బాలీవుడ్లో నటి సాయి పల్లవి ‘రామాయణ’, ‘ఏక్ దిన్’ మూవీలు చేస్తోంది. తాజాగా ‘ఏక్ దిన్’ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. 2026 మే 1న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. జనవరి 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాను ఆమిర్ ఖాన్ నిర్మిస్తుండగా.. ఆయన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహి...
‘పరాశక్తి’ మూవీపై వస్తోన్న ట్రోల్స్పై తమిళ హీరో శివకార్తికేయన్ స్పందించాడు. కొంతమంది అభిమానులు దీన్ని పెద్ద విషయంగా చూస్తున్నారని, తన దృష్టిలో ఇది అసలు సమస్యే కాదని అన్నాడు. విజయ్ దళపతి తనకు సోదరుడితో సమానమని, ఎప్పటికీ తాము ఇలానే ఉంటామని చెప్పాడు. ఇంతకుమించి ఈ అంశంపై మాట్లాడడానికి ఏం లేదని తెలిపాడు.
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన హిట్ సినిమా ‘సర్దార్’కు సీక్వెల్గా ‘సర్దార్ 2’ రాబోతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మేకర్స్.. విషెస్ చెప్పారు. అలాగే ఈ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 2026లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై రాబోతున్న ఈ చిత్రాన్ని P.S మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు.
తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ & టైటిల్ రివీల్కు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 16న ఉదయం 11 గంటలకు టైటిల్ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ మూవీలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒకరాజు’. జనవరి 14న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
తమిళ హీరో విజయ్ దళపతి ‘జన నాయగన్’ మూవీకి సుప్రీకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికేషన్ జారీ చేయడంపై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మేకర్స్ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు వెళ్లాల్సిందిగా సూచించింది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. జనవరి 12న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్ర పోషించాడు. అయితే మెగా విక్టరీ మాస్ సాంగ్కు చిరు, వెంకీ కలిసి అదిరిపోయే డ్యాన్స్తో అలరించారు. తాజాగా ఆ పాటకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ SMలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.152కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు సినిమాల జాతర నెలకొంది. రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. మీరు ఏ సినిమా చూశారు. ఈ సంక్రాంతికి గెలి...
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి మంచి హిట్ అందుకున్నారు. తర్వాత చిరు తన ఫోకస్ మొత్తాన్ని ‘విశ్వంభర’ మూవీపై పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బాబీతో చిరు చేయాల్సిన ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా మరింత ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ‘విశ్వంభర’ 2026 జూన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చరణ్తో కలిసి దిగిన డివోషనల్ ఫొటోను బుచ్చిబాబు SMలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పిక్లో చరణ్ డైనమిక్ లుక్లో కనిపిస్తున్నాడు. ఇక జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతుంది.
సినీ ప్రియులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గుడ్ న్యూస్ చెప్పాడు. బెంగళూరులో కొత్తగా నిర్మించిన ‘AMB సినిమాస్’ ద్వారా డాల్బీ అనుభూతిని పంచనున్నట్లు తెలిపాడు. జనవరి 16న ఇది ప్రారంభం కానున్నట్లు పోస్ట్ పెట్టాడు. దీంతో ఆయనకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు HYDలోని ‘అల్లు సినిమాస్’లోనూ డాల్బీ సినిమా స్క్రీన్ త్వరలో ప్రారంభం కానుంది.
శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఇవాళ సాయంత్రం విడుదలై సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఇద్దరు భామల మధ్య హీరో పడే పాట్లు, తండ్రిగా నరేష్, వెన్నెల కిశోర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. దర్శకుడు రామ్ అబ్బరాజు తన మార్క్ స్క్రీన్ప్లేతో మెప్పించాడు. కొన్ని పాత సినిమా సీన్లు, క్లైమాక్స్ కాస్త మైనస్.రేటింగ్: 3.25/5
నటి రేణు దేశాయ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన ఇన్స్టా స్టోరీలో ఒక ఫోటో షేర్ చేస్తూ ‘టౌన్లో యమ్మీ వెజ్ ఫుడ్ ఆస్వాదిస్తున్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. ఆ స్టోరీలో రేణు దేశాయ్ ముద్దుగా రెడీ అయిన లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు వావ్ యమ్మీ ఫుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నటీనటులు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, డైరెక్టర్ మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025 DECలో రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.