నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఆగస్టు 21, 2026న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ మరోసారి వాయిదా పడనున్నట్లు టాక్. క్వాలిటీ కోసం మేకర్స్ ఈ మూవీని డిసెంబర్కు మార్చాలని చూస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, క్రిస్మస్ బరిలో ఉన్న ఇతర పెద్ద సినిమాలకు నాని గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ‘దసరా’ వంటి హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీపై తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నట్లు అనిల్ రావిపూడి స్వయంగా తెలిపాడు. అయితే వెంకటేష్ పక్కన ఎవరు నటించనున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.
సంతోష్ శోభన్, ‘స్వాతిముత్యం’ ఫేమ్ లక్ష్మణ్ కె కృష్ణ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘సత్తిబాబు పరలోకయాత్ర’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. UV క్రియేషన్స్, AR ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండనుందట. ఇప్పటికే కథ లాక్ అవ్వగా, త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కాగా.. ఐటెం సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాట షూటింగ్ను ఏప్రిల్ 9న స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు, ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు టాక్.
ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత, అంటే మే మధ్యలో ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు టాక్. ఇక ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో మహేష్, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఓ స్పెషల్ సాంగ్ను షూట్ చేయనున్నారట. ఆ పాటలో మహేష్ సరసన మరో బాలీవుడ్ నటి కనిపించనున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
‘గాయపడ్డ సింహం’ ప్రెస్ మీట్లో కమల్ హాసన్పై జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటులందరికీ కమల్ నటనే ఒక బెంచ్ మార్క్ అని, ఆయన చేసినన్ని పాత్రలు సినీ చరిత్రలోనే ఎవరూ చేసి ఉండరని తెలిపాడు. ఒక నటుడిగా ఆయనకు రాని అదృష్టం తనకు ఈ సినిమా రూపంలో దక్కిందన్నాడు. ఇందులో తనది అంత గొప్ప పాత్ర అని, ఇప్పటివరకు కమల్ కూడా చేయని పాత్ర ఇది అని పేర్కొన్నాడు.
‘డెకాయిట్’ ప్రమోషన్స్లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఆసక్తికర విషయాలు పంచుకుంది. అడివి శేష్ గత చిత్రాలకంటే ఇది భిన్నమైన థ్రిల్లర్ లవ్ స్టోరీ అని చెప్పింది. ముఖ్యంగా ఈ సినిమాకు ఎక్కువ మంది మహిళలు పనిచేశారని, ఇండస్ట్రీలో మహిళల సంఖ్య పెరిగితేనే అసమానతలు తొలగుతాయని తెలిపింది. తనకు సినీ నేపథ్యం ఉండడం అదృష్టంగా భావిస్తానని, అది తనకు భరోసానిచ్చిందని పేర్కొంది.
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ ఫాంటసీ హారర్-కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి వీకెండ్ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.80 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
శర్వానంద్, అభిలాష్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ. 18.09 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు వెల్లడిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్, రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.
కన్నడ నటుడు నిరంజన్పై బెంగళూరులో బీర్ బాటిళ్లతో దాడి జరిగింది. నటుడు యశస్ సూర్య ఇంటి నుంచి వస్తుండగా, ఇన్నోవాలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ‘నువ్వు యాక్టర్ అయిన సరే.. ఇది మా ప్రాంతం’ అంటూ గొడవకు దిగి తలపై కొట్టారు. ఈ దాడిలో నిరంజన్ గాయపడగా, తన చేతి గడియారం కూడా పోగొట్టుకున్నట్లు ఆయన ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
‘డెకాయిట్’ సినిమా ప్రమోషన్స్లో మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సరికొత్త కథలే నన్ను నటిగా ఆకర్షిస్తాయి. అందుకే డెకాయిట్ ఒప్పుకున్నాను. ఇందులో నేను సరస్వతిగా, అడవి శేష్ హరిగా కనిపిస్తాం. ఈ రోమియో జూలియట్లు డెకాయిట్స్గా ఎందుకు మారారో చెప్పే డ్రామా బాగుంటుంది. నన్ను నేనే ఆశ్చర్యపరచుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
‘ధురంధర్ 2 వస్తోన్న ప్రశంసలపై కమెడియన్ జాకీర్ ఖాన్ సెటైర్లు వేశాడు. ఈ మూవీ విజయంపై బాలీవుడ్ ప్రశంసలన్నీ అబద్ధమని, అందరికీ లోలోపల అసూయగా ఉందని తెలిపాడు. స్క్రీన్ అవార్డ్స్ 2026 వేదికగా ఆయన మాట్లాడుతూ.. బయటకు ఇన్స్టా స్టోరీలతో పొగుడుతున్నా, ఈ సక్సెస్ను పరిశ్రమ వర్గాలు ఓర్వలేకపోతున్నాయన్నాడు. ప్రస్తుతం ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్న విలేజ్ పీరియాడిక్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. మునిరాజు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 17న విడుదల కానున్న ఈ మూవీ సీడెడ్ హక్కులను SLN సినిమాస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ నటి కరిష్మా తన్న 42ఏళ్ల వయసులో తల్లి కాబోతుంది. భర్త వరుణ్ బంగేరాతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ ఈ శుభవార్త చెప్పింది. ఒక ఫొటోలో ‘MOM’, ‘DAD’ అని రాసి ఉన్న టోపీలు ధరించి ప్రత్యేకంగా కనిపించారు. ఈ వయసులో తొలి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రెగ్నెన్సీ పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.