• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పెట్టుబడుల గమ్యంగా విశాఖ’

విశాఖ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. చంద్రబాబు విజన్‌తో విశాఖ ఐటీ హబ్‌గా మారనుందన్నారు.

April 27, 2026 / 08:51 PM IST

‘డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి’

NZB: ఇందూరులో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లపై హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్‌లో, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉమ్మడి జిల్లా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సమీక్షలో పాల్గొన్నారు.

April 27, 2026 / 08:50 PM IST

ప్రజావాణి కార్యక్రమంలో 162 ఆర్జీలు

HNK: కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 162 ఆర్జీలు వచ్చాయని జిల్లా అదనపు కలెక్టర్ రవి తెలిపారు. ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన స్వయంగా ఆర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

April 27, 2026 / 08:50 PM IST

స్వామి వారి జయంతి ఉత్సవాలు

SDPT: వర్గల్ మండలం నాచారంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, ఆలయ ఈవో రంగాచారి, ధర్మకర్తలు నాయకం శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, గాలి కిష్టయ్య పాల్గొన్నారు.

April 27, 2026 / 08:49 PM IST

‘తట్టు-రూబెల్లా’ టీకా కార్యక్రమం తనిఖీ

KNR: హుజూరాబాద్ శివారులోని పెద్దమ్మలవాడలో నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన మిస్డ్ ఎం.ఆర్ (తట్టు,రూబెల్లా) క్యాంపెయిన్ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, డిప్యూటీ DMHO డాక్టర్ శ్రావణ్ కుమార్ తనిఖీ చేశారు. సమయానుగుణంగా టీకాలు తీసుకోని పిల్లలను గుర్తించి ఎం.ఆర్ వ్యాక్సిన్ వేశారు. అనంతరం తట్టు, రూబెల్లా వ్యా ధులపై అవగాహన కల్పించారు.

April 27, 2026 / 08:49 PM IST

‘ఆఫ్టర్ కేర్‌ కార్యక్రమం ఒక గొప్ప వరం లాంటిది’

ADB: చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి 18 ఏళ్లు నిండి బయటకు వచ్చే యువత సమాజంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆఫ్టర్ కేర్’ కార్యక్రమం ఒక గొప్ప వరమని జిల్లా సంక్షేమ అధికారి మిల్కా పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆసక్తి గల యువతీ యువకులు జిల్లా బాలల సంరక్షణ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలియజేశారు.

April 27, 2026 / 08:46 PM IST

IPL: RCB చెత్త రికార్డు సేఫ్

IPLలో అత్యల్ప స్కోరు (49 పరుగులు) రికార్డు ఇంకా RCB పేరిటే ఉంది. ఈ రికార్డును ఇవాళ ఢిల్లీ బ్రేక్ చేసేలాగే కనిపించింది. ఒక దశలో DC 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో అంతా RCB పేరిట ఉన్న చెత్త రికార్డును ఢిల్లీ చెరిపేస్తుందని అనుకున్నారు. అయితే, పోరెల్ (19), జెమిసన్ (12) కలిసి 49 పరుగుల మార్క్‌ను దాటించారు. ప్రస్తుతం DC 11 ఓవర్లలో 58/7 పరుగులతో ఉంది.

April 27, 2026 / 08:46 PM IST

ట్రాఫిక్ పోలీసులకు చలువ కళ్లద్దాలు పంపిణీ

MNCL: విధుల్లో ఆరోగ్యం ముఖ్యమని CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి CP సోమవారం చలువ కళ్లద్దాలు పంపిణీ చేశారు. వేసవిలో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది ఎండ నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై విధులు నిర్వహించే సమయంలో వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అద్దాలను అందజేశామన్నారు.

April 27, 2026 / 08:46 PM IST

ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి: బీజేపీ అధ్యక్షుడు

NZB: ధాన్యం కొనుగోలు కేంద్రాలు నత్తనడకన కొనసాగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారి ఆరోపించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక పక్క ఎండలు మరోపక్క కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరగక అవస్థలు తప్పడంలేదన్నారు.

April 27, 2026 / 08:46 PM IST

అక్రిడిటేషన్ కమిటీ సమావేశం

SRCL: నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుభాకాంక్షలు తెలిపారు.

April 27, 2026 / 08:45 PM IST

బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా డీఎస్పీకి ఆహ్వానం

NDL: కోవెలకుంట్లలో వెలసిన పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావుని ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గుద్దేటి చిన్న వెంకటసుబ్బారెడ్డి(గుండయ్య), వైస్ ఛైర్మన్ కరిమద్దుల లక్ష్మీ నాగేంద్రబాబు కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి హాజరుకావాలని ఆయనను కోరారు.

April 27, 2026 / 08:44 PM IST

డ్రోన్ నిఘాతో అసాంఘిక శక్తులపై పోలీసుల కట్టడి

అన్నమయ్య: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ముమ్మర నిఘా చేపట్టారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగుతోంది. పేకాట, నాటుసారా, గంజాయి రవాణా వంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

April 27, 2026 / 08:41 PM IST

30న జిల్లాస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు

KDP: ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఈ నెల 30న సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు బాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా సోమవారం తెలిపారు. స్త్రీ, పురుషులకు 100,200,400,800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులన్నారు.

April 27, 2026 / 08:40 PM IST

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

PDPL: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సోమవారం గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 7 లీటర్ల నాటు సారా, 10 కిలోల బెల్లం, 15 కిలోల పటిక స్వాధీనం చేసుకొని, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. అధికారులు గుడుంబా తయారీ, అమ్మకం, రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

April 27, 2026 / 08:40 PM IST

కోసిగిలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు

KRNL: మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడం, వారి రక్షణపై అవగాహన కల్పించేందుకు సోమవారం సాయంత్రం స్థానిక తేరు బజార్ ఆవరణలో సీఐ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నిత్యం జరుగుతున్న అగాయిత్యాల పట్ల మహిళలు, యువతులు ఎలా అప్రమత్తంగా ఉండాలో పోలీసులు వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు ‘శక్తి యాప్’ ఎలా ఉపయోగించాలో వారికి తెలియజేశారు.

April 27, 2026 / 08:37 PM IST