చిన్నతనంలో ప్రేమ, ఆప్యాయతలకు దూరమైన పిల్లలకు భవిష్యత్తులో మరణ గండం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. జ్యూరిచ్ పరిశోధన ప్రకారం.. అనురాగం కరువైన వారిలో మరణించే అవకాశం 48 శాతం అధికంగా ఉంది. పిల్లల ఎదుగుదలలో మానసిక సాన్నిహిత్యం ఎంతో కీలకమని, సరైన సంరక్షణ లేకపోతే వారి జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ఊపిరితిత్తుల లోపల వాపు రావడం లేదా మచ్చలు ఏర్పడటం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అలాంటివారు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా వ్యాయామం, ఈత కొట్టడం చేయండి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. బెర్రీ పండ్లు, జామకాయలు, ఆకుకూరలు వంటి ఆహారం తీసుకోండి. ఇవి ఊపిరితిత్తులలో వాపును తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో నడక ఒక అద్భుత ఔషధం. రోజూ 30 నిమిషాల నడకతో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటును దూరం చేసుకోవచ్చు. ఇది బరువును తగ్గించడమే కాకుండా ఎముకలను దృఢంగా మారుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రను అందించడంలోనూ సహాయపడుతుంది.
బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, మన శరీరం దానికంతట అదే చల్లబరుచుకోవడానికి చాలా కష్టపడుతుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం జరుగుతుంది. ఈ శారీరక అలసట వల్ల మనకు తెలియకుండానే చిరాకు వస్తుంది. చెమట ద్వారా ఒంట్లోని నీరు, లవణాలు బయటకు పోతాయి. నీరు తగ్గినప్పుడు తలనొప్పి, అలసట వస్తాయి. మెదడుకు సరిపడా నీరు అందకపోతే ఏకాగ్రత తగ్గి, చిన్న విషయాలకే కోపం వస్తుంది.
శాకాహారులకు పనీర్ మంచి ప్రోటీన్. అయితే దీనిని అతిగా వేయించడం వల్ల పోషకాలు తగ్గి కొవ్వు పెరుగుతుంది. రోజుకు 100-150 గ్రాముల లోపే పనీర్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కూరగాయలతో కలిపి తింటే మరింత ప్రయోజనం ఉంటుంది. తాజా పనీర్ ఎంచుకుని, సరైన పద్ధతిలో వండుకుంటేనే శరీరానికి పూర్తిస్థాయిలో ప్రోటీన్ అందుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రక్తహీనతతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహార నియమాలతో దానిని దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా శనగలు, బెల్లం కలిపి తింటే హిమోగ్లోబిన్ వేగంగా పెరుగుతుంది. ఐరన్ ఒంటికి పట్టాలంటే విటమిన్-సి అధికంగా ఉండే మామిడి, జామ వంటి పండ్లు తీసుకోవాలి. అలాగే రోజూ పప్పుధాన్యాలు, పెరుగు లేదా లస్సీని డైట్లో చేర్చుకుంటే అలసట తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
మీ ఆరోగ్య స్థితిని మూత్రం రంగు ద్వారా గుర్తించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. తెలుపు రంగు నీరు ఎక్కువగా తాగుతున్నట్లు సూచిస్తుంది. ఆరెంజ్ లేదా బ్రౌన్ రంగులో ఉంటే డీహైడ్రేషన్ లేదంటే లివర్ సమస్య ఉండవచ్చు. ఒకవేళ ఎరుపు రంగులో వస్తే అది కిడ్నీ సమస్యకు సంకేతం కావచ్చు, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
బ్లూబెర్రీలు పోషకాల గనులు. వీటిని శీతలీకరించడం వల్ల శరీరానికి అందే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రీజింగ్ ప్రక్రియలో పండ్ల కణజాల నిర్మాణం విచ్ఛిన్నం అవ్వడం వల్ల, వాటిలోని పోషకాలను మన శరీరం సులభంగా శోషించుకుంటుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాల కోసం తాజా పండ్ల కంటే శీతలీకరించిన బ్లూబెర్రీలు తీసుకోవడం ఉత్తమం.
ప్రశాంతత, నిశ్చలత్వం మనిషి సహజ లక్షణాలు. ఒత్తిడి, ఉద్వేగాలు కేవలం తాత్కాలికమేనని గుర్తించాలి. క్లిష్ట పరిస్థితుల్లోనూ చెదరని ‘స్థితప్రజ్ఞత’ను అలవరుచుకోవడం ద్వారానే మనం ప్రశాంతమైన జీవితాన్ని సాగించగలం. భావోద్వేగాలను నియంత్రించుకుంటూ నిలకడగా ముందుకు సాగడమే నిజమైన జీవన నైజం.
మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం, తగినంత నిద్ర చాలా అవసరం. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ, జంక్ ఫుడ్స్, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉండటమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రస్తుత సమాజంలో రాజకీయ, పోలీస్, న్యాయవ్యవస్థ వంటి కీలక రంగాలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. వ్యవస్థలో కొందరు చేసే అవినీతి.. మొత్తం వృత్తికే మచ్చ తెస్తోంది. సమాజానికి అవగాహన పెంచాల్సిన జర్నలిజం కూడా ఈ వలలో చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి చేటు. వ్యక్తులు మారితేనే వ్యవస్థ మారుతుంది. అప్పుడే వృత్తులకు గౌరవం, సమాజానికి భద్రత లభిస్తాయి. మార్పులో మనమూ భాగస్వాములవడం చాలా ముఖ్యం.
బలమైన రోగనిరోధక శక్తి ఉంటే వైరస్లు, బ్యాక్టీరియాలు దరిచేరవు. ఇందుకోసం సి-విటమిన్ ఉండే నిమ్మ, కమల, విటమిన్-బి6 గల అరటి, చికెన్, శెనగలు తీసుకోవాలి. విటమిన్-ఎ కోసం క్యారెట్, గుమ్మడి, విటమిన్-ఇ కోసం నట్స్, బాదం అవసరం. ఎముకల పుష్టికి, రక్షణకు డి-విటమిన్ ఇచ్చే గుడ్లు, పాలు తీసుకుంటూ.. రోజూ ఎండలో 10-30 నిమిషాలు గడపాలి.
వేసవిలో లభించే మల్బరీ పండ్లు పోషకాల గని. వీటిలోని విటమిన్ C, K, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా రక్తహీనత, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. విటమిన్ A కంటి చూపును మెరుగుపరిస్తే, క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
90% నీరుండే తాటిముంజలు వేసవి తాపాన్ని తగ్గించే సహజ ఎలక్ట్రోలైట్లు. వీటిలోని ఫైబర్, విటమిన్ ఎ, సి, కె రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొటాషియం గుండెకు, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ మధుమేహులకు మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, గర్భిణులకు ఇవి ఉత్తమ ఆహారం. వీటిని పేస్టులా ముఖానికి రాస్తే చర్మం కాంతిమంతంగా మారి, చెమటకాయలు తగ్గుతాయి.