గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ముంబై స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్తో చరిత్ర సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే (101*) పరుగులు సాధించాడు. ఈ మెరుపు సెంచరీతో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 45 బంతుల్లో సెంచరీ చేసి సృష్టించిన రికార్డును తిలక్ ఇప్పుడు సమం చేశాడు. ఈ జాబితాలో కామెరాన్ గ్రీన్ (47 బంతులు), సూర్యకుమార్(49 బంతులు)గా ఉంది.
IPL మ్యాచ్ టికెట్లపై విధిస్తున్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కోరుతూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫ్రాంచైజీలు విజ్ఞప్తి చేశాయి. IPL మ్యాచ్లను వినోదాత్మకంగా కాకుండా కేవలం ఒక క్రీడగానే పరిగణించాలని తెలిపాయి. ప్రస్తుతం మ్యాచ్ టికెట్లపై 40 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. తొలుత మ్యాచ్ టికెట్లపై 28 శాతం పన్ను ఉండగా, గతేడాది సెప్టెంబరులో దీన్ని పెంచారు.
IPL 2026లో భాగంగా GTతో జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ (101*) సంచలన శతకంతో ముంబై 199 పరుగులు చేసింది. అయితే, గుజరాత్ కేవలం 100 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టు మొత్తం కలిసి 100 పరుగులు చేస్తే.. తిలక్ వర్మ ఒక్కడే 101 రన్స్ చేశాడు. దీంతో IPLలో ప్రత్యర్థి జట్టు కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ప్లేయర్గా తిలక్ నిలిచాడు.
IPL 2026లో ఇవాళ ఉప్పల్ వేదికగా హైదరాబాద్, ఢిల్లీ ఢీకొంటున్న సంగతి తెలిసిందే. గణాంకాల ప్రకారం మైదానంలో ఇరుజట్లు పోటాపోటీగా ఆడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన 26 మ్యాచ్ల్లో ఢిల్లీ 12, హైదరాబాద్ 13 గెలిచాయి. మరో మ్యాచ్ రద్దు అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్లో SRHను ఓడించి లెక్క సమం చేయాలని ఢిల్లీ.. సొంత మైదానంలో హ్యాట్రిక్ నమోదు చేయాలని హైదరాబాద్ భావిస్తున్నాయి.
IPL 2026లో ముంబై ఎట్టకేలకు మరో విజయం సాధించింది. అహ్మదాబాద్ మ్యాచులో GTపై 99 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ముంబై 199/5 స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో గుజరాత్ బ్యాటర్లలో సుందర్(26) మినహా ఎవరూ 2 పదుల స్కోర్ చేయలేదు. MI బౌలర్లలో అశ్వనీ కుమార్ 4, శాంట్నర్, ఘజన్ఫర్ చెరో 2, బుమ్రా ఒక వికెట్ తీశారు. టోర్నీలో తమ తొలి పోరు గెలిచిన MI.. ఆపై వరుసగా 4 ఓడిన సంగతి […]
ముంబైతో మ్యాచ్లో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 200 పరుగుల లక్ష్యఛేదనలో 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రబాడ(1), ఆశోక్ శర్మ(0) ఉన్నారు. ముంబై యువ బౌలర్ అశ్వనీ కుమార్ 11వ ఓవర్ చివరి బంతికి తెవాటియా(8)ను.. 13వ ఓవర్ రెండో బంతికి రషీద్(4)ను, చివరి బంతికి షారుఖ్(17) పెవిలియన్ బాట పట్టించాడు.
ముంబై విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు కోల్పోయింది. మిచెల్ శాంట్నర్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి సుందర్(26), ఆ వెంటనే 4వ బంతికి ఫిలిప్స్(6) వెనుదిరిగారు. 8 ఓవర్ల ఆట ముగిసేసరికి గుజరాత్ స్కోర్ 56/5 కాగా.. క్రీజులో రాహుల్ తెవాటియా(1), షారుఖ్ ఖాన్(1) ఉన్నారు. విజయం కోసం గుజరాత్ ఇంకా 144 రన్స్ చేయాల్సి ఉంది.
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ సుదర్శన్ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో ఈ సీజన్లో ఎట్టకేలకు బుమ్రాకు తొలి వికెట్ దక్కింది. ఆ తర్వాతి ఓవర్లోనే బట్లర్ను కెప్టెన్ పాండ్యా LBWగా వెనక్కి పంపాడు. దీంతో కేవలం 5 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి GT కష్టాల్లో పడింది.
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై కెప్టెన్ పాండ్యా.. టెస్టు తరహా బ్యాటింగ్తో MI అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. 16 బంతులు ఎదుర్కొన్న పాండ్యా కేవలం ఒక ఫోర్తో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రూథర్ఫోర్డ్ వంటి హార్డ్ హిట్టర్ ఉన్నప్పటికీ, అతడిని కాదని పాండ్యా ముందే బ్యాటింగ్కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
RR కెప్టెన్ రియాన్ పరాగ్పై అశ్విన్ విమర్శలు గుప్పించాడు. జడేజా వంటి స్పిన్నర్ను పరాగ్ సరిగా వినియోగించుకోవడం లేదని మండిపడ్డాడు. KKRతో మ్యాచ్లో జడేజా 3 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టినప్పటికీ, అతడికి నాలుగో ఓవర్ ఎందుకు ఇవ్వలేదని అశ్విన్ ప్రశ్నించాడు. పరాగ్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రాజస్థాన్ ఓటమి పాలైందని వ్యాఖ్యానించాడు.
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన తిలక్.. ఆ తర్వాత కేవలం 14 బంతుల్లోనే మిగతా 50 పరుగులు చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. దీన్ని బట్టి చెప్పవచ్చు అతడి విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో. మొత్తంగా 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో IPLలో తన తొలి సెంచరీని సాధించాడు.
గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై 20 ఓవర్లలో 199/5 పరుగులు చేసింది. తిలక్ వర్మ 45 బంతుల్లోనే అద్భుత సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. నమన్ ధీర్ 45 పరుగులతో రాణించాడు. డికాక్(13), డానిష్(2), సూర్య(15), పాండ్యా(15) ఘోరంగా విఫలమయ్యారు. GT బౌలర్లలో రబడ 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీసుకున్నారు.
రేపు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా SRH vs DC పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు కూడా 6 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. హోం గ్రౌండ్ వేదికగా వరుసగా రెండు విజయాలు సాధించిన సన్రైజర్స్, ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేసింది. అయితే, గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం.
ముంబై స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. GTతో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో తిలక్కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కాగా, ఓవరాల్గా ఐపీఎల్ కెరీర్లో ఇది 9వది. అశోక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో తిలక్ వరుసగా 6, 4, 4, 6, 6 బాది మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు.
శ్రీలంక ఆల్రౌండర్ దాసున్ శనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. 2027లో జరగబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి అతడిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 2026-PSL సీజన్ కోసం లాహోర్ ఖలందర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న శనక, టోర్నీ ప్రారంభానికి ముందే ఐపీఎల్ కోసం PSL నుంచి తప్పుకున్నాడు. దీంతో PCB అతడిపై ఏడాది నిషేధం విధించింది.