పొదుపును అలవాటుగా చేసుకుంటే, మదుపు చేయడానికి అదే ఇంధనంగా మారుతుంది. క్రమం తప్పకుండా చేసే మదుపు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. అయితే ఎక్కువ డబ్బును కూడబెట్టడమే ఆర్థిక స్వేచ్ఛ అని ఆలోచించేవారు దాని కోసమే ఆరాటపడుతూ ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. డబ్బును అవసరాల కోసమే చూసేవారికే ఆర్థిక స్వేచ్ఛ సొంతమవుతుంది.
ఎండు చేపలను తరుచూ తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం. అలసట ఉండవు. మెదడులో వాపు తగ్గుతుందట. అంతేకాదు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు ఎండు చేపలను తింటే మంచిది. అయితే హైబీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు వీటిని తినాలని నిపుణులు చెబుతున్నారు.
క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణుడు డాక్టర్ సలీం జైదీ తెలిపారు. ఈ బిస్కెట్లలో పాలు లేదా క్రీమ్ ఉండవని.. వాటికి బదులుగా హైడ్రోజనేటెడ్ ఆయిల్, కృత్రిమ రుచులు, అధిక చక్కెర, సింథటిక్ రంగులను వాడతారని చెప్పారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, ఇన్సులిన్ నిరోధకత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్ జైదీ పేర్కొన్నారు.
పియర్ పండ్లను తరుచూ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాదు రక్తపోటు అదుపులో ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గుతాయి.
ఉదయం లేవగానే పురుషులకు అంగస్తంభన అనేది సాధారణం. ఇది మంచి ఆరోగ్యానికి సంకేతం. లైంగిక ప్రేరేపణ వల్ల కాకుండా.. పురుష పునరుత్పత్తి వ్యవస్థ సాధారణ విధుల వల్ల సంభవిస్తుంది. ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉదయాన్నే గరిష్టానికి చేరుకుంటాయి. దీంతో శారీరక ప్రేరణ లేకుండా అంగం గట్టిపడుతుంది. అయితే అంగస్తంభన గంటల తరబడి ఉన్నా.. అసలు లేకున్నా వైద్య నిపుణులను సంప్రదించండి.
వెన్నెముక, నడుము, పాదాలు బలం పెంచుకోవడానికి బాలాసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనంలో 3 నుంచి 5 నిమిషాలపాటు స్థిరంగా ఉండటం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ముందుగా మోకాళ్లపై వజ్రాసనంలో కూర్చోవాలి. నడుమును పైకి ఎత్తకుండా శరీరాన్ని ముందుకు వంచాలి. తలను నేలకు ఆనించి, చేతులను వెనక్కి చాపి పాదాలను అందుకోవాలి. ఈ భంగిమలో శ్వాసక్రియ నిధానంగా కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండి, ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుప్పెడు బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
బ్లాక్ గ్రేప్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలు ఉంటాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని తింటే వృద్ధాప్య ప్రక్రియ ఆలస్యమవుతుంది. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
ఎన్ని మందులు వాడిన రక్తపోటు అదుపులోకి రాని వారికి బాక్స్ డ్రోస్టాట్ అనే కొత్త ఔషధం వచ్చింది. ఇది నియంత్రణలోకి రాని బీపీని సైతం సమర్థవంతంగా తగ్గిస్తున్నట్లు ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది. ఈ ట్రయల్స్లో భాగంగా రోజూ ఒకసారి 1 మిల్లీగ్రామ్ లేదా 2 మిల్లీగ్రాముల బాక్స్ డ్రోస్టాట్ మాత్ర తీసుకున్న వారిలో 12 వారాల తర్వాత రక్తపోటు గణనీయంగా తగ్గింది.
పర్పుల్ కలర్ క్యాబేజీలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ K, క్యాల్షియం, మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది.
వినాయకుడి ముందు గుంజీలు తీస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. దీని వెనుక ఒక కథ ఉంది. ఒకసారి బాల గణేశుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు. విష్ణువు ఎంత బతిమిలాడినా గణపతి ఇవ్వడు. దీంతో విష్ణువు గుంజీలు తీయడం చూసి గణపతి గట్టిగా నవ్వడంతో పొట్టలో ఉన్న సుదర్శన చక్రం బయటకి వస్తుంది. అప్పటినుంచి వినాయకుడి ముందు గుంజీలు తీసే సంప్రదాయం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి.
వినాయక చవితికి స్వామివారికి పెట్టే నైవేద్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కుడుములు, ఉండ్రాళ్లు బలవర్థకమైన ఆహారం. జీర్ణశక్తికి మంచిది. పాయసం, పాలతాలికల్లో ఖనిజాలు ఉంటాయి. మోదకాలు, పూర్ణాల నుంచి ప్రొటీన్లు, సహజ చక్కెరలూ లభిస్తాయి. పెసరపప్పు, బెల్లం, ఉడికించిన శనగలు, అరటి, వెలగపండ్లు తక్షణశక్తిని ఇస్తాయి. పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పాత కుక్కర్లను వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. పాత కుక్కర్లలోని లోహాలు ఆహారంలోకి సీసాన్ని విడుదల చేస్తాయి. ఇది మెదడు, మూత్రపిండాలు, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గీతలు పడిన, రీసైకిల్డ్ లోహంతో చేసిన కుక్కర్లను వెంటనే వాడటం మానేయాలి. సురక్షితమైనవిగా భావించే స్టీల్, అయొనైజ్డ్ అల్యూమినియం కుక్కర్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ASR: పండ్ల తోటల పెంపకంతో సుస్ధిర ఆదాయం వస్తుందని అరకు సర్కిల్ ఇన్స్స్పెక్టర్ ఎల్ హిమగిరి తెలిపారు. సోమవారం డుంబ్రిగుడ మండలం, లైగండ పంచాయితీ కేంద్రంలో గిరిజన రైతులకు ఐటీడీఏ సహాకారంతో సిల్వర్, నిమ్మ, సీతాఫల మొక్కలను పంపిణీ చేశారు. సీఐ మాట్లాడుతూ.. గంజాయి వంటి హానికరమైన నిషేధిత మొక్కలు కన్నా పండ్ల మొక్కలను పెంచడం వలన ఆదాయం, ఆహారం, సంఘంలో గౌరవం లభిస్తాయన్నారు.