వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇకపై యూజర్లకు ‘ప్లస్’ సబ్స్క్రిప్షన్లను అందించనున్నాయి. మెటా సంస్థ బిజినెస్ క్రియేటర్లు ఏఐ యూజర్ల కోసం వీటిని తెచ్చింది. ఇన్స్టా, FBలో నెలకు $3.99,వాట్సాప్లో $2.99 చొప్పున ప్లాన్లు ఉంటాయి. వీటి ద్వారా ప్రొఫైల్ కస్టమైజేషన్, సూపర్ రియాక్షన్స్ స్టోరీ వంటి ప్రత్యేక ఫీచర్లు లభిస్తాయి.
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ఫ్ పర్యావరణహిత, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ బైక్ను జూన్ 3న లాంచ్ చేయనుంది. పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా, కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే హీరో మోటోకార్ప్ సరికొత్త టెక్నాలజీ బైక్ను తీసుకొస్తోంది.
హీరో మోటోకార్ప్ సరికొత్త ‘సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.0’ బైక్ను రూ.86,500(ఎక్స్షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. 124.7cc ఇంజన్తో వచ్చే ఈ బైక్ లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/SMS అలర్ట్స్ వచ్చే డిజిటల్ మీటర్, USB టైప్-సి చార్జింగ్ పోర్ట్, సైలెంట్ స్టార్ట్ ఫీచర్ ఉన్నాయి. ఇది 5 రంగుల్లో లభిస్తుంది.
హ్యుందాయ్ కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. పలు మోడళ్లపై రూ.12,800 వరకు ధరలు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెంచిన ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తయారీ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్లే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఆటోమొబైల్ కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల మారుతీ సుజుకీ కూడా కార్లపై రూ.30 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎలక్ట్రిక్ టూవీలర్లు కొనేవారికి కేంద్రం సరికొత్త బూస్ట్ ఇవ్వనుంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఈవీ వాహనాలపై రాయితీలను పెంచేందుకు భారీ పరిశ్రమల శాఖ యోచిస్తోంది. ఇందుకోసం అదనపు నిధులు కేటాయించాలని కోరనుంది. 2026 FYగానూ ఈ స్కీమ్కు ఇప్పటికే రూ.10,900 కోట్లు కేటాయించగా, పరిశ్రమల డిమాండ్ మేరకు ఈ సబ్సిడీల గడువును జూలై చివరి వరకు పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
హోండా ఇండియా కీలక ప్రకటన చేసింది. భారత మార్కెట్లో 2030 నాటికి ఎలక్ట్రిక్, కాంపాక్ట్ ఎస్యూవీ సహా 10 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో పూర్తి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా హోండా సిటీ 2026ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.11.99 లక్షలుగా (ఎక్స్షోరూమ్) నిర్ణయించింది. ఫేస్లిఫ్ట్లో ముందరి భాగాన్ని పూర్తిగా మార్చివేసింది. హనీకూంబ్ తరహాలో ఫ్రంట్ గ్రిల్, లైట్తో కూడడిన స్ట్రిప్ ఇచ్చారు. ఆరు ఎయిర్బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, హిల్హోల్డ్ అసిస్ట్, ADAS ఫీచర్లు ఉన్నాయి.
మారుతీ సుజుకీ కార్ల ధరలు జూన్ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. అన్ని మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచనుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా ధరలు పెంచకుండా వ్యయాన్ని తగ్గించేందుకు కంపెనీ నిరంతర ప్రయత్నాలు చేసినట్లు పేర్కొంది.
మొబైల్ తయారీ సంస్థ ఒప్పో.. Oppo Find X9s, Oppo Find X9 Ultra పేరిట రెండు స్మార్ట్ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. X9 Ultra స్మార్ట్ ఫోన్ 12GB+512GB వేరియంట్ ధర రూ.1,69,999గా కంపెనీ నిర్ణయించింది. Oppo Find X9s స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లో వస్తోంది. 12GB+256GB వేరియంట్ ధర రూ.79,999, 12GB + 512GB వేరియంట్ ధర రూ.89,999గా కంపెనీ నిర్ణయించింది.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా రేపు భారత మార్కెట్లో సరికొత్త ‘సిటీ ఫేస్లిఫ్ట్’ సెడాన్ కారును విడుదల చేయనుంది. ఈ కారు ధరలను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. మార్కెట్ అంచనాల ప్రకారం.. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.12.50 లక్షల నుంచి ప్రారంభమై రూ.19 లక్షల (ఎక్స్షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. హైబ్రిడ్ మోడల్ ధర రూ.20.50 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
2025-26 నాలుగో క్వార్టర్ ఫలితాల్లో OLA ఎలక్ట్రిక్ సంస్థ ఆదాయం గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ రూ.611 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం రూ.265 కోట్లకే పరిమితమైంది. నష్టాలు మాత్రం రూ.870 కోట్ల నుంచి రూ.500కోట్లకు తగ్గాయి. EV మార్కెట్లో పోటీ పెరగడం, డిమాండ్ లేకపోవడం ఆదాయం క్షీణించడానికి కారణాలుగా భావిస్తున్నారు. ఈ క్వార్టర్లో 20,256 వాహనాలను డెలివరీ అయ్యాయి.
ఓలా ఎలక్ట్రిక్ తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి రూ.500 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. 2024-25లో ఇదే సమయంలో రూ.870 కోట్లతో పోలిస్తే 42.5% నష్టం తగ్గుముఖం పట్టింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.265 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ.611 కోట్లతో పోలిస్తే 56.62% తగ్గింది.
చైనా సంస్థ డ్రీమ్ టెక్నాలజీ ‘నెబ్యులా నెక్స్ట్01’ పేరుతో అద్భుతమైన సూపర్ కారును తీసుకొచ్చింది. ఇందులో రాకెట్ బూస్టర్లు ఉండటం వల్ల కేవలం 0.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారులో అత్యాధునిక సెన్సార్లు, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది భవిష్యత్తు వాహన రంగంలో సరికొత్త విప్లవం సృష్టించబోతోంది.
యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ ఫోల్డ్ పేరుతో యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్కు సంబంధించిన కొన్ని డమ్మీ యూనిట్లు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే, దీనిపై కంపెనీ మాత్రం ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
స్నాప్చాట్కు గట్టి పోటీ ఇచ్చేందుకు మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ‘ఇన్స్టాంట్స్'(Instants) పేరుతో సరికొత్త క్విక్ ఫొటో షేరింగ్ యాప్ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ యాప్ స్పెయిన్, ఇటలీలోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే భారత్ సహా మిగతా దేశాల్లోనూ ఈ యాప్ను విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.