SKLM: వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి సముద్ర తీర ప్రాంతంలో జూద శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతో శుక్రవారం సాయంత్రం ఎస్ఐ నిహార్ తన సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కార్యకలాపాలపై నిఘా కొనసాగుతోందని ఎస్ఐ తెలిపారు..
MBNR: టీజీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోన్-7 అధికారిణి ఫ్లోరిన్స్ తెలిపారు. తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 16న మరికల్ హాస్టల్లో డెమో నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 9704550224 నంబర్కు సంప్రదించాలన్నారు.
NLR: నెల్లూరు సిటీ వైసీపీ అధ్యక్షుడిగా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ను నియమించారు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి కొనసాగారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఉదయం 10 నుంచి విజయనగరం పార్లమెంట్ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి లావేరు హెడ్క్వార్టర్ కల్యాణమండపం నందు ఆయన అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, టీడీపీ మండల కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.
HYD: జూబ్లీహిల్స్లో చోరీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. యూసఫ్గూడలోని MSME కార్యాలయంలో చందనం చోరీ చేసిన ఈ ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొంత మంది పరారీలో ఉన్నారని తెలిపారు. పిల్లలు, మహిళల ద్వారా చోరీలు చేయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ELR: యోగా చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా పంచాయతీ అధికారి అనురాధ అన్నారు. శనివారం ఉంగుటూరు గ్రామ కమ్యూనిటీ హాల్లో యోగా ట్రయల్ రన్ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ బండారు సింధు మధుబాబు, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, ఎంపీడీఓ రాజ్ మనోజ్ కుమార్, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఆంజనేయబాబు, డీపీఆర్సీ టీం, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.
ATP: కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య చేపట్టిన RDT పరిరక్షణ పాదయాత్రలో మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పాల్గొన్నారు. RDTకి FCRA రెన్యువల్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. RDT సేవలు ఆగిపోతే ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని.. RDT విషయంలో కూటమి నేతలు నిద్రావస్థలో ఉన్నారని ఆరోపించారు.
NLR: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 12కు చేరింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు ఆయనకు పరీక్షలు చేయగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో అతడిని హోం ఐసోలేసన్లో ఉంచారు. జిల్లాలో కరోనా సంఖ్య పెరిగితే మరిన్ని కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు.
VZM: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించడం ప్రభుత్వానికి చెంప పెట్టు అని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోర్టు వ్యాఖ్యలు చేయడం గాడి తప్పిన ప్రభుత్వ పాలనకు హెచ్చరిక లాంటిదన్నారు.
KMR: నాగిరెడ్డిపేట మండలం వాడికి చెందిన బాల్లింగం శుక్రవారం పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన బాల్లింగం గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆయనకు పాము కాటు వేయగా కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మరణించాడు.
PDPL: జిల్లా ఎస్సీ కార్పొరేషన్ డీడీ వినోద్ కుమార్కు జార్జిరెడ్డి పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు రత్న నరేష్ శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్స్ను కూల్చివేసి నూతన భవనాలను నిర్మించాలని, ఇటీవల ప్రారంభించిన నూతన మెనూను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. నాయకులు అనిల్, చారి, మహేష్ పాల్గొన్నారు.
WG: తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, రావులపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసుల్లో పూతి ప్రసాద్ అలియాస్ పెరుమాళ్ల దాలయ్యను అరెస్ట్ చేసినట్టు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సమావేశం నిర్వహించారు. రూ.13 లక్షల విలువైన 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
WG: కాళ్ల మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం 6గంటలకు ‘యోగా సామూహిక ప్రదర్శన’ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ జి.స్వాతి శుక్రవారం తెలిపారు. యోగాపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు సుమారు 500 మందితో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, జాయింట్ కలెక్టర్ రాహుల్ పాల్గొంటారన్నారు.
WG: జిల్లా సహకార అధికారిగా సంకు మురళీకృష్ణ శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి బదిలీపై ఆయన భీమవరంకు పచ్చారు. జిల్లా సహకార అధికారిగా బాధ్యతలు చేపట్టిన కృష్ణను కలెక్టరేట్లోని వారి కార్యాలయంలో రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యదర్శి నందమూరి కలిశారు. శ్రీహరిపురం లేఅవుట్లో జరిగిన అవకతవకల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళారు.
VZM: బొబ్బిలి మున్సిపాలిటీలో శతశాతం పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ ఛైర్మన్ రాంబార్కి శరత్ బాబు ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటి, కుళాయి పన్నులపై రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఇంటి పన్నుల ఎస్సెస్మెంట్ నంబర్లు డబుల్ ఎంట్రీ ఎందుకు అయిందో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.