• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

పడుకునే ముందు తింటున్నారా?

రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్ర లేమి, ఊబకాయం సమస్యలు వేధిస్తాయి. ఇది గుండెజబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏదీ అధిక పరిమాణంలో తీసుకోకూడదు.

March 16, 2026 / 09:38 PM IST

పుస్తకం తెరవగానే నిద్ర ముంచుకొస్తుందా..?

పుస్తకం తెరవగానే నిద్ర వచ్చినట్లు అనిపించడం సర్వసాధారణం. చదివేటప్పుడు కనుబొమ్మల కండరాలు అలసిపోవడం వల్ల మెదడు నిద్రకు సంకేతాలిస్తుంది. ముఖ్యంగా పడుకుని చదవడం వల్ల శరీరం త్వరగా నిద్రలోకి వెళ్తుంది. అందుకే కుర్చీలో నిటారుగా కూర్చుని, తగినంత వెలుతురులో చదవడం అలవాటు చేసుకోవాలి. బయటకి చదవడం కూడా మంచి చిట్కానే. దీంతో నిద్ర మత్తు వదిలి చురుగ్గా పుస్తకాన్ని చదవగలుగుతారు.

March 16, 2026 / 08:51 PM IST

ALERT: అతిగా మద్యం తాగుతున్నారా..?

మద్యం తాగి నియంత్రణ కోల్పోవడంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతిగా తాగి బహిరంగ ప్రదేశాల్లో వాంతులు చేసుకోవడం ఇతరులకు అసహ్యం కలిగిస్తుంది. అలాగే, మద్యం మత్తులో గట్టిగా అరవడం, గొడవలు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నవారు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ప్రవర్తన వల్ల తన గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా.. ఒంటరివాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, మద్యానికి దూరంగా ఉండండి.

March 16, 2026 / 08:36 PM IST

ఎండలను తట్టుకోలేకపోతున్నారా..?

వేసవి వేడి నుంచి ఉపశమనం పొందాలంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయను తప్పక తీసుకోవాలి. ఇందులో విటమిన్ A, C, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. అలాగే శరీర తాపాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే మజ్జిగను తీసుకోవడం కూడా ఎంతో ఆరోగ్యకరం. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండడం ఉత్తమం.

March 16, 2026 / 04:42 PM IST

కుదుళ్లకు మసాజ్‌.. ఎందుకంటే?

జొజోబా, బాదం నూనెతో తల మర్దన చేయడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ పెరిగి జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. అయితే అతిగా నూనె వాడితే ముఖం జిడ్డుగా మారి ఇతర సమస్యలు రావచ్చు. మర్దన చేసేటప్పుడు స్ట్రోక్స్ సరిగ్గా లేకున్నా, చేతి గోళ్లు తగిలినా ఇబ్బందే. సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా మర్దన చేసుకుంటే జుట్టుకు పోషణతో పాటు సహజసిద్ధమైన మెరుపు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

March 16, 2026 / 04:15 PM IST

వేసవిలో దీన్ని తింటే మంచిది!

గోండ్ కటిరా(Tragacanth gum) ఆస్ట్రాగలస్ మొక్కల నుంచి లభించే సహజ రెసిన్. ఇది వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఎముకలు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాత్రంతా నీటిలో నానిన ఈ జెల్లీని పాలు, మజ్జిగ లేదా జ్యూస్‌లలో కలిపి తీసుకోవచ్చు.

March 16, 2026 / 03:30 PM IST

మధ్యాహ్న భోజన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మధ్యాహ్న భోజనం అమితంగా కాకుండా మితంగా, పోషకాలతో నిండి ఉండాలి. భోజనానికి అరగంట ముందు, తిన్న గంట తర్వాతే నీళ్లు తాగాలి. అన్నంలో కూరగాయలు, పప్పు ఉండేలా చూసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టీ, కాఫీలకు దూరంగా ఉండి, మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. సరైన సమయంలో భోజనం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

March 16, 2026 / 12:30 PM IST

అరికాళ్లలో దురద వేధిస్తోందా? ఈ చిట్కా మీకోసం!

పాదాల దురద, పగుళ్ల నివారణకు పెప్పర్‌మింట్ ఆయిల్ అద్భుతమైన ఔషధం. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల నూనె వేసి పాదాలను నానబెడితే చర్మం మృదువుగా మారుతుంది. ఇది ఎరుపుదనాన్ని తగ్గించి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. రసాయన మందుల కంటే ఈ సహజ చిట్కా మేలని నిపుణులు సూచిస్తున్నారు. మీ పాదాల సంరక్షణకు ఇది సురక్షితమైన మార్గమని చెబుతున్నారు.

