TG: HYD రామాంతపూర్లో జరిగిన శ్రీకృష్ణ శోభాయాత్రలో విద్యుత్ షాక్తో ఐదుగురు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలిచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
NLR: కొడవలూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ని వెనుక నుంచి టాటా ఎస్ వ్యాన్ ఢీకొట్టింది.ఈ ఘటనలో టాటా ఎస్ వాహనంలోని మాధవరావు, హుస్సేన్ అనే చెన్నైకి చెందిన ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కావలికి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,686 గ్రామపంచాయతీలో ఉండగా.. 15,276 వార్డులున్నాయి. ఒకే రోజు పోలింగ్, అదే రోజు లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
MDK: జిల్లాలో ఆదివారం రాత్రి కుంభ వర్షం కురిసింది. తూప్రాన్ పట్టణంలో అత్యధికంగా 179.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా, కౌడిపల్లి 176. 0, పెద్ద శంకరంపేట 165.5, వెల్దుర్తి 160.8, మాసాయిపేట 148.8, శివంపేట 147.0, కొల్చారం 137.5, మనోహరాబాద్ 130.3, నర్సాపూర్ 126.5, టేక్మాల్ 126.3, చిలిపిచెడు114.5, రేగోడు 107.0, చేగుంట 70.0 మిల్లీమీటర్ల వర్షపాతం ఆమోదయింది.
MBNR: అడ్డాకులలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. HYD నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న WNP డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనకనుంచి బొలెరోవాహనం ఢీకొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఆత్మకూరు మండలం పిన్నెంచెర్లకుచెందిన కుమ్మరి నాగలక్ష్మన్న(40) అక్కడికక్కడే మృతిచెందాడు.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
MBNR: జిల్లా పురపాలక పరిధిలోని 21వ వార్డులో ఆదివారం రాత్రి నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీస కార్యక్రమానికి మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్లడాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి పనిలో చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
స్టార్లింక్తో జియో, ఎయిర్టెల్ జట్టుకట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్లింక్కు స్వాగతం పలుకుతూ కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ పోస్ట్ పెట్టారు. ‘భారత్లోకి స్టార్లింక్కు స్వాగతం. మారుమూల ప్రాంతాల్లోని రైల్వే ప్రాజెక్టులకు ఇది ఉపయోగకరం’ అని పోస్టు పెట్టారు. అయితే, కొద్ది సేపటికి దానిని డిలీట్ చేయడం గమనార్హం.
PLD: కేంద్ర ప్రభుత్వ పథకం జలజీవన్ మిషన్ ద్వారా మాచర్ల నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి రూ. 600కోట్లు కేటాయించడం హర్షణీయమని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. 8 నెలల్లోనే ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించే దిశగా అడుగులు పడుతున్నాయంటే దాని వెనుక నరసరావుపేట ఎంపీ లావు ఉన్నారన్నారు.
KRNL: పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది.
NDL: వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కూటమి సర్కారు వచ్చి పది నెలలు పూర్తయినా ఇంకా వైసీపీ పైనే నిందలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో మేము ఇంటి ఇంటికి వెళ్లి ఓట్లు వేయండని అడిగితే వేస్తాం నాయన అని చెప్పారు. మమ్మల్ని ఎవరూ తిట్టలేదు. ఈసారి టీడీపీ వాళ్లు ఓట్లు అడిగితే చెప్పులు, చీపురులు రెడీగా ఉన్నాయి’ అన్నారు.
KRNL: నగరంలోని సెట్కూరు కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను కర్నూలు నగర పాలక కమిషనర్ యస్. రవీంద్ర బాబు పరిశీలించారు. గురువారం టోకెన్ల జారీ, ఆహారం వడ్డింపు, స్వచ్ఛత, తాగునీటి వసతులకు సంబంధించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అంతకన్నా ముందు జగన్నాథ గట్టుపై టిడ్కో నందు ఎస్బిఐ బ్యాంకు సహకారంతో నర్సరీ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.
ATP: వైసీపీ హయాంలో చెత్తపైనా పన్ను వేశారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాగానే చెత్త పన్నును రద్దు చేసిందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అమృత్ స్కీం కింద నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.
APT: విద్యుత్ షాక్కు గురై చిన్నారి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. డి. హీరేహాళ్ మండలం మురిడికి చెందిన 6 ఏళ్ల చిన్నారి అర్పిత స్నానం చేసేందుకు వెళ్తుండగా డోర్కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించి పడిపోయింది. గమనించిన తల్లి రూతమ్మ వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.
GNTR: బ్యాంకుకు రుణం కట్టలేదనే నెపంతో పత్తి మిల్లుకు సీల్ చేసిన ఘటనలో చిక్కుకున్న ఇద్దరు బీహార్ కూలీలను.. ఈస్ట్ డీఎస్పీ అజీజ్ బ్యాంకు అధికారుల్నీ పిలిపించి వీఆర్వో రోశయ్య సమక్షంలో సీల్ తీయించి కూలీలకు విముక్తి కలిగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో లాలాపేట ఎస్సై హసీమ్, ఇతర సిబ్బంది ఉన్నారు.
సత్యసాయి: హిందూపురంలోని తూముకుంట చెకోపోస్ట్ వద్ద డీసీ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఎస్పీ వి. రత్న, జిల్లా జడ్జిలు, ఇతర రంగాల మహిళా ప్రముఖులు హాజరుకానున్నారు. వక్తల ఉపన్యాసాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.