GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల పురోగతిపై మున్సిపల్, ఆర్ & బీ, రైల్వే అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొని పనుల గురించి అధికారులతో చర్చించారు.
PLD: సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
నటుడు ప్రియదర్శి హీరోగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే పలు చోట్ల కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్కు మ్యూట్స్ సూచించినట్లు సమాచారం.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చించనుంది. అలాగే SIPB పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. CRDA పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
TG: రైతుల మేలు కోసమే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ‘రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించాం. అర్హులైన అందరికీ సన్నబియ్యం అందిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై జీవో విడుదల చేశాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతిచ్చారు’ అని అన్నారు.
2020లో నవీ ముంబైకి చెందిన 15 ఏళ్ల బాలిక, UPకి చెందిన 22 ఏళ్ల యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. పది నెలల తర్వాత గర్భవతిగా ఇంటికి తిరిగి రావడంతో ఆమె తండ్రి.. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. బాలిక తన ఇష్టపూర్వకంగానే వెళ్లిందని, పరిణామాలు తెలిసే ఆమె అలా చేసిందని పేర్కొంటూ యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.
NLR: సోమశిల జలాశయ నీటి వివరాలను అధికారులు మంగళవారం వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడం లేదని ఏఈ శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 52.358 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 500, ఉత్తర కాలువకు 50, దక్షిణ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
NLR: చేజర్ల మండలం ఆదూరుపల్లి పూసల కాలనీలో నీటి మోటారు వారం రోజుల క్రితం చెడిపోయింది. అప్పటి నుంచి స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి ఆటోల ద్వారా నీరు తెచ్చుకుంటున్నారు. రోజువారీ అవసరాలకు నీరు తగినంత లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. అదికారులు వెంటనే స్పందించి మోటారు బాగు చేయాలని కోరుతున్నారు.
SRD: భర్తతో గొడవపడి గృహిని అదృశ్యమైన సంఘటన పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామానికి చెందిన సరళ(30) భర్తతో గొడవ పడి ఈనెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. తిరిగి రాకపోవడంతో భర్త పొల్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కెసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి తెలిపారు.
WGL: పట్టణ కేంద్రంలోని మడికొండ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జయరాజుకు మంగళవారం సేవారత్న అవార్డు లభించింది. మనం ఫౌండేషన్ డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జయరాజు రక్తదానం చేస్తూ, ప్రతి నెల ఒక బీద కుటుంబానికి సరిపడా బియ్యం అందిస్తున్నారు. ఆయన సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామ స్థూపం మైదానంలో పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో అర్చకులు సత్కరించారు.
ADB: బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుకు శాలువతో సన్మానించి స్వీట్ తినిపించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు జొన్నలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
కోనసీమ: ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామివారి అన్నదాన భవన నిర్మాణానికి మంగళవారం గాజువాక వాస్తవ్యులు నూక వెంకట గణేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళంగా అందించారు. వీరికి ఆలయ అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి చరిత్ర గురించి వివరించారు. డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు, సిబ్బంది స్వామివారి చిత్రపటం అందించారు.
MNCL: నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామపంచాయతీ ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాళాలలోని మురికి నీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, వాహనదారులు, విద్యార్థులు సైతం జారీ పడుతున్నారన్నారు.
NRML: నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్యలో ఉన్న మొక్కలకి నీళ్ళు లేక ఇలా ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. అందమైన పూల మొక్కలు వాటితో పాటు నీడనిచ్చే మొక్కలకి సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. నిర్మల్ అంటే కేవలం పన్నులు వసూలు చేయడమే కాదు అంతటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అని పట్టణవాసులు కోరుతున్నారు.