కృష్ణా: గ్రామాల్లో అధ్వానంగా మారిన అంతర్గత రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గురువారం రాత్రి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. గన్నవరం మండలం మాదాలవారిగూడెంలో రూ.43లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ముస్తాబాద్లో రూ.71లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం పంచమి: రా. 1-11 తదుపరి షష్ఠి మూల: పూర్తి వర్జ్యం: మ. 1-13 నుంచి 2-51 వరకు తిరిగి తె. 4-50 నుంచి అమృత ఘడియలు: రా. 11-04 నుంచి 2-51 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-15 నుంచి 9-04 వరకు తిరిగి మ. 12-23 నుంచి 1-13 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.5.45; సూర్యాస్తమయం: […]
వాంఖడే వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేధించింది. రోహిత్ శర్మ (26), రికెల్టన్ (31), విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21*) పరుగులు చేశారు. SRH బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీశాడు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయా కేసుల్లో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కారాగారంలో తనపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు. అయితే, వీటిని పాకిస్తాన్ సమాచారశాఖ మంత్రి అతావుల్లా తరార్ తోసిపుచ్చారు. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవించడం కాకుండా.. హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై నెల కోటాను టీటీడీ విడుదల చేసింది. జూలై నెల కోటాను ఏప్రిల్ 19 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
KMM: ముదిగొండ మండలంలో ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం క్రింద మొత్తం 5,235 ధరఖాస్తులు వచ్చాయని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీజకు MPDO శ్రీధర్ స్వామి వివరించారు. ఎస్సి, ఎస్టీ, బీసి, మైనారిటీ, ఈబీసి, ఎంబీసీ అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా 3280 దరఖాస్తులు, ఆఫ్ లైన్ ద్వారా 1955 దరఖాస్తులు వచ్చాయని కార్యాలయ విజిట్లో భాగంగా వివరాలను వెల్లడించారు.
NDL: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంబార్కేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గురువారం నంద్యాల నేషనల్ పీజీ కళాశాలలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు డా. ఎస్. ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
KRNL: ఆదోని మాజీ MLA సాయి ప్రసాద్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. అలసందగుత్తి గ్రామానికి చెందిన వీరాంజనేయులు, నాగేంద్ర గార్ల కుమార్తె, కుమారుడి పెళ్లికి బంగారు తాళిబొట్టు, వెండి మెట్లు ఇవాళ అందించారు. పేద మహిళల ఆడపిల్లల పెళ్లికి తాళిబొట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని మాజీ MLA అన్నారు. ఈ కార్యక్రమంలో YCP యువజన అధ్యక్షుడు నల్లా రెడ్డి తదితరులు ఉన్నారు.
BPT: బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్ ప్రాంతంలో గురువారం కొండ తేనెటీగలు స్థానికులపై దాడికి దిగాయి. ఈ ఘటనలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తేనెటీగల దాడి ఎలా జరిగిందన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. తేనెటీగలు మదినచేసే స్థలాన్ని ఏదైనా బద్దలై ఉండడం వల్ల అవి దాడికి దిగే అవకాశముందని స్థానికులు తెలిపారు.
MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని గురువారం జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, దీనికి భూభారతి ముఖ్య ఉదాహరణ అని అన్నారు.
SRD: కేసుల పరిష్కారంలో ఫింగర్ ప్రింట్స్ కీలకమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఫింగర్ ప్రింట్, ఎంఎస్ డీసీ డివైస్పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలో ఆస్తి తగాదాల కేసులు, సస్పెక్ట్ చెక్, గుర్తు తెలియని మృతదేహాల ఫింగర్ ప్రింట్స్ సేకరించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
SRD: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ రజతోత్సవ స్ఫూర్తితో పోరాటంపై ముందుకు సాగుదామని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మాణిక్యం పాల్గొన్నారు.
సత్యసాయి: మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి బయలుదేరి బెంగళూరుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన ఉదయం 9.30 గంటలకు మడకశిరకు చేరకుంటారని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, అధికారులతో కలిసి నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.
BPT: నవోదయం 2.O కార్యక్రమం సందర్భంగా గురువారం బాపట్లలోని బేతపూడి, స్టువర్టుపురం గ్రామాలలో నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించబడింది. బాపట్ల ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నాటుసారా సంభందిత చర్యలు చట్టవిరుద్ధమని, ఈ చర్యలకు పాల్పడిన వారికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ATP: ప్రధాని మోదీ మే 2న రాష్ట్రానికి వస్తుండటంతో సీఎం చంద్రబాబునాయుడు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఐదుగురు మంత్రులతో ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా జిల్లా నుంచి మంత్రులు సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్కు చోటు దక్కింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, బహిరంగ సభ విజయవంతానికి వీరు కృషి చేయనున్నారు.