AP: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అయ్యవరం గ్రామంలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా 8,451 రైతుసేవా కేంద్రాలలో కరపత్రాల పంపిణీ జరగనుంది. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సీఎం భేటీ కానున్నారు.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫర్నీషింగ్ బ్రాండ్ వేక్ఫిట్ ఇన్నోవేషన్ లిమిటెడ్ ఐపీఓ ఈనెల 8న ప్రారంభమై 10తో ముగియనుంది. ఐపీఓ ద్వారా రూ.1,289 కోట్లు కంపెనీ సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.185- 195గా కంపెనీ నిర్ణయించింది. రూ.6,400 కోట్ల మార్కెట్ విలువతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది.
SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తీసుకుం టామని, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఎన్నికలపై అవగాహన సమావేశ నిర్వహించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, కులసంఘాలకు డబ్బు పంచడం, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేయవద్దన్నారు.
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా కన్జూమర్ దేశంలోనే తొలిసారిగా నాన్-ఏసీ కేటగిరీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కస్టమర్లకు మరిన్ని ఎంపికలను అందించేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రభాస్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి’. ఈ మూవీ సెకండ్ పార్ట్ నుంచి హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో ఎవరు నటించబోతున్నారనే చర్చ గత కొంత కాలంగా నడుస్తోంది. అయితే ఆమె స్థానంలో తాజాగా ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్లో రెండో టెస్టు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ డే-నైట్ టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. మార్క్ వుడ్ స్థానంలో విల్ జాక్స్కు తుది జట్టులో చోటు కల్పించారు. జట్టు: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(c), స్మిత్(wk), జాక్స్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్.
TG: కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు భయాందోళన కలిగిస్తోంది. కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై అటవీ ప్రాంతం వద్ద రోడ్డుపై చిరుత సంచరించడం తాజాగా కలకలం రేపింది. ఆ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొట్టాల్ వద్దకు రాగా.. రోడ్డు దాటుతున్న చిరుతపులిని డ్రైవర్ గమనించారు. అక్కడే బస్సును నిలిపివేయడంతో.. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు.
GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో మానవపాడు, అలంపూర్, ఎర్రవల్లి, ఇటిక్యాల, ఉండవెల్లి మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో మొత్తం 700 వార్డులకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ప్రధాని మోదీ సహా అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. రేపు ఢిల్లీలో ప్రధానిని రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులనూ కలవనున్నారు. కాగా, మిగితా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి దాని వెనుకాల భారీ టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. చాలా మంది వచ్చే అవకాశం ఉండడంతో ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
HYD: ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ‘ఎంతో మంది ఉద్దండులను అందించిన OUను కేసీఆర్ కాల గర్భంలో కలిపేశారు. యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతైనా ఖర్చు చేస్తా’ అని చెప్పారు. కాగా, ఇప్పటికే ఓయూని సందర్శించిన సీఎం భారీగా నిధులు కేటాయిస్తామన్నారు.
రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో చిత్ర బృందం ‘థాంక్స్ మీట్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో రామ్ మాట్లాడుతూ.. నవంబర్లో సినిమా రిలీజ్ అంటే తాను భయపడినట్లు తెలిపాడు. గతంలో తను నటించిన ‘మసాలా’ సినిమా NOVలో విడుదలై బోల్తా కొట్టిందన్నాడు. కానీ, ఈ ‘ఆంధ్ర కింగ్’ హిట్ కావడం చాలా సంతోషాన్ని...
HYD: తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. తిరుమలగిరి మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు కలెక్టరేట్ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులకు కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల ద్వారా జరుగుతున్న పనితీరు, వాటి బాధ్యతలను ఏవో సెక్షన్ అధికారులు వద్యార్థులకు వివరించారు.
NZB: రూరల్ మండలంలోని కొండూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నామపత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
HYD: పోటీ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 1,260 మంది ల్యాబ్ టెక్నీషియన్స్కు త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా వైస్ ఛైర్మన్ జీ.చిన్నారెడ్డి తెలిపారు. సీఎం ప్రజా భవన్కు భారీ ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చి తమకు పోస్టింగ్స్ త్వరగా ఇప్పించాలని కోరారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరలో పోస్టింగ్ ఇస్తారని పేర్కొన్నారు.