TG: రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు ఈ నెల 4, 5 తేదీల్లో మొత్తం 3 సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 93.38 శాతం హాజరయ్యారు.
TG: ప్రముఖ హైదరాబాద్ బిలియనీర్ మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి అమెరికాలోని మెట్ గాలాలో తళుక్కుమన్నారు. సౌత్ ఇండియా వారసత్వాన్ని క్యారీ చేస్తూ ఇవాళ మెట్ గాలా రెడ్ కార్పెట్పై నడిచి ఆశ్చర్యపరించారు. ట్రీ ఆఫ్ లైఫ్ అనే థీమ్తో కూడి డ్రెస్సింగ్తో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనలో ఆమె ధరించిన నెక్లెస్ ధర అక్షరాల రూ. 140 కోట్లు.
నిన్న ట్రేడింగ్లో అదానీ పోర్ట్స్(5.30%), రిలయన్స్(2.24%) షేర్లు అదరగొట్టాయి. రియల్ ఎస్టేట్, హెల్త్కేర్ రంగాలు రాణించగా, భారతీ ఎయిర్టెల్, TCS వంటి ఐటీ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. దేశీయ సంస్థాగత మదుపర్లు(DII) సుమారు రూ.4,764 కోట్ల విలువైన కొనుగోళ్లు చేసి మార్కెట్కు అండగా నిలిచారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు మొగ్గు చూపినా, దేశీయ కొనుగోళ్లతో సూచీలు నిలబడ్డాయి.
ఎన్నికల ఫలితాల జోష్లో స్టాక్ మార్కెట్లు లాభపడినా, రూపాయి పతనం ఆందోళన కలిగిస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 39 పైసలు తగ్గి, అత్యంత కనిష్ఠమైన రూ.95.23 వద్దకు చేరింది. అటు అంతర్జాతీయంగా ముడి చమురు ధర 5% పెరిగి 114 డాలర్లకు చేరడం కూడా సూచీలపై ప్రభావం చూపింది. ఈ రెండు ప్రతికూల అంశాల వల్ల మార్కెట్ సాధించాల్సిన భారీ లాభాలు కొంతమేర పరిమితమయ్యాయి.
NLR: పాలిసెట్ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో దాదాపుగా 4888 మంది విద్యార్థులు పరీక్ష రాయగా… 4531 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. పాస్ పర్సంటేజ్ 92.07గా ఉంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు డిప్లమో కోర్సు కోసం ఈ పరీక్షను రాస్తారు.
దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని ఎన్డీయే గెలుచుకోవడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. మదుపర్ల నమ్మకం పెరగడంతో సెన్సెక్స్ 355 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో BSE మార్కెట్ విలువ ఏకంగా రూ.3.95 లక్షల కోట్లు పెరిగింది. బ్లూచిప్ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
భారత తయారీ రంగ వృద్ధికి పశ్చిమాసియా యుద్ధం, పోటీ పరిస్థితులు అవరోధంగా మారుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ఉద్రిక్తతల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి తయారీ రంగంపై ప్రభావం చూపుతోందని HSBC ఆర్థికవేత్త ప్రంజుల్ భండారి తెలిపారు. క్లయింట్లు కొటేషన్లను ఆమోదించడానికి విముఖత చూపడం కూడా వృద్ధి వేగాన్ని తగ్గించిందని, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు నెలకొన్నాయని తాజా సర్వే వెల్లడించింది.
భారత తయారీ రంగ వృద్ధి ఏప్రిల్లో స్వల్పంగా పెరిగింది. కొత్త ఆర్డర్ల రాక ఇందుకు ప్రధాన కారణమని HSBC ఇండియా వెల్లడించింది. పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(PMI) సూచీ మార్చిలో 53.9 పాయింట్ల వద్ద ఉండగా, ఏప్రిల్లో 54.7 పాయింట్లకు చేరుకుంది. గిరాకీలో స్థిరత్వం, ప్రకటనల వల్ల ఉత్పత్తి పెరిగినప్పటికీ.. గత నాలుగేళ్లలో ఇది రెండో కనిష్ఠ పెరుగుదలగా నమోదైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 293 పాయింట్ల నష్టంతో 76,976 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్లు నష్టంతో 24,024 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.34 వద్ద ప్రారంభమైంది.
AP: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల నియామక ప్రకటన విడుదలకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈనెల 15న 1,500 పోస్టులకు ప్రకటన విడుదల కానుంది. విశ్వవిద్యాలయాలకు మంజూరు చేసిన పోస్టుల్లో బ్యాక్లాగ్లు మినహాయించి మిగతా వాటిల్లో 43 శాతం ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటికి రిజర్వేషన్ రోస్టర్ను ఖరారు చేసే ప్రక్రియను విశ్వవిద్యాలయాలు చేపట్టాయి.
AP: రాష్ట్రంలో పాలిటెక్నిక్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలు విడుదల చేయనున్నారు. పాలిసెట్కు మొత్తం 1,77,581 మంది దరఖాస్తు చేయగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ఫలితాలను polycetap.ap.gov.in, మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లాభపడి 77269.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121.75 పాయింట్ల లాభంతో 24119.30 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.18గా ఉంది.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే వైఫల్యం సన్టీవీ నెట్వర్క్పై తీవ్ర ప్రభావం చూపింది. విజయ్ TVK ప్రభంజనంతో DMK మూడో స్థానానికి పడిపోవడంతో, సన్టీవీ షేర్లు ఒక దశలో 9.5 శాతం మేర పతనమయ్యాయి. DMK అధినేత స్టాలిన్కు సన్టీవీ యజమాని కళానిధి మారన్ దగ్గరి బంధువు కావడమే ఈ పతనానికి ప్రధాన కారణం. రాజకీయ మార్పుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.
ఆంథ్రోపిక్ ‘క్లాడ్ మిథోస్’ ఏఐ వల్ల బ్యాంకింగ్ డేటాకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో బ్యాంకులు ఐటీ వ్యయాన్ని పెంచుతున్నాయి. సాఫ్ట్వేర్ లోపాలను 72 గంటల్లోపే అటాక్ చేసే ఈ ఏఐని ఎదుర్కోవాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు. దీనిపై అధ్యయనం కోసం ఎస్బీఐ చైర్మన్ సి.ఎస్. శెట్టి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
బాపట్ల: సంతమాగులూరు మండలం ఏల్చూరులోని చారిత్రాత్మక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (1942) శిథిలావస్థకు చేరడంతో, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 84 ఏళ్ల పాత భవనాల కూల్చివేత పూర్తయి, అత్యాధునిక వసతులతో కొత్త పాఠశాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.