వనపర్తి వ్యవసాయం మార్కెట్ యార్డ్ను రైతు సంఘం కార్యదర్శి పరమేశ్వర చారి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన వేరుశనగను ప్రవేట్ దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మార్కెట్ యార్డ్కు వచ్చిన వేరుశనగను అధికారులు పరీక్షించి ఏ గ్రేడ్ ఉన్న వేరుశనగకు పదివేలు ధర నిర్ణయించాలని కోరారు. రైతుల సమస్యను పరిష్కరించాలన్నారు.
MDK: రేగోడు మండల అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం రేగోడుకు తక్షణమే రెగ్యులర్ ఎంపీడీవోను నియమించాలని సర్పంచ్ పర్వీన్ సుల్తానా డిమాండ్ చేశారు. సోమవారం రేగోడులో నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతిపత్రం అందజేశారు. శాశ్వత ప్రాతిపదికన అధికారిని నియమించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
MBNR: జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ నుంచి మర్లు కాలనీకి వెళ్లే దారిలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ దుర్వినియోగం అవుతోందని, ప్రజాధనం వృథా అవుతోందని కాలనీవాసులు మండిపడుతున్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించడంలో అధికారులు విఫలమయ్యా రని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తిరుపతి: ఖేల్రత్న సిఫారసుల నుంచి ప్రపంచ స్థాయి కాంపౌండ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నంను తప్పించడాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తప్పుబట్టారు. ఎంపిక ప్రక్రియను పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ జాయింట్ సెక్రటరీ డా. శోభిత్ జైన్కు లేఖ రాశారు. 90కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించిన అర్జున అవార్డు గ్రహీతను విస్మరించడం అన్యాయమని ఆయన అన్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపింది. వాన్స్ ఇంటిపై ఒక్కసారిగా దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: లక్ష్మిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జిపై సోమవారం మధ్యాహ్నం కారు అదుపు తప్పి రైలింగ్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మాంసం దుకాణం ధ్వంసం కాగా, ఎవరికి గాయాలు కాలేదు. దుకాణం మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో కారు మితిమీరిన వేగంతో ఉండటం, అకస్మాత్తుగా టైరు పేలడంతో పాటు రహదారి అధ్వానంగా ఉండటమే ఈ ఘటనకు కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కోనసీమ: అల్లవరం మండలం తుమ్మలపల్లి, కొమరగిరిపట్నం గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి విలేజ్ క్లినిక్లు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అల్లాడ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: హిందూపురం పట్టణంలో స్థానిక ఎంజీఎం పాఠశాల కాంపౌండ్లో ఉన్న భవిత పాఠశాలలో ప్రపంచ అంధుల దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కోరారు. అనంతరం అంధ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈవో గంగప్ప తదితరులు పాల్గొన్నారు.
VZM: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు. ఎల్కోట టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని మండిపడ్డారు. కరెంటు చార్జీలు భారం ప్రభుత్వమే భరిస్తోందన్నారు.
BHPL: జిల్లా ఐడీవోసి కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 47 దరఖాస్తులు స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం 350 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే వారంలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారత అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రోల్స్(114) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. డేనియల్ బోస్మాన్(31), లగాడియన్ (25) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ 4, అంబరీష్ 2, దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 36 అర్జీలను స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
ATP: ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘జేసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-4’ రేపు ప్రారంభం కానుంది. తాడిపత్రిలోని జేసీ (కాలేజీ) గ్రౌండ్స్లో రేపు ఉ.8:30 గంటలకు అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
MDK: చిన్నశంకరంపేట మండలంలోని గజగట్లపల్లిలో సర్పంచ్ నాగభూషణం ఆధ్వర్యంలో మంచినీటి సమస్య తలెత్తకుండా వేసిన బోర్లను RWS ఏఈ స్వప్న పరిశీలించారు. గ్రామంలో వేసిన బోరు బావులకు మోటారు బిగించాల్సిన అవసరం ఉందని, గ్రామంలోని పలు సమస్యలను ఏఈకి వివరించారు. గ్రామ అభివృద్ధిపై రాజిపడేదిలేదని సర్పంచ్ నాగభూషణం తెలిపారు.
కడప: చికెన్, మటన్ షాపు యజమానులు తమకు మార్కెట్ యార్డ్లో స్థలం కేటాయించాలని సోమవారం మున్సిపల్ కమిషనర్ను కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో చర్చించి 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఈరోజు జరిగిన ఈ సంఘటన వ్యాపారుల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని సూచిస్తోంది.