అలనాటి ప్రముఖ నటుడు కత్తి కాంతారావు వర్ధంతి ఇవాళ. ఆయన సూర్యపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో నవంబర్ 16, 1923లో జన్మించారు. కత్తి కాంతారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 400 పైగా సినిమాలలో నటించారు. పౌరాణిక, జానపద చిత్రాలలో కూడా నటించి జానపద నటుడిగానూ పేరుగాంచారు. తెలుగు తెరపై కత్తిసాముతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టేలా అనేక జానపద చిత్రాలలో నటించిన నట ప్రపూర్ణుడు.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఎలి లిల్లీ భారత్లో ఊబకాయం తగ్గుదల, టైప్-2 డయాబెటిస్ నివారణకు ‘మోంజారో’ ఇంజెక్షన్ను ప్రారంభించింది. దీని ధర రూ.3,500/వయల్ (2.5mg), రూ.4,375/వయల్ (5mg). క్లినికల్ ట్రయల్ ప్రకారం దీన్ని 15mg మోతాదులో వాడితే 72 వారాలలో 21.8 కిలోలు, 5mg వాడితే 15.4 కిలోల బరువు తగ్గడానికి దారితీస్తుంది.
AP: బోయింగ్ యూత్ స్కిల్ ప్రోగ్రాంలో మూడో బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుంది. బోయింగ్ ఇండియా, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులను ఎంపీ శ్రీభరత్ అభినందించారు. ఈ కార్యక్రమం విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరిగింది. విద్యార్థుల్లో సమగ్ర నైపుణ్యం ఉంటే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఎంపీ తెలిపారు.
ADB: భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో పంట చేలలోని బోరు బావుల వద్ద నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం తాంసి మండలంలోని గిరిగామ గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. NREGS ద్వారా నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలే బోరిగావ్ గ్రామపంచాయతీ కేబీ కాలనీలో రూ. 8లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ కమిటీ ఎస్టీ సెల్ చైర్మన్ సేద్మాకి ఆనందరావు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కట్టబడి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.
అన్నమయ్య: మందుల షాపులపై విజిలెన్స్, ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలో విస్తృతంగా ఆకస్మిక దాడులు చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.కేశవరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మకాలు జరిపిన వెంటనే వాటి వివరాలను హెచ్ వన్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.
SRD: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎంశ్రీ పథకంలో జిల్లాకు చెందిన 40పాఠశాలలు ఎంపికైనట్లు డీఈఓ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 25లోపు http:///pmshree. education.cgg.gov.in వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
KDP: బద్వేల్ రూరల్ సీఐగా పనిచేస్తున్న M.నాగభూషణ్కు ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాలలో రాష్ట్ర పోలీస్ మహాన్నత సేవా పతకాన్ని ప్రకటించినారు. ఈ సేవా పథకాన్ని నవంబరు 1వ తేదీన అమరావతిలో జరిగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీద ఇవ్వనున్నారు.
TPT: రాయల చెరువు నుంచి ఇద్దరూ బైక్పై వస్తూ పీవీ పురం దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన కేశవ, దీపిక అనే ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన జూనియర్ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల కొరకు, అదేవిధంగా నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే సామేలు కోరారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
నెల్లూరు: ఈ నెల 23వ తేదీలోపు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇస్రో ఆధ్వర్యంలో యువికా(యువ విజ్ఞాన కార్యక్రమం)కు దరఖాస్తు చేసుకోవాలని సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన వారికి స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.
SDPT: జిల్లాలోని మహిళా రైతులందరికీ 50% రాయతీపై వ్యవసాయ పనిముట్లు ఇవ్వనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా స్మామ్(SMAM) పథకం ద్వారా 50% రాయతీపై మహిళా రైతులకు మాత్రమే అందుబాటులో ఉండే వ్యవసాయ పనిముట్లు అందించబడుతున్నాయని పేర్కొన్నారు.
NLR: సోమశిల జలాశయ తాజా నీటి వివరాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడంలేదని జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. జలాశయంలో 54.479 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 330 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 400 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
KKD: అచ్యుతాపురంలో ఈనెల 16న తల్లి షేక్ జహారా బీబీని హత్య చేసిన కొడుకు కమల్ను ఇంద్రపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. SI వీరబాబు వివరాల ప్రకారం.. బీటెక్ మధ్యలో ఆపేసి ఇంటి వద్ద రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న కొడుకును ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి అనడంతో నుదిటిపై బలంగా కొట్టి చంపాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.
KKD: తుని పట్టణంలో నేటి నుంచి మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు కారణంగా నీటి సరఫరాకి అంతరాయం ఉంటుందని తెలిపారు. తుని పట్టణంలో ఒకటో వార్డు నుంచి 10వ వార్డు వరకు ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు రేఖ వాణి పాలెంలో లైన్ మార్పు కారణంగా మంచినీరు తక్కువగా వస్తాయన్నారు.