రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రికార్డులు సృష్టిస్తోంది. మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కానుండటంతో, ప్రేక్షకులు మొదటి భాగాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ సినిమా భారత్లో టాప్-3 స్థానానికి చేరడమే కాకుండా 2.2 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.
ఒకప్పుడు నిర్మాతలు పంపిణీకి దూరంగా ఉండేవారు.. కానీ సితార నాగవంశీ ప్రస్తుతం అటు నిర్మాతగా, ఇటు డిస్ట్రిబ్యూటర్గా రాణిస్తున్నాడు. నాగచైతన్య ‘వృషకర్మ’ చిత్ర ఏపీ, TG, కర్ణాటక హక్కులను నాగవంశీ ఏకంగా రూ.45 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. గతంలో ‘వార్ 2’తో నష్టాలు చూసిన ఆయన.. ఇప్పుడు ఈ సినిమాపై ఇంత పెద్ద మొత్తంలో రిస్క్ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో అకెళ్ళ వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వదలా’. తాజాగా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో జగపతి మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నాడు. ప్రేక్షకుల వద్దకు ఈ చిత్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని పేర్కొన్నాడు. అలాగే, కచ్చితంగా హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నిర్మాత కిషోర్ కృతజ్ఞతలు తెలిపాడు.
‘నా దారిలో నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి, మీ చెడు ఆలోచనలను నాపై రుద్దకండి’ అంటూ నటుడు రవి మోహన్ SM వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. సింగర్ కెనీషాతో డేటింగ్లో ఉన్నారనే ప్రచారంపై స్పందిస్తూ.. తన వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని కోరాడు. అయితే, భార్యకు అన్యాయం చేస్తున్నారంటూ నెటిజన్ల నుండి వస్తున్న విమర్శలు కోలీవుడ్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీశాయి.
‘ధురంధర్ 2’తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోటీపై దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా విడుదల తేదీ తన ఒక్కడి చేతుల్లో ఉండదని, అది టీమ్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయమని తెలిపాడు. ఉగాది సమయంలో రెండు, మూడు సినిమాలు విడుదలయ్యేంత ఖాళీ బాక్సాఫీస్ వద్ద ఉందని, అందుకే క్లాష్ గురించి ఆందోళన లేదని స్పష్టం చేశాడు.
హీరో శివ కార్తికేయన్ తన భార్య ఆర్తిపై ప్రశంసలు కురిపించాడు. తాను నిర్మించిన కొత్త సినిమా ‘తాయి కిళవి’ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ‘నా ఆర్థిక లావాదేవీలన్నీ ఆర్తినే చూసుకుంటుంది. చివరికి సినిమా టికెట్టు కొనాలన్నా ఆమెనే డబ్బులు అడుగుతాను’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆమె క్రమశిక్షణ పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని, తన విజయాల్లో ఆమె పాత్ర కీలకమని పేర్కొన్నాడు.
భారీ గ్రాఫిక్స్ సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పాత్రపై ఛోటా కె. నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ్రాఫిక్స్ సినిమాలకు VFX టీమ్ సూచనలే వేదమని.. తమ అనుభవాన్ని, అహంకారాన్ని పక్కపెట్టి వాళ్లు అడిగినట్లే బెస్ట్ అవుట్పుట్ ఇస్తామన్నాడు. రూ.400 కోట్ల బడ్జెట్ మూవీ ‘విశ్వంభర’కు అహంకారం చూపించకుండా సాంకేతిక బృందంతో సమన్వయం చేసుకుంటూ ఉత్తమ క్వాలిటీ కోసం కష్టపడుతున్నట్లు చెప్పాడు.
కుంభమేళాలో పూసలమ్ముతూ వైరలైన మోనాలిసా, ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే, తాజాగా ఆమె కేరళలోని తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన కేరళ యువకుడితో ఆమె గత ఏడాదిన్నరగా ప్రేమలో ఉంది. వీరి ప్రేమను మోనాలిసా తల్లిదండ్రులు నిరాకరించడంతో.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేసింది.
టాలీవుడ్లో కులం ప్రభావంపై సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. పరిశ్రమలో కుల పిచ్చి ఉందనే విమర్శలను ఖండించాడు. తన వ్యక్తిగత జీవితాన్నే ఉదాహరణగా చెబుతూ.. ‘నా భార్య చౌదరి, నా అల్లుడు రెడ్డి, నేను కాపు. ఇక్కడ మూవీకి కులం లేదు. సినీ రంగం అనేది భిన్న కులాలు, మతాల కలయిక. ఇక్కడ కేవలం ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది’ అని ఆయన తెలిపాడు.
జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘వదలా’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా నిర్మించాలంటే భయం వేసిందని, దర్శకుడికి కథపై ఉన్న నమ్మకమే తనను ముందుకు నడిపించిందని తెలిపాడు. ఇండస్ట్రీలో తన మనుగడ కష్టమనుకున్న సమయంలో ఈ సినిమా తీశామని, జగపతి బాబు లేకుండా ఈ చిత్రాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నాడు.
తమిళ స్టార్ ధనుష్కి జోడీగా రుక్మిణి వసంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. తమిళరసన్ పచ్చ ముత్తు దర్శకత్వంలో ధనుష్ హీరోగా చేయనున్నాడట. ఇందులో కథానాయికగా రుక్మిణిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ధనుష్ సొంత బ్యానర్ వండర్బార్ స్టూడియోస్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నట్లు టాక్.
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు హేమంత్ రావు తెరకెక్కిస్తున్న మూవీ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. ఈ సినిమాలో ‘అరువి’ ఫేమ్ నటి అదితి బాలన్ భాగమైనట్లు మేకర్స్ వెల్లడించారు. ఇందులో ఆమె ‘కావేరి’ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో డాలీ ధనుంజయ, ప్రియాంక మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నటి హన్సిక మోత్వానీ తన వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. భర్త సోహైల్ కతూరియాతో ఆమె విడాకులు తీసుకున్నట్లు ముంబై కోర్టు అధికారికంగా మంజూరు చేసింది. 2022లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా, కేవలం నాలుగేళ్లలోనే విడిపోయారు. సోహైల్ హన్సికకు చిన్ననాటి స్నేహితుడు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
రెబల్ స్టార్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లు టాక్. దర్శకుడు సుజీత్ ‘సాహో’, ‘OG’ మూవీలను కలిపి సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తుండటంతో ఈ మల్టీస్టారర్ వార్తలు ఊపందుకున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మించే అవకాశం ఉంది. మరి సుజీత్ దర్శకత్వంలోనే ఈ పవర్-రెబల్ కాంబో సెట్ అవుతుందో లేక సరికొత్త దర్శకుడు వస్తాడో చూడాలి.
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సినీ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పెద్ద దిక్కులు, పదవులు ఉండవని పేర్కొన్నారు. ఎవరికి వాళ్లు చేసే పనులను బట్టి పెద్ద దిక్కవుతారని స్పష్టం చేశారు. ఇది వరకు ఒకరు చేశారని, ఆయన చేసిన పనుల వల్లే పెద్ద దిక్కయ్యారని గుర్తు చేశారు. ఈ రోజు ఆయన లేరు కాబట్టి పెద్ద దిక్కు లేనట్లేనని అన్నారు. ఇకపై ఇంకొకరు రారు అంటూ తెల్చి చెప్పారు.