కేంద్రం వైఫల్యం వల్లే ఢిల్లీలో పేలుడు జరిగిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందులో కేంద్ర నిఘా సంస్థల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. IB, CIB వంటి అత్యున్నత ఏజెన్సీలు ఉన్నప్పటికీ విఫలమైందని విమర్శించారు.
రష్మిక, రక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత రష్మిక, విజయ్ ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి.
CTR: పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పూతలపట్టు వైపు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఆటోని ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. కిచ్చన్నగారి పల్లికి చెందిన ఆటో డ్రైవర్ శరత్కు గాయాలయ్యాయి. దీంతో 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్కు దూరంగా ఉన్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న పాండ్యా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీ20 ప్రపంచకప్ జరగబోతుండటంతో, పాండ్యా మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం భారత జట్టుకు శుభవార్తగా చెప్పవచ్చు.
HYD: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రూ.22 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళిక సంఘం మాస్టర్ ప్లాన్ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ పరిసరాల్లో రోడ్లు, పార్కింగ్ స్థలాలు, సౌకర్య వసతులు, భక్తుల వసతి గృహాలు వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పూర్తయితే యాదాద్రిలా మరో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా కీసరగుట్ట కానుంది.
TG: సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 43 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ. లక్ష ఇస్తామని ప్రకటించారు. విజేతలు ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావడానికి ఈ ప్రోత్సాహకం ఇస్తున్నామన్నారు. కాగా, మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి కూడా గతంలో ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చిన విషయం తెలిసిందే.
★ మేడారం అంటే మాకు బంధం, భక్తి, భావోద్వేగం: మంత్రి సీతక్క★ MHBD: పెద్దవంగర మండలంలో గుండెపోటుతో యువకుడు మృతి★ MHBD పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్★ పెగడపల్లిలో గొర్రెల కాపరిపై పెంపుడు కుక్క దాడి.. వ్యక్తికి తీవ్రగాయాలు
ELR: ఉంగుటూరు మండలం కైకరంలోని Z.P హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ మెంబర్ E.లక్ష్మీ రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం అక్కడ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, డీఎం సివిల్ సప్లైస్ మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్, విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు.
PDPL: కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని.. రైతులంటేనే కాంగ్రెస్ అని, రైతుకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో మంథని మున్సిపల్ పరిధిలోని అంగులూరులో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఢిల్లీ పేలుడు ఘటనను ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ తదుపరి ఎలాంటి చర్య తీసుకుంటుందోనని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశంలో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా.. భారత్ ప్రత్యక్ష దాడులకు దిగుతుందని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో యుద్ధానికి దిగుతుందా? లేక మరోసారి ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తుందా? అనేది చూడాలి.
ప్రకాశం: కంభం పట్టణంలో ఎస్సై నరసింహారావు బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ మెస్రం మాధవరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయాన్నీ తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
KNR: బంగారు, ఆభరణాలు నగదు ఇంట్లో ఉంచుకోవద్దని, బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని చొప్పదండి పోలీసులు సూచించారు. చొప్పదండిలో దొంగతనాల నివారణకు పోలీసులు పలు సూచనలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా, అనుమానాస్పదంగా ఎవరూ కనిపించినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
బాబ్రీ మసీదు వార్షికోత్సవం రోజున ఉగ్రదాడికి డా.ఉమర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. DEC 6న దేశవ్యాప్త పేలుళ్లకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. కానీ ఉగ్రవాదుల అరెస్ట్తో ఎర్రకోట దగ్గర ఆకస్మిక దాడికి పాల్పడ్డారట. తబ్లిగి జమాత్ మసీదులో ప్రార్థనల అనంతరం దాడి చేశారని.. ఉమర్ మసీదులోకెళ్లిన దృశ్యాలు CCTVలో రికార్డు అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ASF: రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రణాళిక నిధులు వరంగా మారాయని జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాధ్ అన్నారు. బుధవారం జైనూర్ మండలంలోని రామనాయక్ తండాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో రూ.15 లక్షలతో చేపట్టిన మురుగు కాలువలు రహదారుల నిర్మాణాలను త్వరలో పూర్తి చేయాలన్నారు.