• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిరంతరాయంగా టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు

KDP:  జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులకు నిరంతరాయంగా టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కడపలో ప్రొవైడర్లతో సమీక్షించారు. సిగ్నల్ అంతరాయం లేని కనెక్టివిటీకి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

November 13, 2025 / 09:21 AM IST

VIDEO: రోడ్డు నిబంధనలు పాటించాలి: ఎస్సై

KMR: వాహనదారులందరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ సూచించారు. బుధవారం రాత్రి పట్టణంలో పోలీస్ సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ధ్రువపత్రాలు ఉంచుకోవాలన్నారు.

November 13, 2025 / 09:21 AM IST

అంబులెన్స్‌లోనే ప్రసవం తల్లీబిడ్డ క్షేమం

KMM: జిలుగుమాడుకి చెందిన గర్భిణీ నాగలక్ష్మికి నిన్న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా సిరిపురం వద్ద నొప్పులు పెరగడంతో మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. ఈఎంటీ విజయభాస్కర్, పైలట్ రాజేష్ సాయంతో తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు.

November 13, 2025 / 09:20 AM IST

మురుగునీటి సమస్యతో ప్రజల అవస్థలు

కృష్ణా: కౌతవరం గ్రామంలోని పశువుల ఆసుపత్రి సమీప రహదారిపై మురుగునీటి సమస్య తీవ్రంగా మారింది. వర్షం పడినరోజు మాత్రమే నిల్వ ఉండే నీరు, గత నెల రోజులుగా ఎండ, వానతో సంబంధం లేకుండా నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కారణంగా ఆ మార్గం గుండా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు మురుగు నీటి స్థాయి పెరుగుతూ ఉండటంతో రహదారిపై నడవటానికే వీలు లేదు.

November 13, 2025 / 09:17 AM IST

ఏపీకి రెన్యూ తిరిగి వస్తోంది: లోకేష్

ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన పునరుత్పాదక ఇంధన సంస్థ రిన్యూ తిరిగి రాష్ట్రానికి రానుంది. ఈ క్రమంలో సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ, ప్రాజెక్ట్ అభివృద్ధి, తదితరాల్లో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తర్వాత గ్రీన్ హైడ్రోజన్, అణువుల వరకు హై టెక్నాలజీ రంగాలలో పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

November 13, 2025 / 09:17 AM IST

ఏపీకి మరో భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన పునరుత్పాదక ఇంధన సంస్థ రిన్యూ తిరిగి రాష్ట్రానికి రానుంది. గ్రీన్ హైడ్రోజన్, మాలిక్యూల్స్ వంటి హై టెక్నాలజీ రంగాలలో పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో రిన్యూ సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ, ప్రాజెక్ట్ అభివృద్ధి, తదితరాల్లో రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

November 13, 2025 / 09:17 AM IST

కల్వకుర్తిలో పెరిగిన కూరగాయల ధరలు

NGKL: కల్వకుర్తి పట్టణంలో మార్కెట్‌లో గురువారం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. బెండకాయ కిలో రూ.100, పచ్చిమిర్చి కిలో రూ.80, టమాట కిలో రూ. 40, దోసకాయ కిలో రూ.60, దీంతోపాటు అన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆకుకూరలు పెద్దకట్ట ఒకటి రూ 20 అమ్ముతున్నారు. ఈ ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

November 13, 2025 / 09:17 AM IST

తెలంగాణ యాసకు ప్రాణం పోసిన ప్రజాకవి కాళోజి

WNP: తెలంగాణ యాసకు ప్రాణం పోసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని రాష్ట్ర మహనీయుల స్ఫూర్తివేదిక ఛైర్మన్ రాజారాం ప్రకాష్ అన్నారు. వనపర్తి పాలిటెక్నిక్లో కాళోజీ 13వ వర్ధంతిని నిర్వహించి నివాళులు అర్పించారు. “బడి భాష కాదు, పలుకుబడుల భాష కావాలి” అని ఆయన చెప్పేవారని, కేంద్రం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

November 13, 2025 / 09:12 AM IST

ఇసుక లారీలతో.. ట్రాఫిక్‌కు అంతరాయం

BDK: మణుగూరు మండలం సీఎస్‌పీ వద్ద ఇసుక లారీలు రోడ్డు పక్కనే నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ఇవాళ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కార్మికులు సకాలంలో వెళ్లే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ వారు హెచ్చరికలు జారీ చేసిన లారీ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా రోడ్డు పక్కనే లారీలు నిలుపుతున్నారని తెలిపారు.

November 13, 2025 / 09:10 AM IST

14న ఒంగోలులో జాబ్ మేళా

ప్రకాశం: ఒంగోలు నగరంలోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈ నెల 14వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణీ కె.రమాదేవి తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఐటీఐ, డిప్లొమా, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు.

November 13, 2025 / 09:10 AM IST

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు వినయ్ ఎంపిక

NZB: ఈనెల 14 నుంచి 16 వరకు మేడ్చల్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు సిరికొండ మండలం కొండాపూర్‌కు చెందిన వినయ్ కుమార్ జిల్లా జట్టులో చోటు సంపాదించాడు. ఇతడు ప్రస్తుతం కాకతీయ యమున క్యాంపస్‌లో వాలీబాల్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.వినయ్ రాష్ట్ర స్థాయి పోటీలకుఎంపిక కావడం పట్ల డైరెక్టర్ రామోజీ, పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

November 13, 2025 / 09:10 AM IST

‘రోహిత్ @264’.. నేటికి 11ఏళ్లు

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (264*) చేసి ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తయ్యింది. 2014, NOV 13న ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై రోహిత్ ఈ అద్భుతాన్ని సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దశాబ్ద కాలంగా ఏ బ్యాటర్ కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోవడం విశేషం.

November 13, 2025 / 09:10 AM IST

బ్రిడ్జి ఎత్తు, డివైడర్లతో వాహనదారులకు తిప్పలు

WNP: శ్రీరంగాపూర్-పుల్గర్‌చర్ల రోడ్డులోని బ్రిడ్జి ఎత్తుగా ఉండటం వలన భారీ వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. అలాగే, శ్రీరంగాపూర్ గ్రామంలో డివైడర్లు అధిక ఎత్తులో ఉండటంతో ద్విచక్ర వాహనాలు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణమే రహదారులను సరిచేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

November 13, 2025 / 09:08 AM IST

‘ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి’

WGL: జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులు చదివే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి రూ.4,000 ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ అందించనున్నట్లు జిల్లా అభివృద్ధి అధికారి నరసింహ ఇవాళ తెలిపారు. తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 15లోగా https://telanganaepass.cgg.gov.inలో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

November 13, 2025 / 09:08 AM IST

ఈ నెల 27 నుంచి శ్రీవారి అంతరాలయ దర్శనం

ELR: ద్వారకా తిరుమల శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని ఈ నెల 27న పునః ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో NVSN మూర్తి తెలిపారు. కరోనా సమయంలో అధికారులు అంతరాలయ దర్శనాన్ని, అలాగే ముఖ మండపం లోంచి స్వామి, అమ్మవార్ల దర్శనాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి భక్తులు బయట నుంచే స్వామి, అమ్మవార్లను దర్శిస్తున్నారు. అయితే ఈ నెల 27 నుంచి పాత పద్ధతిలో దర్శనాలను పునరుద్ధరిస్తున్నారు.

November 13, 2025 / 09:06 AM IST