వైఫై స్లోగా ఉంటే ఇబ్బంది పడకుండా ఈ చిన్న మార్పులు చేయండి. రౌటర్ను ఇంటి మధ్యలో, ఎత్తులో ఉంచడం వల్ల సిగ్నల్ బాగా అందుతుంది. అలాగే సెట్టింగ్స్లో 5GHz బ్యాండ్ను ఎంచుకోండి. మైక్రోవేవ్ ఓవెన్ వంటి పరికరాలకు రౌటర్ దూరంగా ఉండేలా చూడండి. ఈ చిట్కాలతో ఇంటర్నెట్ వేగం పెరిగి బఫరింగ్ సమస్యలు తగ్గుతాయి.
మారుతి సుజుకి తన అరీనా కార్లపై ఈ నెలాఖరు వరకు భారీ ఆఫర్లను ప్రకటించింది. స్విఫ్ట్ మోడల్పై గరిష్టంగా రూ.50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, బ్రెజ్జాపై రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. వ్యాగన్ఆర్, ఆల్టో K10, సెలెరియో, ఈకో కార్లపై రూ.42,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్లతో నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
ఫిబ్రవరిలో దేశీయ కార్ల రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 3,94,768 యూనిట్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది 26% వృద్ధి. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో 34.21% పెరుగుదల కనిపించింది. టాప్ 5లో మారుతి సుజుకి(1,54,095) అగ్రస్థానంలో నిలవగా.. టాటా(56,447), మహీంద్రా(53,281), హ్యుందాయ్(45,615), టొయోటా(26,392) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కస్టమర్లు SUVవీలకే ఎక్కువ మొగ్గు చూపారు.
క్లాసిక్ లెజెండ్స్ తన యెజ్డీ రోడ్స్టర్ మోడల్లో ‘రెడ్ వోల్ఫ్’ పేరుతో స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. దీని ధర ₹2.10 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ కొత్త ఎడిషన్ ముదురు ఎరుపు రంగు (Deep Red) పెయింట్ ఫినిషింగ్, ఇంజిన్, ఎగ్జాస్ట్ పై క్రోమ్ డిటైలింగ్తో ఆకట్టుకుంటోంది. ఇది 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్తో వస్తుంది.
ఐఫోన్ 17e ని యాపిల్ సంస్థ ఆవిష్కరించింది. ఏ19 చిప్సెట్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా కలిగిన ఈ ఫోన్కు 17 సిరీస్లో తక్కువ ధరకు నిర్ణయించారు. రూ.64,900 నుంచి ఈ ఫోన్ లభించనుంది. ఈనెల 4న ముందస్తు ఆర్డర్లు ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 11 నుంచి డెలివరీ చేస్తామని పేర్కొంది. 15 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్, USB-C వైర్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
తమ డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన మాట వాస్తవమేనని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ధ్రువీకరించింది. UAEలోని రెండు సెంటర్లపై నేరుగా, బహ్రెయిన్లోని మరో సెంటర్ సమీపంలో ఈ దాడులు జరిగాయి. దీనివల్ల భారీగా మంటలు చెలరేగి భవనాలు దెబ్బతినడమే కాకుండా, విద్యుత్ సరఫరా నిలిచిపోయి సర్వీసులకు అంతరాయం కలిగింది. టెక్ ప్రపంచంలో ఈ దాడి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలు 1,11,680 యూనిట్లతో 46% వృద్ధిని నమోదు చేశాయి. 31,600 యూనిట్ల అమ్మకాలతో TVS మోటార్ అగ్రస్థానంలో నిలవగా, బజాజ్(25,323), Ather(20,581) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్ 12,512 యూనిట్లతో 4వ స్థానంలో ఉంది. ఒకప్పటి అగ్రగామి ఓలా ఎలక్ట్రిక్ కేవలం 3,968 యూనిట్లతో 6వ స్థానానికి పడిపోగా, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 5వ స్థానంలో నిలిచింది.
రాయల్ ఎన్ఫీల్డ్ తన పాత BS3, BS4 మోడళ్ల కోసం ‘E20 రెట్రోఫిట్ కిట్’ను విడుదల చేసింది. 20% ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల పాత బైక్ల రబ్బర్, మెటల్ భాగాలు దెబ్బతినకుండా ఈ కిట్ కాపాడుతుంది. BS3, BS4 మోడళ్లకు ఇది సరిపోతుంది. కేవలం రూ.1,700 ధరతో లభించే ఈ కిట్లో ఓ-రింగ్స్, ట్యూబ్స్, సీల్స్ ఉంటాయి. ఈ కిట్తో ఇథనాల్ వల్ల కలిగే తుప్పు సమస్యను అరికట్టవచ్చు.
పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఖతార్ ఉత్పత్తి నిలిపివేత, ఇరాన్ దాడుల ప్రభావంతో యూరప్లో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోవడంతో LNG సరఫరా దెబ్బతిని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు, తయారీ రంగంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది.
యమహా ఇండియా XSR155 మోడల్లో కొత్త ‘మెటాలిక్ బ్లాక్’ బైక్ను రూ.1,58,990(ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. గోల్డెన్ USD ఫోర్క్స్, రెట్రో స్టైలింగ్తో వచ్చిన ఈ వేరియంట్ మరింత ప్రీమియం లుక్ను ఇస్తోంది. అయితే, లాంచ్ అయిన 3 నెలల్లోనే కంపెనీ ధరలను పెంచింది. ప్రస్తుతం ఈ బైక్ ధరలు రంగును బట్టి రూ.1.50-1.59L మధ్య ఉన్నాయి. రెడ్ కలర్ ధర రూ.1.53 లక్షలకు చేరింది.
1965 మోంటే కార్లో ర్యాలీ విజేతకు నివాళిగా ‘మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్’ను భారత్లో లాంచ్ చేశారు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎక్స్క్లూజివ్ చిలీ రెడ్ పెయింట్, బోనెట్పై వైట్ స్ట్రైప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్తో ఈ స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు వింటేజ్ లుక్తో పాటు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ను అందిస్తుంది.
KTM ఇండియా RC 160 బైక్లో ‘ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మ్యాట్’, ‘సిరామిక్ వైట్ మ్యాట్’ అనే రెండు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. పాత ధర రూ.1.85 లక్షలకే ఇవి లభిస్తాయి. 164.2cc ఇంజన్, ఆల్-ఎల్ఈడీ లైటింగ్, ఎల్సీడీ క్లస్టర్ వంటి ఫీచర్లలో ఎలాంటి మార్పు లేదు. యమహా R15 తో పోటీ పడుతున్న ఈ బైక్, దానికంటే సుమారు రూ.19,000 ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది.
ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్కు కనీసం 95 ఆక్టేన్ (RON) రేటింగ్ ఉండాలని కేంద్రం తప్పనిసరి చేసింది. 20% ఇథనాల్ బ్లెండింగ్ (E20) వల్ల ఇంధన నాణ్యత మెరుగుపడనుంది. ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ఆక్టేన్ స్థాయి 91-92 నుంచి 97-98 వరకు పెరుగుతుందని చమురు సంస్థలు తెలిపాయి. దీనివల్ల వాహన ఇంజన్ల పనితీరు మెరుగుపడటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.
బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ ట్రయంఫ్ 350cc బైక్లను ఏప్రిల్లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించారు. ప్రస్తుత 400cc ఇంజిన్ను తగ్గించి ఈ కొత్త వెర్షన్ రూపొందిస్తున్నారు. దీనివల్ల 40% నుంచి 18% వరకు జీఎస్టీ తగ్గి, ధరలు మరింత పోటీగా ఉండనున్నాయి. ఇదే వ్యూహాన్ని KTM, Dominor మోడళ్లలోనూ అనుసరించే అవకాశం ఉంది. తక్కువ ధరలో ప్రీమియం బైక్ కోరుకునే వారికి ఇది గుడ్ న్యూస్.
మార్చిలో భారత ఆటోమొబైల్ రంగం కొత్త మోడళ్లతో కళకళలాడనుంది. రెనాల్ట్ డస్టర్(మార్చి 17) రీ-ఎంట్రీ ఇస్తుండగా, లగ్జరీ విభాగంలో మెర్సిడెస్ V-క్లాస్(మార్చి 2), ఆడి SQ8 పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో వస్తున్నాయి. వీటితో పాటు స్కోడా కుషాక్ ఫేస్లిఫ్ట్, టొయోటా ఎబెల్లా EV SUVలు మార్కెట్లోకి వస్తాయి. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు కస్టమర్లకు భారీ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.