మానవాళికి కోవిడ్19 చేసిన గాయాలు ఇంకా మాన లేదు. మరో డిసీజ్ దండయాత్ర చేయడానికి సిద్దం అయిందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహామ్మారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది.
హిర్షాబెల్లె ప్రావిన్స్కు విపత్తు నిర్వహణ డైరెక్టర్ జనరల్ అబ్దిఫతా మహమ్మద్ యూసుఫ్ 15 మంది మరణించినట్లు ధృవీకరించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు.
పాకిస్థాన్లో ఓ కూతురు తన తండ్రిని కాల్చి చంపింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మూడు నెలలుగా తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడని కూతురు ఆరోపించింది. తట్టుకోలేక కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 58 ఏళ్ల వ్యక్తికి అమెరికా వైద్యులు పంది గుండెను అమర్చారు. ఈ ఘటనపై వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఇదొక అద్భుత ఘట్టమని అభివర్ణిస్తున్నారు.
భారత్(bharat), కెనడా(canada) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడికి చదవు సహా ఉద్యోగాల కోసం వెళ్లిన భారత విద్యార్థుల పరిస్థితి గురించి..వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ పిల్లలు సరిగ్గా చదువుకోలేక పోతున్నారని, ఈ వివాద సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.
డాటర్స్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాల్గవ ఆదివారం జరుపుకుంటాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డాటర్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే భారత్లో దేవతలను పూజించినా..పలు చోట్ల ఇప్పటికే ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూతుళ్లు కొడుకుల కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు.
చైనాలో నిన్న ప్రారంభమైన ఆసియా గేమ్స్ 2023(Asian Games 2023)లో భారత్(bharat) మొదటి రోజు భోణి కొట్టింది. రెండు బ్యాక్ టు బ్యాక్ సిల్వర్ మెడల్స్ గెల్చుకుని పతకాల పట్టికలో ఖాతాను తెరిచింది. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ బెర్త్ కోసం కసరత్తు చేస్తోంది.
హర్దీప్ సింగ్ నిజ్జర్కు భారత్ అంతే గిట్టదు. ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడమే అతని పని. కెనడాలో ట్రక్ డ్రైవర్, ప్లంబర్గా పనిచేస్తూనే.. భారత్కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నిధులను సమకూర్చుకొని, కొందరికీ శిక్షణ కూడా ఇచ్చాడు.
కెనడా, భారత్ దేశాల మధ్య గత కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా మద్దతు తెలపాల్సి వస్తే ఎవరికీ తెలుపుతుంది? రెండు మిత్ర దేశాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని అక్కడి అధికారి వెల్లడించారు.
భారత్, కెనడాల మధ్య విమాన ప్రయాణాలు పెరిగాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి.
అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి.. భారత్-అమెరికా సంబంధాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైనా ఆగడాలను కట్టడి చేయాలంటే ఇండియాతో వ్యాపార సంబంధాలు బలపరుచుకోవాలని పేర్కొన్నారు.
హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై భారతదేశం, కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. పంజాబ్ నుంచి ఒట్టావాకు పారిపోయిన పంజాబ్ వాసిని బుధవారం దుండగులు కాల్చి చంపారు.