E.G: గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామపంచాయతీ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీపీ ఈది. రత్న అశోక్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 30 లక్షలుతో ఈ సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.