CTR: విజయపురం మండలంలోని కేవీపురం దళిత వాడకు చెందిన జగనన్న కాలనీని నగరి ఆర్డీఓ భవానీ శంకర్ శుక్రవారం పరిశీలించారు. గత ప్రభుత్వం కేవీపురం దళితవాడ చెందిన 78 మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అక్కడి పరిస్థితులను ఆమె స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. అర్హత కలిగిన వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
SKLM: క్షయ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని DM&HO డా.బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలను గురించి శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. క్షయ అంటువ్యాధి అని, ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
AKP: మాడుగులకు చెందిన రెల్లి కులానికి చెందిన స్వీపర్లందరూ శనివారం మాడుగులలో నల్ల రిబ్బన్లు ధరించి పంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. అణగారిన రెల్లి కులస్తులకు ఎస్సీ వర్గీకరణలో న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో రెల్లిలకు మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.
SRD: జహీరాబాద్ పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని సరస్వతీ శిశు మందిర్ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర రావు శనివారం సీజ్ చేశారు. పాఠశాల 27 లక్షల రూపాయల అస్తపన్ను చెల్లించాల్సి ఉందని కమిషనర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న అస్తి పన్ను వెంటనే చెల్లించాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
SRD: ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు ఎత్తివేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మాణిక్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ధర్నాలు నిరసనలు చేయకుండా వైస్ ఛాన్సలర్ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు.
TG: BRS అధినేత, మాజీ CM KCR సంచలన వ్యాఖ్యలు చేశారు. APలో కూటమి లేకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారు కాదన్నారు. సిరిసంపదలు ఉన్న తెలంగాణను కొందరు దోచుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పదేళ్లు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది BRS మాత్రమేనని, మరోసారి సింగిల్గానే అధికారంలోకి వస్తామన్నారు.
VZM: టీబీ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా, తమ చాంబర్లో శనివారం దీనికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.జీవన రాణి పాల్గొన్నారు.
SDPT: గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోస్టర్ ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి కమలా క్రిస్టియాన్ పాల్గొన్నారు.
KDP: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని శనివారం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ, మైలవరం విద్యుత్ శాఖ ఏఈ సుహాసినికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎలాంటి కోతలు లేకుండా చేనేతలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు.
NZB: జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నర్సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కిరోసిన్ డబ్బాతో వచ్చిన నర్సింగ్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. కోర్టు సిబ్బంది అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. తన తండ్రి వ్యవసాయ శాఖలో పని చేస్తూ మృతి చెందాడని, కారుణ్య నియామకం కింద తనకు రావాల్సిన ఉద్యోగం ఇస్తానని మోసం చేశారన్నాడు.
నిజామాబాద్: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకాంత్ గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. డాక్టర్ శ్రీకాంత్ స్వస్థలం మోస్ర, మృతుడి భార్య నిర్మల్ జిల్లాలో ఆయుర్వేద వైద్యురాలుగా సేవలందిస్తున్నారు. మృతుడికి పలువురు వైద్యులు సానుభూతి తెలిపి నివాళులర్పించారు.
KDP: జమ్మలమడుగు మండల పరిధిలోని భీమరాయుని కొట్టాల గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట 41వ రోజు కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్సీ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ఎమ్మెల్సీ సోదరుడు గిరిధర్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
KDP: పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయటం, ప్రముఖులకు జాతీయ పురస్కారాలు అందజేయడం లాంటి సేవలు అందజేస్తున్న పుల్లయ్య ఫౌండేషన్ సేవలు గొప్పవని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా శనివారం ఫౌండేషన్ తరఫున పేద పిల్లలకు ఉపకార వేతనాలు అందజేశారు.
GNTR: ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.