• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

పిఛ్వాయీ గోడల అలంకరణలో కొత్త ట్రెండ్

రాజస్థానీ సంప్రదాయ కళ పిఛ్వాయీ ఇప్పుడు ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. గోడలపై ఫర్నిచర్ ఎక్కువ పెట్టకుండా, మినిమలిస్ట్ స్టైల్ కోరుకునే వారు ఈ పెయింటింగ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. కలువలు, ఆవులు, లతల మధ్య శ్రీకృష్ణుడి అందమైన చిత్రాలు పూజగది నుంచి లివింగ్ రూం వరకు ప్రశాంతతను అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఇంటికి రాయల్ లుక్ ఇస్తున్నాయి.

December 23, 2025 / 03:13 PM IST

రక్త ప్రసరణ మెరుగుపడాలంటే యోగా తప్పనిసరి

నిత్యం యోగా చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. శారీరక వ్యాయామం, ఒత్తిడి తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. యోగా రక్తపోటును తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెన్నునొప్పి, ఆర్థరైటిస్, మైగ్రేన్లు వంటి దీర్ఘకాలిక నొప్పి పరిస్థితులను నిర్వహించడానికి యోగా ప్రభావవంతంగా ఉంటుంది. ఏకాగ్రతను పెంచుతుంది.

December 23, 2025 / 07:10 AM IST

యోగాతో ఒత్తిడి, మానసిక సమస్యలు దూరం

యోగాతో మానసిక సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఉదయం చేసే యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే లంగ్స్ హెల్తీగా ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కోపం, ఆందోళన కంట్రోల్ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. చిన్న వయసు నుంచే యోగా నేర్పిస్తే పిల్లలకు ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత పెరుగుతుంది.

December 22, 2025 / 06:45 AM IST

ఎంత సంపాదించినా అప్పులు తగ్గట్లేదా..!

ఎంత సంపాదించినా అప్పులే మిగులుతున్నాయంటే దానికి కారణం కేవలం తక్కువ ఆదాయం మాత్రమే కాదు, సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కూడా కావచ్చు. ప్రస్తుత కాలంలో పెరిగిన ధరలు, సామాజిక హోదా, క్రెడిట్ కార్డుల కోసం చేసే అనవసర ఖర్చులు సామాన్యుడిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. అందుకే జీతం రాగానే ముందుగా పొదుపును పక్కన పెట్టి, ఆ తర్వాతే ఖర్చు చేయాలి. ఉన్న దాన్ని పొదుపుగా వాడటమే నిజమైన సంపద.

December 21, 2025 / 09:38 PM IST

చర్మం ముడతలు పడకుండా..!

కొన్ని చిట్కాలతో చర్మం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. ఎండలో బయటకెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. మేకప్ వేసుకుంటే రాత్రి నిద్రపోయే ముందు తీసేయాలి. లేదంటే చర్మ సమస్యలు వస్తాయి. ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ధూమపానం మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

December 21, 2025 / 02:13 PM IST

వాముతో అనారోగ్య సమస్యలకు చెక్

వాముతో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీతో బాధపడేవారు వాము, జీలకర్ర మరిగించిన నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది. గర్భిణులకు ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని తగ్గిస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఆర్థరైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వామును పాలలో కల్పి వేడి చేసి తాగితే నెలసరి సమయంలో కలిగే కడుపు నొప్పి తగ్గుతుంది.

December 21, 2025 / 10:30 AM IST

10 నిమిషాలు యోగా చేస్తే క‌లిగే లాభాలు

ఉదయం పూట యోగా చేయడం వల్ల వెన్నెముక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కూర్చోవడం, నడవడం వంటివి మరింత సహజంగా అనిపిస్తాయి. రోజూ యోగా చేస్తే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. 10 నిమిషాలు యోగా చేయడం వల్ల త్వరగా స్పందించే గుణం తగ్గుతుంది. దీంతో కోపం, ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. యోగా శ‌రీర ఆరోగ్యంతోపాటు మాన‌సిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

December 21, 2025 / 06:59 AM IST

‘ముస్తాబు’.. మనమూ కొనసాగిద్దామా?

