• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ గెజిట్ ప్రతిపాదనపై మంత్రి వర్గంలో చర్చ జరగనుంది. 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025’ పై ప్రధానంగా సమీక్షించనున్నారు. అమరావతి చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది.

April 10, 2026 / 10:50 AM IST

సెన్సెస్ పై టీచర్లతో డిప్యూటీ తహశీల్దార్ సమీక్ష

SRD: సిర్గాపూర్ మండలంలో నిర్వహించనున్న జనగణన సర్వేపై స్థానిక డీప్యూటీ తహశీల్దార్ హేమంత్ కుమార్ ను మండలంలోని ఉపాధ్యాయులను కలిసి ఇవాళ సమీక్షించారు. మండలానికి కావాల్సిన సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్ల నియామకం, శిక్షణ పర్యవేక్షణ, హౌస్ లిస్టు బ్లాక్ తదితర అంశాలపై చర్చించారు. మండలంలో మొత్తం 52 మంది ఎన్యూమరేటర్లను నియమించినట్లు DT తెలిపారు.

April 10, 2026 / 10:49 AM IST

కళ్యాణదుర్గంలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం: ఎమ్మెల్యే

ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఈ నెల 20న ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. ప్రజావేదికలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణదుర్గంలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలం నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి రక్తదానం చేయాలని కోరారు.

April 10, 2026 / 10:49 AM IST

CSR నిధుల తరలింపుపై ఎమ్మెల్యే ఆగ్రహం

SRD: కాలుష్యం మాకు.. అభివృద్ధి మీకా? అంటూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక పరిశ్రమల CSR నిధులను ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని తప్పుబడుతూ, వాటిని స్థానిక అభివృద్ధి పనులకే కేటాయించాలని కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం ఇచ్చారు. నిధులు కేటాయించని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

April 10, 2026 / 10:47 AM IST

అంకోలిలో అస్తవ్యస్తంగా నాలాల వ్యవస్థ

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలోని హనుమాన్ కాలనీలో నాలాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీలు పూడికతో నిండిపోయాయి. దుర్వాసనతో పాటు దోమలు, పురుగులు వృద్ధి చెందుతుండటంతో అంటువ్యాధులు ప్రబలుతాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నాలాలను శుభ్రం చేయించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

April 10, 2026 / 10:46 AM IST

పాడిపశువుల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

KNR: 0తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘2 పాడి పశువుల పథకం’ దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు OBMMS పోర్టల్లో దరఖాస్తు చేసి, ఆధార్, రేషన్, కులం, ఆదాయం, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పట్టా పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

April 10, 2026 / 10:46 AM IST

పద్మాక్షి అమ్మవారికి అభిషేక పూజలు

HNK: నగరంలో చారిత్రాత్మకమైన హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో నేడు పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఈరోజు అష్టమి తిథి, శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పూలతో, పూలమాలలతో అమ్మవారిని అలంకరించి, భక్తుల సమక్షంలో హారతి ఇచ్చారు.

April 10, 2026 / 10:44 AM IST

జీపీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ

WGL: పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ కోసం ఆస్తి యాజమాన్య సర్టిఫికెట్‌పై నకిలీ సంతకం, స్టాంపులు ఉపయోగించినట్లు సమాచారం. సర్టిఫికెట్ తాను జారీ చేయలేదని జీపీ సెక్రటరీ మాలతి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.

April 10, 2026 / 10:42 AM IST

రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్

తన 30వ పుట్టినరోజు వేడుకలపై నటి రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ చేసింది. భర్త, అత్తమామలు, స్నేహితులతో కలిసి జరుపుకోవడం ప్రత్యేకమని తెలిపింది. తన ఊరిలోని ఆలయాన్ని దర్శించి, స్కూల్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. పెళ్లికి రాలేకపోయిన బంధువులను విందులో కలవడం సంతోషాన్నిచ్చిందని, తన ఎదుగుదలలో తోడున్న వారి సమక్షంలో వేడుకలు జరగడం జీవితంలో ఒక మంచి కారణం కోసమేనని పేర్కొంది.

April 10, 2026 / 10:42 AM IST

క్రికెట్ ప్రెడిక్షన్ పేరుతో భారీ మోసం

AP: క్రికెట్ ప్రెడిక్షన్ పేరుతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ వెబ్‌సైట్లను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓ యువకుడి నుంచి రూ.12.50 లక్షలు దోచుకున్నట్లు వెల్లడైంది. దీంతో సాయిగణేష్, అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

April 10, 2026 / 10:41 AM IST

చార్లీ చాప్లిన్ జయంతి వేడుకలు

VSP: హాస్య సామ్రాట్ చార్లీ చాప్లిన్ 137వ జయంతి వేడుకలను వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలోని విశాఖ పౌర గ్రంథాలయ హాలులో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో చాప్లిన్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన జీవితంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు.

April 10, 2026 / 10:41 AM IST

30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

PDPL: ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించనున్నారు. దీంతో ప్రజలు ఇకపై పెద్దపల్లి, కరీంనగర్ వెళ్లకుండా సమీపంలోనే మెరుగైన వైద్య సేవలు పొందనున్నారు.

April 10, 2026 / 10:39 AM IST

HYD నుంచి అయోధ్య, కాశీకి ప్రత్యేక రైళ్లు

HYD: తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం IRCTC ఏప్రిల్ 14 నుంచి జూన్ 12 వరకు HYD నుంచి అయోధ్య, కాశీ, వైష్ణో దేవి, దక్షిణ భారతదేశ క్షేత్రాలను సందర్శించేలా 4 ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్‌లలో ప్రయాణం, హోటల్ వసతి, 3 పూటలా భోజనం, గైడ్, భద్రతా సౌకర్యాలు కల్పించనున్నారు. టికెట్ ధరలు రూ.14,500 నుంచి రూ.34,100 వరకు అందుబాటులో ఉన్నాయి.

April 10, 2026 / 10:38 AM IST

పెద్దకడబూరు పీహెచ్సీలో మందుల కాల్చివేత

KRNL: పెద్దకడబూరులోని PHCలో ప్రజలకు ఉపయోగపడాల్సిన మందులను స్థానిక వైద్యులు తగలబెట్టేశారు. ఎక్స్‌పైరీ అయ్యాయనే సాకుతో వందలాది సిరప్‌లు, ట్యాబ్లెట్లు గురువారం రాత్రి ఎవరూ లేని సమయంలో కాల్చారు. స్టాక్‌ను ప్రజలకు పంపిణీ చేయకుండా ఇలా మంటల్లో పారవేయడంపై సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

April 10, 2026 / 10:36 AM IST

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా యానయ్య

MLG: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా మంగపేట మండలం తక్కెల్లగూడెంకి చెందిన య్యోరి యానయ్య రెండోసారి నియమింపబడ్డాడు. ఈ సందర్బంగా యానయ్య మాట్లాడుతూ.. క్రమశిక్షణతో పనిచేసిన కార్యకర్తలందరికీ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తనను నమ్మి రెండవసారి అధికార ప్రతినిధిగా బాధ్యత ఇచ్చినందుకు మంత్రి సీతక్క, రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

April 10, 2026 / 10:36 AM IST