TG: డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో.. దాదాపు 2వేల మందికిపైగా వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ గ్లోబల్ సమ్మిట్కు ఈ నెల 10 నుంచి 13 వరకు సామాన్యులకూ ప్రవేశం కల్పించింది. ఇందుకు MGBS, JBS, కూకట్పల్లి, ఎల్బీనగర్ నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది.
MDK: జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో రైజింగ్ డే వేడుకల్లో భాగంగా గురువారం పలు మ్యాచ్లను నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సమక్షంలో తుది పోటీలు నిర్వహించగా వాలీబాల్ పోటీల్లో మెదక్ సర్కిల్, రామాయంపేట సర్కిల్, కబడ్డీ పోటీల్లో అల్లాదుర్గం సర్కిల్, రామాయంపేట సర్కిల్ ప్రథమ ద్వితీయ స్థానాలు నిలిచాయి. క్రీడల్లో గెలుపొందిన జట్లను ఎస్పీ అభినందించారు.
NZB: మోస్రా మండలం దుబ్బ తండా గ్రామ పంచాయతీ సర్పంచి స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో ఏకగ్రీవమైన ఈ స్థానానికి ఈసారి పోటీ ఉండడంతో గ్రామంలో హోరా హోరి ప్రచారం కొనసాగుతోంది. తమకు కేటాయించిన గుర్తులు చూపిస్తూ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చింతకుంట, తిమ్మాపూర్, గోవూర్, మోస్రాలోనూ ముమ్మరంగా ప్రచారం కొనసాగుతోంది.
ASR: డుంబ్రిగూడ మండలంలోని కొరాయి, తోటవలస గ్రామాల్లో ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ ఆదివాసులపై జరుగుతున్న అన్యాయాలు, సమస్యలను ప్రజలకు వివరించారు. హైడ్రోపవర్ ప్రాజెక్టులను రద్దు చేయాలని, స్థానిక ఆదివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ చెలరేగిపోతున్నాడు. తొలి టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన చేసిన స్టార్క్, తాజాగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేయడం అతడి కెరీర్లో ఇది 18వ సారి కావడం విశేషం.
TG: ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్లో ఆదిలాబాద్ను అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపుగనులు ఉన్నాయన్నారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. త్వరలోనే మరో 40వేల ఉద్యోగాల భర్తీని చేపడతామని స్పష్టం చేశారు.
BDK: కొత్తగూడెం జిల్లాలో 50 గ్రామ పంచాయితీలకు, 2 వందల వార్డులకు తమ అభ్యర్థులను నిలబెడుతుందని CPI ML రంగారెడ్డి తెలిపారు. వీరంతా కూడా ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండదండగా ఉంటున్న పేర్కొన్నారు. ప్రజాపంథా అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఇవాళ భద్రాచలం వేదికగా విజ్ఞప్తి చేశారు.
KMM: జిల్లాలోని అటవీ భూముల ఆక్రమణకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పోడు భూముల పట్టా పొందిన కొంత మంది రైతులను మభ్యపెట్టి సమీపంలో ఉన్న అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతుందన్నారు.
TG: ఏడాదిలో ఆదిలాబాద్కు ఎయిర్ పోర్టు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు సాధించే దిశగా ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. పాయల్ శంకర్, నగేష్ బీజేపీ నాయకులైనా.. కలుపుకుని వెళ్తున్నామన్నారు.
TG: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మెట్రో రైల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డబ్ల్యూజేఐ నేతలు కోరారు. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద జర్నలిస్టులకు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత గల పత్రికలకు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్ కార్డు పెంచాలని కోరారు.
అన్నమయ్య: గత కొన్నిరోజులుగా రైల్వే కోడూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోడూరు మండలం మాధవరం పోడు పంచాయతీలోని ఆనాల రాములమ్మ ఇళ్లు కూలినట్లు తెలిపింది. వెంటనే అధికారులు స్పందించి ఆశ్రయం కోల్పోయి నాకు సహాయం అందించాలన్నారు. అయితే ఆమే ప్రభుత్వ రైతు భరోసా కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తూ తెలియాజేసింది.
NLR: ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్లు కట్టించండని సూచించారు.
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో అదరగొట్టాడు. 181 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలమవుతున్నా కూడా అతడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్లో 40వ సెంచరీ కావడం విశేషం. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
ADB: ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చేవి కావని గుర్తు చేశారు.
సూర్యాపేట జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గిపోతోందని ఎస్పీ కె. నరసింహ తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో మంచు ప్రభావంతో 77 రోడ్డు ప్రమాదాలు, 34 మంది మృతి, 94 మంది గాయపడ్డారని వెల్లడించారు. డ్రైవర్లు తప్పనిసరిగా తక్కువ వేగం, లోబీమ్ లైట్లు, ఇండికేటర్ల వినియోగం, వాహనాల మధ్య దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.