CTR: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పుంగనూరులో ఓట్ చోరీ-గద్ది చోడ్ కార్యక్రమాన్ని నాయకులు శనివారం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ భాష, ముబారక్ భాషా, ఫయాజ్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
✤ కాకినాడ ఉప్పాడ తీరప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై Dy.CN పవన్ సమీక్ష✤ ములకలచెరువు మద్యం కేసులో ఎవరినీ వదిలి పెట్టం: మంత్రి DBV✤ చిత్తూరు దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తేలుస్తాం: హోంమంత్రి అనిత✤ గుంటూరు అన్నపర్రు BC హాస్టల్ వార్డెన్ని, వంటమనిషిని తొలగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
MBNR: గండీడ్ గ్రామ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. శనివారం ఆయన స్వగృహంలో నిర్వహించిన దశదిన కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్గా గ్రామాన్ని ఎంతో అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లారని ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ATP: పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44 హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న రెండు బైక్ లను వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుల మీద ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
SKLM: జీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని సత్య సాయి క్యాష్యూ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి యన్ గణపతి, ఉపాధ్యక్షులు కె.కేశవరావు, జీడి సంఘం నాయకులు జి.బాలమ్మలు డిమాండ్ చేశారు. శనివారం మందస మండలంలో కార్మికులతో నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టారు.
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో మాట్లాడారు.
MDK: పాపన్నపేట మండలం పాతలింగాయపల్లి గ్రామానికి చెందిన BJP సీనియర్ నేత అర్జున దస్తయ్య గుండెపోటుతో శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా BJP అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించరు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కోనసీమ: రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆలమూరు ఎస్సై జి. నరేష్ సూచించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలంలోని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగహన పెంచుకుని, మరికొందరికి అవగాహన కల్పించాలన్నారు. చదువుకున్న వాళ్లు కూడా ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
NZB: జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్డులో వన్వే నిబంధనల అమలుతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ వ్యాపారస్తులు శనివారం తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. వన్వేను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న ఈ నిబంధనల వల్ల తమ వ్యాపారాలు నడవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
KMR: జనరల్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఆపరేటర్లు శనివారం ధర్నా నిర్వహించారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా అక్టోబర్ 1 నుంచి విధుల్లోకి రాకూడదని సూపరింటెండెంట్ హెచ్చరించారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించామన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకుని, వేతనాలు చెల్లించాలన్నారు.
KDP: తొండూరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని శనివారం ఐసీడీఎస్ సూపర్వైజర్ రవణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని బాలికల హక్కులు, సాధికారత, రవణమ్మ మాట్లాడుతూ.. ప్రతి బాలికకు సమాన అవకాశాలు ఉండాలన్నారు. ప్రతి బాలిక సురక్షితంగా, బలమబలమైన వ్యక్తిత్వ్యక్తిత్వంతో ఎదగడం అత్యంత అవసరమన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో మాజీ MLA దుర్గం చిన్నయ్య శనివారం ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ‘బాకీ కార్డు’ను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, బీడీ కార్మికులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 పింఛన్, కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కృష్ణా: జిల్లాలోని రైతులు సేంద్రీయ వ్యవసాయం చేయాలని నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, ఆయిల్ ఫామ్, కొరమేను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కృషి యోజన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ బాలాజీ, కేవీకే అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
TPT: పుత్తూరు రూరల్ గోపాలకృష్ణపురం పంచాయతీలో శనివారం సూపర్ జీఎస్టీ – సూపర్ సక్సెస్ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్కు టీడీపీ అధ్యక్షుడు అరవ బాలాజీ ఇంటింటికి వెళ్లి సూపర్ జీఎస్టీ వల్ల తగ్గే ధరల వివరాలు గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఏఏ వస్తువులపై ధరలు తగ్గాయో ప్రజలకు అవగాహన కల్పించారు.
కేంద్ర కార్పొరేట్ వ్వవహారాల శాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్లో 145 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా ఆసక్తి కలిగిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. వెబ్సైట్: https://icmai.in/icmai/