March 16, 2026 / 11:56 AM IST

ప్రతి నలుగురిలో ఒకరికి మైగ్రేన్ ముప్పు!

దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఇది కేవలం తలనొప్పి కాదు, తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధి. విపరీతమైన నొప్పి, వాంతులు, వెలుతురును భరించలేకపోవడం దీని ప్రధాన లక్షణాలు. ఒత్తిడి, నిద్రలేమి వల్ల ఇది మరింత పెరుగుతుంది. సరైన జీవనశైలి మార్పులు, వైద్య చికిత్స ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

March 16, 2026 / 11:46 AM IST

మెడపైన ముడతలు పోవాలంటే..!

ముందుగా గోరువెచ్చని నీళ్లు, నూనె రహిత క్లెన్సర్‌తో ముఖం శుభ్రం చేయాలి. ఆలివ్ నూనెతో మెడపై మర్దన చేయడం, వ్యాయామాలు చేయడం వల్ల చర్మం ఉత్తేజితమవుతుంది. కోడిగుడ్డు తెల్లసొన-తేనె మిశ్రమం లేదా పెరుగు-నిమ్మరసం ప్యాక్ వేసి మర్దన చేస్తే మంచిది. కలబంద, తేనె కలిపిన ప్యాక్ కూడా 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖం, మెడ కాంతివంతంగా మారుతాయి.

March 16, 2026 / 11:13 AM IST

వ్యాయామానికి ముందు ప్రీ-వర్కౌట్ డ్రింక్స్

వ్యాయామానికి 30-60 నిమిషాల ముందు తీసుకునే ప్రీ-వర్కౌట్ డ్రింక్స్ శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. బ్లాక్ కాఫీ తక్షణ శక్తినిస్తే, బీట్‌రూట్ జ్యూస్ రక్త ప్రసరణను మెరుగుపరిచి స్టామినాను ఇస్తుంది. నిమ్మరసం-తేనె నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అరటిపండు స్మూతీ కండరాల పనితీరుకు అవసరమైన పొటాషియం, కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.

March 16, 2026 / 09:51 AM IST

విదుర నీతి: విషం కంటే చెడు సలహానే ప్రమాదకరం

ఎవరికైనా విషం ఇస్తే, ఆ విషం కేవలం ఆ ఒక్క వ్యక్తి ప్రాణాన్ని మాత్రమే తీస్తుంది. కానీ, నిర్ణయాలు తీసుకునే నాయకుడికి ఎవరైనా ‘చెడు సలహా’ ఇస్తే.. ఆ తప్పుడు సలహా ఏకంగా ఒక రాజ్యాన్ని, కుటుంబాన్ని సమూలంగా నాశనం చేస్తుందని విదురుడు హెచ్చరించారు. బయట ఉండే శత్రువుల ఆయుధాల కంటే, మన పక్కనే ఉంటూ స్వార్థంతో తప్పుడు సలహాలు ఇచ్చే వారితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుందని విదుర నీతి సారాంశం.

March 16, 2026 / 08:00 AM IST

ఉదయం 8 గంటలలోపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే?

ఉదయం 8 గంటల ప్రాంతంలో అల్పాహారం తీసుకుంటే శరీరంలోని సహజ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. గుండె జబ్బులు, హైబీపీ, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ఉదయం 8 గంటలకు తినాల్సిన అల్పాహారాన్ని 9 గంటలకు తింటే.. గుండె సమస్యల ప్రమాదం ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

March 16, 2026 / 07:58 AM IST

రాత్రిపూట విపరీతంగా దాహం వేస్తోందా?

వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. పగలు తగినంత నీరు తాగకపోవడం, రాత్రిపూట ఉప్పుగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అర్ధరాత్రి విపరీతంగా దాహం వేస్తుంది. దీనివల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీనిని నివారించడానికి పగలు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. రాత్రి పడుకునే ముందు మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లగా ఉండి హాయిగా నిద్రపడుతుంది.

March 15, 2026 / 11:29 PM IST

ఇలా చేస్తే గాఢ నిద్ర పడుతుంది

ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. గాఢ నిద్ర రావాలంటే రాత్రి 7 గంటలలోగా భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం త్వరగా జీర్ణమై హాయిగా నిద్ర పడుతుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర పడుతుంది. ఏదైనా బుక్స్ చదివినా నిద్రలోకి జారుకుంటారు. పడుకునే ముందు గ్లాసు పాలు తాగినా గాఢ నిద్ర పడుతుంది.

March 15, 2026 / 09:54 PM IST