SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి 15 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 86 లక్షల 85 వేల 3 వందల ఏడు రూపాయలు వచ్చినట్లు ఈవో వినోద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బంగారం 83 గ్రాములు, వెండి 05 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపును ఈవో వినోద్ పర్యవేక్షించారు.
ELR: సీఎం చంద్రబాబును చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు ఉన్న స్నేహ సంబంధాలతో యూకే నుంచి వచ్చిన విదేశీ పెట్టుబడిదారుల బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. రూ.2000 కోట్ల పెట్టుబడులతో పదివేల మందికి ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకోనున్నారు.
ELR: ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ అనూష మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిరోధక చట్టం ఆవశ్యకతను వివరించారు. కార్మికులు, నేటి విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఇందులో కార్మిక శాఖ అధికారి శ్యాంబాబు, లాయర్ బసవరాజు రామకృష్ణ పాల్గొన్నారు.
W.G: జిల్లా వ్యాప్తంగా గురువారం మెగా డీఎస్సీ పరీక్ష మూడు కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. ఉదయం సెషన్కు 362 మంది అభ్యర్ధులకు గాను 348 మంది హాజరయ్యారని, మధ్యాహ్నం సెషన్లో 727 మందికి గాను 696 మంది హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. పరీక్ష సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈవో స్పష్టం చేశారు.
సత్యసాయి: 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి. సత్యసాయి జిల్లాలో 5,588 మంది పరీక్ష రాయగా.. 3,986 మంది పాసయ్యారు. 71.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.
ATP: రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరిగాయి. అనంతపురం జిల్లాలో 9,445 మంది పరీక్ష రాయగా.. 7,206 మంది పాసయ్యారు. 76.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విదేశాంగశాఖ అధికారిక ప్రకటన చేసింది. విమాన ప్రమాదంలో చాలామంది మరణించినట్లు వెల్లడించింది. అయితే, మృతుల సంఖ్య ఇప్పడే చెప్పలేమని తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి పేర్కొంది. కాగా, విమాన ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.
కామారెడ్డి: జిల్లాకు చెందిన సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి రూ. లక్ష విరాళం అందజేశారు. దేశరక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో దేశరక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న త్రివిధ దళాల సేవలు మరవలేనివని అన్నారు.
చిత్తూరులో గురువారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని 47వ డివిజన్లో వెంకట రెడ్డి(50)ని ఆయన కుమారుడే హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
PLD: దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు వయసుని లెక్కచేయక శ్రమిస్తున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమిప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తైన సందర్భంగా పట్టణవ్యాప్తంగా మూడుపార్టీల విజయోవత్సవ వేడుకలు నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు.
KMR: జుక్కల్ నియోజకవర్గం ఎరువుల దుకాణదారులు రైతులకు అమ్మే ఎరువులు ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని, అధిక ధరలతో అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం మద్నూర్ మండలంలో మద్నూర్ సొసైటీ, పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
CTR: పలమనేరు ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గురువారం తనిఖీ చేశారు. అనంతరం ఎంపీడీవోతో పలు విషయాలపై చర్చించారు. మండలంలోని తాగునీటి సమస్య అడిగి తెలుసుకుని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని జడ్పీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.
KMR: ఎల్లారెడ్డి 9వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుపతి తన ఉదారత చాటుకున్నారు. పట్టణానికి చెందిన రాములు అనే వృద్ధుడికి కళ్లు కనిపించవు. కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఒంటరిగా పాడుబడిన ఇంట్లో ఉండగ.. ఇటీవల వర్షానికి అది కూలిపోయింది. విషయం తెలుసుకున్న తిరుపతి వృద్ధుడిని అద్దె ఇంట్లోకి మార్చారు. ప్రతినెలా అద్దె చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. దీంతో పలువురు ఆయన్ను అభినందించారు.
SRCL: జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. జూన్ 21న జరిగే యోగా కార్యక్రమానికి ప్రజలంతా హాజరుకావాలని అధికారులు సౌమిని,శ్వేత, డీపీవో తిరుపతి, యోగా శిక్షకులు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జూన్ 19న కలెక్టరేట్ ఆవరణలో అధికారులతో కలిసి యోగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా ప్రోగ్రాం అధికారి డా.శిరీష సందర్శించారు. రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్థులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను మెడికల్ ఆఫీసర్ డా.విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. NCD సేవలను పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో విస్తరించాలన్నారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.