VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి అప్పన్నపాలెంలో టీ. రాము అనే వ్యక్తికి నిన్న రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు గుర్తించి 108లో విశాఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాము ఇవాళ తెల్లవారుజామున చనిపోయినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. మృతుడు విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
W.G: అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాల సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారికి స్వామివారి ఆశీస్సులు అందించారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున ఎమ్మెల్యే దంపతులను సత్కరించారు.
AP: మాక్ అసెంబ్లీని విద్యార్థులు బాగా నిర్వహించారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేల పాత్రను పిల్లలు సమర్థవంతంగా పోషించారని అభినందించారు. ‘రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత. దేశ మనుగడ ఉన్నంత వరకు అంబేద్కర్ మన మదిలో ఉంటారు. రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రతీ పౌరుడికి చెప్పాలి’ అని పేర్కొన్నారు.
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తోందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇదే మూలమని చెప్పారు. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని.. దీనిలో భాగమే EWS రిజర్వేషన్లు అని వెల్లడించారు.
NTR: మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బట్టు గోపి (23) అనే యువకుడు ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి తగిలి మృతి చెందాడు. ఈ ఘటనపై మైలవరం ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. 2 రోజులు జరగనున్న ఈ సమావేశాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను సరళంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉంచేందుకు ఎలాంటి మార్పులు చేయాలన్న దానిపై చర్చ జరగనుంది. అభ్యర్థులకు మరింత న్యాయం అందించటం, వ్యవస్థను ఆధునికరించటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం.
WNP: జిల్లాలో సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున అన్ని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ సునీత రెడ్డితో నామినేషన్ల ప్రక్రియ పై దిశా నిర్దేశం చేశారు.1977 యాక్ట్ ప్రకారం చేపట్టాలన్నారు.
AP: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్కు మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ’76 ఏళ్ల క్రితం డా.అంబేద్కర్ మనకు స్వేచ్ఛ, సమానత్వంతో కూడిన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఈరోజు ఆయనకు ఇవ్వగలిగే ఉత్తమ నివాళి ఆ విలువలను కాపాడుకోవడమే. మన ప్రజాస్వామ్యం ఎవరికీ భయపడని విధంగా, అత్యంత పారదర్శకంగా ఉండేలా మనం చూసుకుందాం’ అని పేర్కొన్నారు.
ADB: పంచాయతీ రిజర్వేషన్లో బీసీలకు అన్యాయం జరిగిందని మండల నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు మాదాసు ప్రవీణ్ అన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో సంఘం నాయకులతో సమావేశమై మాట్లాడారు. మండలంలోని 32స్థానాలకు గాను ఎస్టీలకు 18, ఎస్సీలకు 02, జనరల్ 12 స్థానాలు కేటాయించగా బీసీలకు ఒక్క స్థానాన్ని కేటాయించ లేదని పేర్కొన్నారు. ఈ అంశంపై కలెక్టర్ చొరవ చూపాలని కోరారు.
MBNR: జిల్లా కేంద్రంలోని అబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుల రాజు ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు వరం లాంటిదని వెల్లడించారు. రాజ్యాంగం మూలంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు విద్య ఉద్యోగ రంగాల్లో ఎంతో మేలు జరిగిందన్నారు.
ATP: 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం అమరావతిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో గుంతకల్లు నియోజకవర్గం తరఫున గుత్తి ఆర్ఎస్కు విద్యార్థిని స్వప్న పాల్గొంది. ఈ మాక్ అసెంబ్లీలో స్వప్న పాల్గొనడంతో ఆమె తల్లిదండ్రులు సహ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఏడో శతాబ్దం కాలం నాటి కథతో తెరకెక్కనున్నట్లు, ఆనాటి వీరుడి గెటప్లో గోపీచంద్ కనిపించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. చిట్టూరి శ్రీను నిర్మించనున్న ఈ మూవీ కోసం రూ.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేయనున్నట్లు తెలిపాయి.
PPM: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మకు సీతంపేటలో కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ఘన స్వాగతం పలికి, పూలమొక్కను అందజేశారు. ఆశావాహ జిల్లా, బ్లాక్స్ ప్రోగ్రాంకు జిల్లా కేంద్ర నోడల్ అధికారిగా విచ్చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజన సంక్షేమ కోసం చేపడుతున్న చర్యలపై ఆమెకు వివరించారు.
కృష్ణా: వేడి సాంబారు గిన్నెలో పడి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన పెదపారుపూడి మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం ఫంక్షన్లో చిన్నారి ఆడుకుంటూ భోజనానికి సిద్ధం చేసిన సాంబారు గిన్నెపై కూర్చుంది. ప్లేటు పక్కకు ఒరగడంతో ఒక్కసారిగా వేడి సాంబారులో పడిపోయింది. దాంతో చిన్నారి శరీరం పూర్తిగా కాలిపోయింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచింది.
SS: గోరంట్ల మండలం 1వ వార్డులో ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలికలు)లో కల్తీ ఆహారం తిని కొంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి బుధవారం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంటగదిని, ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. అనారోగ్యానికి గురి అయిన బాలికలకు వైద్యం అందిస్తామన్నారు.