• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థులకు శక్తి టీం అవగాహన కార్యక్రమం

కృష్ణా: జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు శక్తి టీం నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రజా ప్రదేశాల్లో శక్తి యాప్ వినియోగం, మహిళల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తమ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు ఎవరితోనో పంచుకోవద్దని సూచించారు.

November 27, 2025 / 08:19 AM IST

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఒకరికి గాయాలు

MBNR: బోయపల్లి రైస్ మిల్లు సమీపంలో బుధవారం సాయంత్రం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఆంజనేయులు (40) అనే వ్యక్తికి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది తక్షణమే ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

November 27, 2025 / 08:18 AM IST

పాలమూరు వాసికి విశిష్ట రంగస్థల పురస్కారం

MBNR: 2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం ఉమ్మడి పాలమూరు జిల్లా మఖ్తల్‌కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు లభించింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన, రంగస్థల కళల్లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని జనవరి 2న ప్రదానం చేయనున్నారు.

November 27, 2025 / 08:17 AM IST

‘నా కోరిక ఒక్కటే.. మా ఫ్యామిలీ అంతా కలవాలి’

నటి మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. తనకు ఉన్న ఏకైక కోరిక.. తన కుటుంబమంతా కలిసి ఉండటమేనని మనసులో మాట బయటపెట్టారు. గతంలో మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా కుటుంబం అంతా ఒక్కచోట ఉండాలి’ అని లక్ష్మి కోరుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

November 27, 2025 / 08:17 AM IST

సరికొత్త చరిత్ర.. రహానేని దాటేసిన మార్క్రమ్

గౌహతి టెస్టులో సౌతాఫ్రికా ప్లేయర్ ఐడన్ మార్క్రమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచులో అత్యధిక క్యాచులు పట్టిన ఫీల్డర్‌గా అవతరించాడు. గౌహతిలో 9 క్యాచులు పట్టి అజింక్య రహనే(8 vs SL 2015) రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ లిస్టులో గ్రెగ్ చాపెల్, యజుర్వింద్ర సింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మాథ్యూ హేడెన్, కేఎల్ రాహుల్ 7 క్యాచులతో మూడో స్థానంలో ఉన్నారు.

November 27, 2025 / 08:07 AM IST

VIDEO: కరెంటు షాక్‌తో యువకుడు మృతి

KDP: పులివెందులలోని వాసవీ కాలనీకి చెందిన యువకుడు చైతన్య బుధవారం రాత్రి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ చేస్తుండగా, విద్యుత్ షాక్ తగిలి అక్కడకక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

November 27, 2025 / 08:05 AM IST

జిల్లాలో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

ములుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికలకు నేడు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని మూడు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు నిర్వహించారు. గోవిందరావుపేట 18 జీపీలు, తాడ్వాయి 18 జీపీలు, ఏటూరునాగారం 12 జీపీలు, మొత్తం 48 సర్పంచ్, 420 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

November 27, 2025 / 07:59 AM IST

గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాల్లో ఉ. 10:30 గంటల నుంచి సా. 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలి విడతలో మెదక్ జిల్లాలో 6 మండలాల్లోని 160 జీపీలు, 1,402 వార్డులు, SRDలో 7 మండలాల్లోని 136 జీపీలు, 1,246 వార్డులరు ఎన్నికలు జరగనున్నాయి.

November 27, 2025 / 07:47 AM IST

నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాల్లో ఉ. 10:30 గంటల నుంచి సా. 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలి విడతలో మెదక్ జిల్లాలో 6 మండలాల్లోని 160 జీపీలు, 1,402 వార్డులు, SRDలో 7 మండలాల్లోని 136 జీపీలు, 1,246 వార్డులరు ఎన్నికలు జరగనున్నాయి.

November 27, 2025 / 07:47 AM IST

ఏయూలో సీనియర్ల అరాచకం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేసినట్లు సమాచారం. బుధవారం తరగతులు జరుగుతుండగా, సీనియర్లు ఆ విద్యార్థిని తరగతి గది నుంచి బయటకు పిలిచి, క్లాస్ పూర్తయ్యాక బయటకు వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. పిలిస్తే ఎందుకు రాలేదని వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

November 27, 2025 / 07:46 AM IST

టీజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగింపు

ATP: జిల్లాలో రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు డిసెంబరు 10 వరకు పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్ బాబు బుధవారం తెలిపారు. జిల్లాలో సెయింట్ మెరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాల (అనంతపురం)లో ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, ఎల్సెట్ తెలుగు, ఎల్పీటీ హిందీ పోస్టులు ఉన్నాయన్నారు.

November 27, 2025 / 07:43 AM IST

రోడ్డు ప్రమాదానికి గురై బ్యాంకు ఉద్యోగి మృతి

CTR: బంధువుల ఇంట్లో జరిగిన అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై బ్యాంకు ఉద్యోగి మరణించిన ఘటన గంగవరంలో జరిగింది. పలమనేరు HDFC బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న గోపిశంకర్ రాయలపేటలో బంధువుల ఇంట్లో అయ్యప్ప స్వామి పూజకు కుటుంబ సమేతంగా వెళ్లాడు. బాలేంద్రపల్లి సమీపంలో టిప్పర్ ఢీకొని మృతిచెందారు.

November 27, 2025 / 07:42 AM IST

ఒంగోలులో ట్రాన్స్‌ఫార్మర్ పేలి చెలరేగిన నిప్పులు

ప్రకాశం: ఒంగోలు అన్నవరప్పాడు రెండే రోడ్డులోని ట్రాన్స్‌ఫార్మర్ బుధవారం రాత్రి ఒక్కసారిగా భారీ శబ్దంతో నిప్పులు చిమ్మడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో తరచూ ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా అకస్మాత్తుగా శబ్దం రావడంతో ప్రజలు హడలిపోయారు. నిప్పులు కిందపడటం కూడా ఆందోళన పెంచింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

November 27, 2025 / 07:42 AM IST

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు: కలెక్టర్

NZB: నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించినట్లు కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి నిన్న తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించినట్లు పేర్కొన్నారు.

November 27, 2025 / 07:38 AM IST

బాలానగర్ లో ప్రభుత్వ భూమి స్వాధీనం

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో గతంలో ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు సర్వే నిర్వహించిన అధికారులు, ఆ భూమిలో హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచిక బోర్డులో రాశారు.

November 27, 2025 / 07:37 AM IST