• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యం

NZB: కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజ్య లక్ష్మి (27) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా వారి ఆచూకీ లభించలేదని భర్త గంగాధర్ పేర్కొన్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సాయిలు(27) హోటల్‌కు వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయారు.

March 10, 2026 / 10:06 PM IST

మున్సిపల్ కమిషనర్‌పై బీజేపీ కౌన్సిలర్ల ఫైర్.!

కామారెడ్డి పట్టణంలోని వార్డుల్లో శానిటేషన్ లేబర్లు ఎక్కడ పని చేస్తున్నారని BJP కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు. తమ వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నేడు కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను కమిషనర్ ముందు ప్రస్తావించగా కమిషనర్ నుంచి సమాధానం రాకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 10, 2026 / 10:02 PM IST

రేపు స్పీకర్ చేతుల మీదుగా సబ్ స్టేషన్ ప్రారంభం

VKB: వికారాబాద్ మండలం జైలుపల్లిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్, మెటీరియల్ గోడౌన్‌ను రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించనున్నారని విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) రవి ప్రసాద్ తెలిపారు. దాదాపు రూ. 6 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారన్నారు. ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

March 10, 2026 / 09:46 PM IST

సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు రాత్రి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా గౌరవ అధ్యక్షులు కురుమూర్తి మాట్లాడుతూ.. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుంటుందని భావించి వారికోసం విద్యా అందించడంలో కృషి చేసిందన్నారు.

March 10, 2026 / 09:37 PM IST

వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

BDK: చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలో ని జాంబవంతుడి గుట్టల పై వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఆలయ నిర్వహకులు గత మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజైన ఇవాళ కళ్యాణాన్ని గిరిజన పూజారులు గిరిజన ఆచార సంప్రదాయాలలో ఎల్లమ్మ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు.

March 10, 2026 / 09:36 PM IST

తీవ్ర విషాదం.. 10 రోజుల్లో 24 మంది మృతి

MHBD: కొత్తగూడ మండల వ్యాప్తంగా మార్చి 1వ నుంచి 10వ తేదీ వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది గడ్డిమందు తాగి ఆత్మహత్య, మిగతా 13 మంది సాధారణ కారణాల వల్ల చనిపోయారు. ఈ మరణాల శ్రేణి స్థానికులను భయాందోళనలోకి గురిచేస్తోంది. మరణాల గురించి ఊర్లో కూడా తెలియని ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మండలంలో విషాద వాతావరణం నెలకొంది.

March 10, 2026 / 09:35 PM IST

ఎస్సీ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

జనగామ పట్టణ కేంద్రంలోని ధర్మకంచ SC బాలుర హాస్టల్ ని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలను, కిచెన్ గదిని పరిశీలించారు. హాస్టల్‌ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలని, అలాగే వంటకి సంబందించి తాజా కూరగాయలను మాత్రమే వాడాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

March 10, 2026 / 09:10 PM IST

మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలి: కలెక్టర్

BHNG: ప్రభుత్వ పాఠశాలలు, SC, ST, BC, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, దీనిపై ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. నిబంధనల ప్రకారం భోజన నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు.

March 10, 2026 / 09:10 PM IST

‘బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలి’

SRPT: తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కనకయ్య కోరారు. ఈరోజు చిలుకూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు.

March 10, 2026 / 09:05 PM IST

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

KMR: సంగోజివాడి గ్రామంలో సీఎం, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ చిత్రపటాలకు మంగళవారం మహిళలు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు.

March 10, 2026 / 09:05 PM IST

విద్యార్థులు ఆరోగ్య వివరాలు ఆరా తీసిన DMHO

BDK: మణుగూరు బీసీ బాలుర వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులు తీసుకున్న ఆహార వివరాలను  DMHO మంగళవారం అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన, చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వసతి గృహానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు.

March 10, 2026 / 09:05 PM IST

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నగరంలో బోనాల పండుగ సందర్భంగా రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే★  గవిచెర్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి★ వర్ధన్నపేటలో పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు★ వరంగల్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబల్ రోడ్డు ప్రమాదంలో మృతి

March 10, 2026 / 09:00 PM IST

1.3 కేజీల గంజాయి పట్టివేత

MDCL: ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడ, పర్వతాపూర్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడు కుమ్మరి గోపి వద్ద 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మున్నా అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.

March 10, 2026 / 08:59 PM IST

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

KNR: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గంగాధర మండలం మధుర నగర్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి స్పందన భారీ లభించింది. సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ రాజు కుమార్ పాల్గొని గ్రామస్థులకు వైద్య సేవలపై అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో వైద్యులు పలువురికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

March 10, 2026 / 08:56 PM IST

‘బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి’

KNR: శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన ‘పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026′ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో శిక్షణ తరగతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

March 10, 2026 / 08:56 PM IST