MLG: తాడ్వాయి మండలంలోని విండ్ ఫాల్ అటవీ ప్రాంతంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం బయటపడటం స్థానికుల్లో ఆందోళన నెలకొల్పింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడారం మినీ జాతరకు కుటుంబంతో కలిసి వచ్చిన ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడని ఫిర్యాదు అందిందని, ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఇవాళ సంగెం మండలంలోని ఆశాలపల్లిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజమహకూర్ తన కుటుంబంతో కలిసి మూడు నెలలుగా ఆశాలపల్లి శివారులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. వారి ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడిపోయింది. వేంటనే MGM ఆసుపత్రికి తరలించినా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
PPM: పార్వతీపురం పురపాలక కౌన్సిల్ ఎన్నికయి నాలుగేళ్లయిన ఇప్పటివరకు వారి తీరులో మార్పు రాలేదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. సోమవారం పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల అవిశ్వాస తీర్మాన పత్రాలను జేసీ శోభిక, కమిషనర్ వెంకటేశ్వర్లకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు . వైసీపీ హయాంలో ఏర్పాటు అయిన కౌన్సిల్ పట్టణ అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందన్నారు.
MNCL: తాండూర్ మండలంలో 247 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. మండలంలో తనిఖీలు చేయగా రూ.6,17,500 విలువ చేసే 247 కిలోల పత్తి విత్తనాలు లభ్యమయ్యాయన్నారు. ఐదుగురు కొనుగోలుదారులు, ముగ్గురు డ్రైవర్లను అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు మనోహర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
VZM: అనకాపల్లిలో దీపు అనే హిజ్రాను ఆమెతో సహవాసం చేసే దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. దీపు ఆత్మకు శాంతి కలగాలని నగరంలోని హెల్పింగ్ హాండ్స్ హిజ్రా అసోషియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండబాబు, అధ్యక్ష కార్యదర్శులు దవడ మీనాకుమారి, స్రవంతి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్కు వెళ్లి వినతి పత్రం సమర్పించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 1,39,595 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 227 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అన్నదాన ట్రస్ట్ ద్వారా 2400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
NRML: రోడ్డు ఆక్రమణలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా హెచ్చరించారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఇబ్బందులకు గురి చేస్తూ రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.
PPM: పార్వతీపురం వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరోఇద్దరు కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పురపాలక సంఘం 1వ వార్డు, 30వ వార్డులకు చెందిన కౌన్సిలర్లు రణబేరి బంగారు నాయుడు, చిన్నం నాయుడు, వైసీపీ నాయకులు వెంకట్రావు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
KKD: ప్రజల ఆరోగ్య భద్రతకే అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య సోమవారం తెలిపారు. పట్టణంలోని ఒక చికెన్ సెంటర్లో ప్రజలు కొనుగోలు చేసిన మాంసంలో పురుగుల ఘటనపై ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పట్టణ పరిధిలోని అన్ని షాపులను అధికారులతో తనిఖీలు చేయించి, అక్రమార్కుల లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.
కోనసీమ: పుస్తకాలు చేత పట్టి చదువుకోవాల్సిన పిల్లలు ప్లకార్డులు చేత పట్టి ఉద్యమ బాటపడుతున్నారు. సోమవారం మండపేట సప్తగిరి థియేటర్ వద్ధ ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు తక్షణం తొలగించాలని మహిళలు చేస్తున్న ఆందోళనకు మేము సైతం అంటూ.. “మద్యం షాపు మాకు వద్దు” అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
KKD: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఉన్న ప్రభుత్వ పాఠశాల జడ్పీహెచ్ స్కూల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో జేసీ రాహుల్ మీనాకు ఎస్ఎఫ్ఐ బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరి బాబు మాట్లాడుతూ… గత 20 సంవత్సరాల క్రితం నుంచి పాఠశాలకు ప్రహరీ గోడ లేదన్నారు.
BHPL: భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. ఈ సందర్భంగా 21 మంది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి సమస్యపై విచారణ చేసి ప్రజలకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
ADB: జలవనరులు, భూవనరుల విభాగం న్యూఢిల్లీ నుంచి నీటి వనరుల పునరుజ్జీవనం అమలుపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ NITI ఆయోగ్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. చెరువుల్లో పూడికతీతతో నీటి నిల్వలు పెరుగుతాయన్నారు. చెరువుల పరిధిలో ఆయకట్టు సాగుకు నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ASF: జిల్లా కాగజ్నగర్ అరుణోదయ స్కూల్ విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్లు వంటి అంశాలపై ఎఎస్ఐ సునీత వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీం హెల్ప్ లైన్ 87126 70565 లేదా డయల్ 100 ద్వారా సహాయం కోరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లలిత, టీచర్లు, షీ టీం పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కల్వరాల గ్రామానికి చెందిన 33 మంది రైతులకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లాపూర్ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు సోమవారం స్ప్లింకర్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా హార్టికల్చర్ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని సూచించారు.