బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని బీజేపీకి, కాంగ్రెస్, తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. అందుకే ఎన్నికల సమయంలో బెంగాల్ నుంచి పెద్ద సంఖ్యలో 500 మంది IAS, IPS అధికారులను తమిళనాడుకు పోలింగ్ అబ్జర్వర్లుగా పంపించారని మండిపడ్డారు. తద్వారా బెంగాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు.
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తన ఫ్రీడమ్ ప్లాన్ను మరోసారి అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ సేవలను పొందవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు సమీపంలోని BSNL సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్ను సంప్రదించాల్సి ఉంటుంది.
TG: సికింద్రాబాద్ పికెట్లోని కేంద్రీయ విద్యాలయం(KVS)లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 4వ తరగతికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తి గల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలకు వెళ్లి దరఖాస్తు ఫారమ్లను సమర్పించాలి. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.
చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా పెట్టిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ జూన్ కాంట్రాక్ట్ 110.58 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ మే కాంట్రాక్ట్ 111.90 డాలర్లకు ఎగబాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 93.52 పాయింట్లు నష్టపోయి 73226.03 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6.70 పాయింట్ల నష్టంతో 22706.40 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.06గా ఉంది.
AP: ఇవాళ పదో తరగతి పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు ఆయా జిల్లాల్లోని స్పాట్ కేంద్రాల్లో ఉ.9-సా.6 గంటల మధ్య ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు దాదాపు 20 వేల మందిని నియమించారు. కాగా మార్చి 16-ఏప్రిల్ 2 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 3415 సెంటర్లలో పరీక్షలు జరగ్గా.. 622152 మంది రెగ్యులర్ విద్యార్థులు, 19568 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరయ్యారు.
AP నెల్లూరులోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(GGH)లో 14 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డాక్టర్, నర్స్, వార్డ్ బాయ్, కౌన్సిలర్ తదితర పోస్టులు ఉండగా.. అర్హత, అనుభవం గల వారు ఈ నెల 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలతో అప్లికేషన్ ఫామ్ను హాస్పిటల్లోని సూపరింటెండెంట్ కార్యాలయానికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ NTA హిస్టరీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, కామర్స్ & హిందీ సబ్జెక్టులకు సవరించిన కీలను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన ఫలితాలపై విద్యార్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు & కోర్టులో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హిస్టరీ సబ్జెక్టులో 4 ప్రశ్నలను, కామర్స్ పరీక్షలో 3 ప్రశ్నలను NTA తొలగించింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశంలో 5 కిలోల చిన్న LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. MAR 23 నుంచి ఇప్పటివరకు 6.6 లక్షల సిలిండర్లు అమ్ముడైనట్లు కేంద్రం తెలిపింది. సరైనా గుర్తింపు పత్రాలు చూపించి సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద వీటిని తీసుకోవచ్చని సూచించింది. మరోవైపు MAR నుంచి నేటి వరకు 50వేలకు పైగా బ్లాక్ చేసిన సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది.
బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు నోట్ రావడం కలకలం రేపింది. కొద్దిసేపట్లో విమానం టేకాఫ్ అవ్వబోతున్న సమయంలో విమానంలోని వాష్ రూమ్లో ఒక టిష్యూపై ఉన్న బాంబు బెదిరింపు నోటును సిబ్బంది చూశారు. వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రయాణికులను కిందకు దింపి విమానమంతా తనిఖీలు చేసిన అధికారులు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు.
TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్-2026కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం వరకు మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు JNTUH కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్ కోసం 2,03,167 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 86,523 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రెండో రోజు జరిగిన జేఈఈ మెయిన్ షిఫ్ట్-1 పరీక్షలో గణితం, ఫిజిక్స్ నుంచి అడిగిన ప్రశ్నలు సులువుగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కెమిస్ట్రీలో థర్మో కెమిస్ట్రీ తదితర విభాగాల నుంచి అడిగిన ప్రశ్నలు కాస్త సమయం తీసుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. షిఫ్ట్-2లో కెమిస్ట్రీలో.. ప్రధానంగా ఇనార్గానిక్ విభాగాల్లో ప్రశ్నలు జ్ఞాపకశక్తి ఆధారితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2026 పరీక్షల అడ్మిట్ కార్డులను UPSC విడుదల చేసింది. ఈ మేరకు హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP: రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఫలితాలను ఈ నెలలోనే విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ఈనెల 9తో పూర్తవుతుంది. మార్కులను ఆన్లైన్లో ఉంచి ఈనెల 15 తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. ఇక టెన్త్ పరీక్షల మూల్యాంకనం ఈనెల 15 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత రిజల్ట్స్ను ప్రాసెస్ చేసి ఈనెల 25 తర్వాత విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
కేరళం కొచ్చిలోని ICARకు చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) లేదా ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు పీజీడీసీఏ కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు https://cmfri.org.in/career ను సంప్రదించాలి.