ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్లో కొత్త విద్యుత్ కారును లాంచ్ చేసింది. YL పేరిట కొత్త మోడల్ను తీసుకొచ్చింది. దీని ధర రూ.61.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అధిక వీల్బేస్, 6 సీటర్ కెపాసిటీతో వస్తోంది. సింగిల్ ఛార్జింగ్తో 681 కి.మీ. ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్ను చైనాలో విడుదల చేయగా అమెరికాలో ఇంకా లాంచ్ చేయకపోవడం గమనార్హం.
ప్రముఖ కార్ల సంస్థ సిట్రోయెన్ తన ‘బసాల్ట్’ మోడల్ కార్ల ధరలను రూ.40,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముడిసరుకు ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. దీనివల్ల ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.8.55 లక్షలకు చేరింది. ఇతర మోడళ్ల ధరలు కూడా వేరియంట్ను బట్టి ధరలు పెంచింది. కొత్తగా కారు కొనాలనుకునే వారు ఇప్పుడు మరికొంత అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సింపుల్ ఎనర్జీ ‘అల్ట్రా’ ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ.2.35L ధరతో లాంచ్ చేసింది. 400KMల IDC రేంజ్తో దేశంలోనే అత్యధిక మైలేజీని ఇచ్చే స్కూటర్గా నిలిచింది. 115 kmph టాప్ స్పీడ్ దీని ప్రత్యేకత. కేవలం 2.77 సెకన్లలోనే 40 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. 7 అంగుళాల డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ HYD, విజయవాడల్లో అందుబాటులో ఉంది.
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి ‘ఇగ్నిస్’ ఉత్పత్తిని నిలిపివేసింది. అమ్మకాలు పడిపోవడం, డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఈ కార్ల ఉత్పత్తి నిలిచిపోయిందని డీలర్లు చెబుతున్నారు. కొత్త బుకింగ్లను సైతం తీసుకోవట్లేదు. 2017లో విడుదలైన ఈ ప్రీమియం అర్బన్ కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ కారు ధర రూ.4.59 లక్షల నుంచి రూ.7.80 లక్షల మధ్య ఉండేది.
ముంబైలో జరిగిన ‘సుజుకి మాట్సురి 2026’ ఈవెంట్లో బర్గ్మన్ 400 మ్యాక్సీ స్కూటర్ భారత మార్కెట్లో మెరిసింది. 400cc పవర్ఫుల్ ఇంజిన్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఇది రూపొందింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ భారత్లో BMW C400 GT వంటి లగ్జరీ స్కూటర్లకు గట్టి పోటీ కానుంది.
వెస్పా తన పాపులర్ ప్రిమవెరా, స్ప్రింట్ మోడళ్లలో పవర్ఫుల్ 180cc ఇంజిన్ వేరియంట్లను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర సుమారు రూ.2.99L. కొత్త ఐ-గెట్ ఇంజిన్తో ఇవి 15hp పవర్, 13.7Nm టార్క్ను అందిస్తాయి. కీ-లెస్ ఎంట్రీ, కలర్ డిజిటల్ క్లస్టర్, మియా కనెక్టివిటీ వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. భారత్లో వీటి లాంచ్పై ఇంకా స్పష్టత లేదు.
స్మార్ట్ఫోన్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ వివో తన ‘T5 ప్రో’ను విడుదల చేసింది. 9020 mAh భారీ బ్యాటరీతో వస్తుండటం దీని ప్రత్యేకత. గత ఏడాది వచ్చిన T4 ప్రోకు సక్సెసర్గా వచ్చిన ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 29,999 గా ఉంది.
