• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు?

TG: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు జీతాలు రాక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వారికి రావాల్సిన జీతాల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ నెల జీతం ఇప్పటివరకు రాలేదని ఆవేదన చెందుతున్నారు. ఏ నెల ఎప్పుడు జీతం వస్తుందో తెలియట్లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఉద్యోగులు ఇవాళ మధ్యాహ్నం లంచ్ టైంలో ‘మౌన ప్రదర్శన’కు పిలుపునిచ్చారు.

October 10, 2025 / 11:10 AM IST

BREAKING: భారీగా పెరిగిన ధర

రోజురోజుకు వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కిలో వెండి రూ.3000 పెరిగి రూ.1,80,000కు చేరుకుంది. కాగా, నిన్నటి కంటే బంగారం ధర భారీగా తగ్గింది. HYD మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,22,290కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,700 తగ్గి రూ.1,12,100గా ఉంది.

October 10, 2025 / 10:57 AM IST

ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ. 56,400 జీతం

డేహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 56,400 స్టైఫండ్ ఇస్తారు. అప్లై చేయాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి.

October 10, 2025 / 10:00 AM IST

దేశంలో అత్యంత ధనవంతుడిగా అంబానీ!

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 2025కి సంబంధించిన ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచెస్ట్ లిస్టులో మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. గతంలో సన్ ఫార్మా దిలిప్ సంఘ్వీ, అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ టాప్ ప్లేసులో కొంత కాలం కొనసాగారు. ప్రస్తుతం అంబానీ సంపద 105 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదానీ కుటుంబం 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.

October 10, 2025 / 09:28 AM IST

చిత్తూరు: ITI విద్యార్థులకు గమనిక

చిత్తూరు: జిల్లాలోని  ప్రభుత్వ ITI కాలేజీ ప్రాంగణంలో 13వ తేదీ జిల్లాలోని పలు ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌షిప్‌లను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రా రెడ్డి పేర్కొన్నారు.ఇందుకు ప్రభుత్వ,ప్రైవేట్ ఐటీఐలలో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

October 10, 2025 / 04:56 AM IST

ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ధర

గత కొన్ని రోజులుగా వెండి ధర భారీగా పెరుగుతుంది. ఈరోజైతే ఏకంగా రూ.7 వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.9,900 పెరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భవిష్యత్‌లో వెండి మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వెండి ధరలపై సామాన్యులలో ఆందోళన మొదలైంది.

October 9, 2025 / 10:49 PM IST

GOOD NEWS: ఫలితాలు విడుదల

AP: పలు నియామక పరీక్షల ఫలితాలను APPSC విడుదల చేసింది. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, లైబ్రేరియన్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. వాటితో పాటు అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ పరీక్ష ఫలితాలనూ ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను APPSC.gov.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

October 9, 2025 / 09:20 PM IST

GOOD NEWS: జనవరిలో డీఎస్సీ

AP: మంత్రి లోకేష్ నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్ చెప్పారు. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ , 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించి కొత్త విద్యాసంవత్సరం నాటికి టీచర్లను భర్తీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు సన్నద్ధం కావాలని సూచించారు.

October 9, 2025 / 08:22 PM IST

వసతి గృహాల్లో విద్యా ప్రమాణాలు పెంచండి: కలెక్టర్

NTR: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్య ప్రమాణాలు పెంచాలని సంక్షేమ హాస్టల్‌ల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. జిల్లాలోని 65 ఎస్సీ, బీసీ, గిరిజన, మైనార్టీ హాస్టళ్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని ఈ సందర్భంగా వెల్లడి చేశారు. గురువారం విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సూచించారు.

October 9, 2025 / 07:52 PM IST

‘ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి’

AKP: ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని ఫ్యాప్టో తీసుకున్న నిర్ణయం మేరకు బోధనేతర పనులను బహిష్కరిస్తామన్నారు. ఈ మేరకు గురువారం ఎలమంచిలి ఎమ్ఈవోకు వినతి పత్రం అందజేశామన్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం పనులు మాత్రమే చేస్తామన్నారు.

October 9, 2025 / 05:46 PM IST

రేపు మెగా జాబ్ మేళా

SKLM: స్థానిక అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 18 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నాయని తెలిపారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన 18–30 ఏళ్ల గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

October 9, 2025 / 04:48 PM IST

BREAKING: ఫలితాలు విడుదల

AP: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్‌లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను పొందుపరిచింది. FBOలో మొత్తం 13,845 మంది మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ కాగా, FSOలో 2,346 మంది ఎంపికయ్యారు.

October 9, 2025 / 04:47 PM IST

విద్యార్థుల ఆరోగ్యం పట్ల దృష్టి సాధించాలి: కలెక్టర్

కృష్ణా: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వసతి గృహాల్లోనీ విద్యార్థుల సంక్షేమం ఆరోగ్యం తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి గురువారం సమీక్షించారు. ఈ కార్యక్రమం అధికారులు పాల్గొన్నారు.

October 9, 2025 / 03:35 PM IST

నూతన ఉపాధ్యాయ కరదీపిక-2025 పుస్తక ఆవిష్కరణ

ASR: జిల్లా ఏపీటీఫ్ (ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) అధ్యక్షుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో గురువారం పాడేరులో నూతన ఉపాధ్యాయ కరదీపిక-2025 పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీ.బ్రహ్మాజీరావు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేతలు పాల్గొన్నారు.

October 9, 2025 / 01:49 PM IST

13న బడులకు కొత్త టీచర్లు

AP: మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్ల పోస్టింగ్‌ల కోసం వెబ్ ఆప్షన్‌ల నమోదుకు ఇవాళ్టి నుంచి రెండు రోజులు అవకాశం కల్పించారు. పాఠశాల కేటాయింపు పత్రాలను 11న జారీ చేస్తారు. టీచర్లు కొత్త పాఠశాలల్లో 13న చేరాల్సి ఉంటుంది. కొత్త టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి.

October 9, 2025 / 11:25 AM IST