VKB: జిల్లా పరిధిలోని పరిగి ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారి సాయంత్రం సమయంలో ఎరుపేక్కింది. ప్రకృతి పరవశించిన ఈ దృశ్యాలను ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించారు. పరిగి పుడమి పులకరించినట్లుగా ఉందని, అక్కడ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
W.G: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభించిన చారిత్రాత్మక ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకమును ఉండి కృషి విజ్ఞాన కేంద్రం నందు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ శనివారం ప్రారంభించారు. ఏపీలో నాలుగు జిల్లాలను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు మొత్తం రూ.1.44 లక్ష కోట్లు రానున్నాయని తెలిపారు.
GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే PGRS కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు రాయించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు ప్రజలకు సులభతరం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించడం జరిగిందని శనివారం పేర్కొన్నారు. ఈ సదుపాయం అక్టోబర్ 13 నుంచి ప్రారంభమవుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
కోనసీమ: రామచంద్రపురం మండలం కందుల పాలెం గ్రామైక్య సంఘానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడం పట్ల కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం హర్షం వ్యక్తం చేశారు. ఏపీఎమ్ ఎస్.శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు అవ్వారి మంగాదేవి, వీవోఏ నాగలక్ష్మి, సంఘం సభ్యులు సత్యంను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామానికి ప్రతిష్టాత్మక అవార్డు రావడం స్ఫూర్తిదాయకం అన్నారు.
SRD: విద్య నేర్పిన బడిని, తల్లిదండ్రులను, గురువులను మరవరాదని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి, అఖిలభారత సాధు సంతుల రాష్ట్ర ప్రతినిధి సంగ్రామ్ మహారాజ్ పేర్కొన్నారు. శనివారం నారాయణఖేడ్ శిశుమందిర్ పాఠశాలలో 2008-09 పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు కంప్యూటర్, ప్రింటర్లను బహుకరించారు.
KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్కు చెందిన చిలువేరు రాజేష్ కుమార్ ఇటివల రోడ్డు ప్రమాదంతో మరణించాడు. శనివారం బాల్యమిత్రులు గొర్ల అనిల్ యాదవ్, బండ శ్రీనివాస్, నూనె శ్రీనివాస్, నూనె రవి, మోతే శంకర్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. బాల్యమిత్రుడి కూతురు నిత్యశ్రీ పై రూ.52 వేలు కన్నాపూర్ పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేశారు.
సత్యసాయి: కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో ఎస్పీ సతీష్ కుమార్ సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. కేసుల పురోగతిని పర్యవేక్షించి, సాక్షులను సకాలంలో హాజరుపరచాలని ఆదేశించారు. కొత్త బీఎన్ఎస్ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
HNK: నర్సంపేట నియోజకవర్గ MLA దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న MHBD ఎంపీ పోరిక బలరాం నాయక్ శనివారం సాయంత్రం HNKలోని MLA దొంతి నివాసానికి వెళ్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం MLA కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
US రాయబారి సెర్గియో గోర్ PM మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ గురించి మోదీ ప్రస్తావిస్తూ.. తన పదవీ కాలంలో భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని గోర్ బలోపేతం చేస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానితో తన భేటీ అద్భుతంగా జరిగిందని.. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, కీలక ఖనిజాల గురించి చర్చించినట్లు గోర్ పేర్కొన్నారు. మోదీని ట్రంప్ స్నేహితుడిగా భావిస్తారని తెలిపారు.
SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామ రైతుల కష్టాలను జీఎంఆర్ ఫౌండేషన్ తొలగించింది. వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తాజా మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు ఆకుల రాములు జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుర్రపు మచ్చేందర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల కోరిక మేరకు రోడ్డు ఏర్పాటు చేశారు.
SDPT: చేర్యాల పట్టణానికి చెందిన కల్లు గీత కార్మికుడు బురగోని శ్రీనివాస్ గౌడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (KANA) ఆధ్వర్యంలో రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని KGKS జిల్లా నాయకుడు బండకింది అరుణ్ సమన్వయంతో కుటుంబానికి అందించారు. KANA ప్రతినిధులకు గౌడ సంఘం ధన్యవాదాలు తెలిపింది.
అన్నమయ్య: ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని,14 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏ1గా ఉన్న జనార్దనావును కస్టడీలోకి తీసుకున్నామని, నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుతోపాటు ఏపీలోనూ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. త్వరలో APTATS యాప్ ద్వారా మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకుంటామన్నారు.
BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో శనివారం PACS ఛైర్మన్ మేకల సంపత్ కుమార్ ఆధ్వర్యంలో BRS నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి మరిచిందన్నారు. BRS నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధికి చెందిన ప్రకాష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య సహాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని అభ్యర్థించాడు. ప్రకాష్ వైద్యం కోసం రూ. 5 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈరోజు అందజేశారు. మాజీ ఆత్మ డైరెక్టర్ శ్రీరామ్ నరేందర్, తునికి సురేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.
PDPL: ఎలిగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 69వ ఎస్జీఎఫ్ పెద్దపల్లి జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 చదరంగ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ప్రారంభించారు. జిల్లాలోని పాఠశాలల నుండి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చెస్ అసోసియేషన్ నాయకులు గడ్డాల శ్రీనివాస్, భాను, సతీష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.