KRNL: డయల్ యువర్ APSPDCL సీఎండి కార్యక్రమంలో ఛైర్మన్ ఎండీ శివశంకర్ సోమవారం 65 వినతులు స్వీకరించారు. కర్నూలు సర్కిల్ నుంచి అత్యధికంగా 17 సమస్యలు అందాయని ఆయన తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లో-ఓల్టేజ్, ట్రాన్స్ ఫార్మర్ మార్పు వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
KMM: సిగ్నల్ వ్యవస్థ రద్దీని తగ్గించి, ప్రమాదాలు తగ్గేందుకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. సత్తుపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నూతన సిగ్నల్స్ను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. అత్యంత రద్దీగా ఉండే బోసుబొమ్మ సెంటర్, పాత బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
WNP: దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని BRS నాయకులు కలెక్టరేట్లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ యాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కేవలం సన్న ధాన్యం మాత్రమే కొంటున్నారని, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. BRS జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
WNP: తాను ఒక్కసారి కూడా కవితను పల్లెత్తు మాట అనలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో 10% పనులు పూర్తి చేస్తే సరిపోతుందని, పాలమూరు బిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపకుండా తనపై దుర్భాషలాడడం సమంజసం కాదన్నారు.
AP: మంత్రి లోకేష్ వచ్చె నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 6న ఆయన డల్లాస్ వెళ్లనున్నారు. 8 వేల మందితో గార్లాండ్లో భారీ సభ నిర్వహించనున్నారు. 8, 9 తేదీల్లో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సమావేశానికి NRI టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కీలక పాత్ర పోషించనున్నాయి.
ప్రకాశం: ఒంగోలులో సోమవారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పోలీసులు గుర్తించారు. వీరిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, 11 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి పదివేలచొప్పున జరిమానా, మరొకరికి 2 రోజుల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు.
WNP: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఈ చీరలను ప్రతి జిల్లా నుంచి మహిళా సమాఖ్య అధ్యక్షులు హైదరాబాద్ వెళ్లి ఎంపిక చేశారని తెలిపారు. ఈ చీరల తయారీలో పదివేల మంది నేతన్నలు శ్రమించారని గుర్తు చేశారు. జిల్లాలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణం త్వరలో పూర్తవుతుందని ఆయన తెలిపారు.
VSP: విశాఖ ఆటోనగర్లోని ఓ కార్ల గోదాము పైకప్పు మరమ్మతులు చేస్తుండగా, విజయనగరానికి చెందిన జంకల చంటి (32) అనే దినసరి కూలీ సిమెంట్ రేకు విరిగిపోవడంతో పైనుంచి కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: తెనాలిలో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ట్రాఫిక్ అంశంపై చర్చించేందుకు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సబ్ కలెక్టర్ సంజనా సింహ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుందని, ఇందులో అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారని కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2 రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలని పేర్కొన్నారు.
CTR: GDనెల్లూరులో రెవెన్యూ ఫిర్యాదులు గణనీయంగా తగ్గినట్లు తహశీల్దారు శ్రీనివాసులు పేర్కొన్నారు. 5 నెలల క్రితం ప్రతి సోమవారం దాదాపు 25కు పైగా ఫిర్యాదులు అందేవని, ఇప్పుడు ఆ సంఖ్య 5కు తగ్గిందన్నారు. మండల స్థాయి రెవెన్యూ సమస్యలను అక్కడే పరిష్కరించాలన్న కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతో ఈ ఫలితాలు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
NLR: వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని జగన్కు సలహా ఇస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కొడవలూరు(M) తాటాకులదిన్నెలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో వాలంటీర్లు 50 శాతం మంది మాత్రమే తమకు పని చేశారని, మిగతావాళ్లు రూ. 20 వేలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. వాలంటీర్లను నమ్ముకుని కార్యకర్తలను దూరం చేసుకుని నష్టపోయామన్నారు.
NRPT: దేశ ఐక్యతకు అందరం కృషి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోత్సవాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన 4కేరన్లో ఆమె పాల్గొన్నారు. దేశంలోని గొప్ప నాయకుల్లో పటేల్ ఒకరని, దేశాన్ని ఏకం చేయడంలో ఆయన కృషి ఎనలేనిదని కలెక్టర్ కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు.
MDK: చిన్నశంకరంపేట మండలం చందంపేట పీఏసీఎస్ కార్యాలయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఐదేళ్ల లెక్కలు కోరుతూ మాజీ వార్డు సభ్యులు కుమ్మరి ప్రవీణ్ కుమార్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సీఈఓ పాషాకు దరఖాస్తు చేశారు. అయితే, “ఆర్టీఐ చట్టం సొసైటీలకు వర్తించదు” అంటూ సీఈఓ ఆ దరఖాస్తుపై రాసివ్వడం విమర్శలకు తావిచ్చింది.
HYD: పైరవీలతో సంబంధం లేకుండా బాధితులకు నేరుగా సేవ చేయాలని HYD సీపీ సజ్జనార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా కేసు విషయంలో ముందు నిర్లక్ష్యంగా వ్యవహరించి దళారుల ఎంట్రీ తర్వాత చర్యలు ఉన్నట్లు తెలిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న దళారుల కదలికలపై కన్నేసి ఉంచేలా మార్గదర్శకాలు జారీ చేశారు. దళారులను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవన్నారు.