సంపూర్ణ ఆరోగ్యవంతుడు కోటీశ్వరుడితో సమానం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కాకుండా పరిశుభ్రత కూడా అవసరం. మన ఇల్లు, స్కూలు, ఆఫీసు, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఇందుకు ఏపీలోని ఓ కలెక్టర్ ప్రారంభించిన ‘ముస్తాబు’ కార్యక్రమం ఇప్పుడు అన్ని పాఠశాలల్లో ప్రారంభమైంది. మనం కూడా ఇదే స్ఫూర్తిని ప్రతీ ఇల్లు, వీధి, గ్రామం, పట్టణం తేడా లేకుండా కొనసాగిద్దాం. ఏమంటారు?

December 20, 2025 / 06:00 PM IST

డిప్రెష‌న్ ల‌క్ష‌ణాలు ఇవే..!

నేటి యువత ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎల్లప్పుడూ విచారంగా, ఏదో కోల్పోయినట్లు ఉంటారు. రోజువారి కార్యకలాపాలపై ఆసక్తి చూపరు. చేసే పనిపై శ్రద్ధ పెట్టరు. ఆకలి తగ్గుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతారు. అలసటగా, నీరసంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. ఎక్కువగా మాట్లాడరు. వారికి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి.

December 20, 2025 / 04:51 PM IST

స్మార్ట్‌ఫోన్లు అదే పనిగా వాడుతున్నారా?

రాత్రిపూట అధిక స్క్రీన్ వాడకం, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్‌ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది శరీర సహజ నిద్ర చక్రానికి భంగం కలిగిస్తుంది. యువ జంటలు స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువ సమయం గడపడం వల్ల టెక్-డ్రైవన్ ఇంటెమసీ గ్యాప్స్ పెరుగుతున్నాయి. ఇది లైంగిక కోరికపై నేరుగా ప్రభావం చూపుతుంది.

December 20, 2025 / 11:33 AM IST

తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా?

కొంత మంది తరచూ తలనొప్పితో ఇబ్బంది పడుతుంటారు. పని ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలా తలనొప్పి వస్తుంది. ఇది అంత సులువుగా తగ్గదు. అలాంటి సమయంలో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్‌లు చేయాలి. మెడిటేషన్ లాంటివి చేయడంతో కొంత రిలీఫ్ దొరుకుతుంది. వీటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరమే. దీని వల్ల మైండ్ రిలాక్స్ అయి తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

December 19, 2025 / 09:30 PM IST

రోజూ కాఫీ తాగుతున్నారా..?

మ‌న‌లో చాలా మంది త‌మ రోజును ఒక క‌ప్పు కాఫీతో ప్రారంభిస్తారు. ఉద‌యం కాఫీ తాగ‌నిదే వారికి రోజు గ‌డిచిన‌ట్టుగా కూడా ఉండ‌దు. కాఫీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ‌నిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధుల బారినుండి శ‌రీరాన్ని కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ&z...

December 19, 2025 / 09:28 PM IST

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే?

మేకప్ ఎక్కువసేపు మంచిగా నిలవాలంటే కొన్ని సరైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మేకప్ వేసే ముందు మాయిశ్చరైజర్, ప్రైమర్ ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. మేకప్ వేసుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవాలి. లేదంటే ముఖంపై ఐస్ మసాజ్ చేస్తే.. మేకప్ వేసుకున్న తర్వాత బాగుంటుంది. అంతేకాదు రాత్రి మేకప్ తీసేసి పడుకోవాలి. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

December 19, 2025 / 01:16 PM IST

పచ్చి బఠానీలతో కలిగే ప్రయోజనాలు

పచ్చి బఠానీలు చలికాలంలో పెద్ద మొత్తంలో పండుతాయి. పచ్చి బఠానీలో కొవ్వు పరిమాణం తక్కువగా ఉండగా.. ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి బఠానీల ఎంపిక ఉత్తమం. ఎక్కువ క్యాలరీలు లేకుండా పొట్ట నిండిన భావన కలిగించడం వల్ల అవసరానికి మించి తినకుండా సహాయపడుతుంది. మాంసాహారం తీసుకోని వారికి ప్రోటీన్ లోపం ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వారు పచ్చి బఠానీ తీసుకోవాలి.

December 19, 2025 / 12:05 PM IST

ఉదయాన్నే పసుపు నీళ్లు తాగుతున్నారా?

మూత్రపిండ రాళ్ల సమస్య ఉన్నవారికి పసుపు వినియోగం మరింత జాగ్రత్త అవసరం. పసుపులో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువగా చేరినప్పుడు కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్‌గా మారుతుంది. ఇదే మూత్రపిండ రాళ్లకు ప్రధాన కారణంగా మారుతుంది. ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు, ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు పసుపును పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

December 19, 2025 / 08:31 AM IST