారం.
ఇన్స్టాగ్రామ్లో ‘ఆటో స్క్రోల్’ ఫీచర్ను ఆన్ చేస్తే ఒక రీల్ అయిపోగానే మరో రీల్ ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. దీనికోసం రీల్స్ ట్యాబ్లో ఏదైనా రీల్ ప్లే చేసి, కుడివైపు ఉన్న మూడు డాట్స్పై క్లిక్ చేసి ‘Auto Scroll’ ఆప్షన్ను ఆన్ చేయాలి. యూట్యూబ్లో వీడియోలకు ఆటో ప్లే ఉన్నా, షార్ట్స్కు లేదు. వాటికి పీసీలో ఎక్స్టెన్షన్ అవసరం.
అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, ఆయా పోస్టుల భర్తీకి కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 14 వర్కర్లు, 78 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు సంబంధిత ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 638.12 పాయింట్ల లాభంతో 85,567.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 26,172.40 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.70గా ఉంది.
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జయంతి నేడు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో కృషి చేశాడు. రామానుజన్ తక్కువ సంవత్సరాలే బతికినా.. సుమారు 3900 ఫలితాలు రాబట్టాడు. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా 1729 సంఖ్య ప్రత్యేకతను చెప్పాడు.
EV స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ప్రకటించింది. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు పెంపు ఉంటుందని తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఏథర్ సంస్థ 450 సిరీస్లో పెర్ఫార్మెన్స్ స్కూటర్లను, రిజ్తా పేరిట ఫ్యామిలీ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.1,14,546 నుంచి ఉన్నాయి.
కొత్త యూజర్లను ఆకర్షించేందుకు BSNL తన ఫ్రీ సిమ్ ప్లాన్ను మరోసారి తీసుకొచ్చింది. క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా రూ.1కే 30 రోజులపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా లభించినా రూపాయితో రీఛార్జ్ చేస్తేనే పై ఫీచర్లు పొందొచ్చు. ఈ ఆఫర్ వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
IIT వడోదరలో 7 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉండగా.. PG, CA అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.iiitvadodara.ac.in
TG: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేపర్-1 పరీక్ష ‘కీ’ విడుదలైంది. ఈనెల 14న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పేపర్-1 పరీక్ష నిర్వహించింది. సా. 5 గంటల నుంచి tgprb.inలో కీ అందుబాటులో ఉండనుంది. ఈ నెల 24 వరకూ అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఒక్కో అభ్యంతరానికి రూ.500 ఫీజు ఉంటుందని, అభ్యంతరం సరైనదైతే ఫీజు తిరిగి ఇస్తామని తెలిపింది.