ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ.. భారత్లో కొత్త ఫెరారీ 849 టెస్టరోస్సాను ఆవిష్కరించింది. దీని ధర రూ.10.37 కోట్లు(ఎక్స్షోరూమ్). ఇది గ్లోబల్ లైనప్లో ఫెరారీ SF90 స్ట్రాడేల్ స్థానంలో ఉంటుంది. 2.3 సెకన్ల కాలంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 330 కిలోమీటర్లు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం ద్వారా 25 కిమీ పరిధి లభిస్తుంది.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా కొనుగోలుదారులకు గుడ్న్యూస్ చెప్పింది. ఓలా S1 మోడల్ లేదా రోడ్స్టర్ స్కూటీని కొనుగోలు చేసిన వారికి రూ.20 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ సోమవారంతో ముగియనుంది. ఈ ఆఫర్లలో భాగంగా రూ.10 వేల నగదు డిస్కౌంట్తో పాటు రూ.15 వేలు విలువైన ఎనిమిదేండ్ల బ్యాటరీ వారంటీ ఉచితంగా అందిస్తుంది.
గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు జెమిని ఏఐతో కలిసి మీకు ఒక స్నేహితుడిలా మారనుంది. ఇకపై మీరు మ్యాప్స్తో నేరుగా మాట్లాడవచ్చు. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు ఇది ఖచ్చితమైన సమాధానమిస్తుంది. అలాగే ‘ఇమ్మర్సివ్ నావిగేషన్’ ద్వారా వెళ్లే దారిని 3D రూపంలో, భవనాలు, ఫ్లై ఓవర్లతో సహా కళ్లకు కట్టినట్లు చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ప్రముఖ బైక్ తయారీ సంస్థ డ్యుకాటి తన ‘మోన్స్టర్’ మోడల్లో ఐకానిక్ S4 నుంచి స్ఫూర్తి పొందిన కొత్త ‘స్పోర్ట్ లివరీ’ని పరిచయం చేసింది. గ్రే బేస్, రేసింగ్ రెడ్ హైలైట్స్తో ఈ బైక్ అదిరిపోయే లుక్లో కనిపిస్తోంది. ఇందులో 111 hp పవర్, 91.1 Nm టార్క్ని ఇచ్చే శక్తివంతమైన V2 ఇంజిన్ ఉంది. స్పోర్టివ్ డిజైన్ను ఇష్టపడే రైడర్లకు ఇది బెస్ట్ ఛాయిస్.
మారుతి సుజుకి డిజైర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2008లో లాంచ్ అయిన ఈ సెడాన్, ఇప్పటివరకు 30 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటింది. 2025లో 2.14 లక్షల కార్లు అమ్ముడై దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 4వ తరం మోడల్లో సన్రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉండటం దీనికి కలిసి వచ్చింది. లీటరుకు 24.79 కిమీ మైలేజీ ఇవ్వడం దీని ప్రత్యేకత.
సుజుకి మోటార్సైకిల్ ఇండియా బర్గ్మన్ స్ట్రీట్ EXను రూ.1.08 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. పాత ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త మోడల్లో ‘పర్ల్ గ్రేస్ వైట్’ అనే సరికొత్త రంగును ప్రవేశపెట్టారు. 124cc ఇంజిన్తో వచ్చే ఈ మ్యాక్సీ స్కూటర్లో 8.58 bhp పవర్, 10 Nm టార్క్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ప్రీమియం ఫీచర్ ఉంది.
