ఐటీ దిగ్గజం TCS తన ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. వారానికి 5 రోజులు ఆఫీసుకు (WFO) రావాలన్న నిబంధన పాటించని వారి అప్రైజల్స్ను నిలిపివేస్తున్నట్లు సమాచారం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి ఇకపై రేటింగ్స్, హైక్స్ ఉండవని పరోక్షంగా హెచ్చరించినట్లయింది. ఆఫీస్ అటెండెన్స్ పాలసీని కచ్చితంగా అమలు చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అశ్లీల, అసభ్యకర దృశ్యాల రూపకల్పనకు గ్రోక్ (చాట్బాట్) దుర్వినియోగం అవుతుండటంపై ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ‘X’ చర్యలు చేపట్టింది. ఈ చాట్బాట్లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్పై పరిమితులు విధించింది. కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో గూగుల్ (ఆల్ఫాబెట్) సత్తా చాటింది. టెక్ దిగ్గజం యాపిల్ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో గూగుల్ షేర్లు పుంజుకోవడంతో ఈ ఘనత సాధ్యమైంది. దీంతో యాపిల్ మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఈ పరిణామం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
AKP: మునగపాక జడ్పీ హైస్కూల్లో 1989-90లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు స్థానిక రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ వ్యాపారాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఒకరికొకరు కష్ట సుఖాలు కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. స్కూల్ జ్ఞాపకాలను తలుచుకొని ఆనందంగా గడిపారు.
సేవ్ చేయని నంబర్ కాల్స్ వస్తే ఇకపై టెన్షన్ వద్దు. ట్రాయ్ తెస్తున్న ‘CNAP’ ఫీచర్తో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినా పేరు స్క్రీన్పై కనిపిస్తుంది. మార్చి 31 కల్లా ఇది అమల్లోకి రానుంది. సిమ్ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా పేర్లు డిస్ప్లే అవుతాయి. దీంతో స్పామ్ కాల్స్ను ఈజీగా పసిగట్టవచ్చు. ఈ ఫీచర్ వస్తే ట్రూకాలర్ వంటి యాప్స్ అవసరం ఉండదు.
అమెరికా పరిశోధకులు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే అతి చిన్నదైన స్వతంత్ర రోబోను (మైక్రో రోబో) సృష్టించారు. పెన్సిల్వేనియా, మిషిగన్ వర్సిటీలు తయారు చేసిన ఈ చిట్టి రోబో.. కాంతి (Light) ద్వారా శక్తిని పొంది ద్రవాలలో ఈదుకుంటూ వెళ్తుంది. ఇది మన శరీరంలోని కణాల ఆరోగ్యాన్ని చెక్ చేయగలదు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ బుజ్జి రోబోలు వైద్య రంగంలో విప్లవం సృష్టించనున్నాయి.
భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ 3 వీలర్ యోధ ట్రెవో విడుదలైంది. వస్తువుల డెలివరీ, సరుకు రవాణాకు రూపొందించారు. దీని ధర రూ.4.35 లక్షల నుంచి రూ.4.75 లక్షల వరకు ఉంటుంది. ఇది 11.8 kWh ఫిక్స్డ్ బ్యాటరీ, 7.6 kWh స్వాపబుల్ బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్తో 130-150 KM వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది.
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఓ చేదు వార్త. ఇకపై పోస్టులకు ఇష్టమొచ్చినన్ని హ్యాష్ట్యాగ్లు వాడలేరు. పోస్ట్ లేదా రీల్కు గరిష్ఠంగా 5 హ్యాష్ట్యాగ్లు యాడ్ చేయాలనే కొత్త రూల్ను త్వరలో తేనుంది. ఇప్పటివరకు 30 వరకు వాడుకునే అవకాశం ఉండగా.. దానికి మెటా చెక్ పెట్టింది. స్పామ్ను తగ్గించి, కంటెంట్ క్వాలిటీ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
వాట్సాప్లో అశ్లీల కంటెంట్ను షేర్ చేయడం చట్టరీత్యా నేరం. గ్రూప్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలు, దేశవ్యతిరేక కంటెంట్ను పంపినా చట్టపరమైన చర్యలు తప్పవు. జాతీయ భద్రత కారణంగా ఇలాంటి కంటెంట్పై నిఘా ఉంటుంది. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ షేర్ చేస్తే కఠిన శిక్షలు విధిస్తారు.
TG: హైదరాబాద్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కామన్ మొబిలిటీ కార్డ్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో ఒకే కార్డుతో మెట్రో, RTC బస్సుల్లో టికెట్ రహిత ప్రయాణం సాగించవచ్చు. ఈ కార్డును 2023 ఆగస్టులోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించగా, ఇప్పటివరకు పూర్తి అమలు కాలేదు. మెట్రో, RTC విజయవంతంగా అనుసంధానమైన తర్వాత.. MMTS రైళ్లు, ఇతర వాహనాలకూ దీన్ని విస్తరించే అవకాశముంది.
ఏథర్ ఫ్యామిలీ స్కూటర్ ‘రిజ్తా’ మార్కెట్లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా 2 లక్షల అమ్మకాల మైలురాయిని దాటేసింది. లాంచ్ అయిన 7 నెలల్లోనే లక్ష స్కూటర్లు అమ్ముడవ్వడం విశేషం. ఏథర్ మొత్తం సేల్స్లో 70 శాతం వాటా ఈ ఒక్క స్కూటర్దే. దీని రాకతో UP, MP, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఏథర్ మార్కెట్ షేర్ డబుల్ అయ్యింది. ఫ్యామిలీస్ దీనికి ఫుల్ ఫిదా అయిపోతున్నారు.
మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు త్వరలో పెరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. Jio, Airtel, VI టారిఫ్ను 10 నుంచి 12శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తక్కువ ధరలలో ఉన్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను ఇప్పటికే కంపెనీలు తొలగించిన సంగతి తెలిసిందే. మరోవైపు పేమెంట్ యాప్ లోనూ ‘రీఛార్జ్ ధరలు పెరగొచ్చు’ అంటూ అలర్ట్స్ వస్తుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
> క్రోమ్లో మై డూడుల్ అని సెర్చ్ చేయాలి> పక్కన యాడ్ టూ క్రోమ్పై క్లిక్ చేస్తే యాడ్ ఎక్ట్సెన్షన్ అని వస్తుంది> దాన్ని క్లిక్ చేయగానే కుడివైపున ఫజిల్ సింబల్ లాంటి చిత్రం కనిపిస్తుంది> అది క్లిక్ చేస్తే మై డూడుల్ అని ఉంటుంది> అందులో మీకు నచ్చిన పేరును టైప్ చేస్తే అది డూడుల్గా కనిపిస్తుంది.
కార్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ‘టాటా సియెర్రా’ రానే వచ్చింది. దీని బేస్ మోడల్ ధరను రూ.11.49 లక్షలుగా(ఎక్స్-షోరూం) నిర్ణయించారు. ఈ ప్రైస్తో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటాకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, అదిరిపోయే లుక్తో వస్తున్న సియెర్రా.. మిడ్ సైజ్ ఎస్యూవీ మార్కెట్ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం XEV 9sను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కంపెనీ విడుదల చేసిన తొలి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV ఇదే కావడం విశేషం. దీని ప్రారంభ ధర రూ.19.95 లక్షలుగా నిర్ణయించారు. వేరియంట్ను బట్టి గరిష్ఠ ధర రూ.29.45 లక్షల వరకు ఉంటుంది. 2026 జనవరి 14 నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. జనవరి 23 నుంచి డెలివరీలు చేపట్టనున్నారు.