కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్(81) కన్నుమూశారు. కాన్పూర్లో ఆయన తుదిశ్వాస విడిచారు. 2004-2009 వరకు హోంశాఖ సహాయమంత్రిగా, 2011-2014 మధ్య కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. కేంద్రమంత్రి కావడానికి ముందు 2000-2002 వరకు ఆయన UPCC అధ్యక్షుడిగా సేవలందించారు. శ్రీప్రకాశ్ మృతిపట్ల కాంగ్రెస్ అగ్ర నేతలు సంతాపం తెలిపారు.
1759: గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నోలీ మరణం1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే ఫోనోగ్రాఫ్ ప్రదర్శన1901: చిత్రకారుడు, పద్మశ్రీ గ్రహీత శోభా సింగ్ జననం1982: నటి, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య జననం1993: పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా మరణం2009: తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా విధించింది. పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ బ్యాంకుపై రూ.91 లక్షల ఫైన్ విధించినట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు మన్నకృష్ణ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కూడా రూ.3.10 లక్షల జరిమానా విధించింది. వినియోగదారుల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
భారత మహిళల చీఫ్ కోచ్గా సాంటియాగో నివా ఎంపికయ్యాడు. 2017-22 మధ్య ఆయన జాతీయ బాక్సింగ్ హై ఫెర్ఫార్మెన్స్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక నుంచి మహిళా బాక్సర్లకు కోచ్గా సేవలందించనున్నట్లు బీఎఫ్ఐ ప్రకటనలో పేర్కొంది. భారత బాక్సర్లతో తిరిగి మమేకం కావడం సంతోషంగా ఉందని సాంటియాగో తెలిపాడు.
TG: హైదరాబాద్ ఫిలింనగర్లో కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఐపీఎస్ శశికాంత్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, శశికాంత్ ఇంట్లో తనిఖీల సమయంలో శ్రవణ్ కుమార్ రూ.25 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ను చోరీ చేసినట్లు సమాచారం.
ఇండస్ట్రీ బాగుండాలి.. దీనిపై సినీపెద్దలు ఆలోచించాలని నటుడు బాలకృష్ణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘అఖండ-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బాలయ్య మాట్లాడారు. సినిమాల విషయంలో తాను కూడా కొన్ని తప్పులు చేశానని, అపజయాలకు కుంగిపోనని చెప్పుకొచ్చారు. సినిమాలను వేగంగా పూర్తిచేయాలని, సినీ పరిశ్రమలో క్రమశిక్షణ ఉండాలని పేర్కొన్నారు. గౌరవం లేని చోట తాను ఉండనని స్పష్టం చేశారు.
MH గోండియా జిల్లా దరేక్సా పోలీసుల ఎదుట 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఇందులో ఎంఎంసీ జోన్ ముఖ్య ప్రతినిధి అనంత్ ఉన్నారు. జనవరి 1 నాటికి ఆయుధాలు వదులుకుంటామని ప్రకటించిన ఒక్క రోజు వ్యవధిలోనే లొంగిపోవడం గమనార్హం. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఎంఎంసీ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్పై రూ.కోటి రివార్డు ఉంది.
‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సినిమాలు ఉత్తేజపరుస్తాయి.. కొన్ని ఆలోచించేలా చేస్తాయి.. కానీ, ఇది మన సనాతన ధర్మాన్ని చూపించే సినిమా అని తెలిపారు. తప్పును నిలదీయడమే సనాతన ధర్మం అని, సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే వాళ్లు సైనికులు అయితే.. ధర్మాన్ని కాపాడే సైనికులు అఘోరాలు అని పేర్కొన్నారు.
AP: భారత్ ఆర్థిక శక్తి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని సీఎం చంద్రబాబు అన్నారు. 2025-26 రెండో త్రైమాసికంలో దేశ GDP వృద్ధి రేటు 8.2% నమోదై భారత్ను ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిపిందన్నారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న సంస్కరణలు, ఆవిష్కరణలు, ప్రజల కృషికి నిదర్శనమని గుర్తుచేశారు.
TG: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్ప్యాక్లు ఇతర వ్యక్తిగత వస్తువులను భద్రపరిచేందుకు ఈ స్మార్ట్ లాకర్లు ఉపయోగపడతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం స్మార్ట్ లాకర్లను ఉప్పల్ మెట్రో స్టేషన్లో ప్రారంభించారు. మరిన్ని వివరాలకు http://www.tuckit.inని సంప్రదించాలి.
‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో బాలకృష్ణ తన పవర్ఫుల్ స్పీచ్తో ఆకట్టుకున్నారు. తన కొత్త సినిమా #NBK111 (వర్కింగ్ టైటిల్)లోని డైలాగ్తో అభిమానులను ఉర్రూతలూగించారు. ‘చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ, చరిత్రను తిరగరాసి మళ్లీ చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే ఉంటాడు. నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర’ అని డైలాగ్ చెప్పారు.
తాజాగా నథింగ్ ఫోన్ కంపెనీ కొత్త మోడల్ ఫోన్ తీసుకువచ్చింది. నథింగ్ ఫోన్ 3ఏ లైట్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఫోన్ 3ఏ లైట్ 6.77 అంగుళాల AMOLED డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50MP (Main) + 8MP (UW) + 2MP (Macro) Rear Camera కూడా ఈ ఫోన్ కు అందిస్తున్నారు. ఇక సెల్ఫీల కోసం 16MP కెమెరా కూడా అందిస్తోంది […]
సాఫ్ట్బ్యాంక్ మద్దతు కలిగిన సంస్థ మీషో రూ.5,421 కోట్ల IPO డిసెంబర్ 3న సబ్స్క్రిప్షన్కు రానుంది. డిసెంబర్ 5న ముగియనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.105-111గా నిర్ణయించింది. షేరు గరిష్ఠ ధర వద్ద రూ.50,096 కోట్ల విలువతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. డిసెంబర్ 2న యాంకర్ ఇన్వెస్టర్లకు విండో తెరుచుకుంటుంది.
NDL: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం దొర్నిపాడు మండలం గుండుపాపుల గ్రామం సందర్శించారు. కలెక్టర్ రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ వంటి పథకాల లబ్ధి అందుతున్న విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు.
‘అఖండ 2’ సినిమాకు సంగీతం అందించే అవకాశం దొరకడం చాలా అదృష్టమని తమన్ అన్నాడు. ఈ సినిమాలో శివుడి రూపంలో బాలకృష్ణ పడిన కష్టం చూస్తే తన కళ్ళలో నీళ్లు వచ్చాయని తెలిపాడు. మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా బాలయ్య ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నటించారని ప్రశంసించాడు. ‘శివుడి రూపంలో బాలయ్యను తెరపై చూసినప్పుడు, ప్రేక్షకులు చేతులెత్తి దండం పెడతారు’ అని తమన్ చెప్పుకొచ్చాడు.