• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆలయ కార్య నిర్వహణ అధికారిగా శ్రీనివాసరెడ్డి

NDL: బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో వెలిసిన చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ కార్య నిర్వహణ అధికారిగా శ్రీనివాసరెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

June 13, 2025 / 04:53 PM IST

బ్రహ్మోత్సవాల్లో బీసీ ఇందిరమ్మ

NDL: సంజామల మండలం నొస్సం గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ శుక్రవారం నాడు పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు బుగ్గ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం బీసీ ఇందిరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

June 13, 2025 / 04:50 PM IST

విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ తీవ్ర దిగ్భ్రాంతి

NLR: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో గురువారం విమాన ప్రమాదం జరగడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

June 13, 2025 / 04:32 PM IST

కలెక్టర్‌ను కలిసిన DLDO వేణుగోపాల్

కోనసీమ: అమలాపురం డివిజన్ స్థాయి అభివృద్ధి అధికారి J. వేణుగోపాల్ శుక్రవారం DLDOగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకిత భావం, జవాబుదారి తనంతో వ్యవహరించాలని వేణుగోపాల్‌కు సూచించారు.

June 13, 2025 / 04:18 PM IST

‘పిచ్చి కుక్కల బెడద అరికట్టాలి’

NDL: ఆత్మకూరు పట్టణంలో పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఏ.రణదీర్ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. తోటగేరి, పెద్ద పీర్లవీధి, తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన దాదాపు 20 మందిపై పిచ్చి కుక్కలు దాడిచేసాయని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

June 13, 2025 / 04:13 PM IST

వరి విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామంలో రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన నూతన సాగు విధానాలను అవలంబించాలని, డ్రోన్లను వాడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో DCCB ఛైర్మన్ సూర్యనారాయణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

June 13, 2025 / 04:05 PM IST

రెవెన్యూ సదస్సులో అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పాయం

BDK: పినపాక మండలం పట్టి నగర్ పంచాయతీలో శుక్రవారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలుపరస్తుందని గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల అనేక అవకతవకలు జరిగాయని, అనేకమంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు.

June 13, 2025 / 04:02 PM IST

‘కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోంది’

కృష్ణా: కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూలులో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఎంపీపీ సుమతి, ఎంఈవో పిచ్చియ్య, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ దివి శ్రీను, హెచ్ఎం శైలజ పాల్గొన్నారు.

June 13, 2025 / 03:35 PM IST

‘ట్రేడ్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి’

BDK: నిజామాబాద్‌లో ఈ నెల 21, 22 తేదీలలో జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మణుగూరులోని సింగరేణి పని ప్రదేశాల్లో ఈ మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక సమస్యలపై నిర్వహించే ఈ సభలో కార్మికులు పాల్గొనాలని కోరారు.

June 13, 2025 / 03:29 PM IST

మంత్రి జూపల్లిని కలిసిన MLA పాయల్ శంకర్

ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాదులోని అంబేద్కర్ సెక్రటేరియట్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో ప్రజలకు అందజేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు.

June 13, 2025 / 03:13 PM IST

క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

JGL: కరీంనగర్ తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెట్‌పల్లి ఎంఈఓ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. 01-09-2016 నుంచి 31-8-2017 మధ్య వరకు జన్మించిన వారు ఈనెల 15 సాయంత్రం 5 గంటల లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 16 నుంచి 19 వరకు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఎంపిక ఉంటుందన్నారు.

June 13, 2025 / 02:59 PM IST

సీపీఐ మహాసభల లోగో ఆవిష్కరణ

మహబూబబాద్: జూలై 5, 6 తేదీల్లో కురవి మండల కేంద్రంలో జరిగే సీపీఐ జిల్లా 3వ మహాసభల లోగోను సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలను విస్తరింప చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి మహా సభలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు.

June 13, 2025 / 01:57 PM IST

విద్యార్థి మిత్ర కిట్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పధకానికి ప్రభుత్వం సన్నబియ్యం అందించడం గొప్ప విషయం అని అన్నారు.

June 13, 2025 / 01:47 PM IST

విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేత

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం క్రమశిక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు.

June 13, 2025 / 01:15 PM IST

లబ్ధిదారులకు ప్రోసీడింగ్ పత్రాలు పంపిణీ

MDK: శివంపేట మండలం లచ్చిరెడ్డి గూడెంలో శుక్రవారం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రోసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే లబ్ధిదారులను గుర్తించి 8 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

June 13, 2025 / 01:01 PM IST