KNR: హుజురాబాద్ సబ్ జైలులో ఖైదీలు, సిబ్బందికి గురువారం డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు, ఛాతి ఎక్స్రేలు, రక్త పరీక్షలు చేపట్టి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అలాగే వ్యాధి నిరోధక శక్తిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా.రవీందర్ రెడ్డి, డా. తులసీదాస్, డా. జరినా, ఐసీటీసీ హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.
AP: రాష్ట్ర ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్రలో వడగాలులు వీస్తాయని, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 16 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రేపు మరో 19 మండలాల్లో వడగాలులు, ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
BDK: రాష్ట్ర స్థాయిలో ప్రదానం చేసిన అవార్డుల్లో సుమారు 20% అవార్డులు భద్రాద్రి జిల్లా టీవీవీపీ ఆసుపత్రులు దక్కించుకున్నాయి. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు గురువారం కలెక్టర్ అంకిత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నాటి కలెక్టర్ జితేష్ పాటిల్ నుంచి నేటి కలెక్టర్ అంకిత్ వరకు మద్దతు, సహకారం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సూపరింటెండెంట్లు స్పష్టం చేశారు.
WNP: అమరచింతలో పాలమూరు ఎంపీ డీకే అరుణ నేడు పర్యటించనున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగా లావణ్య తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పెద్ద చెరువు పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అమృత 2.0 పథకంలో రూ.314 కోట్లతో చేపట్టనున్న ఆధునికరణ పనులకు భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ఈరోజు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసుపత్రిని పూలతో సుందరంగా అలంకరించారు. ఆసుపత్రి ప్రారంభంతో పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
TG: విజయవాడ-హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త వచ్ఛోహిండి.ఇవాళ్టి నుంచి ఫ్లై91 విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉ.7:30 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి HYDకు తొలి సర్వీసు బయలుదేరుతుంది. రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించే వారికి ఈ సర్వీసులు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
CTR: రామకుప్పం (M) వీర్నమలకు చెందిన జ్యోతి-శివలింగం దంపతుల కుమారుడు నవీన్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ టోర్నీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అద్భుత విజయాన్ని సాధించాడు. నేపాల్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో నవీన్ ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. దీంతో పలువురు అతన్ని అభినందించారు.
TPT: హైకోర్టులో MBU ఛాన్సలర్ మోహన్ బాబుకు ఊరట దక్కింది. తిరుపతిలో విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ వ్యవహారంలో ఆయనపై తొందరపాటు చర్యలు వద్దంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు డైరీని తమ ముందు ఉంచాలన్న కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
NDL: బేతంచెర్ల ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించాలని టీడీపీ నాయకులు కోరారు. అటు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.
VZM: ప్రభుత్వ ఆదేశాల మేరకు మహత్మ జ్యోతిరావు ఫూలే 200వ జయంతి కార్యక్రమాన్ని ఏఫ్రిల్ 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పూలేకి నివాళులర్పించి, అనంతరం ఆడిటోరియంలో సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధిలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
పార్వతీపురం మండలం సూడిగంలో పాతబడిన విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించాలని కోరుతూ అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణికి వినతిపత్రం సమర్పించారు. ఎంపీపీ మజ్జి శోభారాణి, వైసీపీ నాయకులు చంద్రశేఖర్ ఈ మేరకు ఎంపీ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కాకినాడ జిల్లాలో గృహ వినియోగ సిలిండర్లను సకాలంలో సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓటీపీ రాని సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలకు సమానంగా గ్యాస్ లోడ్ పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.
HYD: అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు వచ్చేలా చూస్తున్నామని బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అన్నారు. గురువారం నియోజకవర్గానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పారదర్శకంగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
KKRపై LSG విజయం సాధించడంలో ముకుల్ చౌదరి కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమి KKR కెప్టెన్ రహానే స్పందింస్తూ.. ‘ముకుల్ ఒక్కడే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఓడించాడు. అతడి బ్యాటింగే మా ఓటమికి కారణం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. కానీ మా కుర్రాళ్లు ఆడిన తీరు అమోఘం. ఇలాంటి మ్యాచ్ల్లో తప్పులను వెతకకూడదు. కానీ ముకుల్ ఆడిన తీరుకు, ఆ భాగస్వామ్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని అన్నాడు.
ATP: గుంతకల్లు శ్రీనివాసనగర్కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతుల కుమారుడు సుదీప్ (10) స్థానిక చర్చి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలోనే ఉన్న ఎస్ఎస్ ట్యాంక్లోకి ఈత కొట్టేందుకు వెళ్లిన సుదీప్ నీట మునిగి ఊపిరాడకు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.