గోధుమ గడ్డి రసంలో విటమిన్లు (A, C, E), మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రోజూ పరిగడుపున 30ml రసం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. బరువును తగ్గిస్తుంది.
ఉదయం అల్పాహారం తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల పగటిపూట ఎక్కువగా తినడం తగ్గుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. సమతుల్య అల్పాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలను తగ్గించవచ్చు. అల్పాహారంలో ఓట్స్, గుడ్లు, పండ్లు (బెర్రీలు, అరటిపండ్లు), గ్రీక్ పెరుగు, చియా విత్తనాలు, తృణధాన్యాలు చేర్చుకుంటే మంచింది.
పశ్చిమోత్తనాసనం వెన్నెముకను సాగదీసి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పొట్ట కండరాలను ఒత్తిడికి గురిచేయడం ద్వారా మసాజ్ చేసి, అజీర్ణం, మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది. మనస్సును శాంతపరచి, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో, జీవక్రియ పెంచడంలో సహాయపడుతుంది. క్రమంగా సాధన చేస్తే పొడవు పెరగడానికి దోహదపడుతుంది.
పిల్లల ఎదుగుదలకు పోషకాహారం, నిద్ర, వ్యాయామం చాలా ముఖ్యం. ప్రోటీన్లు, కాల్షియం ఉండే గుడ్లు, ఆకుకూరలు అందించాలి. రోజుకు 8-10 గంటల నిద్రతో పాటు విటమిన్-డి కోసం ఎండలో ఆడుకోనివ్వాలి. స్విమ్మింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు ఎముకల పుష్టికి, ఎత్తు పెరగడానికి తోడ్పడతాయి. సరైన జీవనశైలితోనే పిల్లల శారీరక వికాసం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్లో ఉంచి తినడం వల్ల బ్యాక్టీరియా చేరి కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని అజీర్తి, విరేచనాలకు దారితీస్తుంది. అందుకే పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్దే తినాలి. తిన్న 45 నిమిషాల తర్వాతే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండాకాలంలో జిడ్డు, చెమటకాయలు, ట్యాన్ తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచించారు. స్నానపు నీటిలో ఓట్స్ కలపడం, ఐస్ క్యూబ్స్తో రుద్దడం, ముల్తానీ మట్టి ప్యాక్ వేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇవి చర్మంపై మురికిని, నూనెను తొలగించి ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ సులభమైన పద్ధతులతో వేసవిలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుకోవచ్చు.
షాపింగ్ మాల్స్లోని మేకప్ టెస్టర్ల వాడకం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి ద్వారా హెర్పెస్ వైరస్, ఈ-కోలి బ్యాక్టీరియా వ్యాపించి పెదాలపై బొబ్బలు, చర్మ అలర్జీలు, మొటిమలకు దారితీస్తాయి. ఇతరులు వాడిన ఐలైనర్లు, మస్కారాల వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. పబ్లిక్ శాంపిల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం చేసే విషయంలో జాగ్రత్త చాలా అవసరం. చాలా మంది పనిలో పడి సమయానికి తినరు. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1-2 గంటల లోపే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ భోజనాన్ని నిర్ణీత సమయానికి తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుందంటున్నారు.
పరగడుపున పచ్చి కొబ్బరి తింటే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది తింటే కడుపు నిండుగా అనిపించి, అనవసరపు ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. ముఖంపై ముడతలు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మనలో చాలా మందికి టీ తాగనిదే రోజు ప్రారంభమవదు. అయితే టీ తాగిన వెంటనే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. దీని వల్ల దంతాలపై తీవ్ర ప్రభావం పడి చిగుళ్ల దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీని వల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే టీ లేదా కాఫీ తాగిన 10-15 నిమిషాల తర్వాత నీరు తాగాలి. టీ తాగడానికి ముందు కూడా నీరు తాగడం మంచింది.
వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అయి తరచూ దాహాం వేస్తుంది. ఇలాంటి సమయాల్లో కూల్డ్రింక్స్ తాగడం వల్ల తాత్కాలికంగా దాహం తీర్చినప్పటికీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే అత్యంత ఔషధ గుణాలున్న మారేడు పండు తీసుకోవాలి. ఇది శరీరానికి చలువ చేసి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచతుంది. దీని జ్యూస్, షర్బత్ వేసవి తాపాన్ని తగ్గించి, శక్తిని ఇస్తాయి.
ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబాలిజం పెరగడం వల్ల కొవ్వు కరుగుతుంది. నీళ్లు తాగిన తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది మీ మూడ్ను రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది.
కోనసీమ: అయినవిల్లి మండలం క్రాపలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోటిపల్లి రాజారావు (47) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు దిగుడుబావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతునికి భార్య మాణిక్యం, కుమార్తె ఉన్నారు. అయినవిల్లి ఎస్సై కే జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మునగ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మునగ కొందరు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. గర్భధారణ సమయంలో అసౌకర్యం, సమస్యలకు దారితీస్తుంది. అలాగే పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడే స్త్రీలు కూడా మునగ తినకుండా ఉండాలి. దీనిలోని వేడి లక్షణాలు రక్తస్రావాన్ని మరింత పెంచుతాయి.
గులాబీ నూనెకు యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువ. వేడినీటిలో కాస్త రోజ్ ఆయిల్ని వేసి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మం తేమగా మారుతుంది. వెన్న, బ్రౌన్ షుగర్, రోజ్ ఆయిల్ కలిపి శరీరానికి రాసుకుంటే ఇది సహజసిద్ధమైన స్క్రబ్లా పనిచేస్తుంది. ఆలివ్, రోజ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి.. కాసేపయ్యాక కడిగేస్తే సహజ తేమను పొందుతుంది.