తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ‘క్లాట్-2026’ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతిష్టాత్మక న్యాయవిద్య యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్-2026) నిర్వహిస్తున్నారు. HYDలోని నల్సార్ వర్సిటీ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీలో సీట్లను కూడా ఈ పరీక్ష ర్యాంకర్లతో భర్తీ చేయనున్నారు.
AP: నీట్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2025-26 విద్యా సంవత్సరంలో MBBS ప్రవేశాల్లో 60.72 శాతం సీట్లు అమ్మాయిలకే దక్కాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి అమ్మాయిల ప్రవేశాలు 3.66 శాతం పెరిగాయి. NTR ఆరోగ్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాల ప్రక్రియ ముగిసింది.
TG: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ వారంలో ప్రారంభిస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. పాత సీట్లతోపాటు కొత్తగా మంజూరైన 420 పీజీ సీట్లను భర్తీ చేస్తామని, ఏయే కళాశాలలో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయో వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
TG: డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. యూపీఐ లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే 33 శాతం పెరిగి, దక్షిణ భారతదేశంలోని ఇతర నగరాలకంటే ముందంజలో నిలిచింది. సర్వే ప్రకారం నగరాల్లో 52% ట్రాన్సాక్షన్లు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రజల విశ్వాసం పెరుగుతుండడంతో హైదరాబాద్ నగదు రహిత వాణిజ్యం వైపు వేగంగా సాగుతోంది.
TG: కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా కె.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల కాళోజీ వర్సిటీలో పీజీ పరీక్ష పత్రాల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో వీసీ నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంఛార్జ్ వీసీగా యాదాద్రి భువనగిరి వైద్య కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న రమేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్(THDC)లో 40 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరి రోజు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. BSc/BTech/BE, MBBS అర్హతగలవారు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.55 వేల జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: thdc.co.in
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. గడువు నిన్నటితో ముగియగా.. DEC 15 వరకు అవకాశమిచ్చారు. సివిల్, కంప్యూటర్, మెకానికల్ తదితర పోస్టులు ఉండగా.. B.Tech/B.E ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: sail.co.in
TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్ను ఎయిర్ పోర్టు సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ప్లైట్లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వ్యవస్థను నిషేధించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ పద్ధతిలో గిగ్ కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డైడ్లైన్ను అందుకునేందుకు గిగ్ కార్మికులు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 10 నిమిషాల క్రూరత్వ పద్ధతికి ముగింపు పలకాలని రాజ్యసభలో కోరారు.
భారత్ UPI సేవలు మరిన్ని దేశాలకు విస్తరించనున్నాయి. తాజాగా మరో 8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు వెల్లడించారు. ప్రస్తుతం సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఖతార్, యూఏఈ, మారిషస్ దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీలను అనుమతించేలా మరో 7-8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని నాగరాజు తెలిపారు.
DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ 763 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నీషియన్-A పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్ https://www.drdo.gov.in ను సందర్శించండి.
ఈ ఏడాది ఇప్పటికే వడ్డీరేట్లపై త్రిపుల్ బొనాంజా ప్రకటించిన RBI.. మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25శాతానికి దిగొచ్చింది. కాగా, ఈ ఏడాది FEB, APRలో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన RBI.. జూన్లో 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టిన సంగతి తెలిసిందే.
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. మరిన్ని ఒప్పందాల దిశగా అడుగులు వేస్తోంది. టాటా గ్రూప్తో భాగస్వామ్యం అంశాన్ని సరైన సమయంలో వెల్లడిస్తామని గూగుల్ వెల్లడించింది. కాగా, అక్టోబరులో రిలయన్స్ ఇంటెలిజెన్స్తో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికింద 18 నెలల పాటు జియో వినియోగదార్లకు ‘గూగుల్ జెమినై’ తాజా వెర్షన్ను ఉచితంగా అందిస్తోంది.
వెస్ట్రన్ కోల్ఫీల్డ్లో 1,213 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే చివరి రోజు. టెన్త్/ITI/BTech/BE అర్హత గల 18-26 ఏళ్లలోపు వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్లు ముందుగా NATSలో, ITI అప్రెంటీస్లు NAPSలో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://westerncoal.in/
TG: 118 ఏపీపీ(అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పరీక్ష వివరాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ నెల 14న ఏపీపీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఏపీపీ పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.