ASR: రంపచోడవరం డివిజన్లో ఇంటర్ పాస్ అయిన యువతకు మారేడుమిల్లి వైటీసీలో 15 రోజుల ఉచిత డేటా ఎంట్రీ శిక్షణ ఇవ్వబడును. ఎంపికైన వారికి ఉచిత భోజన, వసతి సదుపాయం కలదు. ఆసక్తి గలవారు ఈ నెల 17లోపు ఆన్లైన్లో లేదా ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ITDA PO స్మరణ్ రాజ్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. వాటి కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, ఏనుగుల్ని తమ ప్రాంతం నుంచి తరిమేయాలని కోరుతున్నారు.
KDP: ఖాజీపేట పరిధిలోని దుంపలగట్టు గ్రామంలో సోమవారం వర్గకక్షలు,సైబర్ నేరాలవల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ పోలీస్ కళా-జాగృతి బృందం ఇన్ఛార్జి జి.నరసరామ్ ఆధ్వర్యంలో “మేలుకొలుపు” నాటకం, పాటల ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఖాజీపేట సి.ఐ వంశీధర్ ముఖ్య అతిధిగా హాజరై ఆత్మీయంగా జీవిస్తూ, మన బిడ్డల బంగారు భవితకు బాటలువేద్దామన్నారు.
SKLM: ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ అధికారులు రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు పోలీస్ సిబ్బంది సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
VZM: విజయనగరం మహారాజా హాస్పిటల్ నందు 108 కార్యాలయంను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వద్ద అందుబాటులో ఉన్న108 వాహనాన్ని పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో 108, 104 సేవలు అద్భుతంగా అందిస్తున్నాయన్నారు. నిబంధనల ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్సులు సకాలంలో చేరుకుంటున్నాయని తెలిపారు.
PLD: ఎడ్లపాడు మండలం కొండవీడులో అగ్ని హర్షిదాతు MSME పార్కు ఏర్పాటుకు కలెక్టర్ కృతికా శుక్లా ఆమోదం తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (DIPEC) సమావేశంలో, నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
VZM: గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు తెలిపారు. జీలికవలస హైవే వద్ద మోటార్బైక్పై 5.70 కేజీల గంజాయి తరలిస్తుండగా తెర్లాం వెలగవలసకు చెందిన శశి, ఒడిశా పొట్టంగికి చెందిన అనంత్ వసాది, విశాఖకు చెందిన భానుప్రసాద్లను పోలీసులు పట్టుకున్నారు.
ELR: ద్వారక తిరుమల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన ఆయన, గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలోనే మండలంలో రూ. 25 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.
E.G: భారతీయ జనతా పార్టీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం క్వారీ సెంటర్ నందు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సోమవారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృతి, సనాతధర్మం, చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గుల పోటీలను నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు.
కోనసీమ: అంబాజీపేట మండలం మొసలిపల్లి గ్రామంలో జగ్గన్న తోట ప్రభల తీర్థం పనులను పీ. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలన్నారు.
NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం బోగోలు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని కొండ బిట్రగుంట ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నూతన కళ్యాణ మండపాలు, తూర్పు రాజగోపురం, తూర్పు రాజగోపురం మెట్లు నిర్మాణం, స్వామి వారి రథం భద్రపరచు గది, ప్రహరీ గోడ నిర్మాణం, మౌలిక సదుపాయాల తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
NLR: సంక్రాంతి పండుగను మండల ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఎస్సై సంతోష్ రెడ్డి సూచించారు. మండల పరిధిలో ఎవరైనా కోడిపందాలు, డైమండ్ డప్పా, పేకాట ఇతర జూదాలతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పండుగ రోజుల్లో ఇళ్లను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ATP: గుత్తి పట్టణంలో రేపు ఎమ్మెల్యే జయరాం పర్యటిస్తారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి సోమవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. తొండపాడు గ్రామంలో 10.30 గంటలకు రూ. 8 లక్షలతో నూతన సీసీ రోడ్డుకు నిర్మాణానికి భూమి పూజ, అలాగే ఫిబ్రవరి 1న జరగబోయే రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలపై అధికారులతో ససమావేశం నిర్వహిస్తారన్నారు.
NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని యాతం జయ చంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో హైకోర్టు న్యాయవాది ఇస్మాయిల్ కుమారుని వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నమయ్య: రాయచోటిలోని పోలీస్ పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్, ఆయన సతీమణి శ్రీలక్ష్మీ భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. సంక్రాంతి కుల–మతాలకు అతీతమైన రైతుల పండుగ అని ఎస్పీ పేర్కొన్నారు. ముగ్గుల పోటీలు, పిల్లల ఆటలు, గాలిపటాల ఎగరేసే కార్యక్రమాలతో పోలీస్ కుటుంబాల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.