TG: GHMCలో 27 మున్సిపాల్టీల విలీనానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. మంత్రివర్గం తెచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై త్వరలో ప్రభుత్వం గెజిట్ జారీ చేయనుంది.
రీజినల్ రూరల్ బ్యాంకుల్లో RRBS 13,217 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ద్వారా అధికారిక వెబ్ సైట్లో లాగిన్ అయి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
HNK: కాజీపేట మండలం కడిపికొండ బ్రిడ్జిపై ఇవాళ సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతిపై యాసిడ్ దాడి చేశారు. ఈ యాసిడ్ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా.. గమనించిన స్థానికులు యువతిని MGM ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు జనగాం జిల్లా జఫర్ఘడ్కు చెందినవారీగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: మంత్రులు లోకేష్, అనిత ఢిల్లీ చేరుకున్నారు. వీరికి టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. మంత్రుల వెంట కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు తదితరులు ఉన్నారు. లోకేష్, అనిత రేపు కేంద్రమంత్రులు అమిత్ షా, శివరాజ్సింగ్ చౌహాన్ను కలవనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మొంథా తుఫాన్ నష్టంపై వివరించనున్నారు. ఈ భేటీలో మంత్రులతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొననున్నారు.
PDPL: గ్రామపంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు, రచ్చపల్లి గ్రామాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం సిపి సందర్శించి శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు సూచనలను సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
NZB: బోధన్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ భాస్కరరావు పరిశీలించారు. సోమవారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రావడంతో పట్టణంలోని స్టోర్స్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణదారులకు కీలక సూచనలు చేశారు. స్టాక్ వివరాలు, రోజువారీ విక్రయాల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
PDPL: ఈనెల 7 నుంచి 9 వరకు మెదక్ పట్టణంలో జరిగే CITU రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరిఖని CITU కార్యాలయంలో ఇవాళ జరిగిన ప్లంబర్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. మహాసభలకు నేతలు బివి రాఘవులు, హేమలత, సాయిబాబు,పాల్గొన్నారు.
JGL: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేస్తూ, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేట్లు చూడాలన్నారు.
MDK: మనోహరాబాద్ మండలంలో రెండవ రోజు 294 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో రవీందర్ తెలిపారు. సర్పంచ్ పదవికి 53 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 241 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో 393 నామినేషన్లు దాఖలు కాగా, సర్పంచ్ పదవికి 76, వార్డు పదవులకు 317 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు.
MHBD: కొత్తగూడ మండల పరిధిలోని పెగడపల్లి గ్రామంలో ఇవాళ BRS నాయకులు నోముల సాంబరాజు, గాడుదుల సమ్మయ్య, బొల్లు రాజేందర్ కాంగ్రెస్లో చేరారు. మండల అధ్యక్షులు సారయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్సింగ్ పార్టీలో చేరిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వజ్జ సారయ్య పిలుపునిచ్చారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలో దళిత, గిరిజనులకు శ్మశానవాటికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి అన్నారు. సోమవారం ఎమ్మార్వో అమర్నాథ్కు వినతిపత్రం సమర్పించి, శ్మశానవాటికలు ఏర్పాటు చేయలన్నారు. అలాగే వాటికి ముళ్ల కంచె వేయాలని, గ్రామాల్లో విద్యుత్, నీటి సమస్యల్ని దూరం చేయాలని విజ్ఞప్తి చేశారు.
SRCL: వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు గుడ్ల మైసయ్య, సుమారు 20 మందితో కలిసి సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వాకులభరణం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సొయినేని కర్ణాకర్ పాల్గొన్నారు.
BHPL: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో BHPL జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్-1861 అమలు చేస్తున్నట్లు SP సంకీర్త్ గౌడ్ తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నా, రాస్తారోకో, పబ్లిక్ మీటింగ్స్, సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే వాడకం, ప్రభుత్వ ఆస్తులకు నష్టంకలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
MHBD: కొత్తగూడ మండలంలో BJP మండల అధ్యక్షుడు యాదగిరి మురళి ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, రాష్ట్ర నాయకుడు సీతయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. DEC 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బీజేపీ జిల్లా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.
MNCL: దండేపల్లి మండలంలోని నంబాలకు చెందిన ఏడేళ్ల బాలికపై శనిగారపు బాపు, ఉపారపు సతీష్ అత్యాచారం చేసి హత్య చేశారని డీసీపీ భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 27న బాలికను ఎత్తుకు వెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారన్నారు. అనంతరం బాలికను హత్య చేసి గ్రామంలోని ఒక బావిలో పడేశారన్నారు. వారిద్దరూ పారిపోయే ప్రయత్నం చేయగా రిమాండ్ లోకి తీసుకున్నామన్నారు.