సత్యసాయి: డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. డీసీఏ పనితీరు, సాధిస్తున్న ఫలితాలపై ఆరా తీశారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం సమర్థవంతంగా పనిచేయాలని, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా తనిఖీలు చేయాలని కోరారు. యువత, ప్రజలను వ్యసనాలకు గురిచేసే మందుల విక్రయంపై దృష్టి పెట్టాలని సూచించారు.
AP: విజయవాడ సీఐడీ కార్యాలయానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేరుకున్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. అక్రమంగా పోర్టు వాటాలు బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై CIDకి కేవీ రావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
JN: జిల్లాలో సిఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ఘనపూర్ (స్టేషన్) పర్యటన నేపథ్యంలో తగిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కల్సి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం భారీగా మిర్చి తరలివచ్చింది. ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. తేజ మిర్చి క్వింటాకు ₹13,400 (నిన్న ₹13,500) 341 రకం మిర్చి క్వింటాకు ₹13,100 (నిన్న ₹13,000) వండర్ హాట్ (WH) మిర్చి క్వింటాకు ₹16,500 (స్థిరంగా కొనసాగుతోంది) అని అధికారులు తెలిపారు.
TG: రాష్ట్ర ప్రజల కల సాకారం చేసేందుకు ఈ బడ్జెట్ సమావేశాలు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ‘రైతులకు రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశాం. వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్లా మారింది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500లకే సిలిండర్ అందిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీలతో యువతలో నైపుణ్యం పెంచుతున్నాం’ అని అన్నారు.
AP: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 5 కేసుల్లో ఆయనకు 41-ఏ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నేడు విచారణకు హాజరుకావాలని ఒంగోలు వైసీపీ ఆఫీస్లో చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు.
రాబోయే హోలీ పండుగకు ముందు యూపీ పోలీసులకు డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. హోలీ వేడుకల సమయంలో ఎటువంటి కొత్త సంప్రదాయాలను అనుమతించరాదని స్పష్టం చేశారు. అన్ని హోలీకి సంబంధించిన ప్రదేశాలను, వివాదాల చరిత్ర కలిగిన ప్రదేశాలను సందర్శించాలని సీనియర్ అధికారులకు సూచించారు. గత కేసులను సమీక్షించిన తర్వాత, తదనుగుణంగా సమర్థవంతమైన నివారణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
HYD: ధూమపానం వీడితే వాళ్లే నిజమైన జీవిత విజేతలు అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహాశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మార్చి 12వ బుధవారం జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాచిగూడలో మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల బారిన పడి ఎందరో తమ జీవితాల్ని ఛిద్రం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ADB: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలుపొందిన పింగిలి శ్రీపాల్ రెడ్డిని పీఆర్టీయూటీఎస్ ADB జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. జిల్లాధ్యక్షుడు కృష్ణ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ స్వామి, నాయకులు రాజు, ఈశ్వర్, రవి, తదితరులున్నారు.
ATP: పట్టణంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ జెండాను వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే వైసీపీ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
MNCL: ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని దండేపల్లి మండల కేంద్రంలో నిరసన తలపెట్టిన నేపథ్యంలో మంచిర్యాలలో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్ కుమార్, నాయకులు అశోక్ వర్ధన్, ముదాం మల్లేష్, రాజు, రాకేశ్ రేణ్వాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ADB: అసెంబ్లీకి ముట్టడికి బయలుదేరిన సర్పంచుల సంఘం మాజీ జిల్లాధ్యక్షుడు తిరుమల్ గౌడ్ను పోలీసులు బుధవారం హౌస్ అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ.. MLA అనిల్ జాదవ్ ఆదేశానుసారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరనున్న సమయంలో పోలీసులు అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని అన్నారు.
పిల్లల్లో ప్రాణాంతకమైన రెటినోబ్లాస్టోమా కలవరపెడుతోంది. ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే ఈ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కంటిలో ఉన్నట్టుండి కణతులు రావడం, కన్ను నొప్పి పెట్టడం, వాపు రావడం, ఆకారంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెటినోబ్లాస్టోమా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను త్వరితగతిన గుర్తించడం, అవగాహన, చికిత్సలు అందించడంతో.. నివారించవచ్చు.
AP: చిత్తూరు గాంధీరోడ్డులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.
ప్రకాశం: పంగులూరు మండలం రేణింగివరం జాతీయ రహదారి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైజాగ్ నుండి తిరుపతి వెళుతున్న బస్సు డ్రైవర్ నిద్ర మత్తుతో ముందు ఉన్న సిమెంటు లారీని ఢీ కొట్టాడు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉండగా వారిలో నలుగురికి గాయాలు అయ్యాయి. బస్సు డ్రైవర్ కాళ్లు క్యాబిన్లో ఇరుక్కోవడం వలన ఫ్రాక్చర్ అయ్యాయి.