• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత కొణిదెలకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘నా ప్రియమైన సుస్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నా పక్కన నడిచిన చిన్న అమ్మాయి నుంచి.. నేడు మీరు బలమైన, బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగావ్. నిజంగా నన్ను గర్వపడేలా చేసింది. ఎప్పటికీ ఇలా ప్రకాశిస్తూ ఉండు నా ప్రియమైన హనీ పాపా. నీకు నా ప్రేమ, ఆశీస్సులు ఉంటాయి’ అని పోస్ట్ చేశారు.

March 10, 2026 / 02:00 PM IST

మృతురాలికి నివాళి అర్పించిన కీర్తిరెడ్డి

BHPL: ఘనపూర్ మండలానికి చెందిన సోమ దామోదర్ భార్య లక్ష్మి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.చందుపట్ల కీర్తిరెడ్డి మంగళవారం ఆయన నివాసానికి చేరుకుని మృతురాలి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 10, 2026 / 01:51 PM IST

BREAKING: అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం

TPT: తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా నగదు పట్టుపడింది. విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా నగదు పట్టుబడింది. దాదాపు రూ.65 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 10, 2026 / 01:50 PM IST

పండగ ఏర్పాట్లకు నిధులు కేటాయించాలని వినతి

KNR: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి, రంజాన్ మాసం ఏర్పాట్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ మసాబ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. శివాలయాలు, శ్రీరామనవమి వేడుకలు జరిగే ఆలయాలతో పాటు రంజాన్ పర్వదినం సందర్భంగా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

March 10, 2026 / 01:48 PM IST

విజయ్‌, త్రిష రూమర్స్‌పై దర్శకుడి కామెంట్స్

గతకొంత కాలంగా నటుడు విజయ్, నటి త్రిషపై పలు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై దర్శకుడు విక్రమ్ భట్ స్పందించారు. ‘సినీ తారలకు సంబంధించి వారు నటించిన సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి. వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. SMలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. వారి సినిమాలు మాత్రమే మనవి. వ్యక్తిగత జీవితాలు మనవి కావు’ అని అన్నారు.

March 10, 2026 / 01:40 PM IST

సివిడ్ సాగుపై అధికారులతో సమావేశం

కోనసీమ: కేరళకు చెందిన అమృత యూనివర్సిటీ వారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థతో ఎంవోయూ కుదుర్చుకొని డ్వాక్రా సంఘాలకు సివిడ్ పెంపకం, ఉత్పత్తుల తయారీపై సెక్షన్లను ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిడ్ సాగు, వాటి ఉత్పత్తుల తయారీపై చర్చించారు.

March 10, 2026 / 01:39 PM IST

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ విద్యాధికారి

వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య మంగళ వారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎర్ర అంజయ్య మాట్లాడుతూ.. ప్రతి పరీక్షా కేంద్రంలో నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

March 10, 2026 / 01:37 PM IST

కూరగాయల మార్కెట్‌ను తనిఖీ చేసిన కమిషనర్

ATP: గుంతకల్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మంగళవారం కూరగాయల మార్కెట్‌ను తనిఖీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని, చెత్తను మున్సిపల్ పాయింట్లలోనే వేసి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వ్యాపారస్తులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒక కిరాణా షాపునకు రూ. 500 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు ప్రతాప్, సుదర్శన్, ఎస్సై రవి పాల్గొన్నారు.

March 10, 2026 / 01:36 PM IST

పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామస్థుల ప్రతిజ్ఞ

NLG: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ మైనంపల్లిలో డ్రైనేజీలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్రరాంసింగ్ నాయక్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 10, 2026 / 01:35 PM IST

కంచెట్టి మరణం తీరని లోటు: MLA

NZB: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ మరణం తీరని లోటని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కంచెట్టి గంగాధర్ మంగళవారం ఉదయం మృతి చెందారు.

March 10, 2026 / 01:34 PM IST

ఈవీఎం కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

KMR: త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగారు.

March 10, 2026 / 01:33 PM IST

కాకినాడలో హెచ్‌పీవీ టీకా ప్రారంభం

కాకినాడలో ఈ రోజు నుంచి హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ టీకా హ్యూమన్ పాపిలోమా వైరస్ సంక్రమణ వల్ల కలిగే గర్భాశయ ముఖ కేన్సర్‌ను నివారించడంలో ఉపయోగపడుతుందిని వైద్యులు తెలిపారు. ఈ పథకం ద్వారా 14 సం. వయస్సు గల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాను అందిస్తున్నారు. వైద్య సిబ్బంది బాలికల తల్లిదండ్రులకు టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

March 10, 2026 / 01:33 PM IST

HPV వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: సీతానగరం PHC వద్ద మంగళవారం నిర్వహించిన HPV వాక్సినేషన్ ప్రక్రియను రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. అమ్మాయిల్లో క్యాన్సర్ ముప్పును తప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించిందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాల పంపిణీ చేస్తుందని చెప్పుకొచ్చారు.

March 10, 2026 / 01:33 PM IST

‘వైసీపీ అప్పులను వారసత్వంగా ఇచ్చింది’

AP: గత YCP ప్రభుత్వం అప్పులను వారసత్వంగా ఇచ్చిందని మంత్రి పార్థసారథి అన్నారు. అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. అప్పులను తీర్చడమే కాకుండా.. బకాయిలు కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఆదాయాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

March 10, 2026 / 01:31 PM IST

బీజేపీ నాయకుల సంతకాల సేకరణ

ADB: భీంపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. రైతు పెట్టుబడి సహాయం, పూర్తి స్థాయిలో రుణ మాఫీ, పంట భీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. రైతుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అంకం అశోక్, ప్రధాన కార్యదర్శి కొకటి వెంకటేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

March 10, 2026 / 01:30 PM IST