TG: తాను మూడేళ్లు పీసీసీ చీఫ్గా పనిచేశానని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గాంధీ భవన్లో డీసీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. జిల్లాల్లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో.. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని డీసీసీలను ఆదేశించారు. రాష్ట్రానికి సీఎం అయినా కావచ్చు కానీ.. డీసీసీగా అవ్వడం కష్టమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
AP: మాజీ సీఎం జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. ఐదేళ్ల జగన్ పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాయలసీమకు హంద్రీనీవా జీవనాడి వంటిదని అన్నారు. వైసీపీ హయాంలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే హంద్రీనీవాకు రూ.3,860 కోట్లు వెచ్చించినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు.
KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన కుక్కల యాకోబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న MRPS నాయకులు వెంకన్న మాదిగ, కట్టెకోల వెంకటేశ్వర్లు యాకోబు భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
TG: ఈ నెల 8,9 ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 9న తెలంగాణ- 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. కాలుష్య కారక పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఇండస్ట్రీస్ తరలింపు తమ ప్రధాన లక్ష్యాలన్నారు.
WGL: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఇవాళ వరంగల్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్స్, భారీ డిస్కౌంట్స్ పేరుతో ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఉచితం అనగానే ఆశపడకుండా ఒక్క క్షణం ఆలోచించాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో అభిషేక్ శర్మ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 19 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెంగాల్తో జరిగిన గత మ్యాచ్లోనూ అభిషేక్ 148 పరుగుల భారీ శతకం సాధించిన విషయం తెలిసిందే.
W.G: పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్, ఎస్టీవీఎన్ హైస్కూల్లో బాల్ వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ.. యుక్త వయసులో బాలికలకు వివాహాలు చేయడం మేలు అని సూచించారు. చిన్న వయసులోనే బాలికలకు పోషణతో కూడిన ఆహారం అందించాలన్నారు. తద్వారా గర్భస్థ దశలో ఎటువంటి సమస్యలు ఉండవన్నారు.
కడప: బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డా.దాసరి సుధ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రోగులతో మాట్లాడుతూ అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. జనరల్ వార్డు, ఓ.పీ, రిజిస్టర్, డయాలసిస్ యూనిట్ను పరిశీలించి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ASF: అక్రమ ఆయుధాలతో హత్యాయత్నం చేసిన నిందితుడిని కౌటాల పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం SP నికిత పంత్ మాట్లాడుతూ.. బీహార్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి, వ్యాపారి హత్యకు ప్రయత్నం చేసిన కుర్బంకర్ అజయ్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కడన్నారు. నిందితుడి నుండి ఒక పిస్తోల్, ఒక తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం చేసుకున్నట్లు SP పేర్కొన్నారు.
WGL: ఉమ్మడి జిల్లాలో GP ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ పదవికి భారీ పోటీ ఉన్నప్పటికీ, గౌరవ వేతనం నెలకు కేవలం రూ.6,500 మాత్రమే. 2015లో నిర్ణయించిన ఈ మొత్తాన్ని 2021లోనే పెంచారు. అభివృద్ధి బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఆదాయం లేకపోయినా, గ్రామానికి ‘ప్రథమ పౌరుడు’ అన్న గౌరవం, ప్రతిష్ఠ కోసం సర్పంచ్ అభ్యర్థులు రూ. 1,00,000 ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.
E.G: రాజమండ్రిలోని వంకాయల వారి వీధిలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో.. ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని ఎమ్మెల్యే వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
TG: రాష్ట్రంలో బీజేపీ రిమోట్ కంట్రోల్ BRS నేత హరీష్ రావు చేతిలోకి వెళ్లిందని కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ సామా రాంమోహన్ రెడ్డి ఆరోపించారు. BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు, BJLP ఏలేటి కీలు బొమ్మల్లా మారారన్నారు. హరీష్ కార్యక్రమాలను KTR కంటే ఎక్కువగా ప్రచారం చేసేలా BJP ప్రణాళిక చేస్తోందన్నారు. ఈటల, హరీష్ వ్యూహంలో ఆ పార్టీ చిక్కుకుందని సామా పేర్కొన్నారు.
ATP: ఉరవకొండ పట్టణంలో ఇవాళ మంత్రి పయ్యావుల కేశవ్ రెండో రోజు పర్యటిస్తున్నారు. పట్టణంలోని కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు నాణ్యవంతంగా పూర్తి చేయాలని మంత్రి సదరు కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
NZM: PM శ్రీ ZPHS వేల్పూర్లో మండల స్థాయి (English Language Teachers Association) Olympiad & Elocution పోటీలు నిర్వహించారు. Olympiad సీనియర్లో రోహన్ (వేల్పూర్), జూనియర్లో సహస్ర (అంక్సాపూర్) విజయం సాధించారు. Elocution సీనియర్లో పల్లవి, జూనియర్లో SK.నూరుద్దీన్(వేల్పూర్) మొదటి స్థానాలు దక్కించుకున్నారు. విజేతలకు HM రాజన్న బహుమతులు అందజేశారు.
MDK: ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తాండ, సీఎం తాండ, ఎల్లిపేట్, ఎల్పుగొండ, కొత్తపల్లి, అబ్లపూర్, అన్నారంలకు చెందిన ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా ఉండాలన్నారు.