ఎక్కువ టూత్ పెస్ట్ పెట్టుకుని పళ్లు తోమితే నోరు, దంతాలు మరింత శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ పేస్టు అధికంగా వాడితే.. రోగాల బారిన పడుతారని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ఉపయోగిస్తే దంతాలపై క్యావిటీస్ ఏర్పడుతాయి. పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చిగుళ్ల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
SRD: పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈనెల 17 నుంచి మార్చి 15వ తేదీ వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం తెలిపారు. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్ జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని ఆమె చెప్పారు.
SKLM: గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి విభిన్న ప్రతిభా వంతులను గుర్తించాలని నరసన్నపేట జూనియర్ సివిల్ న్యాయాధికారి సీహెచ్. హరిప్రియ అన్నారు. ఉర్లం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ C, A, B6, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంతోపాటు ఎముకలను ధృఢంగా ఉంచుతాయి. హైబీపీ, ఆయాసం, దగ్గు, కళ్ల సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా గోంగూర తినడం వల్ల రక్త హీనత, మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
మెనోపాజ్లో ఎదురయ్యే సమస్యల్లో పొట్ట పెరగటం కూడా ఒకటి. గంటల తరబడి కూర్చోని పనిచేసే వారిలో ఇది మరింత ఎక్కువ. అలాకాకుండా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, అవిసె గింజలు, ఓట్స్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గితే పొట్ట చాలావరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
రాత్రిళ్లు చాలా మంది ఫోన్ చూస్తూ నిద్రపోకుండా ఉంటారు. అలా చేస్తే నిద్రలేమి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి కారణంగా బాడీలోని మెలటోనిన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయి క్యాన్సర్కు కారణమయ్యే కణాలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి శరీరానికి నీళ్లు, ఆహారంతో పాటు సరిపడా నిద్ర కూడా అంతే అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
నల్ల ద్రాక్ష తినడం వల్ల పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహ బాధితులు నల్ల ద్రాక్ష తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఇనుప కడాయిల్లో చేసిన వంటకాలు రుచిగా ఉంటాయి. అయితే కొన్నింటిని ఐరన్ కడాయిల్లో చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. టొమాటో, చింతపండు, నిమ్మకాయతో చేసే వంటలు ఐరన్తో రియాక్ట్ అవుతాయి. వంకాయ, పాలకూర వంటివి ఇనుప కడాయిలో వండకూడదు. కోడిగుడ్డు, బీట్రూట్, తీపి పదార్థాల రుచి పోతుందట. అయితే ఇనుప కడాయి వాడకానికి ముందు నూనె పట్టించి, రుద్ది.. క్లీన్ చేశాక వాడుకోవాలి.
కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. వచ్చే కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పనిచేద్దాం! ఇది విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు మార్పు అనేది వయసుతో సంబంధం లేదు. ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని మనందరి నమ్మకం. అందుకే కొత్త ఏడాదిని కొత్తగా ప్రారంభించండి. అనుకున్న ఫలితాలు సాధించండి. ALL THE BEST
పెరుగు.. ఆరోగ్యానికే కాదు, జుట్టు సమస్యలు తొలగించటానికీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కప్పు పెరుగులో చెంచా చొప్పున నిమ్మరసం, తేనె కలిపి తలకి రాసుకుని ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. పెరుగులో కాస్త ఆలివ్ ఆయిల్ కలిపి తలకి మసాజ్ చేసుకోవాలి. వారానికి 2సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. వెంట్రుకలకు పోషణ అంది, మృదువుగా మారతాయి. జుట్టు మెరుస్తుంది.
AKP: నర్సీపట్నం బాలల సత్వర చికిత్స కేంద్రం వద్ద సోమవారం వినికిడి పరీక్షలు నిర్వహించారు. వినికిడి సమస్యలతో బాధపడుతున్న పలువురు రోగులు భారీగా హాజరయ్యారు. ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీ వరప్రసన్న రోగులను పరీక్షించి వినికిడి స్థాయిని నిర్ధారించారు. రోగులకు అవసరమైతే వినికిడి యంత్రాలను అందజేస్తామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంతి తెలిపారు.
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. పర్యావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, మద్యపానం వల్ల వెంట్రుకలు నెరసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. B12 ఉండే ఆహారాలు.. గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్ వంటివి చిన్నప్పటి నుంచే డైట్లో భాగం చేసుకోవాలి.
బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అయితే ఉదయం పూట బెల్లం నీళ్లు తాగితే మరెన్నో లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. పరగడుపున బెల్లం నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. ఇందులోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. కీళ్లనొప్పులతో బాధపపడే వారు ఉదయాన్నే బెల్లం నీరు తాగితే ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
పాదాలకు కొబ్బరి నూనె రాయడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో పాదాలకు పగుళ్లు ఏర్పడుతాయి. పాదాలకు కొబ్బరి నూనె రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. పాదాలు ఆరోగ్యంగా మారుతాయి. గోళ్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మడమల నొప్పి తగ్గుతుంది. పాదాల దగ్గర దుర్వాసన తగ్గుతుంది. పాదాలను ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
మంచం మీద కూర్చొని భోజనం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు ఇది కడుపులో భారం, యాసిడ్ రిఫ్లక్స్కు కారణమవుతుంది. అలాగే నిద్రను ప్రభావితం చేస్తుంది. అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. బరువు వేగంగా పెరుగుతారు. ఆహారం మంచం మీద పడి స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.