సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా మిగిలిన సరిహద్దు దేశాల FDIల విషయంలో ఉన్న నిబంధనలను సులభతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న ‘ముందస్తు అనుమతి’ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. తాజాగా దీన్ని తొలగించారు.
మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన పేరుతో ఖాతాదారుల నుంచి గత మూడేళ్లలో ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు వసూలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. HDFC బ్యాంక్ అత్యధికంగా రూ.3800 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.2,700 కోట్లు, ICICI బ్యాంక్ రూ.1200 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.
ATP: తాడిపత్రి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మంగళవారం తెలిపారు. 6వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరేందుకు విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు.
ATP: తాడిపత్రి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ పద్మావతి మంగళవారం తెలిపారు. 6వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరేందుకు విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 639.82 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 233.55 పాయింట్ల లాభంతో 24,261.60 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు రాణించడంతో మార్కెట్లు పరుగులు తీశాయి. గత కొన్ని రోజులుగా ఒడిదొడుకుల మధ్య సాగుతున్న మార్కెట్లలో ఈ లాభాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి.
వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడుతాయని పేర్కొంది. ఢిల్లీ, బెంగళూరులో ఇప్పటికే కొన్ని హోటళ్లలో వంటగ్యాస్ అందుబాటులో లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కోల్కతా వెళ్లాల్సిన స్పైస్జెట్ ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 7:25 గంటలకు బయలుదేరాల్సిన విమానం రీషెడ్యూల్ చేసినట్లు స్పైస్జెట్ సిబ్బంది ప్రయాణికులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,62,380కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 పెరిగి రూ.1,48,850 పలుకుతోంది. అటు కిలో వెండి ధర ఒక్కరోజే రూ.10,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
TG: రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో విద్యాశాఖ జీవో 30 జారీ చేసింది. ఒక్కో కాలేజీకి 1 నుంచి 5 కోర్సులకు అనుమతి దక్కింది. ఒక్కో కోర్సులో కనిష్ఠంగా 15 నుంచి గరిష్ఠంగా 60 సీట్లున్నాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.
TG: రాష్ట్రంలోని ఇంజినీరింగ్తో పాటు ఫార్మసీ, లా, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. అనేక కళాశాలలకు ఫీజు పెంచకపోవడంతో పాటు కొన్ని కళాశాలలకు ఇప్పటివరకు ఉన్న ఫీజునే తగ్గించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈసారి ట్యూషన్ ఫీజు తప్ప.. ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదని GO జారీ చేసింది.
పీఎం జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన 75 కోట్ల పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ నిబంధన లేదని కేంద్రమంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. కనీస బ్యాలెన్స్ లేకపోయిన వీటికి ఎలాంటి జరిమాన పడదన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే సున్నా-నిల్వ ఖాతా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే డిపాజిట్, నగదు ఉపసంహరణ, ఏటీఎం సేవలకు కూడా ఛార్జీలు ఉండవని తెలిపారు.
బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను RBI విడుదల చేసింది. ముందస్తు GST చెల్లింపుల నేపథ్యంలో బ్యాంకుల్లో భారీగా నగదు చలామణి అవుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు మార్కెట్ ఆపరేషన్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి బ్యాకింగ్ వ్యవస్థలోకి RBI రూ.50 వేల కోట్లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవస్థలో రూ.2.41-3.02 లక్షల కోట్ల వరకు మిగులు ఉన్నట్లు అంచనా.
ద్విచక్ర వాహనాన్ని కొనాలనుకునే వారికి ఓలా ఎలక్ట్రిక్ శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకున్న నేపథ్యంలో కంపెనీ ‘ఛాంపియన్ మహోత్సవ్’ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఓలాకు చెందిన అన్ని వాహనాలపై రూ.10 వేల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. 3 రోజుల పాటు ఈ ఆఫర్ అమలులో ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్ను అందిపుచ్చుకోవాలని వినియోగదారులకు సూచించింది.
వేసవిలో ఎండలతో పాటు ఏసీల ధరలు కూడా మండనున్నాయి. ఏసీ తయారీలో రాగి వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి తగ్గే కొద్దీ కంపెనీలకు భారం పెరుగుతోంది. దీంతో ఏసీల ధరలు 5-15% పెరిగే అవకాశం ఉంది. వోల్టాస్, బ్లూస్టార్, LG, హయర్, దైకిన్ వంటి కంపెనీలు తమ అన్ని మోడళ్ల ఏసీల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
భారీ నష్టాల వేళ ఐటీ స్టాక్స్ రాణించాయి. విప్రో, LTM, HCL టెక్నాలజీస్, కోఫోర్జ్ స్టాక్స్ లాభపడ్డాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం కావడం ఈ స్టాక్స్కు కలిసొచ్చింది. ఆయా కంపెనీలకు ఆదాయం డాలర్లలో ఉండడం, ఖర్చులు రూపాయల్లో ఉండడం ఇందుకు కారణం. అలాగే, గత నెల ఐటీ స్టాక్స్ భారీగా పతనమైన నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు కనిపించింది.