పశ్చిమాసియాలో యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడవచ్చన్న వార్తలతో హైదరాబాద్ పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇబ్బందులు భరించలేక చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల(EV) వైపు మళ్లుతున్నారు. షోరూమ్ల వద్ద వినియోగదారులు తమ గోడు వెళ్లగక్కుతున్నారు. దీంతో గత 2 రోజులుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు అమాంతం పెరిగాయని షోరూమ్ యజమానులు చెబుతున్నారు.
అమెరికా కంపెనీ రైన్ మోటర్స్ FP3 అనే కారును విడుదల చేసింది. అమెరికా రిజిస్ట్రేషన్ నిబంధనలను అనుసరించి త్రీవీలర్గా వస్తోంది. ఇందులో సుజుకీ హయబుసా 1,340 సీసీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఫైబర్గ్లాస్ బాడీతో వస్తోంది. ఈ కారు 2.8 సెకన్లలోనే 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. FP3 బేస్ మోడల్ రూ.73.72 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది.
ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV EV2ను యూరప్లో విడుదల చేసింది. ఈ SUV 42.2 kWh, 61 kWh బ్యాటరీ సామర్థ్యాలతో అందిస్తోంది. దీని గరిష్ఠ రేంజ్ 413 కిలోమీటర్లు. దీని మోటార్ గరిష్ఠంగా 146 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును యూరప్లో 26,600 యూరోల ధరకు అందిస్తున్నారు. భారతీయ రూపాయలలో సుమారుగా రూ.29 లక్షలు (దాదాపు రూ.2.9 మిలియన్లు).
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్స్టా డైరెక్ట్ మెసేజెస్(DM)లోని ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. చాలా తక్కువ మంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ వాడుతున్నారని.. దీంతో ఈ ఏడాది మే 8 నుంచి దీన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదే జరిగితే మెటాకు యూజర్ల చాటింగ్స్పై పూర్తి యాక్సెస్ లభిస్తుంది.
టయోటా థాయ్లాండ్లో కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని విడుదల చేసింది. ఈ SUVలో 2.7 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. ఈ ఇంజిన్ 166 PS పవర్, 245 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని థాయిలాండ్లో THB రూ.12.69 లక్షల ధరకు విడుదల చేసింది. భారతీయ రూపాయలలో రూ.36 లక్షలు. 2026 చివరి నాటికి భారత్లో విడుదల కానున్నట్లు సమాచారం.
ఐఫోన్ యూజర్లను డార్క్స్వార్డ్ అనే స్పైవేర్ వణికిస్తోంది. ఇది ముఖ్యంగా iOS 18, అంతకంటే పాత వెర్షన్ ఫోన్ల నుంచి వ్యక్తిగత, క్రిప్టో వాలెట్ల సమాచారం దొంగిలిస్తోంది. సుమారు 25% ఫోన్లు పాత సాఫ్ట్వేర్తోనే ఉన్నాయని, అవన్నీ ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హ్యాకర్ల బారిన పడకుండా వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ విండోస్ 11 కొత్త అప్డేట్ వల్ల లక్షలాది మంది యూజర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్ ఉన్నప్పటికీ వన్డ్రైవ్, ఆఫీస్ వంటి యాప్లలో ‘నో ఇంటర్నెట్’ అనే ఎర్రర్ వస్తోంది. దీంతో చాలా మంది యూజర్లు లాగిన్ అవ్వలేకపోతున్నారు. ఈ బగ్ను గుర్తించిన మైక్రోసాఫ్ట్, త్వరలోనే శాశ్వత పరిష్కారం కోసం కొత్త అప్డేట్ను రిలీజ్ చేస్తామని తెలిపింది.
