TG: మహబూబ్నగర్లోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,07,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,02,904 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.660 మీటర్లకు చేరుకుంది.
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అయినా అతడు పెద్దగా సంబరాలు చేసుకోలేదు. దీనికి కారణం ఏంటా? అని క్రికెట్ అభిమానుల్లో ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై బుమ్రా మాట్లాడుతూ.. ‘నేను బాగా అలసిపోయా. అందుకే ఎక్కువగా సంతోషపడలేకపోయా. ఎగిరి గంతులు వేయడానికి ఇప్పుడు నేనేమీ 21-22 ఏళ్ల కుర్రాడిని కాదు’ అని వెల్లడించాడు.
SKLM: నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన సోంపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ రిసెప్షన్ కేంద్రంలో రికార్డులు నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కార తదితర అంశాలను పరిశీలించి.. మహిళా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
KRNL: దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో ఫోన్ కొనివ్వలేదన్న కారణంతో 16 ఏళ్ల శ్రీనాథ్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 9న ఈ ఘటన జరగగా.. కుటుంబ సభ్యులు శ్రీనాథ్ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. నెలరోజుల పాటు చికిత్స పొందిన శ్రీనాథ్ గురువారం రాత్రి మృతిచెందాడు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన శ్రీనాథ్ మృతిపై గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
NZB: జిల్లాలో పెద్దపులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలను సేకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పులి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. S 12 పెద్దపులిగా దానిని అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
SRCL: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి, నాంపల్లి ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాసు తెలిపారు. ఈనెల 15, 16 తేదీలలో 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల బాలబాలికలు సరైన ధ్రువపత్రాలతో హైదరాబాద్లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంకు రావాలి అన్నారు.
రంగారెడ్డి జిల్లా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, పర్యటక ప్రాంతాల నిలయం. ముఖ్యంగా చిలుకూరు బాలాజీ టెంపుల్, అలియాబాద్ రత్నాలయం, సంఘీ టెంపుల్, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం, గండిపేట అమ్మవారు, శంషాబాద్ మాతాదేవి టెంపుల్, గౌరెల్లి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి, రాజేంద్రనగర్ నాగులమ్మ తల్లి ఇలా అనేక దేవాలయాలు ఉన్నాయి.
KRNL: కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ MLA ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం జ్యోతి తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని, మహిళలపై బూతులు తిట్టడం, దూషించడం వైసీపీ రాజకీయ సిద్ధాంతంగా మారిందని శుక్రవారం ఆలూరు PSలో ఫిర్యాధు చేశారు.
KRNL: ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. కర్నూలు సీపీఐ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు భర్తీకై ఈనెల 14న కర్నూలు కలెక్టరేట్ ముందు నిరుద్యోగ యువతతో ధర్నా చేయిస్తామని అన్నారు.
GNTR: మంగళగిరి నగరంలోని గౌతమబుద్ధ రోడ్డులో గల కాళీమాత అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాకాంబరి ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ దేవిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
KRNL: నగరపాలక సంస్థ నూతన కమిషనర్ నియమితులైన పి. విశ్వనాథ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ వారితో చర్చించారు.
TG: స్థానిక సంస్థల్లో 42శాతం BC రిజర్వేషన్ల ఘనత తమదే అని కాంగ్రెస్, జాగృతి రెండూ చెప్పుకుంటున్నాయి. తాము కొట్లాడటం వల్లే BCల రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని MLC కవిత సంబరాలు చేసుకున్నారు. అయితే BCలకు, కవితకు సంబంధమేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. BCలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. మరి ఇది ఎవరి క్రెడిట్.. మీరేమంటారు?
లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 13, కరుణ్ నాయర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 13 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ మరో 343 పరుగులు వెనుకబడి ఉంది.
PDPL: సుల్తానాబాద్ మండలం కదంబాపూర్, తొగరాయి గ్రామాలలో రూ. కోటి 5 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొగర్రాయిలో సమ్మక్క సారలమ్మ గద్దెల నిర్మాణానికి ప్రహరీ, ఇందిరమ్మ గృహలకు భూమి పూజ, కదంబాపూర్లో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు.
KMM: ముదిగొండ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వాసిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హరిత పాల్గొని, గంజాయి, పొగాకు ఉత్పత్తుల వాడకంతో జరిగే అనర్థాలు, శిక్షల గురించి విద్యార్థలకు వివరించారు. మత్తు పదార్థాల వాడకం జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు.