దేశీయ మార్కెట్లో సుజికీ కార్లకుండే డిమాండ్ గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిడిల్ క్లాస్ పీపుల్స్కు తగ్గట్లుగా మైలేజ్, మెయింటెనెన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థ కార్లను తయారు చేస్తోంది. అయితే ఈ ఏడాదిలో 20 లక్షల కార్లను అమ్మింది. ఈ మేరకు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో 20 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్మిన మొదటి బ్రాండ్గా మారుతీ సుజికీ రికార్డు సృష్టి...
మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ను రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్షోరూమ్). అలాగే, ఈ ఎడిషన్కు రూ.11 వేల విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. ఇంజిన్తోపాటు 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. CNG వేరియంట్లో ఈ ఇంజిన్ 56bhp శక్తిని, 82.1nm యొక్క టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ గేర్బాక్స్తో మాత్ర...
మార్కెట్లో మరో సరికొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొరియర్ సర్వీస్ DHL పేరిట స్కామ్లు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. మీ ఆర్డర్ను డెలివరీ చేయడంలో అంతరాయం కలిగింది.. మీ డెలివరీ డేట్ అండ్ టైంను మళ్లీ ఫిక్స్ చేయాలంటూ QR కోడ్ను స్కాన్ చేయాలంటూ ఆగంతకులు ఇంటి బయట పాంప్లెట్ను పెడుతున్నారు. అయితే.. దీనిని స్కాన్ చేసిన అనంతరం మన ఫోన్లో సమాచారం, అకౌంట్లలో నగదు మాయమవుతాయని టెక్ ని...
వాహన పరిశ్రమలో ధరలు పెంపు ధోరణి కొనసాగుతోంది. ఇప్పటికే కీలక కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా స్కోడా ఆటో ఇండియా సైతం ధరలు పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. స్కొడాలో ఉన్న అన్ని మోడళ్ల ధరలను 3 శాతం మేర పెంచనున్నట్లు స్పష్టం చేసింది.
భారత్లో హ్యుందాయ్ క్రెటా EV లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ 2025 సంవత్సరంలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో మొదటి రోజున ప్రారంభిస్తారు. జనవరి 17న హ్యుందాయ్ క్రెటా EV భారత్లో లాంచ్ కానుంది. క్రెటా EVలో 45kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులో అమర్చిన బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 400 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.
2024లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EV) సేల్స్ భారీగా జరిగాయి. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ఓలా నంబర్-1గా కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో కంపెనీ రిటైల్ విక్రయాల సంఖ్య 4 లక్షల యూనిట్లను దాటింది. 2024 డిసెంబరన్ 15వ తేదీ వరకు లేటెస్ట్ వాహన డేటా ప్రకారం ఓలా మొత్తం 4,00,099 యూనిట్లను విక్రయించింది. సెప్టెంబర్ 9న ప్రపంచ EV దినోత్సవం సందర్భంగా కంపెనీ 3 లక్షల యూనిట్ల మైలురాయిని సాధించింది.
EVల ఛార్జింగ్ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్ధమవుతుంది. 2030 నాటికి 30 శాతం విద్యుద్ధీకరణకు రూ.16 వేల కోట్లు అవుతుందని ఫిక్కీ (FICCI) తెలిపింది. అధిక EV డిమాండ్ ఉన్న టాప్ 40 నగరాలకు ప్రాధాన్యత ఇవ్వడం కీలకమని గుర్తించింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా EVల వృద్ధికి తోడ్పడుతున్నాయి. E2W, E3W, బస్సులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించే PM E-Drive పథకంతో భారత్ అనేక ప్రోత్సాహక...
ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ ‘కవాసకి’ తమ వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. నింజా 500 కొనుగోలుపై రూ.15 వేలు, నింజా 650 బైక్ కొనుగోలుపై రూ.45 వేలు తగ్గింపు ప్రకటించింది. ఈ తగ్గింపు ఈనెల 31వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 2024 సంవత్సరం ముగుస్తుండటంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ కార్లలో ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపును సొంతం చేసుకున్న టెస్లా కంపెనీ భారత్లో తన విక్రయాలు ప్రారంభించనుంది. ఈ మేరకు ఢిల్లీలో షోరూం ప్రారంభించడానికి కావాల్సిన స్థలం కోసం డీఎల్ఎఫ్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. కాగా.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలనే నిర్ణయాన్ని టెస్లా మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
క్వాంటమ్ అనే ఓ ప్రత్యేక రకమైన కంప్యూటర్ చిప్ను గూగుల్ ఆవిష్కరించింది. క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించేందుకు రూపొందించింది. సాధారణ చిప్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఎంతటి క్లిష్టతరమైన గణాంక సమస్యలనైనా కేవలం 5 నిమిషాల్లోనే పరిష్కరిస్తోంది. కాగా, ఇదే పనిని ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లు చేయాలంటే మాత్రం విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువ సంవత్సరాలు పడుతుందట.
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఈనెల 20న కొత్త చేతక్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. సింగిల్ ఛార్జ్లో 123 కిలోమీటర్ల నుంచి 137 కిలోమీటర్ల రేంజ్ను ఇస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ ధరలు రూ.96,000-రూ.1,29,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఇక కొత్త ఈవీ ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ హ్యండ్లింగ్, రైడ్ నాణ్యత మరింత మెరుగ్గా ఉండ...
వాట్సప్ బీటాలో ప్రీ సెట్ చాట్ లిస్ట్ తొలగించే ఫీచర్ను వాట్సప్ ఆండ్రాయిడ్ 2.24.23.23 వర్షన్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫీచర్తో అన్ రీడ్, గ్రూప్స్ వంటి ప్రీ సెట్ ఫిల్టర్లను తీసివేయవచ్చు. దీన్ని చేయడానికి యూజర్లు చాట్ ఇంటర్ఫేస్లోని ఫిల్టర్ను నొక్కి పట్టుకోవడంతో తొలగించే ఆప్షన్ను యాక్సెస్ చేయవచ్చు.
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది జనవరి నుంచి వాహన ధరలను పెంచనున్నట్లు కంపెనీ ఎక్స్ఛ్ంజీ ఫైలింగ్ తెలిపింది. కారు మోడల్, వేరియంట్ ఆధారంగా అత్యధికంగా 4 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ముడిసరుకులు, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి అయానిక్ వరకు ధరలను పెంచే యోచనలో ఉన్నాయి.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మోడళ్ల కార్ల ధరలు రూ.25 వేలకు పెంచనున్నట్లు వెల్లడించింది. ముడి సరకు వ్యయం, ట్రాన్స్పోర్టు ఛార్జీలు పెరగడం కారణం పెంచాల్సి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఈవీ అయానిక్ వరకు రూ.5.92 లక్షల నుంచి రూ.46.05 లక్షల మోడళ్లను హ్యుందాయ్ విక్రయిస్తుంది.
యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘1998 నుంచి యాపిల్లో పనిచేస్తున్నాను.. కంపెనీ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం కష్టం’ అని చెప్పారు. ఇక దిగిపోయే సమయం ఆసన్నమైందని నా మనసు చెప్పే వరకు పని చేస్తూనే ఉంటానని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. దీంతో ఆయన ఇప్పట్లో రిటైర్ అవ్వరంటూ టెక్ వర్...