టీమిండియా మాజీ పేసర్ మోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మోహిత్ 2013లో అంతర్జాతీయ అరంగేంట్రం చేశాడు. హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం నుంచి భారత జెర్సీ ధరించడం, IPLలో ఆడటం వరకు తనకు సపోర్ట్గా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
NLG: రామన్నపేటలోని భవిత సాహితీ విద్యా వనరుల కేంద్రంలో నల్గొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి గవ్వ జ్యోతి హాజరై పర్యవేక్షించారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు డా. వరుణ్ రెడ్డి, డా. ఉదయ్లు కలిసి స్థానిక ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించారు.
TG: రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్తో పాటు సమాన వేతనం అమలు చేస్తూ విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో నోటిఫికేషన్ జారీ చేయగా… కొందరిని 2013లో.. మరికొందరిని 2014లో రెండు విడతలుగా నియమించారు. దీంతో వేతనంలో తేడాలు, సీనియారిటీ సమస్యలు తలెత్తాయి. ఈ విషయంలో విచారణ జరిపిన న్యాయస్థానం టీచర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
AP: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ‘రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నా. ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం’ అని సీఎం వెల్లడించారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై స్థానిక వైసీపీ ఇన్ఛార్జి రవికుమార్ ఇటీవల నిరాధార వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. ఇవాళ ఆమదాలవలస పోలీసు స్టేషన్లో వైసీపీ ఇన్ఛార్జిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు.
VZM: 2020లో సంతకవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు నాలుగు సంవత్సరాల ఆరు నెలల జైలు, రూ.12,000 జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. నిందితులు వెంపటాపు గోపి , కొప్పల రామినాయుడు బాధితుడిని కులం పేరుతో దూషించి, దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు.
HR88B888 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ను హిసార్కు చెందిన వ్యక్తి రూ.1.17 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే గడువులోగా ఆ మొత్తాన్ని చెల్లించడంలో అతను విఫలంకావడంతో దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రూ.1.17 కోట్లను అతను చెల్లించగలడా? అతనికి ఆర్థిక స్తోమత ఉందా? అతని ఆదాయమెంతా? అనేది నిర్థారించాలని హర్యానా మంత్రి అనిల్ తెలిపారు.
AP: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వైబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 10 నుంచి రెండు విడతల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.
MBNR: ఏఐసీసీ సంఘటన సృజన్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసినట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ నిబద్ధతగల నాయకుడు కావడంతో పదవీకి ఆయనను ఎంపిక చేశారని తెలిపారు.
ELR: పెదపాడు మండలం అప్పనవీడు సమీపంలో గల కొత్త రేమల్లె మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలకు, పదివేల రూపాయల విలువ గల సామాగ్రిని గ్రామానికి చెందిన తుమ్మల పూర్ణచందర్రావు వితరణగా అందించారు. ఈ మేరకు పాఠశాల హెచ్.ఎం. వెలమర్తి రవిబాబుకు బుధవారం అందజేశారు. పూర్ణచందర్రావు మాట్లాడుతూ.. గ్రామం మరియు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు.
WGL: పర్వతగిరి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం బుధవారం విస్తృత పరిశీలనలు చేపట్టింది. తురకల సోమారం క్రాస్ రోడ్, పర్వతగిరి చౌరస్తా పరిసరాల్లో వాహనాలను ఆపి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు దేవకచరణ్, అనిల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
GNTR: తాడికొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం వార్షిక తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. విలేజ్ అడాప్టెడ్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీసుల ద్వారా క్షేత్రస్థాయి సమాచారం సేకరించాలన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, గంజాయిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రౌడీషీటర్లపై నిఘా ఉంచాలన్నారు.
TG: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కుముదిని ఎమ్మెల్సీ కవిత కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. సీఎం అధికారిక కార్యక్రమాలతో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చేలా సీఎం జిల్లాల పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
KNR: హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం మహా దివ్య పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పడి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పేద పండితులు అవధారుల భాస్కర్ శర్మ, కాట్రపల్లి శ్రీకాంత్ శర్మల మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ పడి పూజ వేడుకల్లో అయ్యప్ప మాల ధరించిన సుమారు 300 మంది స్వాములు, 200 మంది భక్తులు పాల్గొన్నారు.