పొద్దున్నే నిద్ర లేవడంతోనే ప్రజలు కాఫీ, టీ, బూస్ట్ ఇలా ఎవరికి నచ్చింది వారు తాగుతారు. అయితే అధిక బరువుతో బాధపడేవారు పొద్దున్నే పరగడపున జీలకర్ర నీళ్లను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బరువును తగ్గించడమే కాదు.. ఇతర రకాల వ్యాధుల బారి నుంచి విముక్తి కలిగిస్తుందని చెబుతున్నారు. గ్యాస్టిక్ ట్రబుల్, ఊబకాయం, ఉబ్బరం, కడుపునొప్పి లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
ATP: తాడిపత్రిలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో ఈ నెల 17న మ.2 నుంచి సా.5 గంటల వరకు ఉచిత మూర్ఛ వ్యాధి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గోపాలం శివన్నారాయణ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SKLM: నరసన్నపేట మండలం కామేశ్వరి పేట సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఉర్లాం పీహెచ్సీ వైద్యాధికారిణి ఎం శాలిని తెలిపారు. మంగళవారం ఉదయం ఈ శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 48 మందికి వైద్య తనిఖీలు నిర్వహించామని అన్నారు. దీర్ఘకాలిక రోగులకు రక్త, బిపి, మధుమేహ వ్యాధి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశామన్నారు.
SKLM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సహాయకుడిగా పనిచేస్తున్న కె. రమేష్ (36) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. స్థానిక ఏపీవో టి. పార్వతి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పచ్చకామెర్లు వ్యాధితో రమేష్ బాధపడుతున్నాడని తెలిపారు. విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. ఈ రోజు మృతి చెందారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి 15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
హిందూ సంప్రదాయంలో వివాహిత స్త్రీలు నుదుటన అలంకరించుకునే సింధూరానికి చారిత్రక, సాంస్కృతిక, వైద్యపరమైన ప్రాముఖ్యతలున్నాయి. దీన్ని అదృష్టం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. సింధూ నాగరికత నుంచే ఈ సంప్రదాయం ఉంది. నుదుటిపై ఆజ్ఞా చక్రం అనే నాడీ మండల కేంద్రంలో దిద్దే ఈ సింధూరం మహిళల్లో ఏకాగ్రతను పెంచి, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.
VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో శనివారం వీక్లీ మీటింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో స్థానిక బీసెంట్ స్కూల్ గ్రౌండ్లో సభ్యులు అందరు ఫీజికల్ ఫిటినెస్తో ఉండాలని జాగింగ్, రన్నింగ్ లాంటివి పీటీ మాస్టారు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రెసిడెంట్ నాగేశ్వరావు, సెక్రటరీ శంకర్ రెడ్డి తెలిపారు.
సగ్గు బియ్యంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో సగ్గు బియ్యం జావ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. సగ్గు బియ్యం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. మలబద్ధకం, జలుబు, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి.
వాటర్ యాపిల్.. దీన్నే రోజ్ యాపిల్, వ్యాక్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇవి కేవలం విదేశాల నుంచి మాత్రమే దిగుమతి అయ్యేవి కానీ.. ఇప్పుడు మన దగ్గర కూడా పండిస్తున్నారు. దీనిలో 90శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. మల బద్ధకం సమస్యను తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ ప్రీ ర్యాడికల్స్ను నిర్మూలిస్తుంది.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం హిందూ సంప్రదాయంలో శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించే పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. “అక్షయ” అనే పదం “ఎన్నటికీ క్షీణించని” అని అర్థం, కాబట్టి ఆ రోజు కొన్న బంగారం శాశ్వత లాభాన్ని ఇస్తుందని భావిస్తారు. అంతేకాక, ఆ రోజు ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కూడా చెబుతారు.
Akp: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ నేరేడుబంద పీవీటీజీ గిరిజన గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. గ్రామంలో 14 కుటుంబాలు జీవిస్తుండగా మూడు రోజుల నుంచి జ్వరాలతో 13 మంది చిన్నారులు బాధపడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.గోవిందరావు తెలిపారు. తక్షణమే గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సమయానికి తినకపోవటం, పోషకాహార లోపం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మనం తీసుకునే కొన్ని ఆహారాలు ఆ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పికి అరటిపండు, మలబద్ధకం-బొప్పాయి, యాపిల్ తీసుకోవాలి. వికారం, వాంతులు- అల్లం, హైబీపీ-బీట్ రూట్, కీళ్లనొప్పి- అనాస, డీహైడ్రేషన్-తర్బూజ, నిద్రలేమి-చెర్రీలు, కండరాల అలసటకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి.
SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన ఓ చిన్నారి చిన్నతనంలోనే రెండు కిడ్నీలు పోవడం బాధాకరమని నందన్ కృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు గోపాల్ ఉర్లాన తెలిపారు. ఆయన గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తోటి విద్యార్థులు ఆ పిల్లవాడిని ఆదుకున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.
మార్చి 30వ తేదీని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. ఇది క్రీస్తుశకం 800-1200లో భారతదేశానికి వచ్చింది. కాలక్రమేణా ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇడ్లీలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది.
ఖర్జూరం తినడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, పలు రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
పెరుగు తింటే జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుందని.. ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక.. వారానికి రెండు, అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి కుడివైపున వచ్చే పెద్ద పేగు క్యాన్సర్.. ముప్పు తగ్గుతున్నట్టు వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కన్నా కుడి వైపు క్యాన్సర్ తీవ్రమైంది కావటం గమనార్హం.