ATP: గుంతకల్లు శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆర్డీవో శ్రీనివాస్ అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో హనుమత్ వ్రతంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ ఈవో విజయ రాజు, ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. డిసెంబర్ 3న జరిగే హనుమత్ వ్రతానికి వచ్చే భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
GNTR: రైతుల సంక్షేమానికి నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురంలో సోమవారం సచివాలయ సిబ్బంది రైతులతో మాట్లాడారు. రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమై ఉందా అని ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యనమాల ప్రకాశ్ రైతులతో కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలు స్వీకరించారు.
ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థం పెద్ద కాలువ కట్ట మిడివేస్ట్ డంపింగ్ సమీపంలో పెద్దపులి తిరుగుతున్నట్లు స్థానికులు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఈ విషయంపై వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించారు. ఈ వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓల్డ్ వీడియో అని గిద్దలూరు FRO సత్యనారాయణరెడ్డి నిర్ధారించారు.
KMM: భూమి ఉన్న రైతులతో పాటు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు వారు సోమవారం వెల్లడించారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.
HYD: గ్రూప్-2 నియామక సమస్యలపై పోరాటం ఆగదని పిటిషనర్లు ఇంద్రా నాయక్, ప్రదీప్ రెడ్డి అన్నారు. దీనిపై శాశ్వత పరిష్కారం కోరుతూ పిటీషనర్లు ప్రొ. కోదండరామ్ వద్దకు వెళ్లారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన నోటిఫికేషన్పై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రోగ్రాంలో బాలాజీ, సుజాత రెడ్డి పాల్గొన్నారు.
ELR: అర్హులు దరఖాస్తు చేస్తే గృహ నిర్మాణానికి రుణాలు మాజూరు చేస్తామని ఎంపీడీవో మనోజ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సొంత ఇంటి స్థలం ఉన్న దరఖాస్తుదారులు తగిన ఆధారాలతో దరఖాస్తు చేయాలన్నారు. సొంత స్థలం లేని వారు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సతీష్, డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పాల్గొన్నారు.
E.G: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం చాగల్లు, దొమ్మేరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
MBNR: మూసాపేట మండల కేంద్రంలో సోమవారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బస్సులు, శిల్పారామంలో వారి ఉత్పత్తులకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో పలువురు కాంగ్రెస్ నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
TG: సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్లను ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపింది. కాగా, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల మాజీ సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘ధర్మేంద్ర మరణం బాధాకరం. సినీ హీరోగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి’ అని పేర్కొన్నారు.
W.G: పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టెక్నోయాన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఛైర్మన్ కె.వి.నరసింహారావు తెలిపారు. కళాశాల విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
NLG: జిల్లాలో సీఎంఆర్ బియ్యం బాకీ ఉన్న మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్లగొండ పార్లమెంట్ కాంటెస్టెడ్ అభ్యర్థి గోలి సైదులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికు ఫిర్యాదు చేశారు. 100 నుండి 150కి పైగా రైస్ మిల్లర్లు అధికార లెక్కల ప్రకారం బాకీ ఉన్నారని తెలిపారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సైదులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
MDK: భవన నిర్మాణ కార్మికులు కార్మిక బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో కార్మిక బీమా పెంపు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈరోజు నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
HYD: తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయని ఢిల్లీలో ఎండగడతామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ..ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్టు రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.
AP: పల్నాడు జిల్లాలోని నాదెండ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రైతుల ఇళ్లకు వెళ్లి కార్యక్రమ లక్ష్యాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. మూస పద్దతులు విడనాడితేనే వ్యవసాయం పది కాలాలు నిలుస్తుందని తెలిపారు. లాభాలు అందించే పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని సూచించారు.