VZM: ఆర్యవైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో వాసవి ఫౌండేషన్ సేవలందిస్తుందని సంఘం అధ్యక్షులు మండవిల్లి వెంకట రాజు పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సముద్రాల గురు ప్రసాద్, గిరిజా ప్రసన్న దంపతులను ఘనంగా సత్కరించారు. సాహిత్య ,సేవ, ఉపాధ్యాయ రంగాలలో అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించారు.
PLD: నకరికల్లు మండలం దేచవరం చెరువు “జలధార–జలహారతి” కార్యక్రమంతో ఆధునికీకరణకు సిద్ధమవుతోంది. పూడికతీత, కట్టల బలోపేతంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి 131 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందనుందని రైతులు అన్నారు. భూగర్భ జలాలు పెరిగి రెండు పంటలకు భరోసా కలుగుతుందని తెలిపారు. చెరువు కొత్త శోభతో గ్రామంలో సాగు విప్లవాత్మక మార్పులు వస్తాయని రైతులు అభిప్రాయపడ్డారు.
PPM: కురుపాం మండలం మొండెంఖల్ వారపు సంతను ఎస్సై నీలకంఠరావు సందర్శించారు. ఈ సందర్భంగా సంతకు వచ్చిన మారుమూల గిరిజన ప్రజలకు అభయదయం 2.0, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మంగళవారం తెలిపారు. సిబ్బంది సమన్వయంతో జరిగిన ఈ పోటీలు ఐక్యత, స్నేహభావాన్ని పెంచాయని చెప్పారు. నిర్వహణలో రన్-అప్ టీమ్ కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. సెనేట్ హాల్లో జరిగిన సమావేశంలో టీమ్ సభ్యులను సత్కరించారు.
SKLM: ఇచ్చాపురం నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు దుస్థితికి టీడీపీ కారణమని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఈదుపురం, కేశపురం బహుదా నది పరివాహక ప్రాంతంలో కాలువలు, పంట పొలాలను స్థానిక రైతులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
E.G: ప్రాథమిక రంగానికి చెందిన పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను గుర్తించి, వారికి అవసరమైన అవగాహనతో పాటు పూర్తి స్థాయి ప్రోత్సాహం అందించాలనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు & ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహికులను పరిశ్రమల స్థాపన వైపు దారితీసేలా చైతన్యం కల్పించాలన్నారు.
కోనసీమ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ తనిఖీదారు రామలింగేశ్వర రావు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. 36 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.18,92,187 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎంకేటి నాగ వర ప్రసాద్ తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, సహాయకులు పాల్గొన్నారు.
TPT: మే 12న నిర్వహించనున్న జపాలి హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. తుడా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అర్చకులు వేదాశీర్వచనం అందించి ఆహ్వాన పత్రికను సమర్పించారు. జపాలి తీర్థం, పాపవినాశనం క్షేత్రాల్లో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా కోరారు.
TPT: నాగలాపురం సురుటపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో కూలింగ్ పెయింట్ వేయించారు. పార్కింగ్ స్థలం నుంచి గోపురం వరకు, అక్కడి నుంచి అన్నదానం భవనం వరకు వెళ్లే మార్గాల్లో భక్తులు కాళ్లు కాలుతున్న సమస్యను గుర్తించిన ఆలయ ఛైర్మన్ డి. పద్మనాభరాజు, ఈఓ పి. లత చర్యలు చేపట్టారు.
CTR: చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అందరూ దూరంగా ఉండాలని గంగవరం సీఐ రాంభూపాల్ సూచించారు. గంగవరం మండలంలోని మారేడుపల్లిలో పోలీసులు గ్రామ సభ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనుమానాస్పద సంఘటనలపై పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. వివిధ మోసాల నుంచి కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు.
AKP: ఈ ఏడాది పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎలమంచిలి మండలం జంపపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులను వారు అభినందించారు.
ATP: మత్స్యకారుల ఆదాయం పెంచి వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గుత్తి పట్టణ శివారులోని చెరువు వద్ద మత్స్య సహకార సంఘ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుత్తి మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో 36,100 చేప పిల్లలను ఉచితంగా చెరువుల్లో వదిలారు.
EG: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో కిశోరి వికాసం వేసవి సెలవుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంను మంగళవారం గౌరీపట్నం అంగన్వాడి సెంటర్ -1 లో నిర్వహించారు. కిశోరి బాల బాలికలకు, ఆత్మ విశ్వాసం, స్వీయరక్షణనైపుణ్యాలు, మంచిపనులు, సరైన నిర్ణయాలు, సామర్థ్యాలు అంశాలను అంగన్వాడి సూపర్ వైజర్ శశికళ వివరించారు. బాలల పరిరక్షణ విభాగఅధికారి కాంతిలాల్ పాల్గొన్నారు.
కృష్ణా: 10వ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను, నందివాడ మండలం వెన్ననపూడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవ్, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రాము మంగళవారం అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ, మంచి ఫలితాలు నమోదు చేస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలని సూచించారు.
KDP: రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ADA రామమోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి (MAO) రామాంజనేయ రెడ్డి సూచించారు. మంగళవారం సింహాద్రిపురం ప్రీ-మాన్సూన్ డ్రైసోయింగ్ విధానంలో సాగు చేసిన పొలాలను పరిశీలించి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.