• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

INSPIRATION: మిల్ఖా సింగ్

దేశ విభజన సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి, అనాథగా మారిన మిల్ఖా సింగ్.. పేదరికం, ఆకలి వంటి కష్టాలను ఎదుర్కొన్నారు. సైన్యంలో చేరిన తర్వాతే ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కేవలం పట్టుదలతో సాధన చేసి ‘ఫ్లయింగ్ సిఖ్’గా పేరుగాంచారు. 1960 ఒలింపిక్స్‌లో పతకాన్ని స్వల్ప తేడాతో కోల్పోయినా, భారతదేశ క్రీడా చరిత్రలో ఒక లెజెండ్‌గా నిలిచారు.

November 23, 2025 / 03:50 AM IST

శబరిమలలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ

శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తొలి వారంలోనే ఏకంగా 5.75 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజు సాయంత్రానికే 72 వేలమందికి పైగా భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. రద్దీ నిర్వహణ, సౌకర్యాలపై ట్రావెన్‌కోర్ బోర్డు అధికారులతో మంత్రి వీఎన్ వాసవన్ ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు.

November 23, 2025 / 12:27 AM IST

వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్‌కు IAF నివాళి

దుబాయ్ ఎయిర్‌ షోలో తేజస్ విమానం కూలి మరణించిన వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్‌కు భారత వాయుసేన(IAF) నివాళులర్పించింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నమాన్ష్ వృత్తిపట్ల అంకితభావం, అసాధారణ ప్రజ్ఞాశీలి అని IAF కొనియాడింది. తన జీవితాన్ని దేశ సేవకు అంకితమిచ్చారని పేర్కొంది. ఈ బాధాకర సమయంలో ఆయన కుటుంబానికి IAF అండగా ఉంటుందని తెలిపింది.

November 22, 2025 / 11:35 PM IST

ఓయూ MBA ఫలితాలు విడుదల

TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన MBA పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. MBA (టెక్నాలజీ మేనేజ్మెంట్), MBA (ఈవినింగ్) కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ అధికారి తెలిపారు. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

November 22, 2025 / 10:55 PM IST

సీఎం రేవంత్‌పై ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

TG: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డిపై పారిశ్రామిక భూముల కుంభకోణం ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి ఇండస్ట్రీ భూములను బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టి, కమిషన్లను ఢిల్లీకి కప్పంగా చెల్లించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పారిశ్రామిక భూములను ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలన్నారు. బలవంతపు భూసేకరణ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

November 22, 2025 / 10:18 PM IST

‘పరాశక్తి’ సెకండ్‌ సింగిల్ టైమ్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పరాశక్తి’. ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్ రేపు సా.5:30 గంటలకు లాంచ్ చేయనున్నట్లు తెలియజేస్తూ.. శివకార్తికేయన్, శ్రీలీల రొమాంటిక్ మూడ్‌లో ఉన్న లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

November 22, 2025 / 09:47 PM IST

చదువుతున్నప్పుడు నిద్ర వస్తుందా?

చదువుతున్నప్పుడు నిద్ర రావడం అనేది చాలా మంది విద్యార్థులు ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే చదువుకునేటప్పుడు ప్రతి గంటకు చిన్న విరామం (5ని.లు) తీసుకోవాలి. చదువుతున్న గదిలో తగినంత వెలుతురు ఉండాలి. అలాగే ఏకాగ్రతను పెంచడానికి తరచుగా నీరు త్రాగాలి. నిద్ర ఎక్కువగా వస్తే 15-20 నిమిషాలపాటు నిద్రపోయి తిరిగి లేచి చదవాలి. ఇలా చేస్తే ఏకాగ్రత మెరుగుపడి, నిద్ర దూరమవుతుంది.

November 22, 2025 / 09:28 PM IST

డిసెంబర్ 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 8,9 తేదీల్లో సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో విజయోత్సవాలకు.. ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25 నుంచి విభాగాల వారీగా సీఎం సమావేశాలు పెట్టనున్నారు.

November 22, 2025 / 09:23 PM IST

ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్షసూచన చేసింది. వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండవద్దని చెప్పింది.

November 22, 2025 / 09:16 PM IST

సర్పంచ్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటే?

TG: 2011 జనగణన ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. గత ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయరాదు. ఎస్టీ గ్రామాల్లో 100శాతం రిజర్వేషన్లు వారికే మొదట ఖరారు చేసి.. తర్వాత SC నుంచి బీసీకి కేటాయిస్తారు. మహిళల రిజర్వేషన్లను అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా అమలు చేస్తారు.

November 22, 2025 / 09:14 PM IST

‘బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు’

SRPT: ఆడపిల్లలను చదివించే దిశగా ప్రోత్సహించాలని, బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు హెచ్చరించారు. మున్యానాయక్ తండాలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే తల్లిదండ్రులతోపాటు ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

November 22, 2025 / 09:13 PM IST

‘ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌ను వేగవంతం చేయాలి’

SRPT: 5-15 సంవత్సరాల పాఠశాల విద్యార్థులందరికీ ఆధార్ మెండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ సీతారామ రావు ఆపరేటర్లకు సూచించారు. జిల్లాలో 24,532 మంది విద్యార్థులకు ఈ అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆధార్ సవరణలు (పేరు, పుట్టిన తేదీ) కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

November 22, 2025 / 09:10 PM IST

చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్

జింబాబ్వే సీనియర్ ప్లేయర్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 2000+రన్స్‌తో పాటు 100+వికెట్లు తీసిన మూడో ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అతని కంటే ముందు బంగ్లా క్రికెటర్ షకిబ్ అల్ హసన్(2551 రన్స్ + 149 వికెట్లు), ఆఫ్ఘాన్ ప్లేయర్ మహ్మద్ నబీ(2417 + 104) మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు.

November 22, 2025 / 09:01 PM IST

కోళ్ల పందాలపై పోలీసుల దాడులు

RR: మొయినాబాద్ PS పరిధిలోని బాకారం గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోళ్ల పందెంపై రాజేంద్రనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు కృష్ణంరాజుతో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60,950 నగదు,4 కార్లు,13 ఫోన్లు, 18 కోడి కత్తిలు, మొత్తం 22 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

November 22, 2025 / 08:57 PM IST

రామచంద్రపురం: జాబ్ మేళా లో 31 మంది ఎంపిక

కోనసీమ: రామచంద్రపురంలోని ఉపాధి కార్యాలయంలో శనివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ మేళాలో వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 31 మంది ఎంపికయ్యారు. లక్స్‌క్లోన్స్ బేబీ వరల్డ్‌లో 13, జస్ట్ డయల్‌లో 1, SBI కార్డ్స్‌లో 13, జెప్టో 4 మొత్తం 31 మంది ఎంపికయ్యారు. వారు హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తారని మంత్రి తండ్రి సత్యం తెలిపారు.

November 22, 2025 / 08:51 PM IST