పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు వస్తోన్న వార్తలను అక్కడి ప్రభుత్వం ఖండించింది. అయితే ఇమ్రాన్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. భారీ ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు రావల్పిండిలో ప్రభుత్వం సెక్షన్ 144 విధించింది. రేపటి వరకు అన్ని బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్టార్ నటి, మిల్కీ బ్యూటీ తమన్నా రూటు మార్చింది. ఓదెల-2, రైడ్-2 తర్వాత ప్రస్తుతం మరో క్రేజీ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లెజెండరీ డైరెక్టర్ వి. శాంతారాం బయోపిక్ లో ఆయన భార్య ‘సంధ్య’ పాత్రలో తమన్నా నటించనుంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా, అభిజిత్ దేశ్పాండే దర్శకుడు. కథ వినగానే తమన్నా ఓకే చెప్పేసిందట. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల గిరిప్రదక్షిణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. స్వామివారి గిరిప్రదక్షిణ అవకాశం, గర్భాలయ దర్శనం ప్రసాదం తదితర సౌకర్యాలు కల్పించిన దేవస్థానం ఈవో వెంకట్రావు, అధికారులకు స్థానిక అయ్యప్ప సేవ సమితి వారు కృతజ్ఞతలు తెలిపి, వారిని ఘనంగా సన్మానించారు.
AP: మంత్రి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు జరిగే అటల్ సందేష్ బస్సు యాత్రకు బీజేపీ నేతలకు ఆహ్వానాలు అందించనున్నారు. ధర్మవరం నుంచి ఈ యాత్ర చేపట్టన్నారు.
ADB: ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో మురుగునీటిని నిల్వ చేయవద్దని సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్ అన్నారు. మంగళవారం ఇచ్చోడ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు నిల్వ చేసి ఉంచిన మురుగు నీటిని శుభ్రపరిచారు. అనంతరం మురుగుకాలువల్లో బ్లీచింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వసంత్, సుభాష్, ఆశ కార్యకర్త సుశీల పాల్గొన్నారు.
పార్లమెంట్ సమావేశాలు రచ్చరచ్చగా మొదలయ్యాయి. లోక్సభలో విపక్షాలు ‘SIR’ ప్రక్రియను వెంటనే ఆపాలంటూ ఆందోళనకు దిగాయి. దీనిపై సభలో చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. అటు పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు భారీ ధర్నా చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
NZB: బోధన్ ఎక్సైజ్ కార్యాలయంలో అనుమతి లేకుండా చెట్లను నరికిన అధికారులకు అటవీశాఖ అధికారులు రూ. 3,490 జరిమానా విధించారు. మొదటి నుంచి ఎక్సైజ్ అధికారుల తీరు వివాదాస్పదంగానే ఉంటుంది. వారి నిర్లక్ష్యానికి అటవీశాఖ అధికారులు విధించిన జరిమానా మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు తీరుమార్చుకొని మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణపు పనుల్లో ఆన్ డ్రైవ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు సివిల్ ఇంజినీర్లు తెలిపారు. మరోవైపు గిడ్డర్, ఫ్రేమ్ వర్క్ కొనసాగుతున్నట్లు JE సుకుమార్ పేర్కొన్నారు. DRM గోపాలకృష్ణన్ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి పనుల్లో నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిందిస్థాయి అధికారులతో అభిప్రాయపడ్డారు.
TG: హిల్ట్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. కాంగ్రెస్ సర్కార్ విలువైన భూములను మార్కెట్ విలువ కంటే తక్కువకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హిల్ట్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తుందని, రేపు, ఎల్లుండి పారిశ్రామికవాడల్లో పార్టీ బృందాలు క్షేత్రస్తాయిలో పర్యటిస్తాయని కేటీఆర్ తెలిపారు.
BHPL: మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు జరిపారు. 251 లీటర్ల గుడుంబా, 5500 లీటర్ల వైట్ షుగర్ వాష్ను ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన 12 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పించారు.
TG: ఎన్నికల బరిలో దిగుతున్నారా? అయితే జాగ్రత్త. చిన్న తప్పు జరిగినా మీ నామినేషన్ రిజెక్ట్ అవుతుంది. సరైన సర్టిఫికెట్లు లేకపోయినా, అభ్యర్థి–ప్రపోజర్ సంతకాల్లో లోపాలు ఉన్నా, ఫార్మాట్ తప్పున్నా అధికారులు ఊరుకోరు. ప్రపోజర్ ఆ వార్డు ఓటర్ కాకపోయినా, రిజర్వేషన్ అర్హత లేకపోయినా అంతే సంగతులు. ఆస్తులు, కేసులు, చదువు వివరాల డిక్లరేషన్ ఇవ్వకపోయినా నామినేషన్ కొట్టిపారేస్తారు.
VZM: స్థానిక ఉల్లి వీధిలో గల ఓ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడ పని చేసిన సిబ్బందికి డా. అక్కేన శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ఉచితంగా జనరల్ & కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 40 మంది సిబ్బందిలో 6 గురికి కంటి ఆపరేషన్లకు, 8 మందికి కళ్ళజోళ్ళు సిఫారసులు చేసినట్లు తెలిపారు. ఆలవెల్లి వెంకట మాధవి,గోకుల కృష్ణ వున్నారు.
WGL: నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంటి పన్ను కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎలాంటి నిర్మాణం లేని ఖాళీ స్థలాలకు లక్షల రూపాయలు వసూలు చేసి ఇంటి నంబర్లు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ అధికారి చేతుల్లో ఈ వ్యవహారం నడుస్తుంది. ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
KMM: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తనలాంటి విద్యావంతులను గెలిపించాలని పోస్ట్ గ్రాడ్యుయేట్ జక్కుల ప్రత్యూష ఓటర్లను కోరారు. తిరుమలాయపాలెం మండలానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిగా ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. పొలిటికల్ సైన్స్లో ఉన్నత విద్య పూర్తి చేసిన తనకు సామాజిక, ఆర్థిక సమస్యలపై లోతైన అవగాహన ఉందని ఆమె తెలిపారు.
సినీప్రముఖులు చనిపోయినప్పుడు మీడియా వ్యవహరిస్తోన్న తీరుపై జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లి చనిపోయినప్పుడు తనని టార్గెట్ చేశారని, తల్లి గురించి చెప్పిన మాటలపై మీమ్స్ చేశారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు దివంగత నటుడు ధర్మేంద్ర విషయంలోనూ ఇలాగే జరుగుతుందని తెలిపింది. వ్యూస్, లైక్స్ కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, ఇలాంటి ధోరణిని ప్రోత్సహించకూడదని పేర్కొంది.