• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం: మంత్రి ఉత్తమ్

TG: యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు ఇబ్బంది కలగకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈసారి 152 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.

March 16, 2026 / 11:27 PM IST

కార్యకర్తలను పరామర్శించిన యువనేత

SKLM: జలుమూరు మండలం రాయిపాడు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కర్రి రాజారావుని యువ నాయకులు, జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, జిల్లా ఉప అధ్యక్షులు బగ్గు రామక్రిష్ణ, తదితరులు ఉన్నారు.

March 16, 2026 / 10:30 PM IST

హైడ్రా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

HYD: సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఫిర్యాదుకుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా పరిశీలించి, పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్లాట్, ఇంటి స్థలం కొనేటప్పుడు లోతుగా విచారించి అన్ని సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్లాలని సూచించారు.

March 16, 2026 / 10:19 PM IST

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ

TG: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైనందుకు గాను, తిలక్‌ను సీఎం శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, వాకటి శ్రీహరి పాల్గొని తిలక్ వర్మ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

March 16, 2026 / 10:19 PM IST

‘వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు’

VSP: వీఎంఆర్డీఏలో ప్రజా దర్బార్‌కు వచ్చిన వినతుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని సంస్థ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, సిబ్బంది జవాబుదారీగా వ్యవహరించాలన్నారు.

March 16, 2026 / 10:13 PM IST

లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

TG: లైంగిక దాడి కేసులో మెదక్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిస్తూ అటెండర్ సారా జైపాల్‌కు 20 ఏళ్ల కఠిన శిక్ష విధించింది. 2019లో పాఠశాల బాలికపై అతడు లైంగిక దాడి చేసినందుకు ఈ తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు బాధితురాలికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం కఠినంగా ఉంటుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

March 16, 2026 / 10:10 PM IST

అరటి గెలలతో రైతుల వినూత్న నిరసన

AP: తమను ఆదుకోవాలంటూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద అరటి రైతులు గెలలతో నిరసన చేపట్టారు. యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో టన్ను ధర రూ. 15 వేల-రూ. 5 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం వెంటనే స్పందించి టన్నుకు రూ. 15 వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

March 16, 2026 / 10:10 PM IST

PHC సీనియర్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసులు

NZB: నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ గణేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె PHCని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టరు పరిశీలించారు. హాజరు పట్టికలో గణేశ్ సంతకాలు చేయకపోవడం గమనించిన కలెక్టర్ ఆయన గురించి వాకబు చేశారు. మూడు రోజులుగా PHCకి రాలేదని గుర్తించి నోటీసు జారీ చేయాలన్నారు.

March 16, 2026 / 10:00 PM IST

రామ్మోహన్ నాయుడుతో మంత్రి పయ్యావుల భేటీ

AP: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(RDT) సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, సానా సతీష్ ఉన్నారు. FCRA కింద విదేశీ నిధులకు గతంలో కేంద్రం అనుమతి రద్దు చేసింది. ఇది RDT వ్యవహారాలకు సమస్యగా మారిందని చెప్పగా.. వెంటనే చర్చలు జరుపుతామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

March 16, 2026 / 09:55 PM IST

బాలయ్య 111 సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్

బాలకృష్ణ, నయనతార జంటగా భారీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 111వ సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని నటిస్తున్నాడు. మరి వీరి కలయికలో సీన్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని పెద్ది నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఓ సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.

March 16, 2026 / 09:50 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: ప్రకాశం జిల్లా తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్, లారీ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 16, 2026 / 09:44 PM IST

టేకుమందలో పర్యటించిన ఎమ్మెల్యే

CTR: బంగారుపాళ్యం(మం) టేకుమందలో “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రైతుల ఇంటింటికి వెళ్లి పలకరించారు. అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంకు ఖాతాలో పడ్డాయా అని ఆరా తీశారు. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

March 16, 2026 / 09:43 PM IST

ఈ నెల 25న BRSలోకి కాంగ్రెస్ నేత

TG: జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి తన అనుచరులతో తెలిపారు. ఈ నెల 25న బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు చెప్పారు. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాగా, రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌తో ఆయనకు పొసగడం లేదు.

March 16, 2026 / 09:42 PM IST

‘కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ పూర్తి చేయాలి’

కోనసీమ: కోటిపల్లి-నర్సాపురం రైల్వే ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిధులు విడుదల చేయాలని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ లోక్ సభ లో కోరారు. సోమవారం రైల్వే గ్రాంట్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉన్న ఈ ప్రాజెక్టును 2026-27 బడ్జెట్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

March 16, 2026 / 09:40 PM IST

పడుకునే ముందు తింటున్నారా?

రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్ర లేమి, ఊబకాయం సమస్యలు వేధిస్తాయి. ఇది గుండెజబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏదీ అధిక పరిమాణంలో తీసుకోకూడదు.

March 16, 2026 / 09:38 PM IST