గత కొద్ది నెలలుగా పాక్ ఆర్మీపై దాడులు చేస్తూ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLR) దాయాది దేశానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో BLR, దాని అనుబంధ మజీద్ బ్రిగేడ్ను ఉగ్రసంస్థలుగా ప్రకటించాలంటూ ఐరాస భద్రత మండలిలో పాక్ ప్రతిపాదించింది. దీనికి చైనా వత్తాసు పలికింది. కాగా, ఇప్పటికే ఈ రెండింటిని ఉగ్ర సంస్థలుగా గుర్తిస్తూ అమెరికా నోటిఫై చేసింది
ఆసియా కప్-2025లో పాకిస్తాన్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. పసికూన UAEని ఓడించి లీగ్ దశను ముగించింది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. తాము ఏ జట్టునైనా ఓడిస్తామని తెలిపాడు. తమ బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉందన్నాడు. షాహిన్ అఫ్రిది బ్యాటింగ్ మెరుగుపడిందన్నాడు. ఈ క్రమంలో మున్ముందు ఏ జట్టునైనా తాము ఓడిస్తామని చెప్పాడు. కాగా, భారత్తో పాక్ మరోసారి తలపడనుంది.
ఆసియా కప్-2025లో పాకిస్తాన్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. పసికూన UAEని ఓడించి లీగ్ దశను ముగించింది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. తాము ఏ జట్టునైనా ఓడిస్తామని తెలిపాడు. తమ బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉందన్నాడు. షాహిన్ అఫ్రిది బ్యాటింగ్ మెరుగుపడిందన్నాడు. ఈ క్రమంలో మున్ముందు ఏ జట్టునైనా తాము ఓడిస్తామని చెప్పాడు. కాగా, భారత్తో పాక్ మరోసారి తలపడనుంది.
శబరిమల పుణ్యక్షేత్రంలో విగ్రహాలలో బంగారం అదృశ్యంపై కేరళ హైకోర్టు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. దేవస్వం బోర్డు ఇటీవల శబరిమల ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూతతో ఉన్న రాగి పలకలను మరమ్మతుల కోసం తొలగించింది. హైకోర్టు ఉత్తర్వులతో బోర్డు వాటిని తిరిగి తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుతం అందులో కొంత బంగారం తగ్గిందనే ఆరోపణలతో దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
ADB: విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నెరడిగొండ మండలంలోని బుగ్గరం (బి) గ్రామంలో గల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినిలు హ్యాండ్ బాల్ పోటీల వసతి ఖర్చుల కొరకు రూ. 5వేల అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు రాథోడ్ సురేందర్ ఉన్నారు.
VSP: విశాఖపట్నం గోపాలపట్నం నరసింహనగర్లో రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను గురువారం ఉదయం జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. జేసీబీతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను కూల్చివేస్తున్నారు. రహదారి ఆక్రమించుకుని దుకాణాల ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. కాగా దుకాణాలను అక్రమం ఆవేదన వ్యక్తం చేశారు.
AP: యూరియా కొరత అనేది అత్యవసరమైన అంశం అని మండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతూ ఎదురు చూస్తున్నారు, వెంటనే సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. రేపటి వరకు వాయిదా వేయకుండా ఇవాళే మంత్రి సమాధానం చెప్పాలన్నారు. రైతులకు యూరియా అందించే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ విమర్శించారు.
MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలు వస్తుండడంతో జిల్లా వైద్యాధికారి వైద్య శిబిరాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. యావపూర్ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి, రోగులకు మందులను అందజేశారు.
SRD: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు నల్లకుంట చెరువులోకి వర్షపు నీటితో పాటు హెటేరో డ్రగ్స్ పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు కలుస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని వాపోయారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
BDK: కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈసారి భద్రాచలం- కొత్తగూడెం మధ్య ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు ప్రభుత్వం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
SKLM: మందసలో జరిగిన వీధి కుక్కల దాడిలో నలుగురు గాయాలపాలయ్యారు. బయట వెళ్తుండగా ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను కరిచినట్లు తెలిపారు. క్షతగాత్రులు మందస పీహెచ్సీలో వైద్యం పొందుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.
కర్ణాటక CID ఓట్ల తొలగింపు వివరాలు కోరినా EC స్పందించటం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. కర్ణాటక ఓటర్లకు లింక్ చేసిన నకిలీ ఫోన్ నెంబర్లు ఎవరివని ప్రశ్నించారు. వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చటానికి ఓట్ల తొలగింపు ఐడీల వివరాలతో పాటు OTPలు ఇవ్వాలని ఈసీని కోరారు. మహారాష్ట్ర రాజురా స్థానంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని తెలిపారు.
SRD: సంగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ భారీ వర్షానికి చెరువును తలపిస్తోంది. వర్షం నీరు పాఠశాల ఆవరణలో నిలిచిపోవడంతో విద్యార్థులు తరగతి గదులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణలో మట్టి పోసి, నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టెలికాం నెట్వర్క్లను నడిపించేందుకు ‘అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్’ అనే సంస్థ పనిచేస్తుంది. ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక ప్రత్యేక కంట్రీ కాలింగ్ కోడ్ను కేటాయిస్తుంది. భారత్ 9వ జోన్లో ఉండటంతో కోడ్ 9తో ప్రారంభమవుతుంది. భారత్కు రెండంకెల చిన్న కోడ్ +91 కేటాయించారు. ఇంటర్నేషనల్ కాలింగ్ను సులభతరం చేసేందుకు ఏర్పాటు చేశారు.
ELR: గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లాలో స్వల్ప వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నూజివీడులో 4.8 మి.మీ, లింగపాలెంలో 4.4, అగిరిపల్లిలో 1.4, దెందులూరులో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. భీమడోలులో 0.8., కామవరపుకోటలో 0.6 మి.మీ కురిసినట్లు అధికారులు తెలిపారు. మిగతా 22 మండలాల్లో వర్షం లేదు. జిల్లాలో సగటున 0.5 మి.మీ.గా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.