ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచులో న్యూజిలాండ్పై భారత్ 50 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో హర్మన్ సేన వరల్డ్ కప్ సెమీస్కు చేరారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 340 రన్స్ చేయగా.. వర్షం పడటంతో NZ లక్ష్యం 44 ఓవర్లకు 325గా నిర్ణయించారు. అయితే NZ 271/8 స్కోర్కే పరిమితమైంది. అంతకుముందు ప్రతిక(122), మంధాన(109) సెంచరీలతో రాణించారు.
TG: ఇటీవల తమ కూమార్తె సుష్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కోరారు. ఇప్పుడు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, అన్నీ సమసిపోయాయని తెలిపారు. పోలీసులు ఇంటికి రావడంతోనే తమ కూతురు ఆవేశంతో మాట్లాడిందని పేర్కొన్నారు.
TG: USకు చెందిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ HYDలో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్ ను ఎంచుకోవడాన్ని సీఎం స్వాగతించారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను సీఎం వారికి వివరించారు.
TG: USకు చెందిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ HYDలో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్ ను ఎంచుకోవడాన్ని సీఎం స్వాగతించారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను సీఎం వారికి వివరించారు.
AP: అగ్తియా గ్రూప్ సీఈవో సల్మాన్ అల్మేరీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. హార్టీ కల్చర్, అక్వా కల్చర్లో పెట్టుబడికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో చాక్లెట్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్కు కావాల్సిన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
PPM: జియ్యమ్మ వలస మండలంలో పెడబుడ్డిడి 11కేవీ పీడర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ DE రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు నుంచి మధ్యాహ్నం 2:00వరకు చెట్లను తొలగించడం జరుగుతుంది. అందువలన పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాలలో గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. పురుషులు, మహిళల సీనియర్ విభాగంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సుమారు 328 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పురుషులు, 20 మంది మహిళా క్రీడాకారులను ఎంపిక చేశారు.
AP: భారీ వర్షాలు, తుపాను ప్రభావంపై మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రులు టెలీకాన్ఫరెన్స్ చేపట్టారు. వర్షాల దృష్ట్యా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
TPT: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన ప్రజా ఉద్యమం చేపడుతున్నట్లు వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్ను గురువారం ఆయన ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
MBNR: బాలానగర్ మండలంలోని బోడజానంపేట గ్రామ రెవెన్యూ శివారులోని తమ పొలాన్ని ఓ కంపెనీ ఆక్రమించిందని రైతులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి విన్నవించారు. సర్వే నంబర్ 87లోని 3.14 గుంటల భూమిని కంపెనీ ఆక్రమించి, ఇబ్బందులకు గురిచేస్తోందని బాధిత రైతులు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ASR: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో గురువారం ఐటీడీఏ పీవో శ్రీపూజ సుడిగాలి పర్యటన చేశారు. అరడకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల ప్రామాణిక విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. కించాయిపుట్టు అంగన్వాడీ సెంటర్ సందర్శించారు. సెంటర్ మూసివేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో పాత నేరస్థుడు రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ను రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసిఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా కార్మిక నగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాలను వివరించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
సినిమాలు, టీవీ షోలకు సెట్లు వేస్తూ బిజినెస్లో తన కెరీర్ను ముఖేష్ సహాని ప్రారంభించారు. ఆ తర్వాత సినీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. అనంతరం నితిన్ దేశాయ్, ఉమాంగ్ కుమార్లతో ఏర్పడిన పరిచయం బిజినెస్ పార్టనర్ షిప్ వరకు వెళ్లింది. తదుపరి రాజకీయాల్లోకి వచ్చి వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ పెట్టారు. ప్రస్తుతం ఇండియా కూటమి తరపున డిప్యూటీ సీఎం బరిలో ఉన్నారు.
GDWL: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గద్వాలలో గురువారం ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించారు. దాదాపు 600 మంది పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గద్వాల జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోలీసుల విధులు, వారు ఉపయోగించే ఆయుధాలు విద్యార్థులు పరిశీలించారు.