భారతీయ సంస్థ KNK కార్ట్స్ మినీ బైక్(పిట్ బుల్ 1.0)ను లాంచ్ చేసింది. రూ.50,000 ధర కలిగిన ఈ బైక్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి. ఇందులో 80cc ఆటోమేటిక్ ఇంజిన్ ఉండగా, బరువు కేవలం 40 కిలోలే. ఇది రోడ్లపై నడపడానికి వీలులేదు. కేవలం ఫామ్ హౌస్లు, ఆఫ్రోడ్ ట్రాక్లకే పరిమితం. డిస్క్ బ్రేక్స్, ఆఫ్రోడ్ టైర్లతో వచ్చే ఈ బైక్ డెలివరీలు జూన్ నుంచి మొదలవుతాయి.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి తన కార్ల ధరలను 2% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, ఇన్పుట్ ఖర్చులు పెరగడమే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపుతో మోడల్ను బట్టి ధర రూ.89,000 నుంచి రూ. 7.33L వరకు పెరగనుంది. లగ్జరీ కార్ల ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్.
కియా సోనెట్ తన లైనప్లో చౌకైన ఆటోమేటిక్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. డీజిల్-ఆటోమేటిక్ ధర రూ.9.77L నుంచి, టర్బో-పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.9.89L నుంచి ప్రారంభమవుతుంది. దీంతో డీజిల్-ఆటోమేటిక్ విభాగంలో దేశంలోనే అత్యంత చౌకైన కాంపాక్ట్ SUVగా సోనెట్ నిలిచింది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ.2.25L వరకు భారం తగ్గింది. కొత్తగా ‘మాగ్మా రెడ్’ కలర్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
రివోల్ట్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్లపై ఈనెల 31 వరకు రూ.25,000 వరకు ప్రయోజనాలను ప్రకటించింది. ఇందులో ఉచిత ఇన్సూరెన్స్, రూ.4,999 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీ, రూ.8,000 వరకు నగదు తగ్గింపులు ఉన్నాయి. అదనంగా PM E-Drive స్కీమ్ కింద రూ.5,000 రాయితీ లభిస్తుంది. RV400, RV1 వంటి మోడల్స్పై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. భారత్లోని అన్ని రకాల మోడళ్లపై 2% వరకు పెంచుతామని వెల్లడించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆడి ఇండియా బ్రాండ్ డెరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ప్రకటనలో తెలిపారు. Q3 SUV నుంచి SUV RS Q8 వరకు రూ.43.23 లక్షల నుంచి రూ.2.34 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తోంది.
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారత్లో లభించే అన్ని మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెరిగిన ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చుల భారం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
ఎలాన్ మాస్క్ తన AI చాట్బాట్ ‘Grok’ సేవల్లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇకపై గ్రోక్ సేవలను ప్రీమియం, ప్రీమియం+ సబ్స్క్రైబర్లుకు మాత్రమే. సాధారణ యూజర్లకు ‘Ask Grok is currently available to premium and premium+ subscribers only’ అనే మెసేజ్ కనిపిస్తోంది. ప్లాట్ఫామ్ ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగానే ఈ నియంత్రణ విధించినట్లు తెలుస్తోంది.
KTM తన బైక్లపై 4 ఏళ్ల స్టాండర్డ్ వారంటీని ప్రకటించింది. 2025 మోడళ్ల నుంచి వర్తించే ఈ ప్రోగ్రామ్లో బజాజ్ తయారు చేసే 400cc లోపు బైక్లు కూడా ఉన్నాయి. డర్ట్, ట్రాక్ బైకులకు ఇది వర్తించదు. బైక్ అమ్మినా వారంటీ కొత్త యజమానికి బదిలీ అవుతుంది. గతంలో ఉన్న 2 ఏళ్ల వారంటీని ఇప్పుడు రెట్టింపు చేస్తూ వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఏథర్ ఎనర్జీ తన రిజ్టా S, 450S మోడళ్లపై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ నెల 31 వరకు రిజ్టా S ధర రూ.1.05 లక్షలు, 450S ధర రూ.1.13 లక్షలుగా ఉండనుంది. PM ఈ-డ్రైవ్ పథకం ముగియనుండటంతో ఈ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా రూ.6,500 నగదు తగ్గింపు, రూ.10,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ.3,500 వారంటీ ప్రయోజనాలు పొందవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.