MNCL: రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. గురువారం భీమిని మండలం వడాల గ్రామంలో AIKS మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. యాసంగి సీజన్ మొదలై 10 రోజులు గడుస్తున్న ప్రభుత్వము రైతు భరోసా డబ్బులు విడుదల చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
HYD: ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు వేల మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇంత మందికి నిమ్స్ అత్యాధునిక వైద్యం అందిస్తోంది. అందుకే కార్పొరేట్ కంపెనీలు కూడా నిమ్స్కు బాసటగా నిలుస్తున్నారు. అత్యాధునిక యంత్రాలకు విరాళాలు ఇచ్చి రోగులను ఆదుకుంటోంది. గత సంవత్సరం దాదాపు రూ. 57 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు.
విశాఖలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు 2026–27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ డీఈవో ప్రేమ్కుమార్కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ.. అక్రమ ప్రచారం, అధిక ఫీజులు, అనుమతులు లేకుండా తరగతులు, హాస్టళ్లు నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
SKLM: రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచన చేశారు.
TG: ప్రేమించిన యువకుడు అనుమానించాడని.. వాటర్ ట్యాంక్ పైనుంచి యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. HYD నాగోల్లో కొత్తగూడెంకు చెందిన ఐశ్వర్య(19) ఉంటుంది. అయితే దూరపు బంధువైన ఆటో డ్రైవర్ మహేష్ (23)తో ఐశ్వర్య ప్రేమలో పడింది. కాగా, ఇటీవల యువతి ఫోన్లో తరచూ మాట్లాడుతుందని ఆనంద్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను నిలదీయడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ముంచంగిపుట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో కే.ధర్మారావు, తహసీల్దార్ అప్పారావు తెలిపారు. శిబిరంలో మండల అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారన్నారు. 54 యూనిట్ల రక్తాన్ని సేకరించామన్నారు.
AP: గుంటూరులో సరస్ మేళాను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన పొదుపు సంఘాల స్టాళ్లను సందర్శించారు. సరస్ మేళాకు గుంటూరు మిరపకాయను మస్కట్గా ఎంపిక చేశారు. కాగా డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో 300 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు సరస్ మేళా కొనసాగనుంది.
BHPL: లూయిస్ బ్రెయిలీ అంధుల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మానసిక దివ్యాంగుల పాఠశాలలో లూయిస్ బ్రెయిలీ 207వ జయంతి వేడుకలు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్ని మాట్లాడారు.
కృష్ణా: గుడివాడ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సర్వీస్లపై ప్రచార మాసోత్సవాలను ఘనంగా జరిగాయి. ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలపై పట్టణ వీధుల్లో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీని నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ ర్యాలీని ఆర్టీసీ డిపో మేనేజర్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
KRNL: సంక్రాంతి పండుగ వేళ దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం మంత్రాలయం సీఐ రామాంజులు సూచించారు. ఊరికి వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల భద్రత పెరుగుతుందని చెప్పారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నిరోధించవచ్చని పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ స్కూల్ను ఎంపీడీవో షేక్ అబ్దుల్ ఖాదర్ గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం అమలుతీరును పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సిబ్బందికి సూచనలు చేశారు. రిజిస్టర్లను తనిఖీ చేసి పాఠశాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.
VZM: ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న చలాన్లను వసూలు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా జామి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బలరాంపురంలో గురువారం ASI సుగుణకరరావు, సిబ్బందితో వాహనదారులను ఆపి బకాయిలను కట్టించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. బకాయిలను సకాలంలో కట్టి పోలీసులకు సహకరించాలని కోరారు.
KDP: గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాల కోసం ఒక్కో లబ్ధిదారుని నుంచి వసూలు చేసిన రూ.35వేలు ఏమయ్యాయని హౌసింగ్ ఏఈలను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతిపత్రాలను స్వీకరించారు. హౌసింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. వసూలు చేసిన డబ్బులను కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు.
AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే సీమ ప్రజలు జగన్ను ఛీ కొట్టారని చెప్పారు. ఇంకా జగన్కు బుద్ధి రావడం లేదన్నారు. నీ హయాంలో కంటే కూటమి పాలనలో ఎన్టీఆర్ వైద్య సేవలు పెరిగాయని తెలిపారు. నీకు, చంద్రబాబుకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా మహారాష్ట్ర, గోవా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర 249/7 తో రాణించింది. మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 131 బంతుల్లో అద్భుత సెంచరీ (134*)తో అదరగొట్టాడు. దీంతో రెండు దశాబ్దాలుగా ఛేదించలేని ప్రపంచ రికార్డును తిరగరాశాడు.