AP: గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరు అయ్యాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్టేడియం అభివృద్ధికి దశల వారీగా నిధులు సేకరిస్తామని చెప్పారు. కేంద్రానికి తెలిపిన క్రీడా మౌలిక వసతుల ప్రతిపాదనలో భాగంగా ఖేలో ఇండియా స్కీమ్ కింద రూ.14 కోట్ల మంజూరుకు క్రీడల శాఖ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
CTR: పూతలపట్టు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో చిత్తూర్ ఎంపీ జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఫోన్ ద్వారా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లులో PDSU నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షుడిగా అఖిల్, ప్రధాన కార్యదర్శిగా వినోద్, ఉపాధ్యక్షుడిగా మధు, సహాయ కార్యదర్శిగా భరత్ ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రవేట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. చిన్నారులు పలు వేషధారణతో అందర్నీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు అందమైన ముగ్గులతో పలువురిని అలరించారు.
PDPL: సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మహేంద్ర బొలెరో వాహనాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. సుల్తానాబాద్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కదంబాపూర్ మానేరు నుంచి మెట్పల్లి వైపు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా వాహనాన్ని గుర్తించి పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
MDCL: గ్రేటర్ పరిధి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సెకండ్ యూనిట్ బృందం మరో ప్రకటన చేసింది. వివిధ వాహనాల నుంచి ఏకంగా రూ.5,00,075 పన్ను వసూలు చేసినట్లుగా పేర్కొంది. పన్నులు చెల్లించకుండానే రాయికల్, గండి మైసమ్మ, బాలానగర్ క్రాస్ రోడ్ లాంటి ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.
NTR: ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వాహనాల్లో తప్పనిసరిగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని రవాణా కమిషనర్ మోహన్ శుక్రవారం తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసినా...
MNCL: జన్నారం మండలంలోని చింతగూడ, మొహమదాబాద్ అటవీ ప్రాంతాలలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం చింతగూడా అటవీ ప్రాంతంలో పెద్దపులి అరుపులు, మహమ్మదాబాద్ అటవీ ప్రాంతంలో పాదముద్రలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
SRD: రామచంద్రాపురం ACP శ్రీనివాస్ కుమార్ శుక్రవారం సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
KDP: రాజంపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో రాజంపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (AMC) ఛైర్మన్ గన్నే సుబ్బనరసయ్య నాయుడు అధికారిక హోదాలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని మండల అధికారులకు సూచించారు.
SRPT: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా ఎంఈవోలు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ ఆదేశించారు. శుక్రవారం సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, అభ్యాసన పుస్తకాలు అందజేయాలన్నారు. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామగ్రిని పంపిణీ చేయాలని అన్నారు.
NTR: నందిగామలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్టీవో కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎం. పద్మావతి మాట్లాడుతూ.. బస్సులు నడిపేటప్పుడు క్రమశిక్షణ, బాధ్యత తప్పనిసరి అన్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, యూనిఫాం, అత్యవసర ద్వారం ఉండాలని సూచించారు.
NTR: విజయవాడ బెనిఫిట్ మెడికల్ బజార్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీ నుంచి తమ వద్ద మందులు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ యజమాని సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. నగరం నుంచి మారుమూల ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందించాలని ఉద్దేశంతో బెనిఫిట్ మెడికల్ పైలెట్స్ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు.
KRNL: సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంత కుమారి హెచ్చరించారు. శుక్రవారం ఆమె బస్సు ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి బస్సులో హెల్ప్ లైన్ నెంబర్ 9281607001 ప్రదర్శించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రెండో డ్రైవర్ను ఉంచుకోవాలని ఆమె ఆదేశించారు.
BHPL: జిల్లాలో అంగన్వాడీ ఆయా నుంచి టీచర్ పదోన్నతుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు నిరాధారమని, అవి వాస్తవ విరుద్ధమని జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి స్పష్టం చేశారు. పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, జీవోలు, జిల్లా సెలెక్షన్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా జరిగాయన్నారు. అర్హతలు, సర్టిఫికేట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎంపిక జరిగిందని ఆయన అన్నారు.