ASR: జీకే.వీధి మండలం సీలేరు నదిలో గిరిజనులు వేసిన వలకు అరుదైన డోబి జాతి చేప బుధవారం చిక్కింది. 22 కేజీల బరువున్న ఈ భారీ చేపను ఒరిస్సా మల్కనగిరి జిల్లా అల్లూరి కోట పంచాయతీ కొందుకూడా గ్రామానికి చెందిన గిరిజనులు పట్టారు. చేపను స్థానిక బాలాజీ రెస్టారెంట్ యజమాని నక్క జ్ఞానేశ్వరరావు కొనుగోలు చేశారు.
GNTR: 20 సూత్రాల అమలు కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ నేడు గురువారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరోగ్యం, విద్య, అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల పురోగతిని చైర్మన్ సమీక్షించనున్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి, విజయవాడకు బయలుదేరుతారు.
KMM: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు 11,14,17న జరుగనున్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఒక వైపు పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతుండగా, మరో వైపు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెలలో మద్యం ఏరులై పారుతోంది. పల్లెలు, పట్నాలు తేడాలేకుండా బెల్టు షాపులో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.
AP: విజయవాడ జోజినగర్ కూల్చివేతల బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇళ్లు లేక రోడ్డున పడ్డామని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను సీఎంకు వివరించేందుకు అవకాశం ఇవ్వాలని రాత్రి ఆయన ఇంటి దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతి పత్రాలు తీసుకుని రావాలని పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ తన కుటుంబ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన ఆర్థికంగా ఎప్పుడూ స్థిరంగా ఉంటారనేది సరికాదని తెలిపింది. సినీ రంగంలో ఒడిదొడుకులు చాలా సహజమని, అమితాబ్ బచ్చన్ వంటి వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చింది. సినిమా నిర్మాణం అనేది అతిపెద్ద రిస్క్తో కూడుకున్న వ్యాపారమని.. ఒడుదొడుకులు సాధారణమని పేర్కొంది.
PLD: వినుకొండ కాంగ్రెస్ నేత, పీసీసీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున బీజేపీలో చేరారు. బుధవారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోదీ సంక్షేమ పథకాలు, హిందుత్వం నచ్చే తాను బీజేపీలో చేరానని నాగార్జున తెలిపారు. ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట్ట రోడ్డులో రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. స్వామి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం కూడా చేశారు.
NLG: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, గుర్రంపోడ్ ఎస్సై మధు అన్నారు. బుధవారం మండలంలోని నడికూడా గ్రామంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు గాని, గొడవలు సృష్టించే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
NZB: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగియడంతో బోధన్ మండలంలో నాలుగు పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. బోధన్ మండలం మావంది కలాన్ శకుంతల, పెంటాకుర్థు క్యాంప్ వేములపల్లి రాధిక, పెంటాకలాన్ కళావతి, భూలక్ష్మీ క్యాంప్ బాల్ రెడ్డిలు సర్పంచి స్థానాలు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు.
GNTR: మంగళగిరి మండలం నవులూరులో వీధి కుక్కల బెడదకు అధికారులు చెక్ పెట్టారు. కుక్కల దాడులతో జనం, వాహనదారులు బెంబేలెత్తుతుండటంతో గురువారం వాటిని బంధించే కార్యక్రమం చేపట్టారు. పట్టుకున్న కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటీ రేబీస్ టీకాలు వేసి తిరిగి వదిలేస్తామని సిబ్బంది తెలిపారు. అధికారుల చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బార్కోడ్ లేకుండా వస్త్రాలను విక్రయిస్తున్న వ్యాపారికి ఈవో దామోదర్రావు నిన్న నోటీసులు జారీ చేశారు. వారం రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ పట్టుబడిన సదరు వ్యాపారి, మళ్లీ మంగళవారం కూడా బార్కోడ్ లేని పంచెలు, చీరలు విక్రయిస్తూ కౌంటర్లో దొరికారు. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈవో ఆదేశించారు.
KRNL: స్పోర్ట్స్ ఆథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 14 వరకు రాష్ట్రస్థాయి ఇన్విటేషనల్ బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు మురళీ కృష్ణ, ముస్తహీర్ ఇవాళ పేర్కొన్నారు. విజేతలకు నగదు, షీల్డ్లను బహూకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు మహిళలు, పురుషులకు నిర్వహిస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం 7989173121ను సంప్రదించాలన్నారు.
SRPT: గరిడేపల్లి మండలంలో 8 క్లస్టర్ల పరిధిలో బుధవారం 26 నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు, 300 వార్డులకు 28 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీవో సరోజ తెలిపారు. మండలంలో 33 గ్రామపంచాయతీల పరిధిలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా 8 క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ప్రకాశం: కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్లో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్ బుధవారం మహిళా పోలీసులతో సమావేశమయ్యారు. మహిళా సమస్యలపై సలహాలు, సూచనలు అందిస్తూ, శక్తి యాప్ డౌన్లోడ్ గురించి చర్చించారు. మహిళలపై జరిగే నేరాల గురించి గ్రామాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహిళా పోలీసులకు సీఐ ఆదేశించారు.
BDK: భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన కొత్తగూడెం పట్టణానికి చెందిన తోట దేవి ప్రసన్న, బుధవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో నియామక పత్రాన్ని స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా ఆమె పత్రాన్ని అందుకున్నారు.