CSKతో మ్యాచ్లో DC స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిస్సంక(19), రాహుల్(12), నితీష్(13), కరుణ్(13) తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో ఢిల్లీ 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టబ్స్(38), రిజ్వీ(40*) కలిసి 6వ వికెట్కు 65 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. దీంతో DC 155/7 పోరాడే స్కోరు సాధించింది. CSK బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.
CSKతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న DC బ్యాటింగ్లో తడబడుతోంది. ఓపెనర్లు నిస్సంక (19), రాహుల్ (12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కరుణ్ నాయర్ (13) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. అనంతరం నితీష్ రాణా (13) సైతం ఔట్ కావడంతో ఢిల్లీ 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
SRH హెడ్ కోచ్ డేనియల్ వెటోరి గుడ్ న్యూస్ చెప్పాడు. గాయంతో KKR మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపాడు. రేపు ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో నితీష్ బరిలోకి దిగబోతున్నట్లు వెటోరి స్పష్టం చేశాడు. గత మ్యాచ్లో నితీష్ స్థానంలో ఆడిన స్మరణ్ రవిచంద్రన్(4) ఆకట్టుకోలేకపోయాడు.
ఐసీసీ తాజాగా పురుషుల టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా 275 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (258), న్యూజిలాండ్ (247), సౌతాఫ్రికా (244), పాకిస్తాన్ (240), వెస్టిండీస్ (233) నిలిచాయి. ఇక టీ20 నంబర్ వన్ బ్యాటర్గా అభిషేక్ శర్మ కొనసాగిస్తున్నాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ LSGపై 44 బంతుల్లోనే 84 పరుగులు చేసి మెరిశాడు. ఈ క్రమంలో రోహిత్పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రోహిత్.. మునపటి ‘హిట్ మ్యాన్’ను గుర్తుచేశాడని అన్నాడు. రోహిత్ గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే.. ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలకు గండిపడటం ఖాయమని హెచ్చరించాడు.
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మోయ్నా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన.. TMC అభ్యర్థిపై 14,000 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించాడు. 2021 ఎన్నికల్లోనూ ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. కాగా, దిండా భారత్ తరఫున 13 వన్డేలు, 9 టీ20లు ఆడి మొత్తం 29 వికెట్లు పడగొట్టారు.
IPL 2026లో LSG కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. 9 ఇన్నింగ్స్ల్లో 204 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంత్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో LSG కోచ్ జస్టిన్ లాంగర్ పంత్కు మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీ అనేది చాలా కఠినమైదని, ఎంతో ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. అతడు కఠోరంగా శ్రమిస్తున్నాడని.. ఫామ్లోకి వస్తాడని అన్నాడు.
ఇటీవల హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహీకాతో కలిసి చేస్తున్న హంగామాపై అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. IPL 2026లో యశస్వి జైస్వాల్, ఇషాన్, అర్ష్దీప్ సైతం తమ గర్ల్ఫ్రెండ్స్ను మైదానాల్లోకి తీసుకొస్తున్నారు. దీనిపై BCCI సీరియస్ అవుతున్నట్లు సమాచారం. క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేయొచ్చని.. గర్ల్ఫ్రెండ్స్ విషయంలో షరతులు విధించొచ్చని తెలుస్తోంది.
IPL 2026లో భాగంగా ముంబై జరిగిన మ్యాచ్లో LSG ఓటమిపాలైంది. ఈ పోరులో ఓటమికి గల కారణాలపై కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. మంచి ఆరంభం లభించానా.. చివరకు 10-15 పరుగులు తక్కువగా చేసినట్లు తెలిపాడు. ‘ఈ పిచ్పై 220-230 పరుగులు ఈజీగా చేయొచ్చు. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. వారిని నిందించలేం. మా జట్టుకు కాస్త అదృష్టం కూడా తోడు కావాలి’ అని చెప్పుకొచ్చాడు.
IPL 2026లో ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పిక్క గాయంతో బాధపడుతున్న అతడు చెన్నై జట్టుతో పాటే ఉంటున్నాడు. అయితే, ఇవాళ ఢిల్లీతో మ్యాచ్ కోసం ధోనీ జట్టుతో పాటు వెళ్లలేదు. దీంతో అతడు IPL 2026కు పూర్తిగా దూరమైనట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ధోనీ ప్రస్తుతం తమతో లేడని, జట్టుతో పాటు ఢిల్లీకి రాలేదని CSK బౌలింగ్ సలహాదారు సిమన్స్ వెల్లడించాడు.
ఇవాళ్టి నుంచి ప్రపంచకప్ స్టేజ్-2 ఆర్చరీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు కూర్పే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ టోర్నీలో భారత్ బరిలో దిగుతుంది. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం.. విదేశీ కోచ్ అందుబాటులో లేని కారణంగా ఈ పోటీల్లో భారత్కు కఠిన పరీక్ష ఎదురుకానుంది.
ఐపీఎల్లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు చెరో 9 మ్యాచ్లు ఆడి, నాలుగేసి విజయాలతో 8 పాయింట్లు సాధించాయి. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ విజయం అత్యంత కీలకం.
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 228/5 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని MI 18.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ(84), రికల్టన్(83) MI గెలుపును శాసించారు. నమన్(23), సూర్య(12) రన్స్ చేశారు.
IPLతో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 27 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్ రోహిత్కు ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం.