SKLM: ఎచ్చెర్ల మండలం పెయ్యలవానిపేట గ్రామంలో రోడ్డు పక్కనే పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సోమవారం జెసిబి సహాయంతో స్థానిక యువకులు తొలగించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో తమ సొంత నిధులతో ఈ పనులు చేపట్టడం జరిగిందని యువకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
SRD: దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్విరామంగా పోరాడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ చరిత్రను రచించి, ప్రపంచం గర్వించదగిన మేధావి ఆయన అని పేర్కొంటూ కొనియాడారు.
MHBD: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
KMM: భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్భంగా.. సోమవారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని, కస్నాతండాలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రామస్తులు పూలమాలలేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామమూర్తి మాట్లాడుతూ.. అంబేద్కర్ సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన స్నాపికుడని అన్నారు.
PDPL: కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాడూరి వినోద్ కుమార్ ఎన్నికైన విషయం విధితమే. ఈ క్రమంలో రామగిరి మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నాయకులు వినోద్ కుమార్ను శాలువతో ఘనంగా సత్కరించి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మండల అధ్యక్షులు ఇల్లందుల బాపు తదితరులు ఉన్నారు.
KNR: భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పోస్టుమాన్ & ఎంటిఎస్ కరీంనగర్ డివిజన్ కార్యదర్శిగా ఓరుగంటి విష్ణువర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ ప్రధాన పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికైన కార్యవర్గాన్ని బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రావణ్ ప్రకటించారు.
SRCL: కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి లక్ష్మీరెడ్డి సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్తో మరణించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి కోనరావుపేట మాజీ సింగిల్ విండో ఛైర్మన్గా పని చేశారు. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
KNR: చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో లక్ష్మీ అనే వృద్ధురాలు తన శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. రేగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.
KMM: ఖమ్మం గొల్లగూడెం మసీదు సెంటర్లో సోమవారం ముస్లింలు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా ఉందని ముస్లిం మత పెద్దలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ముస్లింలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. తక్షణమే వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
BDK: కొత్తగూడెం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తు గడువును మరో 10 రోజులు పొడిగించాలని ఆటో వర్కర్స్ యూనియన్ రామవరం అధ్యక్షుడు SK జలీల్ సోమవారం కోరారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సమయమివ్వాలని, ఆటో సోదరుల కోసం ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని కోరారు.
ASR: కొయ్యూరు మండలంలో ఆదివారం రాత్రి గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం పలకజీడి గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని చిన్నాభిన్నం చేసింది. వసతి గృహంలో ఇనుప రాడ్స్ అన్నీ విరిగిపోయి, పైకప్పు మొత్తం ఎగిరి పోయి, చెల్లాచెదురు అయ్యాయని వార్డెన్ రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
JN: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెంది ఏఆర్ కానిస్టేబుల్ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన గుగులోతు నీల (26) వరంగల్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ కానిస్టేబుల్ పని చేస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
HYD: అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఫైర్ సిబ్బంది అందించే సేవలు అభినందనీయమని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఆదివారం తార్నాకలోని తన నివాసంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాన్ని పోస్టర్ను ఆవిష్కరించారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగుమిల్లి, లక్ష్మీపురం, కొయ్యలగూడెం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం కొయ్యలగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో బాలరాజు పాల్గొంటారన్నారు.
ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని MIకాపాడుకుంది. ఈ ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. కారుణ్ నాయర్ (89) పరుగులు చేసినప్పటికీ ఢిల్లీకి ఫలితం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ముంబైకి ఇది రెండో విజయం కాగా ఢిల్లీకి ఇది తొలి ఓటమి