నటి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ మూవీకి ‘ఓ సుకుమారి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి డైరెక్టర్ భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
WGL: ఖానాపురం MPDO కార్యాలయంలో పనిచేస్తున్న Jr. Asst మహిపాల్ సైబర్ మోసానికి గురై రూ. 47 వేలు కోల్పోయాడు. తన సోదరి నంబరు నుంచి “అర్జంట్గా డబ్బు పంపు” అంటూ మెసేజ్ రావడంతో పని ఒత్తిడిలో ఉన్న మహిపాల్ ఫోన్పే ద్వారా డబ్బు బదిలీ చేశాడు. మళ్లీ డబ్బు అడగ్గా అనుమానం రావడంతో సోదరి, బావను సంప్రదించగా వారు మెసేజ్ పంపలేదని తేలింది. కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.
NLG: మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులను మ. ఒంటిగంట తర్వాతనే తెరవడం, సా. 6 నుండి పర్మిట్ రూములకు అనుమతి కొనసాగుతుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనధికార ఆదేశాలను వైన్ షాపుల యజమానులు పాటిస్తూ సహకరిస్తున్నారు. గ్రామస్తులకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఊరి బయటనే మద్యం షాపులను ప్రారంభించారు. ఎమ్మెల్యే నిర్ణయంను నియోజకవర్గ ప్రజలు హర్షిస్తున్నారు.
ఆరావళి పర్వతాల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సోనియా గాంధీ మండిపడ్డారు. 100 మీటర్ల లోపు కొండల్లో మైనింగ్కు పర్మిషన్ ఇవ్వడం అంటే.. ఆరావళికి ‘డెత్ వారెంట్’ ఇవ్వడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మైనింగ్ మాఫియాకు రెడ్ కార్పెట్ వేయడమేనని, వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ రూరల్ మండలం నగునూర్కు చెందిన మెతుకు హేమలత పటేల్ దశాబ్దకాలంగా కరీంనగర్ కోర్టులో అడ్వకేట్గా సేవలందిస్తున్నారు. ఈమె న్యాయవాద వృత్తితోపాటు మహిళలు, పిల్లలకు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగానూ పోటీ చేసిన హేమలత.. ఇప్పుడు నగునూర్ సర్పంచ్గా బరిలోకి దిగారు. నగనూరులో ఆసక్తికరంగా రాజకీయం రసవత్తరమైంది.
NLG: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాదులో ఇవాళ జరిగిన మహా ధర్నాకు చిట్యాల నుండి ఆ యూనియన్ సభ్యులు బయలుదేరి వెళ్లారు. ఉదయం 10:30 కే చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. అక్రిడేషన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.
AP: విశాఖ స్టీల్ప్లాంట్ అడ్మిన్ ఆఫీస్ దగ్గర కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్లాంట్లో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడంపై నిరసనలు తెలిపారు. వైఫల్యం యాజమాన్యానిది అయితే.. నెపం కార్మికులపై ఎలా నెెడతారంటూ ప్రశ్నిస్తూ ఆందోళనలు చేపట్టారు. ముడిసరుకు ఇస్తే ఉత్పత్తి చేసి చూపిస్తామన్నారు. ఉత్పత్తి ఆధారంగా వేతనాలపై లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
MNCL: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మాగ లేఔట్ రైల్వే బ్రిడ్జి వద్ద వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. పలుచోట్ల రహదారులపై వరద నీరు నిలిచింది.
WGL: వర్ధన్నపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం విక్రయం, బెల్ట్షాపులు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పూర్తిగా నిషేధించామని ఎస్సై సాయిబాబు వెల్లడించారు. బుధవారం వారు మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘన చేస్తే బైండోవర్తో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యల కోసం 100 డయల్ లేదా స్టేషన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
NRML: హిందూ దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి హిందూ దేవుళ్లను కించపరిచారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు.
దిత్వా తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమై ఆపదలో ఉన్న శ్రీలంకకు భారత్ మరో భారీ సాయం చేస్తోంది. అత్యవసర వైద్య సేవల కోసం ‘రాపిడ్లీ డిప్లాయబుల్ ఫీల్డ్ హాస్పిటల్’ను పంపిస్తోంది. దీనితో పాటు 70 మంది వైద్య సిబ్బంది కూడా వెళ్తున్నారు. ఈరోజు సాయంత్రానికే ఈ టీం శ్రీలంక చేరుకోనుంది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణ వైద్యం అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 16 వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం బలోపేతానికి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకుని అమరుడు అయ్యాడని గుర్తు చేసుకున్నారు.
TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. యువత ఎక్కువగా పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు విడతలుగా జరిగిన నామినేషన్లలో 30-44 ఏళ్ల మధ్యవారే ఎక్కువగా ఉన్నారు. సర్పంచ్ బరిలో 60%, వార్డు సభ్యుల్లో 75% పైగా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ గ్రామాలను అభివృద్ధి చేయడానికి పలువురు తమ ఉద్యోగాలను కూడా వదిలేసి మరీ పోటీలో నిల్చున్నట్లు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో MCD ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఏకంగా 7 వార్డుల్లో విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ‘ఆప్’కు కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో స్థానంలో గెలుపొందారు. ఢిల్లీలో బీజేపీ జోరు పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.