• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..

SRPT: నడిగూడెం మండలం సిరిపురం క్లస్టర్ రైతు వేదిక వద్ద ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను ఏఈఓ రేణుక సోమవారం ప్రారంభించారు. రైతుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెల ఫార్మర్ ఐడి కేటాయిస్తామని ఆమె తెలిపారు. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రాయితీలు అందుతాయని చెప్పారు.

May 12, 2025 / 11:10 AM IST

ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు అనారోగ్యంతో మృతి

SKLM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సహాయకుడిగా పనిచేస్తున్న కె. రమేష్ (36) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. స్థానిక ఏపీవో టి. పార్వతి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పచ్చకామెర్లు వ్యాధితో రమేష్ బాధపడుతున్నాడని తెలిపారు. విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. ఈ రోజు మృతి చెందారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి 15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

May 12, 2025 / 11:06 AM IST

శ్రీశైల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

NDL: శ్రీశైల మల్లన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. మల్లికార్జున స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు కావటంతో రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో స్వామివారికి ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. స్పర్శ దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

May 12, 2025 / 10:52 AM IST

సీపీఐ విశాఖ జిల్లా కార్యవర్గం ఎన్నిక

సీపీఐ విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి సోమవారం తెలిపారు. జిల్లా కార్యదర్శిగా ఎస్‌కే రహిమన్, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణ, చంద్రశేఖర్‌లు ఎన్నికైనట్టు తెలిపారు. జిల్లాలో జరిగిన 25 మహాసభలో విజయవంతమైనట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

May 12, 2025 / 10:24 AM IST

కరవంజ జెడ్పీ పాఠశాలలో రెమిడియల్ క్లాసులు

SKLM: జలుమూరు మండలం కరవంజ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని హెచ్ఎం టి. ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక పాఠశాలలో సైన్స్ తరగతుల సంబంధించి రెమిడీయల్ క్లాసులు నిర్వహించామన్నారు. సెలవు దినాలలో తప్ప మిగిలిన రోజులు ప్రతి సబ్జెక్టు పైన ఆయా ఉపాధ్యాయులతో క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

May 12, 2025 / 10:15 AM IST

పట్టణంలో పర్యటించిన కమిషనర్

KRL: ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనర్ ఎన్.గంగిరెడ్డి, సోమవారం తెల్లవారుజామున పట్టణం లోని పార్క్ రోడ్డు, సోమప్ప సర్కిల్, మార్కెట్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. గంగిరెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

May 12, 2025 / 10:15 AM IST

అమ్మవారికి విశేష పూజలు

HYD: ఫిలింనగర్ దైవ సన్నిధానంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువ జామునే పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, హోమం జరిపించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌఖ్యాలు లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

May 12, 2025 / 10:15 AM IST

రేపు చిత్తూరు జడ్పీ స్థాయి సంఘాల సమావేశం

చిత్తూరు: జెడ్పీ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ 1-7 స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ ఛైర్మెన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం ఉంటుందన్నారు. నిర్దేశించిన సమయంలో మాత్రమే సంబంధిత అధికారులు, జెడ్పీటీసీలు హాజరుకావాలన్నారు.

May 12, 2025 / 10:08 AM IST

ఝాన్సీనగర్‌లో పగటిపూట వెలుగులు

HYD: విద్యుత్ శాఖ సిబ్బంది తీరుతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా టోలిచౌకి డివిజన్ పరిధిలోని ఝాన్సీనగర్‌లో వీధిలైట్లు 24 గంటలు వెలుగుతూనే కనిపించాయి. పగటిపూట కూడా వీధిలైట్లు వెలుగుతుండడంతో కరెంటు వృథా అవుతోంది. పలు కాలనీల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు వీడాలని ప్రజలు కోరుతున్నారు.

May 12, 2025 / 09:24 AM IST

హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం

HYD: హైదరాబాద్ మెట్రోకు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ మెట్రోపై పరిశోధన పత్రాన్ని సమర్పించింది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య(PPP) ప్రాజెక్టు అంటూ అందులో ప్రముఖంగా ప్రస్తావించింది. మెట్రో మ్యాన్గా పేరొందిన HMRL ఎండీ NVS రెడ్డి నైపుణ్య శైలిని, నాయకత్వ లక్షణాలను ప్రధానంగా ప్రస్తావించింది.

May 12, 2025 / 09:09 AM IST

నేడు నాగార్జునసాగర్ కు సుందరీమణులు

NLG: నాగార్జునసాగర్‌లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును మిస్ వరల్డ్ పోటీదారులు సోమవారం సందర్శించనున్నారు. బుద్ధ జయంతి రోజే ఈ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. వీరు సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు ఇక్కడ పర్యటిస్తారు. విదేశాల్లోని బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యంగా అధికారులు బుద్ధవనాన్ని ఎంపిక చేశారు.

May 12, 2025 / 08:25 AM IST

‘పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం’

MNCL: పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. సోమవారం జన్నారంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వారు శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో పెరిగిన పిచ్చి చెట్లు, ముళ్ల పొదలను తొలగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

May 12, 2025 / 08:12 AM IST

ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

MNCL: మాల సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాలల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మాల కులస్తులు పాల్గొన్నారు.

May 12, 2025 / 07:53 AM IST

నేడు టీడీపీ కార్యకర్తల సమావేశం

NDL: నందికోట్కూరు‌లో టీడీపీ కార్యకర్తలు సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరవుతారని, ఈ మేరకు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు.

May 12, 2025 / 07:46 AM IST

నల్గొండ పోలీస్ ఖ్యాతి పెంచే విధంగా పని చేయాలి

NLG: జిల్లా కేంద్రంలోని సాగర్ రెడ్డి కళ్యాణ మంటపంలో ఆదివారం రాత్రి ఎస్పీ శరత్ చంద్ర పవార్ బందోబస్తుపై పోలీసు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాగార్జున సాగర్‌కు సోమవారం ప్రపంచ సుందరీ పోటీదారులు వస్తున్న సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్గొండ పోలీస్ ఖ్యాతి పెంచే విధంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు.

May 12, 2025 / 07:45 AM IST