PPM: ఈ నెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై రీ ఓరియంటేషన్ శిక్షణను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎన్జీవో హోంలో వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షలకు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సర్వలెన్స్ వైద్యాధికారి డా, జాన్ పవర్ ప్రెజెంటేషన్ ద్వారా పల్స్ పోలియో కార్యాచరణపై శిక్షణ అందించారు.
KRNL: డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ASF: నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల చేసిన తనిఖీలలో నంబర్ ప్లేట్ లేని బైక్ను సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్లో వాహనం నడిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
NZB: ఆలూరులో పుల్లెల రాముకు చెందిన తాళం వేసిన ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు నవంబర్ 27న ఊరికి వెళ్లగా, మంగళవారం సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా ధ్వంసం చేశారు. ఈ చోరీలో 14 తులాల బంగారం, సుమారు అర కిలో వెండి, లక్ష నగదును దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలో జరుగుతున్న డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురంలోని ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, గుంతకల్లులోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ASF: నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను 100% ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాష్ రావుతో కలిసి కాగజ్ నగర్, ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టవలసిన ఇందిరమ్మ ఇళ్ల పనులపై సమీక్ష నిర్వహించారు.
KDP: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గల వారికి చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తన, ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు.
VZM: రామభద్రపురం పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం CITU ఆద్వర్యంలో చెత్తను ప్రోగుచేసి దానికి పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు.ఈ సందర్భంగా CITU మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న కార్మికులుకు 4 నెలలుగా జీతాలు అందలేదని, జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
TG: iBOMMA రవి స్కిల్స్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఏకంగా సైబర్ క్రైమ్లో జాబ్ ఇస్తాం అంటే.. రవి మాత్రం ‘నాకొద్దు’ అని చెప్పేశాడట. కరీబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతో రెస్టారెంట్ పెట్టి సెటిల్ అవుతానని పోలీసులకే చెప్పాడని తెలుస్తోంది. సంపాదించిన డబ్బుతో లైఫ్ ఎంజాయ్ చేయడమే తన గోల్ అని చెప్పినట్లు టాక్. త్వరలోనే ఇతనికి బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
VSP: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సీపీ శంఖబ్రత బాగ్చితో కలసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. హైవేలో జీబ్రా క్రాసింగ్ వద్ద సోలార్ బ్యాంకర్లు ఏర్పాటు చేయాలన్నారు. మేజర్ రోడ్లలో, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.
E.G: ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్లు, గోదావరి నదీ తీరాలు, అరకు వంటి ప్రదేశాలు ఉన్నాయన్నారు.
HYD: హాస్టళ్లలో నాసిరకం, పాడైపోయిన భోజనం పెడుతున్నారంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిన్న రాత్రి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆహారం సరిగా లేకపోవడం, కనీస మౌలిక వసతుల కొరతపై ఫిర్యాదు చేసినా వార్డెన్, ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ELR: జిల్లాలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞాపనలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో సహా వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులకు సంబంధించి, నిబంధనల ప్రకారం అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని సూచించారు.
KKD: తొండంగి మండలం రావికంపాడు గ్రామానికి చెందిన 15 కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి. దళిత నాయకులు పులుగు వీరబాబు, దడాల సింహాచలం, నొక్కి సూరిబాబుల ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరగా, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధి, ప్రజాసేవను లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
E.G: సీఎం చంద్రబాబు బుధవారం నల్లజర్లలో పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 11:20 హెలికాప్టర్లో బయలుదేరి నల్లజర్ల చేరుకుంటారు. అనంతరం 11:20-11:40 AM నల్లజర్లలోని రైతు సేవా కేంద్రం (RSK) వద్ద జరిగే ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొంటారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు.