• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అశ్వగంధతో ఒత్తిడి, ఆందోళనకు చెక్!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందేందుకు రోజూ ఓ టీస్పూన్ అశ్వగంధ పొడి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ఔషధ, పోషక గుణాలు సంతానోత్పత్తితో పాటు కండరాలు, ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయని అంటున్నారు. ఇందుకోసం అశ్వగంధను పాలు లేదా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

November 21, 2025 / 12:24 PM IST

‘ఎక్కడ భూములు ఉన్నా సీఎం ముఠా వాలిపోతోంది’

TG: ఎక్కడ భూములు ఉన్నా CM రేవంత్ ముఠా వాలిపోతోందని మాజీ మంత్రి KTR అన్నారు. బాలానగర్, జీడిమెట్ల, కాటేదాన్‌లో తన వాళ్లకు రేవంత్ భూములిచ్చారని ఆరోపించారు. 2022లో భూముల రెగ్యులేషన్‌కు చట్టం తెచ్చామని.. భూములకు వంద శాతం ఫీజు కట్టేలా నిబంధనలు చేర్చామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోకుండానే భూ కేటాయింపులు చేశారని మండిపడ్డారు.

November 21, 2025 / 12:24 PM IST

అనారోగ్యం.. తల్లీబిడ్డ ఆత్మహత్య

CTR: చౌడేపల్లె మండలంలో విషాదం నెలకొంది. వెంగళపల్లికి చెందిన ఆదిలక్ష్మీకీ 8నెలల కుమార్తె ఉంది. చిన్నారి హార్ట్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్లో పాటు చాలాచోట్ల చికిత్స అందించారు. పాప ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆ తల్లి మనస్తాపానికి గురైంది. బిడ్డతో కలిసి ఆదిలక్ష్మి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంలో శుక్రవారం దూకి ఆత్మహత్య చేసుకుంది.

November 21, 2025 / 12:19 PM IST

9 వేల 300 ఎకరాలపై రేవంత్ కన్ను: కేటీఆర్

TG: సీఎం రేవంత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూకుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బాలానగర్‌లో 9 వేల 300 ఎకరాల భూ కుంభకోణం.. ఎకరానికి 40 కోట్లు వేసుకున్నా 4 లక్షల కోట్లు దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. జపాన్‌లో ఉన్నప్పుడు కూడా ఈ భూమికి సంబంధించిన ఫైల్‌పై రేవంత్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.

November 21, 2025 / 12:16 PM IST

ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐ కోర్టు విచారణ

AP: ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడ సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఆయేషా మీరా తల్లిదండ్రులు CBI నివేదిక ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కారణంగా తదుపరి విచారణను డిసెంబర్ 19వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

November 21, 2025 / 12:15 PM IST

‘రాజాసాబ్’ నుంచి అప్‌డేట్ వచ్చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 23న ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదలవుతుంది.

November 21, 2025 / 12:13 PM IST

పచ్చదనం పరిశుభ్రతపై క్లాప్ మిత్రులకు శిక్షణ

AKP: పచ్చదనం పరిశుభ్రతపై పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో మండలానికి చెందిన క్లాప్ మిత్రులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతులు ప్రారంభించిన ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ.. క్లాప్ మిత్రులు గ్రామాలను పరిశుభ్రంగా తీర్చి దిద్దడానికి కృషి చేయాలన్నారు. అలాగే పర్యావరణం పరిరక్షణకు మొక్కలు పెంచాలన్నారు. గ్రామాల్లో చెత్తకుప్పలు లేకుండా చూడాలన్నారు.

November 21, 2025 / 12:10 PM IST

‘కాలువకు గండి.. అప్రమత్తతతో తగ్గిన నష్టం’

AP: పల్నాడు జిల్లాలోని నాగార్జునసాగర్ కుడికాలువ కట్టకు గండి పడటంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తమైన గండిని పూడ్చేయటంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కాగా అర్థరాత్రి ఎస్కేప్ ఛానల్ వద్ద గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం పెరిగిన విషయం తెలిసిందే.

November 21, 2025 / 12:07 PM IST

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ఆదేశాలు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. చాందసవాద భావజాల వ్యాప్తిని సోషల్ మీడియాలో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఆయా సోషల్ మీడియా వేదికలతో టచ్‌లో ఉండాలని సూచించారు. రద్దీ మార్కెట్‌లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని తెలిపారు. ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

November 21, 2025 / 12:06 PM IST

సత్యసాయి శతజయంత్యుత్సవాలకు మహారాష్ట్ర సీఎం

AP: పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో అంతర్జాతీయ యువజన సమ్మేళన సదస్సు ప్రారంభమైంది. యువజన సమ్మేళనానికి ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాగా, సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ఇటీవల ప్రధాని మోదీ తదితర ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే.

November 21, 2025 / 12:05 PM IST

రెండేళ్లలో డోలీ రహిత గ్రామాలు కావాలి: మంత్రి

PPM: రెండేళ్లలో డోలీ రహిత గ్రామాలు కావాలని, ప్రతీ గ్రామానికి ఆటో, అంబులెన్సు వెళ్ళాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నయుడు అన్నారు. శుక్రవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 200కు పైగా రహదారి లేని గ్రామాలకు రహదారులు వేయడం జరిగిందన్నారు.

November 21, 2025 / 12:02 PM IST

డిప్యూటీ సీఎంకు శుభలేఖ అందజేసిన రాహుల్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. తన వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న రాహుల్.. తన పెళ్లి శుభలేఖను డిప్యూటీ సీఎంకు అందజేశారు. నవంబర్ 27న అత్యంత వైభవంగా వివాహం జరగనుంది. కాగా రాహుల్, హరిణ్యకు ఆగస్టులో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

November 21, 2025 / 11:59 AM IST

ఆపరేషన్ కగార్‌ నిలిపేయాలి: అఖిలపక్ష నేతలు

TG: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అఖిలపక్ష నేతలు నిరసన తెలిపారు. ఇందులో కూనంనేని సాంబశివరావు, అజీజ్‌పాషా, కోదండరామ్‌ పాల్గొన్నారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆపరేషన్ కగార్‌ నిలిపేయాలని, ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

November 21, 2025 / 11:59 AM IST

బైకులు ఢీకొని యువకుడి మృతి

ELR: మండవల్లి మండలం చావలిపాడు రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గేటు పడుతుండగా వేగంగా దాటే క్రమంలో రెండు మోటార్ సైకిళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కైకలూరు మండలం ఆలపాడుకు చెందిన పడమటి సత్యనారాయణ మృతి చెందగా, మాజీ ఏఎంసీ ఛైర్మన్ తలారి వెంకటస్వామికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

November 21, 2025 / 11:58 AM IST

సమయానికి రాక ఖాళీ కుర్చీలు దర్శనం

RR: షాద్‌నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అధికారితో పాటు సంబంధిత సిబ్బంది సమయానికి హాజరు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు వచ్చిన ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని, కనీసం కార్యాలయంలో జవాబు ఇచ్చేవారు కూడా కరువయ్యారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి సకాలంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన అవసరం ఉందని కోరారు.

November 21, 2025 / 11:57 AM IST