AP: రాష్ట్రానికి దిత్వా తుఫాన్ ముప్పు ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్గా బలపడనుంది. ఈ క్రమంలో ఈనెల 30న ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
TG: ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. 16 బృందాలతో అంతరాష్ట్ర ఆపరేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో దేవవ్యాప్తంగా ఉన్నభారీ నైజీరియన్ డ్రగ్ నెట్వర్క్ను ఛేదించారు. రాష్ట్ర పోలీసులు ఇప్పటికే 50 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ , డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తమిళనాడులోని చెన్నై, మదురై వేదికగా ఇవాళ జూనియర్(U21) హాకీ ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. డిసెంబర్ 10 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు 6 గ్రూపులుగా తలపడనున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం 2016లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడిన భారత యువ జట్టు మరోసారి కప్ గెలిచేందుకు సిద్ధమైంది. ఇవాళ మొత్తం 8 మ్యాచులు జరగనుండగా.. భారత్ 8:30PMకు తన తొలి మ్యాచులో చిలీతో తలపడనుంది.
MNCL: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
BDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తామని కొత్తగూడెం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కనుకుంట్ల కుమార్ చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. నిన్న ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
PPM: ప్రభుత్వ ఉద్యోగుల కోసం శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. PGRS సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ పొందినవారు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చని తెలిపారు.
AP: పరకామణి చోరీ కేసులో ఇవాళ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్నారు. అయితే కల్తీ నెయ్యి వ్యవహారంపై 2019 నుంచి కాకుండా అంతకుముందు పదేళ్ల నుంచి దర్యాప్త చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే సిట్ పలువురిని విచారించిన విషయం తెలిసిందే.
SKLM: పలాస మండలం గరుడఖండి గ్రామ సమీపంలోని పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలగాపు వేణుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సుశాంత్ (23) ఒడిశా గజపతి జిల్లా ఆర్. ద్రమగిరి బ్లాక్ డేరా గ్రామానికి చెందినవాడని తెలిపారు.
MDK: మెదక్ పట్టణ గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈవో విజయ సందర్శించారు. తరగతి గది బోధనా అభ్యసన ప్రక్రియను గమనించారు. మిడ్ లైన్ పరీక్ష నిర్వహణను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలను చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
AP: టీచర్లకు ఈనెల 29 నుంచి జనవరి 4 వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉపాధ్యాయులకు క్రికెట్, ఉపాధ్యాయినులకు త్రోబాల్ పోటీలు నిర్వహిస్తారు. ఈ మేరకు రూ.53.95 లక్షలు మంజూరు చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మండలానికి రూ.5 వేలు, డివిజన్కు రూ.20 వేలు, జిల్లాస్థాయికి రూ.20 వేల చొప్పున విడుదల చేసింది.
ఇవాళ్టి నుంచి రాయ్పూర్లో డీజీపీ-ఐజీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరుకానున్నారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాద నిరోధం, విపత్తు నిర్వహణ, మహిళల భద్రతపై చర్చించనున్నారు. అలాగే AI వాడకంపై 3 రోజుల పాటు సమీక్ష నిర్వహిస్తారు.
NDL: జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డా. సిరి BLOలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించాలన్నారు.
KDP: కాశినాయన మండలం గంగనపల్లి గ్రామ సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో గురువారం 100 KV విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేశారు. పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రైతుల అభివృద్ధికి సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రవీంద్రారెడ్డి తెలిపారు.
ELR: జిలాల్లో ఈనెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పంట నష్టం నివారణ చర్యలపై అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ప్రస్తుతం కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
E.G: పంచాయతీరాజ్ శాఖ సంస్కరణలో భాగంగా జిల్లాలో 18 మందిని డిప్యూటీ ఎంపీడీవోలుగా నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం పరిపాలన పర్యవేక్షణకు ఈ నియమకాలు చేపట్టామన్నారు. సీనియర్ గ్రేడ్ 1 కార్యదర్శులు మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి డిప్యూటీ ఎంపీడీవోలు నియమించారు.