PPM: ఈ నెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై రీ ఓరియంటేషన్ శిక్షణను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎన్జీవో హోంలో వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షలకు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సర్వలెన్స్ వైద్యాధికారి డా, జాన్ పవర్ ప్రెజెంటేషన్ ద్వారా పల్స్ పోలియో కార్యాచరణపై శిక్షణ అందించారు.
NZB: ఆలూరులో పుల్లెల రాముకు చెందిన తాళం వేసిన ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు నవంబర్ 27న ఊరికి వెళ్లగా, మంగళవారం సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా ధ్వంసం చేశారు. ఈ చోరీలో 14 తులాల బంగారం, సుమారు అర కిలో వెండి, లక్ష నగదును దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో జరుగుతున్న డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురంలోని ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, గుంతకల్లులోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
VZM: రామభద్రపురం పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం CITU ఆద్వర్యంలో చెత్తను ప్రోగుచేసి దానికి పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు.ఈ సందర్భంగా CITU మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న కార్మికులుకు 4 నెలలుగా జీతాలు అందలేదని, జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
TG: iBOMMA రవి స్కిల్స్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఏకంగా సైబర్ క్రైమ్లో జాబ్ ఇస్తాం అంటే.. రవి మాత్రం ‘నాకొద్దు’ అని చెప్పేశాడట. కరీబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతో రెస్టారెంట్ పెట్టి సెటిల్ అవుతానని పోలీసులకే చెప్పాడని తెలుస్తోంది. సంపాదించిన డబ్బుతో లైఫ్ ఎంజాయ్ చేయడమే తన గోల్ అని చెప్పినట్లు టాక్. త్వరలోనే ఇతనికి బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
HYD: హాస్టళ్లలో నాసిరకం, పాడైపోయిన భోజనం పెడుతున్నారంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిన్న రాత్రి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆహారం సరిగా లేకపోవడం, కనీస మౌలిక వసతుల కొరతపై ఫిర్యాదు చేసినా వార్డెన్, ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ELR: జిల్లాలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞాపనలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో సహా వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులకు సంబంధించి, నిబంధనల ప్రకారం అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని సూచించారు.
ELR: రవాణా శాఖ అధికారులు ఇవాళ నుంచి ATS సిస్టం ద్వారా వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయనున్నట్లు ఇంఛార్జ్ DTC కృష్ణారావు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఇప్పటివరకు ఆఫ్లైన్లో జారీ చేసేవారు. జిల్లాలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లి ఫిట్నెస్ చేయించుకోవాలని అన్నారు.
NZB: జిల్లాలో ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు 3వ విడత GP ఎన్నికలు జరగనున్నాయి. ఆర్మూర్ డివిజన్లోని ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీలు, 1620 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు.
VZM: ఆల్ ఇండియా రైల్వే లోకో పైలట్ స్టాఫ్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం విజయనగరంలో రైల్వే లోకో పైలట్ లు 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఈ దీక్షా శిబిరాన్ని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఉపాధ్యక్షుడు ఏ.గౌరీ నాయుడు మద్దతు తెలిపారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానాలు వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
SRPT: మద్యం తాగి ఖాళీ సీసాలను కాలువలు, పంట పొలాల్లో వేయడం వల్ల పొలం పనులు చేసే రైతులకు, కూలీలకు గాయాలవుతున్నాయని, ఫిర్యాదులు వస్తున్నాయని జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించడం, ఖాళీ సీసాలలో పంట పొలాల్లో పడి వేయడం మంచి లక్షణం కాదని సూచించారు.
PPM: సాలూరు పురపాలక సంఘం పరిధిలో 26 మరుగుదొడ్ల మరమ్మతులకు టెండర్లను ఆహ్వానించామని, కానీ ఎవరు ముందుకు రాలేదని పురపాలక సంఘం కమిషనర్ టీ. రత్నకుమార్ మంగళవారం తెలిపారు. సాలూరులో మొత్తం 35 మరుగుదొడ్లు ఉన్నాయని, అందులో 11 సామాజిక మరుగుదొడ్లు పూర్తిగా మరమ్మతులు గురికాగా..15 పాక్షికంగా మరమ్మతులు చేయవలసి ఉందన్నారు.
MDK: విద్యార్థులకు శిక్షణ అందిస్తే, జాతి గర్వించే స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని డీఈవో విజయ పేర్కొన్నారు. తూప్రాన్ మండలం ఘనపూర్ హైస్కూల్లో ఇంట్రమురల్ క్రీడల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో డాక్టర్ సత్యనారాయణ, క్రీడా అధికారి రమేష్ గంగాల పాల్గొన్నారు.
SKLM: జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పైడి సింధూరను నియమిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పి. వి. ఎన్ మాధవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన పై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎస్. తేజేశ్వరరావుకు, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.