బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న ఢిల్లీలో జరగనుంది. టీ20 WC విజేతలతో పాటు ఇతర ఐసీసీ టోర్నమెంట్ విజేతలు, కోచ్లను ఆహ్వానించనున్నట్లు BCCI సెక్రటరీ సైకియా వెల్లడించాడు. సీనియర్ పురుషుల జట్టు, 2025లో ట్రోఫీని గెలుచుకున్న సీనియర్ మహిళల జట్టు, అండర్-19 బాలుర, బాలికల జట్లు రానున్నట్లు తెలిపాడు. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలనూ సన్మానించనున్నట్లు పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ దృష్టంతా 2027 వన్డే ప్రపంచకప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. IPL 2026 ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలు ప్రారంభమవుతాయని తెలిపాడు. అప్పుడే బ్లూ ప్రింట్ సిద్ధం అవుతుందని వెల్లడించాడు. ఎంత త్వరగా సన్నాహకాలు ప్రారంభిస్తే అంత మంచిదని చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగుతుండగా ఇటీవల టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రింకూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘మీరు లేకుండా నా జీవితం ఇకపై ఎలా ఉంటుందో తెలియడం లేదు. మీ కల సాకారం చేయడం కోసమే మైదానంలోకి దిగాను. మీ కల నెరవేరింది. మీరు ఇప్పుడు నాతోపాటు ఉంటే బాగుండేది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా నాన్నా’ అంటూ పేర్కొన్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. అతడి భార్య గరిమా తివారీ గృహహింస ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. అమిత్, అతడి కుటుంబం కలిసి తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ యూపీలోని కాన్పూర్ కోర్టును ఆశ్రయించింది. శారీరకంగా, మానసికంగా తనను హింసిస్తున్నారని, ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని గరిమా ఫిర్యాదులో పేర్కొంది.
IPL 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టోర్నమెంట్ తొలి 20 రోజుల షెడ్యూల్ను ఈనెల 12లోగా విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలిపాడు. కాగా, ఈనెల 28 నుంచి మే 31 వరకు IPL 2026 జరగనుంది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా శ్రీలంక-ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ అనూహ్యంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు దుబాయ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య పోరు సాగాల్సి ఉంది. అయితే, ఆ ప్రాంతంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా సిరీస్ను రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
IPL 2026 సీజన్కు ముందు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్ను తమ జట్టు బ్యాటింగ్ కోచ్గా నియమించింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది. రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా, తన తరంలో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్గా పేరుగాంచిన హేడెన్ చేరికతో జట్టు కోచింగ్ బృందం మరింత బలోపేతమైంది.
పాకిస్తాన్ దేశవాళీ క్రికెటర్, సియాల్కోట్ స్టార్ ఆల్రౌండర్ షహజైబ్ భట్టి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పీసీబీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ 24 ఏళ్లకే భట్టి రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశీయ క్రికెట్లో రాజకీయ జోక్యం, అవినీతి ఎక్కువైందని అతడు ఆరోపించాడు. అస్తవ్యస్తమైన వ్యవస్థ కారణంగా తాను క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు షహజైబ్ వెల్లడించాడు.
T20 WCలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఓపెనర్లుగా సంజూ, ఫిన్ అలెన్లను ఎంపిక చేశాడు. రెండు, మూడు స్ధానాల్లో ఇషాన్ కిషన్, బెథెల్, ఆల్రౌండర్ కోటాలో హార్దిక్, దూబే, విల్ జాక్స్, అక్షర్కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లుగా US పేసర్ షాడ్లీ, బుమ్రా, ఎంగిడి ఉన్నారు.
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.131 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా, టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
T20 WC-2026 ఈ విజయంపై టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘వరుసగా రెండో T20 WC విజయంలో భాగమవడం ఎంతో ఆనందంగా ఉంది. నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ ఉంది. ఆ పదేళ్లలో 10 ICC టైటిల్స్ గెలవాలన్నదే నా లక్ష్యం. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవడం చాలా ఎమోషనల్. మ్యాచ్కి ముందే గెలుస్తామని మాకు తెలుసు. గెలుపు తప్ప మరో ఆలోచనే లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని అన్నాడు.
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి తేదీ ఖరారైంది. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను అతడు వివాహం చేసుకోనున్నాడు. గతేడాది జూన్ 4న లక్నోలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, మార్చి 14న మసూరిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత మార్చి 17న లక్నోలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాగా, వంశిక LICలో పనిచేస్తుందని తెలుస్తోంది.
T20WC ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ అర్ష్దీప్ సింగ్ కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్పై బాల్ విసిరిన సంగతి తెలిసిందే. ICC రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు ప్రత్యర్థిపై ప్రమాదకరమైన రీతిలో బంతిని విసరడం ‘క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’గా పరిగణించబడుతుంది. దీంతో అర్ష్దీప్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ తన ఫామ్ వెనుకు ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. ‘క్రికెట్ దిగ్గజమైన సచిన్ నుంచి సలహాలు తీసుకున్నాను. స్పష్టతతో ఉండడం, మ్యాచ్కు సన్నద్ధమవ్వడం.. పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం వంటివి ఎంతో ఉపయోగపడ్డాయి. వరల్డ్కప్లో నేను గొప్పగా రాణించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు.