కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ కాంగ్రెస్లో కాకరేపుతోంది. ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా.. అధినేత అయినా.. నాతో పాటు ఎవరైనా సరే.. వారి మాటను నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి’ అని హైకమాండ్ను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ను గురువారం విడుదల చేశారు. జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సహకారంతో ఈనెల 28న జిల్లా కలెక్టరేట్ దగ్గర గల రంగినేనిలో జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ చెప్పారు.
ADB: గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని.. బ్యాలెట్ బాక్సులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయిలో ఎన్నికలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
TG: హైదరాబాద్లో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. బృందాలకు ఎంపవరింగ్ ఎవ్రీ డే సేఫ్టీ టీమ్స్గా నామకరణం చేశారు. వీరు నగరంలో సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయనున్నారు.
పెరుగు, చక్కెర కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు కలిపి తింటే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాదు ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ రెండు కలిపి తింటే ఆ పని విజయవంతం అవుతుందని పెద్దలు చెబుతుంటారు.
WGL: నల్లబెల్లి మండల పరిధిలో బోరు బావులను ఇవాళ సర్వే నిర్వహించారు. అనంతరం చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రకళ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బోరు, బావులు, చెరువుల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగినట్లు వెల్లడించారు. సర్వే చేసి నివేదిక అధికారులు అందిస్తామని ఆమె పేర్కొన్నారు.
SRCL: తెలంగాణ దళిత పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా ఎర్ర వినయ్ను నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ తెలిపారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో వినయ్కు నియామక పత్రాన్ని TDPS నేతలు అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగేష్, అనిల్ పాల్గొన్నారు.
SKLM: రైతులు ఆధునిక వ్యవసాయం మెలకువలు నేర్చుకుని లాభసాటి వ్యవసాయం చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మెలియాపుట్టి మండలం మర్రిపాడులో “రైతన్న-మీకోసం” కార్యక్రమంలో ఇవాళ ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్లు రైతులకు వివరించారు.
CTR: చిత్తూరులో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ ట్రాఫిక్ నియమాలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. మితిమీరిన వేగంతో చేసే ప్రయాణాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు.
W.G: పరిశుభ్రత పాటిస్తే సగం రోగాలు దరిచేరవని ఉండి ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఉప్పులూరులో గురువారం పంచాయతీ, డ్వాక్రా, యండగండి పీహెచ్సీ సిబ్బందితో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. వీధులు, డ్రైన్లను శుభ్రం చేసిన అనంతరం.. ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేపట్టారు. ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేటీఆర్పై మండిపడ్డారు. కేటీఆర్ కుటుంబ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కవిత పార్టీ విడిచిపోవడం, హరీష్ రావుకు నాయకత్వంపై నమ్మకం లేకపోవడం ఇందుకే నిదర్శనమన్నారు. కేసిఆర్ ఉన్నంతవరకే బీఆర్ఎస్ నిలుస్తుందని, తరువాత పార్టీ చెదిరిపోతుందని వ్యాఖ్యానించారు.
CTR: సదుంలోని మదీనా మసీదు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపినట్లు మైనార్టీ నాయకులు చెప్పారు. పలువురు నాయకులు తిరుపతిలో ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించారు. మసీదు అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. దీనిపట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నల్లగొండ ఎంజీయూ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 11 నుంచి ప్రారంభమైన డిగ్రీ సెమిస్టర్ 1,3,5 పరీక్షలు రేపటితో ముగుస్తాయని ఎంజీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్ను ఇవాళ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తయ్యాయన్నారు.
SRPT: సర్పంచ్ ఎన్నికల తొలి విడత నామినేషన్ల సందర్భంగా సూర్యాపేట మండలం యర్కారం, బాలెంల సహా పలు గ్రామాల్లో పోలీసు పహారా కట్టుదిట్టం చేశారు. ఈరోజు CI రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ కేంద్రాలను పరిశీలించారు. 100 మీ. నిబంధన తప్పక పాటించాలని సిబ్బందికి వారు సూచించారు. అనంతరం ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార 1’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ కూడా సదరు OTTలోకి వచ్చింది. కాగా, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకుపైగా కలెక్షన్స్ రాగా.. హిందీలో రూ.200 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి.