WGL: నేటి నుంచి 27 వరకు వరంగల్లోని నక్కలపల్లి రోడ్డులో రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారదా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 3రోజులు ఈ మేళా ఉంటుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ATP: ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ సీల్డ్ టెండర్లు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపారు. షీల్డ్ టెండర్లకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. నిన్న నిర్వహించిన సీల్డ్ టెండర్లు అనివార్య కారణాలతో అర్ధాంతరంగా నిలిపివేశారు. కార్యాలయం వద్ద గందరగోళం నెలకొనడంతో వాయిదా పడింది.
ATP: కంబదూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నందు 2025-2026వ విద్యా సంవత్సరంలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాలకు విద్యార్థినిల నుండి ఆన్లైన్ నందు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ఎస్ఓ రూప తెలిపారు. ఏప్రిల్ 11 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చన్నారు.
అనకాపల్లి: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా ఏ విధంగా జరుగుతుందో మున్సిపల్ మంచినీటి విభాగం ఏఈ గణపతిరావు మంగళవారం ఉదయం పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో నెహ్రునగర్ ప్రాంతంలో మంచినీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో మంచినీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ASR: జి.మాడుగుల మండలంలోని గాంధీనగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం బయట స్లిప్పులు దర్శనమిచ్చాయి. సోమవారం గణితం పరీక్ష అయిన తర్వాత విద్యార్థులు బయటకు వచ్చి స్లిప్పులు బయట జల్లుకుంటూ వెళ్లిపోయారు. విద్యార్థులు బయటకు వెళ్లేటప్పుడే ఇలా స్లిప్పులు ఉంటే లోపల ఇంకేమి జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. IPLలో కోహ్లీ ఇప్పటివరకు 64 హాఫ్ సెంచరీలు చేశాడు. మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్(66) పేరిట ఉంది. తర్వాత స్థానాల్లో శిఖర్ ధావన్(53), రోహిత్ శర్మ(45), డివిలియర్స్(43) ఉన్నారు.
ELR: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బిఎల్వోలకు ఓటర్ లిస్టుపై శిక్షణ తరగతులు జరుగుతాయని తాహసిల్దార్ వై.పూర్ణచంద్ర ప్రసాద్ తెలిపారు. ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ బిఎల్వోలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. మండలంలోని బిఎల్వోలు తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాలని తాహసిల్దార్ కోరారు.
అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ నీట మునిగి చనిపోయాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
TPT: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్డి నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పరీక్షలు నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
W.G: వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళలలో నాటిక ఒకటని నేడు అది కనుమరుగవుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం రాత్రి వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం నిర్వహిస్తున్న 11వ అఖిల భారత స్థాయి నాటికల పోటీలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
W.G: ప్రతి ఒక్కరు దైవచింతన కలిగి ఉండాలని తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చిన్న మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తొలుత ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ముల్లా జీవనం సాగిస్తారన్నారు.
ఢిల్లీ ఈ సీజన్ను ఘనంగా ఆరంభించింది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నోపై ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లు స్టబ్స్ (34), విప్రజ్ నిగమ్ (39) పరుగులతో రాణించారు. అశుతోష్ (66*) కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి విజయం అందించాడు.
TG: 2018లో 30 మంది కూలీలతో వెళ్తూ వలిగొండ వద్ద ఓ ట్రాక్టర్ మూసీలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. అయితే ఘటనలో తాజాగా డ్రైవర్ వెంకటనారాయణను దోషిగా తేల్చిన జిల్లా కోర్టు.. పదేళ్లు జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది.
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో నికోలస్ పూరన్ కూడా దూకుడు పెంచాడు. విప్రజ్ వేసిన ఏడో ఓవర్లో చివరి నాలుగు బంతుల్లో మూడు సిక్స్లు బాదాడు. వరుసగా రెండు సిక్స్లు బాదిన తర్వాత పూరన్ ఇచ్చిన క్యాచ్ను సమీర్ రిజ్వీ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం LSG 9 ఓవర్లకు 108 పరుగులు చేసింది. పూరన్ (33*), మార్ష్ (57*) పరుగులతో ఉన్నారు.
AP: ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా మాజీ సీఎం జగన్ మద్యం కుంభకోణం అతి పెద్దదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కాం చేసిన ఘనత జగన్ది అని తెలిపారు. జగన్ తన ఆధీనంలోని సంస్థల ద్వారా మద్యం వ్యాపారాన్ని నియంత్రించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టారని మండిపడ్డారు.