కృష్ణా: పెదపారుపూడి నుంచి భూషణగుళ్ళ ప్రధాన రహదారి శనివారం పూర్తిగా దెబ్బతింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారిపై లోతైన గుంతలు ఏర్పడి వాహనదారులు, పాఠశాల విద్యార్థులు,వృద్ధులు,గ్రామ ప్రజలు ప్రతిరోజూ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్షాల కారణంగా గుంతలు మరింత లోతుగా మారాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
SKLM: నందిగాం మండలం పెద్ద బాణాపురం పంచాయతీ పాత్రునివలస గ్రామంలో సిరపు రెడ్డి శ్యామల రావు భార్య కుమారి కుమారుడు జ్ఞానేశ్వర్ రావు ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ గుడి నిర్మించారు. శనివారం అభయ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం, పుణ్య వచనం దీక్ష దారణ చేపట్టారు. అనంతరం నారాయణ సేవ నిర్వహించారు.
ASF: పెంచికల్ పేట్ మండల పరిధిలోని మురళిగూడ, జిల్లేడ గ్రామాల, 300 మంది ఆదివాసి ప్రజలకు శనివారం రాబిన్ వుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పోలీస్ వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పోలీస్ శాఖ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని, గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి సహాయం అందిస్తామని తెలిపారు.
SRPT: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన SRPTలో జరిగింది. ఎస్సై శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంకు చెందిన నర్సింహారావు తన భార్య మైసమ్మతో కలిసి సూర్యాపేటలో ఉంటున్నారు. ఇవాళ బైక్పై వెళుతుండగా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు వేగంతో ఢీ కొట్టిగా ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చెందాడు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
MBNR: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న శామ్యూల్ సుందర్ కూతురు ప్రియా ఏంజెల్ వనపర్తి మెడికల్ కళాశాలలో మెడిసిన్ సీట్ సాధించింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బందికరంగా మారింది. జర్నలిస్టుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థినికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని క్యాంపు కార్యాలయంలో శనివారం అందించారు.
KMM: రైతులకు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రత్యక్ష ప్రసార వీక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన పంటలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు వివరించారు.
BDK: సుమారు ఒక కోటి పదకొండు లక్షల రూపాయల విలువ గల 222 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని శనివారం టాస్క్ ఫోర్స్, అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్న అశ్వారావుపేట పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. విశాఖపట్నం వేదికగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గత మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో ఓడిన భారత్.. గ్రూప్ టాపర్ ఆస్ట్రేలియాను ఓడించి తిరిగి విన్నింగ్ ట్రాక్లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
NLG: బీసీలకు రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికల నిర్వహించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగూడ జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో గల అమరవీరుల స్థూపం వద్ద ఈ నెల 14న జరిగే ‘రాష్ట్ర వ్యాప్త బంద్’ ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.
MNCL: నీల్వాయి మండలంలో ఇవాళ కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ క్రమంలో ఆత్మహ్యత చేసుకున్న మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు 48 గం.ల టైమ్ ఇస్తున్నా ఈలోగా మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలన్నారు. అలాగే ఘటనకు కారణమైన నీల్వాయి ఎస్సైని కూడా సస్పెండ్ చేయాలని తెలిపారు. ఈ విషయంలో నీర్లక్ష్యం చేస్తే బీజీపీ సత్తా ఏంటో చూపిస్తాం అని సవాల్ విసిరారు.
HNK: పరకాల పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న చెరువులో చెత్తాచెదారం చేరి దుర్గంధం వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.4 కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ వద్ద వ్యర్థాలు పారబోయడంతో వాకింగ్కు కూడా చేయలేకపోతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం స్పందించి చెరువును శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు.
SKLM: కంచిలిలోని DJ పురం సచివాలయంలో శనివారం MLHP సంతోషిని ఆధ్వర్యంలో గ్రామస్తులకు షుగరు, బిపి, ఇతర వ్యాధులకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా 104 సిబ్బంది సహకారంతో మందులు సరఫరా చేశారు. కురుస్తున్న వర్షాలు కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆశా వర్కర్లు గన్ని సుమతి, తులసి, లలిత, వైద్య సిబ్బంది ఉన్నారు..
BHNG: న్యాయవాదులు నైతిక విలువలు పాటించాలని,కోర్టులు కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కోరారు. శనివారం జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శిలాపలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన భవనాన్ని కాల పరిమితిలో పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి పండగపై బొత్స సత్యనారాయణ అధికారులను నిందించడం సరికాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్టేజ్ వేసింది వాళ్ల మనుషులే అని.. స్టేజ్ చుట్టూ వాళ్లకి కావల్సిన కలర్ క్లాత్ లే కట్టుకున్నారన్నారు. మాకు బొత్స సత్యనారాయణ అంటే గౌరవం ఉందన్నారు. పండగకు హుండీ పెట్టామనడం సరికాదని తెలిపారు.
NGKL: బిజినేపల్లి మండలంలోని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ధన్ ధాన్య కృషి యోజన కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రైతులు కేవలం వ్యవసాయంపైనే కాక, అనుబంధ రంగాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు.