• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

త్రాగునీటి బోరుకు శంకుస్థాపన చేసిన సర్పంచ్

ASR: హుకుంపేట మండలం తీగలవలస పంచాయితీలోని బసలబంద గ్రామంలో మంగళవారం త్రాగునీటి బోరుకు సర్పంచ్ బేసు శంకుస్ధాపన చేశారు. గ్రామానికి త్రాగునీరు అందించుటకు పంచాయితీ మరియు జల్ జీవన్ మిషన్ పథక నిధుల నుండి సుమారు రూ.6 లక్షలు మంజూరు అయినట్లు ఇంజనీరు జె చందు తెలిపారు.

February 18, 2025 / 08:26 PM IST

రీ సర్వే పనులను పరిశీలించిన జేసీ

W.G: రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి రికార్డులు ఆధునీకరించేందుకు ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మొగల్తూరు మండలం కె.పి పాలెం గ్రామంలో జరుగుచున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను జేసీ సరిహద్దుల మ్యాప్‌లను పరిశీలించారు.

February 18, 2025 / 08:21 PM IST

‘శత శాతం ఉత్తీర్ణత నమోదు కావాలి’

VZM: జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత నమోదు కావాలన్నారు. అంతకుముందు అంగన్వాడీ కార్యకర్తల ఆరు రోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు అందజేశారు.

February 18, 2025 / 08:19 PM IST

దాడి కేసులో ఇద్దరికీ రిమాండ్

ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మిలో జరిగిన దాడి కేసులో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. గ్రామానికి చెందిన వెంగల్ రెడ్డి, శబరి కంఠారెడ్డి పై ఈనెల 13న వల్లెం రాజశేఖర్ రెడ్డి, అతని భార్య రాజ్యలక్ష్మి దాడి చేశారన్నారు. మెజిస్ట్రేట్ ముందు ఇద్దరినీ హాజరు పరచగా కనిగిరి జడ్జి భరత్ చంద్ర ముద్దాయిలిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు.

February 18, 2025 / 08:18 PM IST

విద్యుత్ సమస్యలపై హెల్ప్ లైన్: కలెక్టర్

వనపర్తి: జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా నిరంతర విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు ఎవరైనా విద్యుత్ సమస్యలు ఉంటే 1912 హెల్ లైన్‌కు ఫోన్ చేయాలన్నారు.

February 18, 2025 / 08:16 PM IST

‘ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి’

SKLM: ఆక్వాకల్చర్ టెక్ 2.0 కాంక్లేవ్ కార్యక్రమం రెండు రోజుల పాటు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంగళవారం ఉదయం టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కె.అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆక్వా రంగం సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దేశంలోనే ఏపీ ఆక్వా ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.

February 18, 2025 / 08:12 PM IST

‘చెత్తను ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలి’

VZM: గ్రామాలలో సేకరించిన చెత్తను ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు సూచించారు. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటలోని ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రాన్ని డీపీఈఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్ బిఎస్ఎన్ పట్నాయక్‌తో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. తడిపొడి చెత్తను వేరు చేసి ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని క్లాప్ మిత్రలకు సూచించారు.

February 18, 2025 / 08:08 PM IST

ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ ఛాంపియన్స్

NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా వీరులపాడు మండలం నుంచి పంచాయతీ ఛాంపియన్స్‌గా శిక్షణ పొందిన 8 మంది మంగ‌ళవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా NIRD PR కో-ఆర్డినేటర్ జీవీ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

February 18, 2025 / 07:57 PM IST

నల్ల బ్యాడ్జీలు ధరించి పోస్టల్ ఉద్యోగుల ధర్నా

SRD: పోస్టల్ యాక్ట్ – 2023 అమలు చేయవద్దని కోరుతూ తపాలా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోస్టల్ శాఖను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

February 18, 2025 / 07:53 PM IST

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

నారాయణపేట: నారయణపేట మండలం అప్పంపల్లి మెడికల్ కళాశాల వద్ద ఈనెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో మంగళవారం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పరిశీలించారు. సభ స్థలం, వేదిక, పార్కింగ్ స్థలాలను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.

February 18, 2025 / 07:19 PM IST

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: గొల్లపూడిలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు ఎన్నికల ప్రచారంలో మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పట్టభద్రుల ఓట్లను అభ్యర్థించారు.

February 18, 2025 / 07:10 PM IST

అథ్లెటిక్స్‌లో జిల్లా విద్యార్థికి బంగారు పతకం

నాగర్ కర్నూల్: హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గోరిట గ్రామానికి చెందిన పి అభిషేక్ అండర్-20 ట్రిపుల్ జంప్ విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అతని విజయాన్ని అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ స్వాములు, అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.

February 18, 2025 / 06:40 PM IST

జగన్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు: బెజవాడ నజీర్

కృష్ణా: జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని టీడీపీ నేత బెజవాడ నజీర్ విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనతో విసిగిపోయిన జనం వైసీపీని గద్దె దించినా జగన్‌‌కు బుద్ది రాలేదని, పోలీస్ అధికారులను, టీడీపీ నేతలను బట్టలు ఊడదీసి నిలబెడతానని హెచ్చరించే విధానం చూస్తే మానసిక రుగ్మతతో బాధపడుతునట్లు స్పష్టమైందన్నారు.

February 18, 2025 / 06:39 PM IST

కల్తీ నెయ్యి కేసు.. ముగిసిన విచారణ

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ ముగిసింది. తిరుపతి సిట్ కార్యాలయంలో ఐదు రోజులపాటు నిందితులను విచారించారు. సిట్ అధికారులు కస్టడీలో వివిధ అంశాలపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీవైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్డాను‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు.

February 18, 2025 / 05:25 PM IST

BRS పాలనలో అవమానాలు ఎదుర్కొన్నా: జూపల్లి

TG: గత BRS పాలనలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ చెప్పిన హామీలు నిరుద్యోగ భృతి, దళితులకు భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల అవినీతిపై తాను సవాల్ చేస్తే స్పందించలేదని అన్నారు. గత 10 ఏళ్ల పాలన వల్ల నెలకు రూ.6,500 కోట్లు వడ్డీలు కడుతున్నామన్నారు.

February 18, 2025 / 05:21 PM IST