ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నేడు కొత్తవలస జెడ్పీ పాఠశాలలో ఉదయం 10 గంటలకు జరిగే పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆనంతరం మధ్యహ్నం 1.30 గంటలకు అప్పన్నదొరపాలెం గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మంగళపాలెం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు.
W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామానికి చెందిన మద్దిశెట్టి నాగరాజు, బొమ్మిశెట్టి రామ సూర్యనారాయణలకు మధ్య జరిగిన గొడవకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు SI హనుమంతు నాగరాజు చెప్పారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగి ప్రభుత్వాసుపత్రిలో చేరి ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
కర్నూలు నుంచి విజయవాడకు రైళ్ల సౌకర్యాలు అత్యవసరమని, రైల్వే మినిస్టర్కు వినతిపత్రం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీ సచ్చితా నందను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. కర్నూలు-విజయవాడ మధ్య ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా రైళ్లు తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
వరంగల్ కలెక్టర్ ఆధ్వర్యంలో HCL టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న HCL-టెక్-బీ ప్రోగ్రాం కోసం రేపు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. 2024-25లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు, 2026లో పాస్ కాబోతున్న ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ విద్యార్థులకు ఈనెల 6న HNK అంబేడ్కర్ విగ్రహం వద్ద మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
TG: HYDలోని కార్వాన్ MIM MLA కౌసర్ మొహియుద్దీన్ భార్య నజ్మా సుల్తానా సర్పంచి పదవికి పోటీ పడుతున్నారు. మొహియుద్దీన్ స్వగ్రామం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్. అక్కడ సర్పంచి అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. నజ్మా గతంలో HYDలోని గోల్కొండ, నానక్నగర్ నుంచి 2సార్లు కార్పొరేటర్గా వ్యవహరించారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం 1,748 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గురువారం తెలిపారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొంటారన్నారు.
SDPT: జిల్లాలో మూడవ విడత తొమ్మిది మండలాల పరిధిలోని 163 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు 295 నామినేషన్లు దాఖలు కాగా, ఇప్పటి వరకు మొత్తంగా 468 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. అటు 1432 వార్డులకు గానూ రెండవ రోజు 1111 నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 1472 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల బృహత్ సమావేశాలు నిర్వహించనున్నారు. మన్యం జిల్లా బామినిలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు. అలాగే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో Dy.CM పవన్ విద్యార్థులతో మాట్లాడుతారు. ఉ.10:30 నుంచి మ.2 గం.ల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పిల్లల జవాబు పత్రాలు, హెల్త్ కార్డులను తల్లిదండ్రులకు అందిస్తారు.
VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు, తాగునీటి సమస్య పరిష్కారం,CMRF కి సంబంధించిన అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారని, తుఫాన్ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నందుకు అభినందించారని MLA తెలిపారు.
KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పర్యవేక్షించాలని CP సునీల్ దత్ అన్నారు. పోలీస్ స్టేషన్ సెక్టర్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిన్న గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్త్పై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.
HYD: iBOMMA రవి బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనుంది. కేసు విచారణలో ఉన్నందున, రవికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరుపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. దీంతో రవికి బెయిల్ లభిస్తుందా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
NLG: ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్కు సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం సాయంత్రం నార్కట్పల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
GDWL: ఆదిశిల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప స్వామి) జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు గురువారం భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. భక్తుల రద్దీ భారీగా ఉండే అంచనా నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు.
NZB: వర్ని మండలంలో సర్పంచి ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. గురువారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల పోటీ అభ్యర్థుల వివరాలు, బూత్ల సంఖ్య అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సాయిలు పాల్గొన్నారు.