GDWL: మానవపాడు- పోతులపాడు రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే కానిస్టేబుల్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. 55-60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తెల్ల చొక్కా, బ్లూ షార్ట్, బ్లూ చెక్స్ లుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు.
AP: అరసవల్లి సూర్యనారాయణస్వామివారిని సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో స్వామివారిపై సూర్యకిరణాలు పడలేదు. నిర్ణీత సమయంలో కనిపించే ఈ అద్భుతమైన దృశ్యాన్నీ కనులారా దర్శిస్తే.. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఓ సంస్థ సహకారంతో రూ. 1.20 కోట్ల నిధులతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఈ నూతన వసతులను ఎంఈవో విద్యాసాగర్, పరిశ్రమ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు టూటౌన్ ఎస్సై మన్మధరావు మంగళవారం తెలిపారు. కొబ్బరి తోటలో నివాసం ఉంటున్న యువకుడు బర్రె శివ ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని మెడపై గాయాలు ఉండడంతో హత్యా? ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగాల నియామకం, వేతనాల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలిపింది. 25వేల మంది బోగస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో లేకపోయినా జీతాలు పొందుతున్నట్లు తేల్చింది. అవకతవకల్లో 900 ఏజెన్సీల పాత్రతో సహా.. గత పదేళ్లలో రూ. వందల కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు పేర్కొంది.
PLD: చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు మంగళవారం సంజీవనగర్, శాంతినగర్ వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కుళాయిల ద్వారా వస్తున్న నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించి, స్థానిక మహిళలతో సరఫరాపై మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా, శుభ్రమైన తాగునీటిని అందించాలని ఆయన సిబ్బందిని కఠినంగా ఆదేశించారు.
NGKL: బిజినపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతిని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలికల కోసం బాటలు వేసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని తెలిపారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుపడుతుందని భావించి విద్యను అందించడంలో ఎనలేని కృషి చేసిన ధైర్యశాలి అని తెలిపారు.
BHPL: మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో సుమారు 70 వేల జనాభా ఉండగా, చెత్త కుండీలు నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి. చాలా కుండీలు పగిలి, ధ్వంసమై నిరుపయోగంగా మారాయి. సిబ్బంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చెత్త సేకరిస్తుండటంతో ప్రజలు చెత్తను ఇంట్లో నిల్వ చేయలేక ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన పడేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
PPM: జిల్లాలో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పరీక్షకు 292మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విభాగంలో 4579 మందికి గానూ 82 మంది, ఒకేషనల్ విభాగంలో 1505 మందికి గానూ 200 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, నిబంధనల ప్రకారం పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
KNR: హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటన నేపథ్యంలో జమ్మికుంట పోలీసులు దళిత బంధు సాధన సమితి సభ్యులను ముందస్తుగా అరెస్టు చేశారు. రెండో విడత దళిత బంధు నిధులు మంజూరు చేయాలని నిరసన తెలిపే అవకాశం ఉందని ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దళిత బంధు నిధులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం సరికాదని సమితి సభ్యులు మండిపడ్డారు.
ASR: డుంబ్రిగుడ మండలం అరమ పంచాయితీ పరిదిలోని బడిమెల పరిసర ప్రాంతాల్లో కాఫీ తోటలు తెల్లటి పూలతో, సువాసనలు వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి. సాధరణంగా ఏప్రిల్ చివరి వారం నుండి పూత వస్తుంది, అయితే వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం ముందుగా పూతకు వచ్చాయని గిరి రైతులు పేర్కొన్నారు.
గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడి భారంగా మారడంతో ఈ ఖర్చును తగ్గించుకోవడానికి చాలా మంది ఇండక్షన్ కుక్కర్లను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. గ్యాస్ పొయ్యితో పోలిస్తే, ఇండక్షన్ స్టవ్ వాడటం వల్ల దాదాపు 30 నుండి 40 శాతం వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఈ పొదుపు కారణంగానే మార్కెట్లో ఇండక్షన్ స్టవ్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.
TPT: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పేపర్–I పరీక్ష మంగళవారం జరిగింది. జిల్లాలోని 84 కేంద్రాల్లో 24,736 మందికి గాను 24,307 మంది హాజరుకాగా 429 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 1,147 మందికి గాను 1,033 మంది పరీక్ష రాయగా 114 మంది హాజరుకాలేదు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
TG: వేసవిలో ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నుండి మే వరకు ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను 20 నుండి 30 శాతం తగ్గించనున్నారు. 50 పుష్పక్, 40 సిటీ ఏసీ బస్సుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. 60 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచడమే లక్ష్యంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరికొన్ని కొత్త ఈవీ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.