• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలు మార్పు?

టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలకు బదులుగా చెన్నై, తిరువనంతపురంలకు మార్చాలని ఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. భద్రతా కారణాలతో భారత్‌లో ఆడలేమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసిన నేపథ్యంలో, ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

January 12, 2026 / 10:25 AM IST

సోఫీ డివైన్ ఆల్‌రౌండ్ ధమాకా

గుజరాత్‌ జెయింట్స్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 95 (42) పరుగులు, బౌలింగ్‌లో 21/2 వికెట్లు తీసింది. ముఖ్యంగా చివరి ఓవర్‌లో 6 పరుగులను డిఫెండ్ చేసి జట్టును గెలిపించింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ‘వన్ ఉమెన్ షో’ చేసిన సోఫీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుంది.

January 12, 2026 / 06:54 AM IST

కోహ్లీకి 45వ వన్డే MOM అవార్డు

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ(93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ అవార్డు అందుకున్నాడు. విరాట్ కెరీర్‌లో ఇది 45వ వన్డే ‘MOM’ అవార్డు. వన్డేల్లో అత్యధిక అవార్డుల జాబితాలో సచిన్ (62), జయసూర్య (48) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు.

January 12, 2026 / 06:40 AM IST

WPL: నేడు RCB vs UPW

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఈరోజు RCB vs UPW మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లేదా జియోహాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు. గతంలో ఈ జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరగ్గా, రెండు జట్లూ చెరో మూడు విజయాలు సాధించాయి. కాగా, నిన్న జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది.

January 12, 2026 / 06:08 AM IST

ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠ పోరులో గుజరాత్ జెయింట్స్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 209 పరుగులు చేయగా, ఢిల్లీ 20 ఓవర్లలో 205 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా సోఫి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. దీంతో గుజరాత్ విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లు లిజిలీ (86), లారా (77)ల శ్రమ వృథా అయ్యింది.

January 11, 2026 / 11:09 PM IST

BREAKING: టీమిండియా విజయం

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో ఛేదించింది. కోహ్లీ (93), గిల్ (56), అయ్యర్ (49) రాణించగా.. చివర్లో రాణా(29), రాహుల్(29*) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. బౌలర్లలో జెమిసన్ 4 వికెట్లు తీశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

January 11, 2026 / 09:33 PM IST

సంచలనం.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు

గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నందిని శర్మ సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆమె హ్యాట్రిక్‌తో పాటు 5 వికెట్ల ప్రదర్శనతో మెరిసింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆమె రెండో బంతికి ఒక వికెట్, ఆ తర్వాత చివరి 3 బంతుల్లో వరుసగా 3 వికెట్లు పడగొట్టి.. హ్యాట్రిక్‌తో పాటు ఆ ఒక్క ఓవర్‌లోనే ఏకంగా నాలుగు వికెట్లు తీసింది.

January 11, 2026 / 09:14 PM IST

సోఫీ డివైన్ ఊచకోత.. గుజరాత్ భారీ స్కోరు

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. సోఫీ డివైన్ కేవలం 42 బంతుల్లోనే 95 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 209 పరుగులకు ఆలౌటైంది. ఆష్లీ గార్డనర్ 48 పరుగులతో రాణించగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో నందిని 5 వికెట్లు తీయగా, హెన్రీ, శ్రీచరణి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

January 11, 2026 / 09:08 PM IST

షాక్.. కోహ్లీ సెంచరీ మిస్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు ఒకే ఓవర్‌లో డబుల్ షాక్ తగిలింది. 93 పరుగులతో సెంచరీ వైపు దూసుకెళ్తున్న కోహ్లీని జెమిసన్ ఔట్ చేశాడు. మరో సెంచరీ ఖాయమనుకున్న సమయంలో బ్రెస్‌వెల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇదే ఓవర్‌లో జడేజా (4) కూడా ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది.

January 11, 2026 / 08:46 PM IST

టీమిండియాకు షాక్

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తుండగా వెన్నునొప్పితో మైదానాన్ని వీడాడు. అతడు మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. దీంతో అతడి స్థానంలో నితీష్ రెడ్డి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. త్వరలో జరగబోయే T20 WC జట్టులో సభ్యుడిగా ఉన్న సుందర్ గాయపడటం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

January 11, 2026 / 08:39 PM IST

ప్రపంచకప్ ముందు టీమిండియాకు షాక్

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తుండగా వెన్నునొప్పితో మైదానాన్ని వీడాడు. అతడు మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. దీంతో అతడి స్థానంలో నితీష్ రెడ్డి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. త్వరలో జరగబోయే T20 WC జట్టులో సభ్యుడిగా ఉన్న సుందర్ గాయపడటం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

January 11, 2026 / 08:39 PM IST

విధ్వంసం.. 4, 4, 6, 6, 6, 6

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ సోఫీ డివైన్ విధ్వంసం సృష్టించింది. కేవలం 25 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో స్నేహ రాణా బౌలింగ్‌లో ఆమె వరుసగా 4, 4, 6, 6, 6, 6 కొట్టి ఏకంగా 32 పరుగులు పిండుకుంది. ప్రస్తుతం సోఫీ 27 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులతో క్రీజులో ఉంది.

January 11, 2026 / 08:04 PM IST

అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ప్లేయర్లు..!

➢ సచిన్ (IND) – 34,357 (782 ఇన్నింగ్స్‌లు) – 100➢ కోహ్లీ (IND) – 28,017 (624 ఇన్నింగ్స్‌లు) – 84➢ సంగక్కర (SL) – 28,016 (666 ఇన్నింగ్స్‌లు) – 63➢ పాంటింగ్ (AUS) – 27,483 (668 ఇన్నింగ్స్‌లు) – 71➢ జయవర్ధనే (SL) – 25,957 (725 ఇన్నింగ్స్‌లు) – 54

January 11, 2026 / 07:46 PM IST

IND vs NZ: కోహ్లీ హాఫ్ సెంచరీ

విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీని సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ 44 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా అతడి వన్డే కెరీర్‌లో ఇది 77వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

January 11, 2026 / 07:25 PM IST

కోహ్లీ.. వరుసగా ఐదోసారి 50+ స్కోర్

విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లో 77వ హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 44 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లలో AUSపై చివరి వన్డేలో 74 పరుగులు, SAపై వరుసగా 135, 102, 65 పరుగులు చేసిన విరాట్.. తాజా ఇన్నింగ్స్‌తో కలిపి వరుసగా ఐదు వన్డేల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించి రికార్డు సృష్టించాడు.

January 11, 2026 / 07:25 PM IST