బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం అఖండ 2 వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ వెల్లడించింది. కొన్ని గంటల ముందే గురువారం రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్స్ను చిత్ర బృందం రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ రెండు కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను లాంచ్ చేసింది. పాలసీహోల్డర్ల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త ప్లాన్లను రూపొందించింది. ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్ పేరిట వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రొటెక్షన్ ప్లస్ అనేది సేవింగ్స్ ప్లాన్ కాగా.. బీమా కవచ్ అనేది ప్యూర్ రిస్క్ ప్రొటెక్షన్...
TG: బీసీలకు 42 శాతం కోటాను అమలుచేయకుండా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని ఓ యువకుడు హైదరాబాద్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసు ముందు నిప్పంటించుకున్నాడు. బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్నని కలిసేందుకు ఆ యువకుడు వచ్చాడు. తీన్మార్ మల్లన్న ఆఫీసులో లేడని.. సిబ్బంది చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతని ప్రస్తుతం విషమంగా ఉంది.
TG: గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోవైపు ఏకగ్రీవాలు కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో తొలివిడత ఎన్నికల్లో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటిరవరకు 9331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
TG: హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకుని లక్షల కోట్ల ప్రజల భూమిని కాపాడే దాకా తాము పోరాడుతామని.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి KTR స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వాలు.. పరిశ్రమల కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందన్నారు. అందులో కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందన్నారు.
GNTR: ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ రమణ గురువారం తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 8 స్క్రబ్ టైఫస్ కేసులు జీజీహెచ్కు వచ్చాయని, ఈ వ్యాధి వల్ల ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. GGHలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
GNTR: ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ రమణ గురువారం తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 8 స్క్రబ్ టైఫస్ కేసులు జీజీహెచ్కు వచ్చాయని, ఈ వ్యాధి వల్ల ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. GGHలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
KMM: విద్యుత్ ఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
AP: తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు. ఏ దేవుడి ముందైనా ప్రమాణానికి సిద్ధమన్నారు. తప్పు చేయలేదని జగన్ ఒప్పుకుంటారా? అని నిలదీశారు. రాజకీయాల కోసం గిరిజనులను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ELR: నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి రేపటి పర్యటన వివరాలను సమాచార శాఖ అధికారులు గురువారం రాత్రి వెల్లడించారు. రేపు ఉదయం 8:30 గంటలకు పట్టణంలోని 11, 12 వార్డులను పరిశీలించి, 9:30 గంటలకు జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగులో మంత్రి పాల్గొంటారు. 11:40 గంటలకు ప్రజాదర్బార్, 2:40 గంటలకు పట్టణంలోని 2, 3 వార్డులలో పర్యటించనున్నారు.
ప్రముఖ క్యాబ్ సేవల ప్లాట్ఫామ్ ఓలా కన్స్యూమర్ తన ఫుడ్ డెలివరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలుస్తోంది. యాప్ను అప్డేట్ చేసిన తర్వాత ఓలా ఫుడ్స్ సేవలు ఇకపై అందుబాటులో లేవని కనిపిస్తున్నట్టు మనీకంట్రోల్ తన కథనంలో పేర్కొంది. యాప్ పాత వెర్షన్లో సైతం ఓఎన్డీసీ ద్వారా పనిచేసే క్లౌడ్ కిచెన్ వ్యాపార ఆర్డర్లను కూడా తీసుకోవడంలేదట.
NLG: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని శాలిగౌరారం ఎస్సై సైదులు అన్నారు. మండల పరిధిలోని పలు సమస్యాత్మక గ్రామాలను పోలీస్ విభాగం గుర్తించింది. గురువారం మండలంలోని భైరవునిబండ, ఎన్జీ కొత్తపల్లి తదితర గ్రామాల్లో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్సైలు సైదులు, రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
SRD: సీగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం వెంటనే ఇవ్వాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ జిల్లా ఛైర్మన్ వై అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. పటాన్చెరు మండలం పాశమైలారం సమీపంలోని సిగాచీ పరిశ్రమ కార్యాలయంలో గురువారం వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనిమిది మందికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆరోపించారు.
KMR: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లకు అధికారులు నియామకపత్రాలు అందజేస్తున్నారు. వర్ని మండలంలోని సైదాపూర్ తండా గ్రామానికి చెందిన బానోత్ శ్రీరామ్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు గురువారం అధికారులు సర్పంచ్గా నియామక పత్రం అందజేశారు. బానోత్ శ్రీరామ్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.
GDL: గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్ సమీపంలోని ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇటీవల వడ్ల లారీలు ఇరుక్కుపోయి, అతికష్టం మీద వాటిని బయటికి తీశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ప్రమాదకరంగా మారడం పట్ల వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.