కృష్ణా: పామర్రు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ బుధవారం మొవ్వ మండలం కోసూరు గ్రామాన్ని సందర్శించారు. వేములవాడ రాంబాబు తల్లి పెదకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనంతరం గ్రామస్థులతో ముచ్చటించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
E.G: సీతానగరంలో ఒక భవనానికి పెయింటింగ్ వేస్తూ జారిపడిన చిన్న కొండేపూడి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య: మండల కేంద్రంలోని PHC హాస్పిటల్ను ఎంపీడీవో గపూర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు అక్కడున్న పరిస్థితులను పరిశీలించారు. ఓపీ రిజిస్టర్ పరిశీలించి, వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. కాగా, గ్రామాల్లో అంటురోగాలు ప్రబలకుండా ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కల్పించాలన్నారు.
NRPT: ధన్వాడ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విస్తృతసాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి హాజరుకానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరగనుంది. ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనాలని కోరారు.
GNTR: ఫిరంగిపురం మండలంలో అమీనాబాద్ సచివాలయం 1, 2 పరిధిలో PMAY 1.O – NTR నగర్ హౌసింగ్ లేఅవుట్లను ఎంపీడీవో పీ.శివ సుబ్రహ్మణ్యం బుధవారం పరిశీలించారు. లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా జంగిల్ క్లియరెన్స్, ముళ్ళకంపలు తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి సమస్యలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.
NGKL: కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి ఆర్టీసీ డిపో నుండి బొమ్మరాసి పల్లి ఖానాపూర్ మీదుగా హైదరాబాద్కు బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకు మణికంఠ అన్నారు. ఈ మేరకు బుధవారం కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు దినసరి కూలీలకు ఈ బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
GNTR: రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించారు. గుంటూరు బస్టాండ్లో బుధవారం డిపో మేనేజర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయని, మహిళల వినియోగం పెరిగే నేపథ్యంలో మెయింటెనెన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
KMR: జిల్లా శాఖ SC/ST EW అసోసియేషన్ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎన్నికలు కంపెనీ ప్రెసిడెంట్ ఆనందం, కార్యదర్శి కుమారస్వామి సమక్షంలో నిర్వహించారు. కామారెడ్డి సర్కిల్ నూతన అధ్యక్షుడిగా N.వెంకట్ రాం, కార్యదర్శిగా M.సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా G.నాందేవ్, కోశాధికారిగా M.దేవ్ సింగ్ ఎన్నికయ్యారు.
MNCL: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్లోని ఆర్కే న్యూటెక్ గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారానికి స్ట్రక్చర్ సమావేశాల్లో యాజమాన్యంతో చర్చించి ఒప్పించినట్లు పేర్కొన్నారు.
NLR; చేజర్ల మండలం ఏటూరు, నాగలవెల్లటూరులో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిణి P. హిమాబిందు మాట్లాడుతూ.. జీలుగ, జనము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పంటలు సాగు చేయడంతో నేల సారాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. భూమి అనుకూలమైన పంటలు సాగు చేయాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
KNR: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులందరికీ కార్డులు అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం చొప్పదండిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరైయ్యారు.
NZB: పోతంగల్ మండలంలోని సుంకిని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ సామాగ్రిని దుండగులు ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చి చూసేసరికి ధ్వంసం అయ్యి చెల్లా చెదురుగా పడి ఉన్నాయని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని అన్నారు.
SKLM: గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెలుగు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పైడి కూర్మారావు బుధవారం తనిఖీ చేశారు. మందస మండలం కిల్లోయి కాలనీలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, వంట, భోజన గదులను త్రాగునీరు ఆర్వో ప్లాంట్ను కూడా పరిశీలించారు.
NDL: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. సహచర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఖనిజ దొంగలను, మహిళలపై అసభ్యకరంగా దూషించిన దోషులను పరామర్శించేందుకు నెల్లూరు రావడం హాస్యాస్పదం అన్నారు. పేదల తరఫున పోరాటం చేయడం మానేసి దొంగలను కలుసుకోవడం మంచిది కాదని తెలిపారు.
CTR: శాంతిపురం(M) 64 పెద్దూరులో మంచినీళ్ల కోసం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రామంలో నీళ్లు రాక తాము ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకపోతే ఎలా అని మహిళలు ప్రశ్నించారు. నీటి సమస్య గురించి ఎన్నిసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలతో నిరసన చేశారు.