మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం XEV 9sను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కంపెనీ విడుదల చేసిన తొలి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV ఇదే కావడం విశేషం. దీని ప్రారంభ ధర రూ.19.95 లక్షలుగా నిర్ణయించారు. వేరియంట్ను బట్టి గరిష్ఠ ధర రూ.29.45 లక్షల వరకు ఉంటుంది. 2026 జనవరి 14 నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. జనవరి 23 నుంచి డెలివరీలు చేపట్టనున్నారు.
సిమ్ కార్డు వినియోగదారులకు టెలికాం విభాగం కీలక హెచ్చరిక చేసింది. సైబర్ మోసాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఏ సిమ్ కార్డు వినియోగించినా సిమ్ ఎవరి పేరిట ఉంటే వారే బాధ్యులని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాత సిమ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. టెలీ కమ్యూనికేషన్ నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా ఉంటుందని వెల్లడించింది.
నిన్న TG మంత్రులు సహా వందలాది మంది వాట్సాప్ గ్రూపులు, అకౌంట్లు హ్యాక్ అవడం కలకలం రేపింది. ఈ క్రమంలో మీ అకౌంట్లో ఏదైనా సమస్య వస్తే..★ www.whatsapp.com/contactలో లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి★ యాప్ అన్ఇన్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేయాలి★ ఫోన్ ఓవర్ హీట్/బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అయితే హ్యాక్ అయిందని భావించి, వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.
ప్రైవేట్ కంపెనీలకు షాక్ ఇస్తూ BSNL కస్టమర్ల కోసం రూ.485 విలువైన అద్భుతమైన ప్లాన్ను ప్రకటించింది. ఈ ప్లాన్ 72 రోజుల పాటు నాన్స్టాప్ కనెక్టివిటీని అందిస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 100 SMSలు లభిస్తాయి. ఇంత తక్కువ ధరలో ఎక్కువ డేటా, ఎక్కువ చెల్లుబాటును అందించే చౌకైన ప్లాన్ను ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అందించట్లేదని BSNL పేర్కొంది.
మీరు ‘బ్లూమ్ స్క్రోలింగ్’ గురించి విన్నారా? ఇది డూమ్ స్క్రోలింగ్(చెడు వార్తలు చూడటం)కు పూర్తి విరుద్ధం. అభివృద్ధికి ఉపయోగపడే, మానసిక ప్రశాంతతను, సంతృప్తిని కలిగించే మంచి విషయాలను మాత్రమే చూడటాన్ని బ్లూమ్ స్క్రోలింగ్ అంటారు. ఇలాంటి కంటెంట్ను చూడటం వల్ల మెదడులో డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
TATA మోటార్స్ నవంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. హారియర్, సఫారీ మిడ్-స్పెక్ అడ్వెంచర్ వేరియంట్లపై అత్యధికంగా రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ మోడళ్లపై రూ.50 వేలు, ప్యూర్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి. ఆల్ట్రోజ్ రూ.లక్ష, రేసర్ రూ.1.35 లక్షలు, నెక్సాన్ రూ.45 వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
వాట్సాప్లో ‘క్లియర్ చాట్’ ఫీచర్ను అప్డేట్ చేశారు. తాజా అప్డేట్లో.. చాట్ డిలీట్ చేసేటప్పుడు ‘మెసేజ్లు మాత్రమేనా, లేదా కేవలం మీడియా ఫైల్స్ చేయాలా?’ అని అడుగుతుంది. ఇదివరకు Starred మెసేజ్లు మినహా అన్నీ డిలీట్ చేసే ఆప్షన్ ఉండేది. అంతేకాకుండా మీరు ఏవైనా ఫొటోలు సేవ్ చేచేసుకుంటే, చాట్ డిలీట్ చేసినా గ్యాలరీలో అలాగే ఉంటాయి.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా కొత్త బైకును XSR 155 పేరిట మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.1.50 లక్షలు (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించింది. ఈ బైకులో 155CC లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఉంది. ఇది గరిష్ఠంగా 10,000 RPM వద్ద 18.4 HP శక్తిని విడుదల చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్బాక్స్ అమర్చారు. లుక్ పరంగా FZ-X మోడల్ను తలపిస్తోంది.
జియో తమ ICR సేవలు మెరుగుపరచడానికి BSNLతో చేతులు కలిపింది. గ్రామీణ కవరేజీని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. అందుకోసం జియో 28 రోజుల వ్యాలిడిటీతో రూ.196, రూ.396 విలువైన రీఛార్జ్ ప్లాన్స్ను తెచ్చింది. ఈ ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకున్న జియో యూజర్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మారుమూల ప్రాంతాల్లో కూడా BSNL నెట్వర్క్ను వాడుకోవచ్చు.
జియో తమ ఇంట్రా సర్కిల్ రోమింగ్(ICR) సేవలను బలోపేతం చేసుకోవడానికి BSNLతో చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కవరేజీని మెరుగుపరచడం ఈ భాగస్వామ్యం ముఖ్య లక్ష్యం. JIO-BSNL ICR సేవలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా జియో యూజర్లు మెరుగైన కాలింగ్, డేటా సేవలను పొందగలుగుతారు.
టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జెనరేటివ్ AI సాయంతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వ్యాపార వెబ్సైట్లు, యాప్లు వేగంగా విస్తరిస్తున్నాయి. పండుగ షాపింగ్, జాబ్ సెర్చ్ సమయంలో మోసాలు మరింత పెరిగే అవకాశం ఉంది. నిజమైన సంస్థలు ఉద్యోగ ప్రక్రియలో ఎప్పుడూ డబ్బు అడగవని గుర్తుంచుకోవాలి’ అని సూచించింది.
CTR: చిత్తూరు పోలీసులు ₹63 లక్షల విలువైన 315 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి మొబైల్ అందజేశారు. అయితే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్కు HI, లేదా Help అని పంపాలన్నారు. అనంతరం “CHAT BOT” సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.
భారతీయ వినియోగదారులకు చాట్జీపీటీ శుభవార్త చెప్పింది. చాట్జీపీటీ గో ఉచిత సబ్స్క్రిప్షన్ను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో వినియోగదారులు ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తిగా 12 నెలలపాటు ఈ సబ్స్క్రిప్షన్ను వాడుకోవచ్చు. కాగా, AI సేవలను ఎక్కువ మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ SUV వెన్యూలో పెర్ఫార్మెన్స-ఓరియెంటెడ్ N లైన్ వెర్షన్ను ఆవిష్కరించింది. ఈ మోడల్ను భారత మార్కెట్లో నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.25 వేలు టోకెన్ అమౌ్ంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు, డిజైన్ వివరాలను వెల్లడించిన కంపెనీ, దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభింంచింది.
OpenAI సంస్థ ChatGPT అట్లాస్ అనే కొత్త వెబ్ బ్రౌజర్ను తీసుకొచ్చింది. గూగూల్ క్రోమ్, యాపిల్ సఫారీలకు పోటీగా తీసుకొచ్చిన ఈ బ్రౌజర్ యూజర్ల సెర్చ్ హిస్టరీని బట్టి పర్సనలైజ్ అయిపోతుంది. ఇంకా వెబ్సైట్ సర్ఫింగ్ చేస్తున్నప్పుడే ‘Ask ChatGPT’పై క్లిక్ చేసి ఏం కావాలో అడిగే అవకాశమిస్తుంది. ప్రస్తుతం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో అందుబాటులో ఉంది.