AP: రాజధాని అమరావతి రెండో విడత భూసమీకరణ కోసం పల్నాడు జిల్లా పెదకూరపాడులో గ్రామ సభలను నిర్వహించారు. అలాగే బలుసుపాడులో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే భాష్య ప్రవీణ్, ఆర్డీవో రమాకాంత్, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి రైతులు తెచ్చారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు సానుకూలత చూపినట్లు అధికారులు తెలిపారు.
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఇవాళ జైపూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. గత కొన్ని మ్యాచ్లకు గాయం కారణంగా దూరంగా ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ తిరిగి జట్టులో చేరాడు. అతడు ఈ మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. RR కీలక బౌలర్లు జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ జట్టుకు దూరం అయ్యారు. మరోవైపు పంజాబ్ జట్టులో ఫెర్గూసన్ స్థానంలో కైల్ జేమీసన్ను తీసుకున్నారు.
SKLM: ఆమదాలవలస పట్టణంలో ఆదివారం ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ధాటికి జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా కన్పించాయి. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే ప్రధాన రహదారి నిర్మానుషంగా మారాయి. దీంతో అను నిత్యం రద్దీగా ఉండే పట్టణ రహదారుల పై జనసంచారం కన్పించలేదు. ఎండ తీవ్రత, ఉక్క పోతతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడ్డారు.
ప్రకాశం: సీపీఐ శాఖలను బలోపేతం చేసుకోవాలని, సభ్యత్వలను పెంచుకోవాలని జిల్లా కార్యదర్శి సభ్యులు వై.రవీంద్ర బాబు అన్నారు. శనివారం కనిగిరిలో సీపీఐ శాఖ సమావేశం జరిగింది. రవీంద్ర బాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలపై సీపీఐ పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కోనసీమ: మామిడికుదురు మండలం మగటపల్లి నుంచి గోగన్నమఠం వరకు నిర్వహిస్తున్న పూడికతీత పనులను జెడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు ఆదివారం పరిశీలించారు. పూడికతీత పనులను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు సక్రమంగా పారుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట బాజ్జి, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు ఉన్నారు.
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ బండి ముత్యాలమ్మ తల్లిని జిల్లా నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ మోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో టెస్ట్ చైర్మన్ కడిలి మాణిక్యాలు రావు, ఆలయ సిబ్బంది భక్తులకు ఔషకార్యం కలగకుండా తగిన ఏర్పాటు చేశారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం కొత్తపేటకు చెందిన మంతెన వెంకట కృష్ణంరాజు, దుర్గావతి దంపతులు వారి కుమారులు వెంకట సూర్యసుబ్బరాజు, శ్వేత దంపతులు దర్శించుకున్నారు. వారు రూ.30లక్షలు విలువ కలిగిన 369గ్రా. బంగారు శఠారి(పాదుకలు) స్వామివారికి సమర్పించారు. అర్చక స్వాములు పాదుక సంప్రోక్షణ నిర్వహించి, దాతలకు వేద ఆశీర్వచనం అందజేశారు.
JGL: అన్ని దేశాలకు రాజ్యాంగం ఉన్నప్పటికీ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఆత్మ ఉందని డీఎస్పీ రఘుచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్వాహకులు నల్ల శ్యామ్, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల నారాయణ పాల్గొన్నారు.
సత్యసాయి: వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కి శ్రద్ధాంజలి ఘటించటానికి కదిరిలో బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే బోర్డులో బోర్డింగ్లో శ్రద్ధాంజలి, జోహార్ మురళీ నాయక్ అనే స్లొగన్స్ ఏమి లేకుండా ఏర్పాటు చేశారు. బోర్డులో జాతీయ జెండాని తలకిందులుగా వేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా జాతీయ జెండాను అవమానించేలా ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానికులు చెబుతున్నారు.
TPT: తిరుపతిలోని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నివాసంలో ఆదివారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
చిత్తూర్: ముదరంపల్లె పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 47 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి చేతులు మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని, మరోవైపు అభివృద్ధి చేస్తోందని అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్తూరు: నాగలాపురంలో తిరంగా ర్యాలీ చేపట్టిన అనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చల్లాతమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, కుల మతాలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
కోనసీమ: అంబాజీపేటలో సోమవారం పి.గన్నవరం నియోజకవర్గ స్థాయి మహానాడును నిర్వహిస్తున్నట్లు నియోజవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక టీడీపీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. మహానాడు ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమస్యలపై మహానాడులో చర్చిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సత్యసాయి: చెన్నైకొత్తపల్లి మండలంలోని బసంపల్లి క్రాస్లో సద్గురు యోగి నారాయణ మఠం ఆధ్వర్యంలో ఆదివారం ఎనిమిది నిరుపేద జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. దాతలు అరుణ్ కుమార్, సురేష్, కుళ్లాయప్ప వారు నూతన దంపతులకు వివాహ వస్త్రాలు, తాలిబొట్లు, కాలిమెట్లు అందజేశారు. అనంతరం భోజన సౌకర్యం కల్పించారు. మఠం నిర్వాహకులు ఆశీర్వాదం చేశారు.