జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. భారత్లోని అన్ని రకాల మోడళ్లపై 2% వరకు పెంచుతామని వెల్లడించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆడి ఇండియా బ్రాండ్ డెరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ప్రకటనలో తెలిపారు. Q3 SUV నుంచి SUV RS Q8 వరకు రూ.43.23 లక్షల నుంచి రూ.2.34 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తోంది.
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారత్లో లభించే అన్ని మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెరిగిన ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చుల భారం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
ఎలాన్ మాస్క్ తన AI చాట్బాట్ ‘Grok’ సేవల్లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇకపై గ్రోక్ సేవలను ప్రీమియం, ప్రీమియం+ సబ్స్క్రైబర్లుకు మాత్రమే. సాధారణ యూజర్లకు ‘Ask Grok is currently available to premium and premium+ subscribers only’ అనే మెసేజ్ కనిపిస్తోంది. ప్లాట్ఫామ్ ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగానే ఈ నియంత్రణ విధించినట్లు తెలుస్తోంది.
KTM తన బైక్లపై 4 ఏళ్ల స్టాండర్డ్ వారంటీని ప్రకటించింది. 2025 మోడళ్ల నుంచి వర్తించే ఈ ప్రోగ్రామ్లో బజాజ్ తయారు చేసే 400cc లోపు బైక్లు కూడా ఉన్నాయి. డర్ట్, ట్రాక్ బైకులకు ఇది వర్తించదు. బైక్ అమ్మినా వారంటీ కొత్త యజమానికి బదిలీ అవుతుంది. గతంలో ఉన్న 2 ఏళ్ల వారంటీని ఇప్పుడు రెట్టింపు చేస్తూ వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఏథర్ ఎనర్జీ తన రిజ్టా S, 450S మోడళ్లపై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ నెల 31 వరకు రిజ్టా S ధర రూ.1.05 లక్షలు, 450S ధర రూ.1.13 లక్షలుగా ఉండనుంది. PM ఈ-డ్రైవ్ పథకం ముగియనుండటంతో ఈ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా రూ.6,500 నగదు తగ్గింపు, రూ.10,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ.3,500 వారంటీ ప్రయోజనాలు పొందవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
టాటా మోటార్స్ ఐకానిక్ SUV మోడల్ ‘సియెర్రా’కి దేశీయ మార్కెట్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దీని బుకింగ్స్ 1 లక్ష మార్కును దాటడంతో, డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. జనవరి నుంచి ఇప్పటివరకు 14,000 పైగా వాహనాలు డెలివరీ అయ్యాయి. Q2 నాటికి నెలకు 15 వేల యూనిట్ల తయారీని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ తెలిపింది.
రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల యూనిట్ల విక్రయాలతో అరుదైన మైలురాయిని దాటింది. J-సిరీస్ ప్లాట్ఫామ్పై వచ్చిన ఈ క్రూయిజర్ బైక్, తన రిఫైన్డ్ పెర్ఫార్మెన్స్తో రైడర్లను ఆకట్టుకుంటోంది. 349cc ఇంజిన్, ట్రిప్పర్ నావిగేషన్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లతో 60 దేశాల్లో అమ్ముడవుతోంది. ఈ బైక్ రూ.1.96 లక్షల ప్రారంభ ధరతో లభిస్తోంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షావోమీ దేశీయ మార్కెట్లోకి 9200mAh బ్యాటరీతో ప్యాడ్ 8ను విడుదల చేసింది. 8GB+128GB రూ.33,999, 12GB+256GB రూ.35,999, నానో టెక్స్చర్ డిస్ప్లే వేరియంట్ 12GB+256GB రూ.38,999, క్రియేటర్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.41,999గా ఉంది. ఇదే మోడల్ నానో టెక్స్చర్ డిస్ప్లే ధరను రూ.43,999గా పేర్కొంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెర్నా కారును దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.98 లక్షల (ఎక్స్షోరూమ్). 6 వేరియంట్లలో లభించే ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్సులతో జత చేసిన రెండు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది క్లాసీ బ్లూ, టైటాన్ గ్రే మాట్టే అనే రెండు రంగుల్లో లభిస్తుంది.
వైఫై స్లోగా ఉంటే ఇబ్బంది పడకుండా ఈ చిన్న మార్పులు చేయండి. రౌటర్ను ఇంటి మధ్యలో, ఎత్తులో ఉంచడం వల్ల సిగ్నల్ బాగా అందుతుంది. అలాగే సెట్టింగ్స్లో 5GHz బ్యాండ్ను ఎంచుకోండి. మైక్రోవేవ్ ఓవెన్ వంటి పరికరాలకు రౌటర్ దూరంగా ఉండేలా చూడండి. ఈ చిట్కాలతో ఇంటర్నెట్ వేగం పెరిగి బఫరింగ్ సమస్యలు తగ్గుతాయి.
మారుతి సుజుకి తన అరీనా కార్లపై ఈ నెలాఖరు వరకు భారీ ఆఫర్లను ప్రకటించింది. స్విఫ్ట్ మోడల్పై గరిష్టంగా రూ.50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, బ్రెజ్జాపై రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. వ్యాగన్ఆర్, ఆల్టో K10, సెలెరియో, ఈకో కార్లపై రూ.42,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్లతో నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
ఫిబ్రవరిలో దేశీయ కార్ల రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 3,94,768 యూనిట్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది 26% వృద్ధి. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో 34.21% పెరుగుదల కనిపించింది. టాప్ 5లో మారుతి సుజుకి(1,54,095) అగ్రస్థానంలో నిలవగా.. టాటా(56,447), మహీంద్రా(53,281), హ్యుందాయ్(45,615), టొయోటా(26,392) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కస్టమర్లు SUVవీలకే ఎక్కువ మొగ్గు చూపారు.
క్లాసిక్ లెజెండ్స్ తన యెజ్డీ రోడ్స్టర్ మోడల్లో ‘రెడ్ వోల్ఫ్’ పేరుతో స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. దీని ధర ₹2.10 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ కొత్త ఎడిషన్ ముదురు ఎరుపు రంగు (Deep Red) పెయింట్ ఫినిషింగ్, ఇంజిన్, ఎగ్జాస్ట్ పై క్రోమ్ డిటైలింగ్తో ఆకట్టుకుంటోంది. ఇది 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్తో వస్తుంది.
ఐఫోన్ 17e ని యాపిల్ సంస్థ ఆవిష్కరించింది. ఏ19 చిప్సెట్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా కలిగిన ఈ ఫోన్కు 17 సిరీస్లో తక్కువ ధరకు నిర్ణయించారు. రూ.64,900 నుంచి ఈ ఫోన్ లభించనుంది. ఈనెల 4న ముందస్తు ఆర్డర్లు ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 11 నుంచి డెలివరీ చేస్తామని పేర్కొంది. 15 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్, USB-C వైర్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
తమ డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన మాట వాస్తవమేనని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ధ్రువీకరించింది. UAEలోని రెండు సెంటర్లపై నేరుగా, బహ్రెయిన్లోని మరో సెంటర్ సమీపంలో ఈ దాడులు జరిగాయి. దీనివల్ల భారీగా మంటలు చెలరేగి భవనాలు దెబ్బతినడమే కాకుండా, విద్యుత్ సరఫరా నిలిచిపోయి సర్వీసులకు అంతరాయం కలిగింది. టెక్ ప్రపంచంలో ఈ దాడి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.