అయోధ్య రామాలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ధర్మధ్వజాన్ని ఏర్పాటు చేశారు. దీనిని కాషాయవర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో తయారు చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తుంది. గుజరాత్లోని పారాచ్యూట్ తయారీ సంస్థ పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో, పట్టుదారాలతో 25 రోజుల పాటు శ్రమించి దీన్ని తీర్చిదిద్దింది.
BDK: చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుత సీజన్లో వరి సన్న రకం ధాన్యానికి మద్దతు ధరగా రూ. 2,389 నిర్ణయించి అదనంగా బోనస్ రూ. 500 చెల్లిస్తుందన్నారు.
BHPL: జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం నాలుగో రోజుకు చేరింది. గతంలో 37 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చినా రెండేళ్లు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించకపోవడ పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘ నాయకులు పాల్గొన్నారు.
TG: మతపరమైన దీక్షలపై రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలు చేపడితే సెలవులు తప్పనిసరని పేర్కొంది. డ్యూటీలో ఉండగా ఎలాంటి మతాచారాలు పాటించొద్దని ఆదేశించింది. డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించారని.. కంచన్ బాగ్ SI కృష్ణకాంత్కు మెమో జారీ చేశారు. పోలీసులు జుట్టు, గడ్డం పెంచుకోవద్దని తెలిపింది. షూష్ లేకుండా సివిల్ డ్రెస్లో డ్యూటీ చేయకూడదని పేర్కొంది.
అయోధ్య మందిరం భారత ఆత్మగౌరవ ప్రతీక అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ అన్నారు. ‘తరతరాల ప్రజానీకం ఆకాంక్షలకు, వికసిత్ భారత్ సంకల్పానికి అయోధ్య ఆలయం ప్రతీక. రామాలయంలో జరిగిన ధ్వజారోహణ.. కొత్త యుగానికి శుభారంభం. గత 500 ఏళ్లలో సామాజ్రాలు మారాయి గానీ, భక్తి భావన అచంచలంగా కొనసాగుతూనే ఉంది’ అని పేర్కొన్నారు.
W.G: భీమవరం పట్టణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి ట్రాఫిక్ సమస్యలపై పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాటన్ పార్క్ వద్ద నుంచి ఆర్టీసీ బస్ డిపో వరకు ద్విచక్ర వాహనాలపై అధికార యంత్రాంగం అంతా పర్యటించారు. అధికంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నచోట ఆగి అధికారులకు పలు సూచనలు కలెక్టర్ జారీ చేశారు.
ఉదయం లేవగానే పిల్లలతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగించాలి. కావాలంటే అందులో టీస్పూన్ తేనె, నిమ్మరసం యాడ్ చేయొచ్చు. రాత్రి నీటిలో నానబెట్టిన 4-5 ఎండుద్రాక్షలను పరగడుపున తినిపించాలి. రోజూ వ్యాయామాలు చేయించాలి. గోరువెచ్చని పాలలో అరటీస్పూన్ ఆవు నెయ్యి కల్పి రాత్రి పడుకునే ముందు వారితో తాగించాలి. స్ట్రాబెర్రీ, అవకాడో, ఓట్స్, యాపిల్స్ వంటి పండ్లను తినిపించాలి.
RR: షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, పథకాలను మహిళల పేరుతోనే అమలు చేస్తూ వారి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
KMM: కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు అమర్లపూడి శరత్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా SKM ఆధ్వర్యంలో మంగళవారం సత్తుపల్లిలో నిరసన ర్యాలీ చేపట్టారు. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం అమలు చేయాలన్నారు.
AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విద్యార్థిని బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. బెంగళూరులోని ఆచార్య కళాశాలలో దేవశ్రీ డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు చిత్తూరు జిల్లా పెద్దకొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, దేవశ్రీని అతడే హత్య చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు గుర్తించారు. నిందితుడు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఉల్లి ధరలు భారీగా తగ్గడంపై రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ జిల్లాలోని ధన్నూర్లో ఉల్లిగడ్డలను పాడపై పేర్చి అంత్యక్రియలు చేశారు. పంట పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో ఖర్చుచేస్తుండగా.. కనీసం గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
BDK: బయ్యారం మండలం పెద్ద చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చెరువులో చేప పిల్లలను వదిలారు. బయ్యారం పెద్ద చెరువులో వరద వలన నష్టపోయిన మత్స్య రైతులందరికీ నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.
అయోధ్యలోని రామ్లల్లా మందిర శిఖరంపై అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మోదీ ధ్వజారోహణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ శిఖరంపై కాషాయ రంగు ధర్మధ్వజాన్ని ఎగురవేశారు. ఈ ధర్మధజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం, కోవిదర చెట్టు చిహ్నాలను ముద్రించారు. అలాగే కాషాయ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా చిహ్నాలు ఏర్పాటు చేశారు.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో భారత బౌలర్గా జడ్డూ చరిత్ర సృష్టించాడు. గౌహతి వేదికగా ఉదయం సెషల్లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా.. ఈ మార్క్ అందుకున్నాడు. దీంతో అనిల్ కుంబ్లే, అశ్విన్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు.
NDL: మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరోందిన డాక్టర్ ఖాదర్ వలి మంగళవారం మహానందీశ్వర స్వామి దర్శనార్థం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారమే అనారోగ్యానికి ఔషధమన్నారు. సిరి ధాన్యాలు (మిల్లెట్స్) కలుగుతాయని డాక్టర్ ఖాదర్ వలీ వివరించారు.