TG: నల్లగొండ జిల్లా బంగారిగడ్డ గ్రామ సర్పంచ్ పదవికి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, గ్రామస్తులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. దీంతో వారి మధ్య వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి గ్రామాభివృద్ధికి రూ.73 లక్షలు ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిధులు గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించారు.
AP: విశాఖ కైలాసగిరిపై ఐకానిక్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి వైజాగ్ టూరిస్టులకు కొత్త అనుభవం పరిచయం కానుంది. భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్డ్ నిర్మాణంలో గ్లాస్ బ్రిడ్జ్గా గుర్తింపు రానుంది. రూ.7 కోట్లతో నిర్మించిన ఈ గ్లాస్ స్కైవాక్ పొడవు 55 మీటర్లు ఉంది. దీనిపై ఒకేసారి 40 మంది సందర్శకులు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
కాంగ్రెస్ నేత శశి థరూర్ తీరుపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు సోనియా గాంధీ నిర్వహించిన కీలక భేటీకి ఆయన డుమ్మా కొట్టారు. తల్లి అనారోగ్యం అని కారణం చెప్పినా.. ఆయన మోదీని పొగడటం, పార్టీ మీటింగ్స్ ఎగ్గొట్టడంపై పార్టీ సీరియస్గా ఉంది. గతంలో పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ ఈవెంట్కు వెళ్లారు. దీంతో పార్టీ మారతారని ప్రచారం జోరందుకుంది.
VKB: పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.
TG: డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో MCHRDలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో మెస్సీతో కలిసి రేవంత్ ఫుట్బాల్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ కోసం రేవంత్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో 10 బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే కాలం చెల్లిన 120 చట్టాలను రద్దు చేసే బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్లో ఇవాళ ‘SIR’ అంశంపై రచ్చ జరిగేలా ఉంది. ఎలక్షన్ కమిషన్ నిర్వహించే SIRపై చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి. దీనిపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు. జీరో అవర్ రద్దు చేసి, మిగతా పనులన్నీ పక్కనపెట్టి దీనిపైనే ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేయబోతున్నారు.
TG: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై MP చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం 15 రోజులే నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ భద్రత, ఢిల్లీ కాలుష్యం, ప్రజాస్వామ్యం, రాష్ట్రాల ఆర్థిక భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రకృతి విపత్తుల సహాయంపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.
TG: పార్లమెంట్ సమావేశాల్లో దేశ భద్రతపై చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏంచేస్తోందని, SIR పేరిట ప్రజల ఓటుహక్కును కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో శాశ్వతంగా ఉండాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని మండిపడ్డారు. సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, డెమోక్రసీపై చర్చ జరగాలన్నారు.
HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్ బాల్ స్టేడియాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. రెడ్ హిల్స్, కాప్రా, మల్లేపల్లిలో ఈ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికోసం రూ. 15 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది.
CTR: ఎస్ఆర్ పురం మండలం డీకే మర్రిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు శోభ అనే మహిళ పూరిగుడిసెకు నిప్పు పెట్టారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూరిగుడిసెలో ఉన్న నిత్యవసర సరుకులు, బీరువాలో ఉన్న 30 వేల డబ్బు పూర్తిగా దగ్ధమైంది. పూరిగుడిసెకు నిప్పు పెట్టిన వారిపై తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: సీతానగరం మండలం బొబ్బిలంకలో సోమవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు MLA చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ఒక పండగలా నిర్వహిస్తుందని, కొత్తగా పెన్షన్ మంజూరు విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాల అస్త్రం ప్రయోగించారు. ముఖ్యంగా ‘SIR’ (ఓటర్ల జాబితా సవరణ) అంశంపై చర్చ జరగాల్సిందేనంటూ ఎంపీ మాణిక్కం ఠాగూర్ నోటీసు ఇచ్చారు. జీరో అవర్ రద్దు చేసి, మిగతా పనులన్నీ పక్కనపెట్టి దీనిపైనే చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. సభలో దీనిపై తక్షణం చర్చకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను డిమాండ్ చేశారు.
AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. దర్శనీయ ప్రవేశాలు పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను మూసేశారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులను అలిపిరి వద్ద TTD భద్రతా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమలలోని ఐదు డ్యామ్లు పూర్తి నిండి పొంగి పొర్లుతున్నాయని TTD వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.
HYD: రీజినల్ రింగ్ రోడ్ పనులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 6 లేన్ రోడ్ నిర్మాణంలో భాగంగా దాదాపు 161 కిలోమీటర్ల పనులకు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్ణయించారు. గతంలో నాలుగు లైన్లను నిర్మించాలని నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా 6 లైన్స్ నిర్మించాలని కోరింది.