ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంగళవారం పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తనిఖీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.
KNR: గంగాధర మండలం ఓద్యారంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కుడిక్యాల విజయలక్ష్మి(ఎల్ఎఫ్ఎలెచ్ఎం) సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా మండల విద్యా అధికారి ఏనుగు ప్రభాకర్ రావు సోమవారం సన్మానించారు. ఉద్యోగ విరమణ వయసుకే కాని బోధనకు కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గర్షకుర్తి హెడ్ మాస్టర్లు శశికాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
BHPL: చెల్పూర్ మిల్లెట్స్ విక్రయాల నిర్వహణకు ఐడీవోసీ కార్యాలయంలో క్యాబిన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ డీఆర్డీవోకు సూచించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో చెల్పూర్ మిల్లెట్ యూనిట్ నిర్వహిస్తున్న మహిళలతో కలెక్టర్ సమావేశమయ్యారు. నేటి జీవనశైలిలో మిల్లెట్స్ వినియోగం ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.
VSP: చైతన్య కళాశాల ప్రాంతంలో కారు విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్న ఘటన పీఎంపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వర్షంలో అదుపు తప్పడంతో విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. కానీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.
BHPL: జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన దివ్యాంగులకు ఉపకరణాల కోసం దరఖాస్తు గడువును జులై 5 వరకు పొడిగించినట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి మంగళవారం ప్రకటించారు. అర్హులైన దివ్యాంగులు నిర్దేశిత తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9652318042 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.
W.G: కేరళ రాష్ట్ర పోలీస్ డీజీపీగా ప.గో జిల్లా వీరవాసరానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ సోమవారం నియమితులయ్యారు. కేరళ నూతన డీజీపీగా చంద్రశేఖర్ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామంలో బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈయన 1991లో ఐపీఎస్కు ఎంపికయ్యారు.
VZM: రెవెన్యూ సేవలు నిజాయితీగా అందించాలని బొబ్బిలి ఎమ్మార్వో ఎం.శ్రీను సూచించారు. సోమవారం స్దానిక MRO కార్యాలయంలో VROలు, రెవెన్యూ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. రెవెన్యూ పనులు కోసం అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2019కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేసిన ఇళ్లను క్రమబద్దీకరణ చేయాలన్నారు.
VZM: బాడంగి మండలం పాల్తేరులో సోమవారం రాత్రి బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు పల్లెనిద్ర చేశారు. గ్రామంలోని పెద్దలు, ప్రజలతో సమావేశం నిర్వహించి గంజాయి వలన జరిగే నష్టం, మహిళలపై జరుగుతున్న నేరాలు నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి వలన జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
AKP: పాయకరావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్ను హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలోకి వెళ్లి భోజనం, కూరలను పరిశీలించారు. భోజనం సరిగా లేదని.. ఈ మెనూ ఏంటని హోంమంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా సన్న బియ్యం వాడాలన్నారు. హాస్టల్పై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
KMR: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు. మాచారెడ్డి మండలంలోని నెమ్మిలిగుట్ట తండాకు చెందిన జెరుపుల నవీన్ వయస్సు (24) తన వదిన జెరుపుల సంకి వేరే వారితో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో 2017 ఫిబ్రవరి 24 న మాంసం కోసే కత్తితో ఆమెను పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఆ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడినట్లు వెల్లడించాడు.
VSP: జిల్లా గంజాయి కేసులో నిందితుడు నెల్ల తేజమూర్తికి 14 ఏళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1.40 లక్షలు జరిమానా విధిస్తూ.. విశాఖ మెట్రోపాలిటన్ మొదటి అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపారు. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల సాధారణ జైలు శిక్ష అదనంగా విధించబడుతుందన్నారు.
కామారెడ్డి జిల్లాలోని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 141 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అధికారులు జవాబుదారీగా విధులు నిర్వర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
GNTR: తుళ్లూరు మండలంలోని ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్ మరమ్మతులకు గురవడంతో ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వెలగపూడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్లాంట్ను బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని సోమవారం గ్రామప్రజలు విజ్ఞప్తి చేశారు.
KRNL: తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసం చేసిన ముఠాను కర్నూలు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధితుడి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నకిలీ బంగారు బిస్కెట్లు, నగదు, పోలీస్ యూనిఫామ్స్, వాకీ టాకీలు, హ్యాండ్ కఫ్స్ సహా అనేక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
VSP: ప్యాసింజర్ రైలు చార్జీల పెంపు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయని విశాఖ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. సాధారణ తరగతిలో 500 కి.మీ. వరకు దూరాలకు ఎటువంటి పెంపూ లేదు. 501 నుంచి 1500 కి.మీ. దూరాలకు రూ. 5, 2500 కి.మీ. దూరాలకు రూ. 10, 2501 km నుంచి 3000 కి.మీ. దూరాలకు రూ. 15 పెంపు ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించింది.