MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఆదివారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజల ఆరోగ్యానికి వరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల కృష్ణయ్య, సలాం, కురువ మన్యం పాల్గొన్నారు.
SRPT: మోడీ పాలనలో కార్పొరేట్లకే రెడ్ కార్పెట్ వేస్తోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్లోని అమరవీరుల భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ విధానాల వల్ల అన్ని రంగాలు నిర్వీరం అయ్యే పరిస్థితి దాపురించిందని, ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు.
NLG: నకిరేకల్లోని గురు మందిరంలో వేసవి బాలల సంస్కార శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. విశ్వహిందూ పరిషత్, జిల్లా మాతృ శక్తి ఆధ్వర్యంలో పది రోజుల శిక్షణలో 100 మందికి పైగా బాలలు పాల్గొని శ్రీరామాయణం, నిత్య ప్రార్ధన శ్లోకాలు, హనుమాన్ చాలీసా, ఆటలు, వ్యాయామం, కథలు, దేశభక్తి గీతాలు, కోలాటం వంటి అంశాల్లో శిక్షణ పొందారు.
SRPT: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ శివారులోని దర్గా వద్ద కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి ఇటుక బట్టిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు.
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో దేశం కోసం వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన పోరులో వీర మరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.
KMR: మాతృమూర్తి అమ్మ ఆప్యాయత ఎంతో గొప్పదని కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే అన్నారు. మాతృ దినోత్సవ సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే తన తల్లి కాళ్ళకు పాదాభివందనం చేశారు. మాతృ దినోత్సవం సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తన తల్లికి పాదాభివందనం చేసి నమస్కరించారు.
ప్రకాశం: జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ వెలిగండ్ల మండలం వెదుళ్ళ చెరువు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు శ్యామల కాశిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, తెలుగు రైతు అధ్యక్షులు కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి పలువురు టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
SKLM: పాతపట్నంలో కొలువైన ఉన్న శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు ఆదివారం ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఆదివారం కావడంతో అమ్మవారిని పూలమాలలు, పట్టు వస్త్రాలు, వెండి ఆభరణాలతో అలంకరించామని ఆలయ అర్చకులు రాజేష్ తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు.
ATP: అనంతపురం నగరానికి చెందిన చెస్ క్రీడాకారులు పీజీ.సత్య, శ్రావణి తమ తల్లిదండ్రులతో కలిసి భారత త్రివిధ దళాల ప్రధానమంత్రి ఫండ్కి రూ.52 వేల చెక్ను ఆదివారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వినోద్ కుమార్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి సాహసాన్ని ప్రశంసించారు.
ఈ నెల 7న ఉగ్రస్థావరాలపై దాడులు చేశాక పాక్ డీజీఎంవోకు సమాచారం ఇచ్చినట్లు సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. ఉగ్రస్థావరాలపై దాడుల అనంతరం చర్చలకు సిద్ధమని చెప్పినట్లు పేర్కొన్నాయి. అయితే పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి. మే 10న పాక్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చిందని చెప్పాయి. రహిమ్యార్ఖాన్ వైమానిక స్థావరం రన్వేను నేలమట్టం చేసినట్లు వెల్లడించాయి.
సంగారెడ్డి: కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడిల హానిక EAPCET పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 692 ర్యాంక్ సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గడిల నవీన, గడిల శ్రీనివాస్ రెడ్డి ఆనందంతో ఉప్పొంగి పోయారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం, కృషితో మంచి ర్యాంకును సాధించగలిగానని హానిక తెలిపింది. ఆమెను గ్రామస్తులు అభినందించారు.
AKP: రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పెదగరువు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. గ్రామంలో 8 మంది పిల్లలతో పాటు పెద్దలు జ్వరాల బారిన పడి మంచం పట్టారు. గత వారం రోజులుగా పిల్లలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు డిమాండ్ చేశారు.
HYD: శ్రీ నరసింహ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ బాటా సమీపంలోని శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. ఆలయాన్ని పుష్పాలతో ఎంతో అందంగా అలంకరించారు. వేద పండితులతో హోమాలు, భక్తిగీతాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ప్రకాశం: అద్దంకి మండలం సింగరకొండలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామిని దర్శి టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి లలిత్ సాగర్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం ఆలయ ఈవో తిమ్మనాయుడు వారికి స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
KMR: పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైలాన్ వద్ద జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు లింగారెడ్డి భిక్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ గారి చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతుల పక్షపాతి షబ్బీర్ అలీ అని అన్నారు.