• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి’

MNCL: రాజ్యాంగ ప్రతి ఫలాలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉదయం జన్నారం మండల కేంద్రంలోని ఆస్పత్రి ఎర్లీ ఏరియాలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గాంధీ చిత్రపటాలతో వాడవాడలా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు.

May 12, 2025 / 07:38 AM IST

16న బండలాగుడు పోటీలు

NDL: కోయిలకుంట్ల పట్టణంలో పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 16న బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి సోమవారం నాడు తెలిపారు. బండలాగుడు పోటీలలో గెలుపొందిన వృషభరాజములకు రూ.1,10,000 బహుమతిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందజేయనున్నారు. రెండవ బహుమతి రూ. 50వేలు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు.

May 12, 2025 / 07:24 AM IST

నెల్లూరు: ఘనంగా బంగారు గరుడ సేవ

NLR: రంగనాయకులపేటలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో బంగారు గరుడ సేవ నిర్వహించారు. నరసింహ జయంతి సందర్భంగా పూజలు చేశారు. స్వామివారిని బంగారు గరుడ వాహనంపై ఉంచి నగరోత్సవం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకారం చేశారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి గరుడ సేవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

May 12, 2025 / 07:17 AM IST

విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

MBNR: జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో ఆదివారం వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభానికి మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి  ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినా సరఫరా జరగడంతో ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు, మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

May 12, 2025 / 07:16 AM IST

డ్రంక్ డ్రైవ్‌లో ఇద్దరిపై కేసు నమోదు

కోనసీమ: ఆత్రేయపురం మండలం మండల పరిధిలోని బొబ్బరలంక సమీపంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆత్రేయపురం ఎస్పై ఎస్. రాము తెలిపారు. సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా నిబంధనలు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

May 12, 2025 / 07:16 AM IST

కొండాపురంలో నిరుపయోగంగా గ్రామ సంత

KDP: కొండాపురంలో 11 సంవత్సరాల క్రితం గ్రామ సంత నిర్మించారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో కొండాపురం చుట్టుపక్కల రైతులు, గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సంత ప్రారంభించకపోవడంతో ప్రధాన రోడ్డు పక్కన, బండ్లపైన కూరగాయలను విక్రస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును వెచ్చించి కట్టిన గ్రామ సంత నిరుపయోగంగా మారిందని వారు అన్నారు.

May 12, 2025 / 06:15 AM IST

తాగునీరు అందించాలని నిరసన

KDP: సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లెలోని వడ్డివారి వీధికి కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి తాగనీరు సరఫరా అయ్యే పైపులైను తరచూ దెబ్బతింటుంది. సకాలంలో అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు. పైపులైను బాగు చేసి సరఫరాను పునరుద్దించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

May 12, 2025 / 05:59 AM IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్‌గా తుమ్మల

KKD: జిల్లా DCCB ఛైర్మన్‌గా తుమ్మల రామస్వామి(బాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆయన జనసేన జిల్లా అధ్యక్ష పదవితో పాటు KUDA ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. మరో కీలక పదవి దక్కడంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు కూటమి నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

May 12, 2025 / 05:48 AM IST

నేటి నుండి ఈఏపీసెట్-2025 హాల్ టికెట్లు విడుదల

KKD: కాకినాడ జేఎన్టీయూకే నిర్వహించనున్న ఈఏపీసెట్-2025 హాల్ టికెట్లను ఈ నెల 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జేఎన్టీయూకే వీసీ ప్రొ. సీఎస్ఆర్ కె. ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 3,61,299 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరందరు హాల్టికెట్లను వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inతోపాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చన్నారు

May 12, 2025 / 05:31 AM IST

ట్రంప్‌నకు కానుకగా ఖతార్ విమానం!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వారంలో చేపట్టనున్న మధ్యప్రాచ్య పర్యటన సందర్భంగా ఖతార్ పాలక కుటుంబం నుంచి జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. ట్రంప్ ఖతార్ వెళ్లినప్పుడు ఈ కానుక ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.

May 12, 2025 / 05:29 AM IST

యుద్ధం ఎఫెక్ట్.. పోలీసుల కార్డెన్ సెర్చ్

AP: ప్రజల భద్రతే లక్ష్యమని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు గాను పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో అనుమానితులను గుర్తించి విచారిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

May 11, 2025 / 11:27 PM IST

ఈటల రాజేందర్‌కు జగ్గారెడ్డి వార్నింగ్

TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి కానీ.. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడితే నడిరోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీయిస్తానని హెచ్చరించారు. ఈటల ఇప్పటికైనా నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఈటలకు బీజేపీలో కోరుకున్న పదవులు రాకపోయే సరికి గంజాయి తాగినవాడిలెక్క మారిపోయారని మండిపడ్డారు.

May 11, 2025 / 08:29 PM IST

IPL 2025: RCBకి బిగ్ షాక్!

RCBకి బిగ్ షాక్ తగలనుంది. బెంగళూరు పేసర్ జోస్ హేజిల్‌వుడ్ భుజం నొప్పి కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్‌లో WTC ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతడిని తిరిగి భారత్‌కు పంపకూడదని ఆసీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్‌లో హేజిల్‌వుడ్ 18 వికెట్లు తీశాడు.

May 11, 2025 / 08:26 PM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

SKLM: సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామానికి చెందిన ఎన్.ఉగాది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనిది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం కాగితాపల్లి జెడ్పీహెచ్ పాఠశాలలో 2002–2003 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆదివారం రాత్రి అతని కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

May 11, 2025 / 08:25 PM IST

శ్రీలంక రోడ్డు ప్రమాదంలో 22కు చేరిన మృతులు

శ్రీలంకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది.  ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. మరో 35 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ఘోరం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

May 11, 2025 / 08:19 PM IST