MHBD: జిల్లాలోని స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసులలో జప్తు చేసిన వాహనాలకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని ప్రోహిబిషన్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 10న ఉదయం 11 గంటలకు జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో జరిగే వేలం పాటలో పాల్గొనవచ్చునని తెలిపారు.
టీమిండియా మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ నవంబర్ నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేస్లో నిలిచింది. గత నెలలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చేసిన ఆల్రౌండ్(87 రన్స్, 2 వికెట్లు)తో ఆమె ఈ అవార్డుకు నామినేట్ అయ్యింది. అలాగే, థాయ్లాండ్ స్పిన్నర్ తిపట్చా పుట్టావాంగ్, UAE ఆల్రౌండర్ ఇషా ఓజా కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో ఈ నెల 11న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బు ఆశించకుండా సరైన నాయకుడిని సర్పంచ్గా గెలిపించాలని విన్నర్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కాడపాక చంద్రమౌళి పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్లకు డబ్బు పంచితే ప్రతి పౌరుడు అడ్డుకొని అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు.
WGL: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లో వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.4.50 లక్షలతో శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియని ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
WGL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఇవాళ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తున్న BRS శ్రేణులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి గతంలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా: పులిగడ్డ గురుకుల విద్యార్థులు రాష్ట్రంలో మొదటి స్థానం సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థుల పట్ల ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించే ధ్యేయంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్నారన్నారు
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతోంది. అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవాల పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 44 చోట్ల కాంగ్రెస్ ఏకగ్రీవం కాగా.. BRS 5, BJP 1, ఇతరులు 3 సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. పోటీ ఉన్న చోట్ల రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. మీ గ్రామాల్లో ఎన్నికల పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి..
MDK: పంట అవశేషాలు కాల్చి వేయడం వల్ల భూమిలో పోషకాలు తగ్గిపోతాయని, తద్వారా రైతుకు నష్టం ఏర్పడుతుందని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిని దీపిక సూచించారు. మండల పరిధిలోని పలు వ్యవసాయ పొలాలను ఆమె సందర్శించారు. పంట అవశేషాలు ఎస్ ఎస్ పి, యూరియా ఉపయోగించి డీ కంపోజ్ చేయడం వల్ల భూమిలో పోషకాలు పెరుగుతాయని, తద్వారా రైతుకు లాభం చేకూరుతుందని తెలిపారు.
E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామలోని జడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్-టీచర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బడి పిలుపు-వికసిత్ ఆంధ్రకు మలుపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
TG: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్షించారు. వర్సిటీ అభివృద్ధి కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. మరమ్మత్తుల కంటే కూడా నూతన భవనాల నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని చెప్పారు. ఈనెల 31న పూర్తి ప్రణాళికను ప్రకటించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే, ఈనెల 10న OUను సందర్శిస్తానని CM తెలియజేశారు.
దేశీయ విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్-ఢిల్లీ విమాన టికెట్ ధర రూ.89 వేలు పలుకుతోంది. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40 వేలు, హైదరాబాద్-విజయవాడ టికెట్ ధర రూ.18 వేలుగా ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
KMM: సింగరేణి మండలం టేకులగూడెం గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మడి సందీప్కు పోటీగా ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డు స్థానాలు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంబరాలు జరుపుకున్నారు.
ATP: ఆత్మకూరు మండల కేంద్రంలోని పీఎంసీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేటీఎం 3.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను తిలకించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని వారికి సూచించారు.
MDK: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ అదనపు కలెక్టర్ ఛాంబర్లో గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.