వొడాఫోన్-ఐడియా, BSNL కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో టవర్లు, ఫైబర్, స్పెక్ట్రమ్ను పంచుకోవాలని రెండు సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. ఈ రెండు దిగ్గజాలు చేతులు కలిపితే టెలికాం రంగంలో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆపడానికి ఇకపై స్క్రీన్పై వేలితో నొక్కి పట్టుకోవాల్సిన(Long Press) అవసరం లేదు. యూట్యూబ్ తరహాలో ‘ట్యాప్-టు-పాజ్’ ఫీచర్ను మెటా పరిచయం చేస్తోంది. ఒక్క ట్యాప్తో వీడియోను ఆపి, క్యాప్షన్లను ప్రశాంతంగా చదువుకోవచ్చు. పాజ్ చేసినప్పుడు మ్యూట్ ఆప్షన్ కూడా స్క్రీన్పై కనిపిస్తుంది. ఈ అప్డేట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
మీకు వచ్చే SMS సెండర్ ఐడి చివర ఉండే అక్షరాలను ఎప్పుడైనా గమనించారా?. అందులో G అంటే ప్రభుత్వం, T అంటే బ్యాంక్ లావాదేవీలు, S అంటే ఓటీపీ వంటి సేవలు, P అంటే ప్రమోషనల్ ఆఫర్లు అని అర్థం. స్కామర్ల నంబర్ల వెనుక ఇలాంటి అక్షరాలు ఉండవు. కాబట్టి, ఆ అక్షరాలు లేని మెసేజ్లలోని లింక్స్పై క్లిక్ చేయకండి. ఈ చిన్న చిట్కాతో ఆన్లైన్ మోసాల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.
ఎయిర్బ్యాగ్ సౌకర్యంతో కూడిన ‘Tricity 300’ మోడల్ స్కూటర్ను యమహా విడుదల చేసింది. ప్రపంచంలోనే ఈ ఫీచర్తో వస్తున్న తొలి స్కూటర్ ఇదే. మూడు చక్రాలతో ఉండే ఈ స్కూటర్లో, రైడర్ రక్షణ కోసం బిల్ట్-ఇన్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ ఉంది. స్వీడన్ కంపెనీ ‘ఆటోలివ్’తో కలిసి దీనిని రూపొందించారు. 292cc ఇంజిన్, కార్నరింగ్ ABS వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో స్పెషల్.
దేశంలో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన రెనాల్ట్ డస్టర్.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లేటెస్ట్ లుక్, టెక్ లోడెడ్ ఫీచర్లతో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత సరికొత్త డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ SUVని లాంచ్ చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ.10.29 లక్షలు (ఎక్స్షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. బుకింగ్ టోకెన్ అమౌంట్ రూ.21 వేలుగా కంపెనీ నిర్ధారించింది.
షావోమీ నుంచి 17, 17 అల్ట్రా ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. లైకా భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్లలో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఉన్నాయి. షావోమీ 17 ధర రూ.89,999 నుంచి ప్రారంభం కాగా, అల్ట్రా మోడల్ ధర రూ.1,39,999. అల్ట్రాలో 200MP టెలీఫొటో లెన్స్ ప్రత్యేకం. ఐపీ 68/69 రేటింగ్, 50MP సెల్ఫీ కెమెరా వీటి సొంతం. ఈ నెల 17లోపు కొంటే ఫొటోగ్రఫీ కిట్ ఉచితం.
కవాసకి నింజా ZX-6Rపై డీలర్లు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇందులో రూ.2.74 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ.98 వేల విలువైన యాక్సెసరీస్ ఉచితంగా లభిస్తాయి. దీంతో రూ. 15.43 లక్షల ఆన్-రోడ్ ధర గల బైక్ రూ.12.69 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. పాత స్టాక్ క్లియర్ చేసేందుకు ఇస్తున్న ఈ ఆఫర్ సూపర్ బైక్ లవర్స్కు మంచి అవకాశం. ఇది హోండా CBR650R, ఏప్రిలియా RS 660లకు గట్టి పోటీ.
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ.. భారత్లో కొత్త ఫెరారీ 849 టెస్టరోస్సాను ఆవిష్కరించింది. దీని ధర రూ.10.37 కోట్లు(ఎక్స్షోరూమ్). ఇది గ్లోబల్ లైనప్లో ఫెరారీ SF90 స్ట్రాడేల్ స్థానంలో ఉంటుంది. 2.3 సెకన్ల కాలంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 330 కిలోమీటర్లు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం ద్వారా 25 కిమీ పరిధి లభిస్తుంది.