కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీ మాకు గుడి లాంటిది.. అధిష్టానం పిలిస్తే నేను, సీఎం సిద్ధరామయ్య కచ్చితంగా వెళ్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే తన కులమని, నాకు ఫలానా పదవి కావాలని ఎప్పుడూ డిమాండ్ చేయనని స్పష్టం చేశారు. పార్టీ ఏం నిర్ణయించినా దానికి కట్టుబడి ఉంటానని డీకే తేల్చిచెప్పారు.
TG: గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ ప్రకటించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు గుర్తులు విడుదల చేసింది. బ్యాలెట్లో చివరి గుర్తు తర్వాత నోటా ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులకు నోటిఫికేషన్ పంపింది.
ASR: చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో సాగు చేస్తున్న చిలకడదుంప పంటకు ఈ ఏడాది మంచి గిరాకీ నెలకొంది. రెండు మండలాల్లో మొత్తం 200 ఎకరాల్లో ఈ పంటను రైతులు సాగుచేశారు. ఎకరానికి సుమారు రూ.25,000 పెట్టుబడి పెడితే, ఖర్చులు పోను అదనంగా మరో రూ.25,000 వరకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. దీంతో గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
SDPT: ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి సూచించారు. ములుగు మండలం వంటిమామిడి శివారులోని రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. రిజిస్టర్ వెరిఫై చేశారు. ఇప్పటివరకు 96 వాహనాల తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం చిన్నతిమ్మాపూర్లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
నల్గొండలోని డాన్ బోస్కో పాఠశాలలో ఇంటర్ కాలేజ్ గేమ్స్కు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో ఈనెల 29న (శనివారం రోజున ) జరగవలసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లాటరీ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఆర్మూర్ మున్సిపల్ అధికారులు తెలిపారు. తదుపరి తేదీని తెలియజేస్తామని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు, లబ్ధిదారులు గమనించాలని సూచించారు.
TG: HYDలోని HMDA పరిధిలో భూముల వేలం పాట కొనసాగుతోంది. కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్లో 15,16 ప్లాట్లకు వేలం పాట వేస్తున్నారు. ఇప్పటికే ఎకరం భూమి ధర రూ. 140 కోట్లు దాటింది. కాగా, గతవారం ఇదే లేఅవుట్లో ఎకరం రూ.137 కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని శుక్రవారం మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ రవి నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా బదిలీల అనంతరం విధుల్లో చేరిన కొత్త సీఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పలువురు సీఐలను ఉద్దేశించి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు.
GNTR: ఫిరంగిపురం మండలం రేపూడిలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్స్ గోడౌనన్ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తనిఖీ చేశారు. అనంతరం సీసీటీవీల పనితీరును కూడా పరిశీలించారు.
NZB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో విద్యను కార్పొరేట్గా మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా మహాసభలు శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం నుంచి CVR జూనియర్ కళాశాల వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు.
TG: నిన్న KTRపై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కడియం శ్రీహరి.. నీ ఎమ్మెల్యే పదవి నీఅ*.. నీ అ* ఇచ్చారా?. నువ్వు నీ బిడ్డ పార్టీ ఫండ్ తీసుకుని అమ్ముడుపోయారు. నిన్ను తిట్టే హక్కు బీఆర్ఎస్ పార్టీకి బరాబర్ ఉంది. నువ్వు మొగోడివి అయితే రాజీనామా చేయి’ అని విమర్శించారు.
SRD: పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్ 21వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజి చేసుకునే కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.
‘దిత్వా’ తుఫానుతో వణికిపోతున్న శ్రీలంకకు ప్రధాని మోదీ అండగా నిలిచారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే ‘ఆపరేషన్ సాగర్ బంధు’ కింద సహాయక సామాగ్రిని పంపించారు. కష్టకాలంలో పక్క దేశానికి సాయం చేయడం మన బాధ్యత అని పేర్కొన్న మోదీ.. అవసరమైతే మరింత సాయం చేయడానికి భారత్ ఎప్పుడూ రెడీగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది, కుటుంబాల కోసం భారీ మెగా హెల్త్ క్యాంప్ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అపోలో, మెడికవర్, రినోవా తదితర ఆసుపత్రుల వైద్యులు పాల్గొని BP, షుగర్, ECG, 2D ఎకో, ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించారు. విధుల ఒత్తిడిలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే వ్యాయామం, నడక, యోగా తప్పనిసరి అని ఎస్పీ సూచించారు.
BPT: పిట్టలవానిపాలెం మండలం ఇంటూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందోలు – తెనాలి ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.