షావోమీ సంస్థ Redmi A7 Pro మొబైల్ను లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్.. భారత్లో ఈరోజు విడుదలైంది. 6,300mAh బ్యాటరీ, 32mp డ్యూయల్ కెమెరా, 6.9 అంగుళాల HD+ LCD స్క్రీన్, ఆక్టాకోర్ యూనిసోక్ టీ8300 ప్రాసెసర్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్ వస్తోంది. 4జీబీ+ 64జీబీ ఫోన్ ధర రూ.11,499.. 4జీబీ+ 128జీబీ ధర రూ.12,499గా నిర్ణయించారు.
ఢిల్లీ ప్రభుత్వం ఈవీలపై మూడేళ్ల పాటు సబ్సిడీ అందించనుంది. టూ వీలర్లపై మొదటి ఏడాది రూ.30 వేలు, ఈ-ఆటోలపై రూ.50 వేల వరకు, గూడ్స్ వాహనాలపై రూ.లక్ష వరకు నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం ప్రతి ఏడాది క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తుక్కుగా మార్చి కొత్త ఈవీని కొంటే కార్లపై అదనంగా రూ.లక్ష వరకు భారీ రాయితీని ప్రభుత్వం కల్పించింది.
మారుతీ సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. బాలెనోపై క్యాష్ బెనిఫిట్ కింద రూ.15వేలు, ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ.15వేల వరకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఫ్రాంక్స్పై నగదు బెనిఫిట్ కింద రూ.40 వేలు, అదనంగా రూ.10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నామంది. XL6పై రూ.45వేలు, విటారాపై రూ.50వేలు, ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు.
ChatGPT, Gemini తదితర చాట్బాట్లకు వ్యక్తిగత సమాచారం షేర్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్స్ వంటివి ఇవ్వొద్దంటున్నారు. మెడికల్ అడ్వైజ్లూ తీసుకోవద్దని, అవి డాక్టర్ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. యూజర్లు షేర్ చేసిన/అడిగిన విషయాలను షేర్ చేసుకుంటాయని, ఇతరులకూ షేర్ చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
సుజుకి ఇండియా 2026 బర్గ్మన్ స్ట్రీట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.02L కాగా, టాప్ వేరియంట్ ధర రూ.1.13L (ఎక్స్-షోరూమ్). టాప్ వేరియంట్లో TFT డిస్ప్లే, కీ ఫోబ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 124cc ఇంజిన్, 24.6 లీటర్ల స్టోరేజ్, USB ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు. మేక్ఓవర్ పొందిన LED లైటింగ్ దీనికి సరికొత్త లుక్ ఇచ్చింది.
మారుతీ సుజుకీ తన సర్వీస్ నెట్వర్క్ను రికార్డు స్థాయిలో విస్తరించింది. ఒక్క ఏడాదిలోనే 502 కొత్త సర్వీస్ కేంద్రాలను ప్రారంభించి, దేశవ్యాప్తంగా మొత్తం సంఖ్యను 5,926కు చేర్చింది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యమని సంస్థ తెలిపింది. 2031 నాటికి ఈ కేంద్రాలను 8,000కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. గత మార్చితో పోలిస్తే అమ్మకాలు కూడా 5 శాతం పెరిగాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా SUVలు, వాణిజ్య వాహనాల ధరలను ఈనెల 6 నుంచి 2.5% వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. సంప్రదాయ ఇంధన ఇంజిన్ల (ఐసీఈ)తో నడిచే SUVలు, వాణిజ్య వాహనాల సగటు ధరలు 1.6% పెరుగుతాయని కంపెనీ ప్రకటనలో తెలిపింది. మోడల్, వేరియంట్ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. XUV7 XO వాహనం ధర తొలి 40 వేల మంది కొనుగోలుదార్లకు మాత్రం పెరగదని వివరించింది.
రియల్మి 16 ఫోన్ 7000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో భారత్లో లాంచ్ అయింది. ఇందులో 50MP కెమెరా, IP69 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.31,999. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.6,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అద్భుతమైన డిస్ప్లే, పర్ఫార్మెన్స్తో ఈ ఫోన్ మీ బడ్జెట్లోనే లభిస్తోంది.