• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి భూమి పూజ

TPT: కోట మండలం శ్యామ సుందర పురంలోని అరుంధతి వాడలో 300 మీటర్ల తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాశం సునీల్ సహకారంతో సైడ్ డ్రైన్లు, త్రాగునీటి పైప్ లైన్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

September 12, 2025 / 02:10 PM IST

ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం : ఎమ్మెల్యే

KRNL: ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ తన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నేపాల్లో చిక్కుకున్న AP ప్రజలను మంత్రి లోకేశ్ సురక్షితంగా రాష్ట్రానికి చేర్చడం గర్వంగా ఉందన్నారు.

September 12, 2025 / 02:06 PM IST

మూసీలో భారీగా పెరిగిన వరద ఉధృతి

TG: భారీ వరదలకు ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్(గండిపేట) డ్యామ్ 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 2,652 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. నార్సింగి, మంచిరేవుల మధ్య ఉన్న కల్వర్టు పైనుంచి వరద ప్రవహించడంతో అధికారులు ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు.

September 12, 2025 / 02:06 PM IST

భర్తతో గొడవపడి మహిళ ఆత్మహత్య

PPM: కురుపాం మండలం ఈతమానుగూడలో శుక్రవారం వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు భర్తతో గొడవపడి మండంగి సుగన్ని (24) మలేరియా మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. హుటాహుటీన మొండెంఖల్లు పీహెచ్సీకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

September 12, 2025 / 01:58 PM IST

నూకాలమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు

ELR: సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ రాజన పండు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించి పోస్టర్లు ఆవిష్కరించారు. అలాగే దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ప్రతిరోజు వివిధ రూపాల్లో అలంకరించడం జరుగుతుందన్నారు.

September 12, 2025 / 01:55 PM IST

మరోసారి కులగణన.. సీఎం ప్రకటన

కర్ణాటకలో మరోసారి కులగణన చేపడతామని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 2015లో చేపట్టిన కులగణన ఆమోదయోగ్యంగా లేదన్నారు. అక్టోబర్ 7 వరకు సర్వే కొనసాగుతుందని వెల్లడించారు.

September 12, 2025 / 01:43 PM IST

ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

TG: పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్‌లో సీఎం సమీక్షించనున్నారు. అనంతరం ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు, పోస్టుల సంఖ్యపై సమీక్షకు ఏర్పాటు చేసిన కమిటీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

September 12, 2025 / 01:40 PM IST

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

BDK: లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురం గ్రామస్తులు శుక్రవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముర్రేడు వాగు‌పై వంతెన నిర్మాణం సాధించిన సందర్భంగా కూనంనేని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ చిరకాల కోరిక నెరవేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ జగన్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

September 12, 2025 / 01:40 PM IST

మర్రిగూడలో విజిలెన్స్ తనిఖీలు

NLG: మర్రిగూడలో శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్,విజిలెన్స్ అధికారులు పలు చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కొందరు డీలర్లు రేషన్ బియ్యం బదులు లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చి వారే కొనుగోలు చేస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ DTరఘునందన్, విజిలెన్స్ అధికారులు యాదయ్య,అంజయ్య పాల్గొన్నారు.

September 12, 2025 / 01:39 PM IST

మినరల్ వాటర్ ప్లాట్ ప్రారంభించిన MP

ATP: నార్పల మండలం గూగుడులో రూ.10 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను MP అంబికా లక్ష్మీ నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శింగనమల MLA బండారు శ్రావణి శ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు, పూజారి నరసింహులు, మీసాల ఓబులేశ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

September 12, 2025 / 01:38 PM IST

అఖిలపక్ష సమావేశం నిర్వహించిన రామచంద్రారెడ్డి

GDWL: అయిజను రాబోయే డీలిమిటేషన్‌లో తప్పకుండా అసెంబ్లీ నియోజకవర్గం చేస్తానని, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకె. అరుణ హామీ ఇచ్చారని బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్. రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం అయిజలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ హామీతో అయిజ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

September 12, 2025 / 01:38 PM IST

భీమవరంలో బీజేపీ శోభాయాత్ర

W.G: భీమవరంలో సారధ్య యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు రెండు కిలోమీటర్లు సాగి, ఆనంద ఇన్ ఫంక్షన్ హాలుకు చేరుకుంది. ఈ యాత్రలో వేలాదిగా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

September 12, 2025 / 01:35 PM IST

గృహనిర్మాణ శాఖ ఏఈగా లక్ష్మీ విమల

ASR: జీకేవీధి మండల గృహనిర్మాణ శాఖ ఏఈగా లక్ష్మీ విమలను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం లక్ష్మీ విమల బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఆమె దామనాపల్లి గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మండలంలోని గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లను వేగవంతమయ్యేందకు చర్యలు తీసుకుంటానని అన్నారు.

September 12, 2025 / 01:34 PM IST

‘ఎక్కడ విపత్తులు జరిగితే అక్కడ టీడీపీ సాయం ఉంటుంది’

ATP: విపత్తులు ఎక్కడ వచ్చినా టీడీపీ సాయం అక్కడ ఉంటుందని MLA దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నేపాల్ నుంచి తెలుగు వారిని తీసుకురావడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. తెలుగు వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం గొప్ప విషయమని చెప్పారు. ఇది మంత్రి లోకేశ్ చొరవ వల్లే సాధ్యమైందని దగ్గుపాటి తెలిపారు. MLA దగ్గుపాటి మంత్రి లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

September 12, 2025 / 01:34 PM IST

మున్సిపల్ కమిషనర్‌కు చిరు వ్యాపారుల వినతి

NLG: తోపుడు బండ్లను తొలగించి, తమను నిరాశ్రయులను చేయవద్దని కోరుతూ నకిరేకల్ పట్టణంలోని చిరు వ్యాపారులు శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి మున్సిపల్ కమిషనర్ రంజిత్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నేతలు పల్స శ్రీనివాస్ గౌడ్, జిల్లా డాకయ్య, మంగళపల్లి కిషన్ వ్యాపారులు సైదులు, అంజయ్య, రాజు, రాములమ్మ, భాస్కర్, అనిత, వెంకన్న, నాగేందర్ పాల్గొన్నారు.

September 12, 2025 / 01:32 PM IST