• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

నేడు హెల్ప్ డెస్క్ ద్వారా ఆర్జీల స్వీకరణ

మెదక్: గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణిలో హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి, తమ సమస్యలను తెలుపవచ్చునని పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.

December 16, 2024 / 04:22 AM IST

గ్రూప్-2 పరీక్షకు ఆసక్తి చూపని అభ్యర్థులు

TG: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, ఈ పరీక్షలకు రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపనట్లుగా కనిపిస్తోంది. ఇవాళ మొదటి రోజు పరీక్షలు జరగగా.. హాజరుశాతం భారీగా తగ్గింది. సగానికిపైగా అభ్యర్థులు హాజరుకాలేదు. పేపర్-1కు 46.75 శాతం అభ్యర్థులు హాజరు కాగా.. పేపర్-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

December 15, 2024 / 09:40 PM IST

గ్రూప్-2 పరీక్షలో చీటింగ్

TG: మొదటి రోజు గ్రూప్-2 పరీక్ష ముగిసింది. అయితే, పరీక్ష కేంద్రంలోకి ఓ అభ్యర్థి ఫోన్ తీసుకెళ్లాడు. ఎగ్జామ్ రాస్తుండగా చూసిన ఇన్విజిలేటర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. టీజీపీఎస్సీ నిబంధన ప్రకారం ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రలోకి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.

December 15, 2024 / 08:51 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు పరిశీలించిన డీఐజీ

MBNR: గ్రూప్-2 పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని JPNCE కళాశాల పరీక్షా కేంద్రం వద్ద జోన్- 7 డీఐజీ ఎల్.ఏస్.చౌహన్, ఎస్పీ జానకి బందోబస్తు ఏర్పాట్లను నేడు పరిశీలించారు. సందర్భంగా డిఐజి మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండాలని సూచించారు.

December 15, 2024 / 01:18 PM IST

రెండు వారాల్లో భారీగా FPIల పెట్టుబడులు

దేశీయ మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకున్న విదేశీ పెట్టుబడిదారులు ఈ నెల భారీగా ఇన్వెస్ట్ చేశారు. 2 వారాల్లో రూ.22,766 కోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు గణాంకాలు తెలిపాయి. భారత మార్కెట్‌పై సానుకూల అంచనాల నేపథ్యంలో ఈక్వీటీల్లో పెట్టుబడులు పెరిగినట్లు వెల్లడించాయి. భారత కంపెనీల మూడో త్రైమాసిక ఆదాయాలు, పనితీరు, RBI క్యాష్ రిజర్వ్ రేషియోని తగ్గించటం.. పెట్టుబడిదారుల నమ్మకం బలపడేలా చేసినట...

December 15, 2024 / 01:01 PM IST

ALERT: పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీ యూనివర్సిటీలో 137 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 11, SA 46, అసిస్టెంట్ 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. 6 పోస్టులు SC, 3 ST, 12 OBC, 4 EWSలకు రిజర్వ్ చేశారు. ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఈనెల 18 నుంచి www.du.ac.inలో ప్రారంభం కానుంది.

December 15, 2024 / 12:50 PM IST

గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచన

KMM: గ్రూప్ -2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో 85 కేంద్రాలలో 28,101 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారు. సమయానికి చేరుకోవాలి’ అని సూచించారు.

December 15, 2024 / 08:04 AM IST

కిరణ్‌ షాకు జెంషెడ్‌జీ టాటా పురస్కారం

బయోకాన్ గ్రూప్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజందార్ షాకు ప్రతిష్ఠాత్మక జెంషెడ్‌జీ టాటా పురస్కారం వరించింది. భారత్‌లో బయోసైన్సెస్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఈ అవార్డును ప్రకటించినట్లు ఐఎస్‌క్యూ వెల్లడించింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్‌క్యూ వార్షిక కాన్ఫరెన్స్-2024లో ఆమెకు ఈ పురస్కారం అందించనున్నట్లు తెలిపింది. ఈ అవార్డును తనకు ప్రకటించడం పట్ల కిరణ్ సంతోషం వ్యక...

December 15, 2024 / 06:31 AM IST

విద్యార్థులకు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

KMR: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామన్ డైట్ మెనూ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవాటు చేసుకోవాలని సూచించారు.

December 15, 2024 / 06:23 AM IST

11 నెలల్లో 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు

గత 11 నెలల వ్యవధిలో 15,547 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు కేంద్రం తెలిపింది. వీటి విలువ రూ.223 లక్షల కోట్లు అని పేర్కొంది. భారత్‌కు చెందిన ఈ డిజిటల్ సేవలు ఇతర దేశాల్లోనూ వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. ఇప్పటికే ఈ యూపీఐ సేవలు యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. ఒక్క నవంబర్ నెలలోనే రూ.23.49 కోట్ల విలువైన లావాదేవీలు జరగటం ...

December 15, 2024 / 06:21 AM IST

గ్రూప్-2 పరీక్షకు 16 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

MDK: గ్రూప్-2 పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 5,885 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మెడికల్ కిట్, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేశారు.

December 15, 2024 / 05:23 AM IST

గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

JGL: రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గనులు, భూగర్భ శాఖల అసిస్టెంట్ డైరెక్టర్ జైసింగ్ అన్నారు. గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ ఛార్జీల పెంపు సందర్భంగా శనివారం స్థంభంపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాలలో సౌకర్యాలు పరిశీలించారు.

December 15, 2024 / 04:07 AM IST

గిరిజన యూనివర్సిటీలో ముగిసిన వర్క్షాప్

VZM: డిల్లీ ఐఐటీ సహకారంతో గిరిజన యూనివర్సిటీలో డిసెంబర్ 12,13 తేదీల్లో రెండు రోజులు పాటు జరిగిన వర్క్ షాప్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ కట్టమణి మాట్లాడుతూ.. పరిశోధకులు ప్రదర్శనల ద్వారా తమ పరిశోధనలను విస్తృతంగా ప్రసారం చేయవచ్చుని తెలిపారు. సమీప కళాశాలలు, ఏయూ విశాఖ, ANU గుంటూరు శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీల నుంచి విద్యార్ధులు పాల్గొన్నారు.

December 14, 2024 / 08:36 AM IST

ఈనెల 17న ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా

SKLM: రాజాం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 17వ తేదీన ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారని ఐటీఐ ప్రిన్సిపల్ బండారు భాస్కరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువతీ యువకులకు అవకాశం ఉంటుందన్నారు.

December 14, 2024 / 08:17 AM IST

గ్రూప్-2 అభ్యర్థులకు ALERT

TG: రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు TGPSC పలు సూచనలు చేసింది. ‘పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగా గేట్లు క్లోజ్ చేస్తాం. హాల్ టికెట్, ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డు తీసుకురావాలి. పెళ్లైన మహిళలు మంగళసూత్రం, గాజులు ధరించవచ్చు. షూ వేసుకుని రాకూడదు. చెప్పులు మాత్రమే ధరించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి’ అని ...

December 14, 2024 / 08:15 AM IST