KRNL: బక్రీద్ పండుగ సందర్భంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ప్రార్థనలు ముగిసే వరకు కర్నూలు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను తిప్పమ్మ కొట్టం వద్ద నుంచి నేషనల్ హైవేపైకి మళ్లించనున్నట్లు చెప్పారు. బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సులు బళ్లారి చౌరస్తా, బిర్లా జంక్షన్ మీదుగా వెళ్లనున్నాయి.
SRPT: బక్రీద్ పండుగ నేపథ్యంలో కోదాడలోని ఖమ్మం అడ్డరోడ్డు, హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమ పశువుల రవాణా, గంజాయి, మారణాయుధాల తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా అనుమానిత వ్యక్తుల వివరాలు నమోదు చేసుకుంటూ, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించవద్దని హెచ్చరించారు.
ASF: ఈనెల 29న రాష్ట్ర గవర్నర్ జిల్లాలో పర్యటించనున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.35కు కలెక్టరేట్కు చేరుకుని 11 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రౌట సంకేపల్లి గ్రామంలో జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవంలో పాల్గొంటారు. పర్యటన నేపథ్యంలో భద్రత, రవాణా, వైద్య ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.
HYD: నగరంలో బక్రీద్ సందడి ముగింపు దశకు చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర, మల్లేపల్లి, జియాగూడ, సూర్యాపేట నుంచి తెచ్చిన గొర్రెపోతుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్లో 12-15 KGల గొర్రె ధర రూ.14000 పలుకుతుండగా.. జంట జీవాలు రూ.25-30000 వరకు అమ్ముడవుతున్నాయి. 20 KGల కొమ్ములు తిరిగిన యాట రూ.30 వేలకు పైనే పలుకుతోంది.
NLG-రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నేడు నల్గొండలో పర్యటించనున్నారు. ఉదయం 8:00 గంటల నుంచి 10:00 గంటల వరకు స్థానిక ఈద్గా మైదానంలో జరిగే బక్రీద్ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన పలు స్థానిక కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ వర్గాలు బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
NZB: ధర్పల్లి మండలం గోవిందపల్లిలో అదనపు వరకట్నం వేధింపులతో వివాహిత లక్షిత (కవిత) మృతి చెందిన కేసులో పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్టు చేశారు. మృతురాలి భర్త కర్రోల్ల నెహ్రూ, అత్త కర్రోల్ల సత్తెమ్మ, మామ కర్రోల్ల రాజులు(పెద్ద రాజులు)ను కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
KMR: పిట్లం మండలం చిన్న కొడఫ్గల్ శివారు హైవే 161 పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. SI ఆంజనేయులు వివరాల ప్రకారం.. పిట్లం PSలో హోమ్ గార్డ్గా పనిచేస్తున్న యశ్వంత్ విధులు ముగించుకుని బైక్పై వెళ్తుండగా, రోడ్డు దాటుతున్న చిన్న కొడఫ్గల్ వాసి ఎం. సురేశ్ (48)ను ఢీకొట్టారు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందాడు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక పరుగుల సరికొత్త రికార్డు నమోదైంది. IPL-2026 ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు కలిసి ఏకంగా 439 పరుగులు సాధించాయి. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ 243 రన్స్ చేయగా, హైదరాబాద్ 196 పరుగులు చేసింది. దీంతో 2025లో నమోదైన 436 (MI vs GT) పరుగుల రికార్డు బద్దలైంది.
TG: ఎవరెస్ట్పై మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ మృతదేహాన్ని పర్వతంపైనే వదిలేయాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. డెత్ జోన్ నుంచి మృతదేహాన్ని తేవడం ప్రమాదకరం, అత్యంత ఖర్చుతో కూడుకున్నదని నిర్వాహకులు తెలిపారు. దీంతో శివుని నివాసంలో ప్రాణాలు విడిచినందున అక్కడే వదిలేయాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
రామ్చరణ్ ‘పెద్ది’ చిత్రంలో అప్పలసూరి పాత్ర తన కెరీర్లోనే ప్రత్యేకమని జగపతి బాబు అన్నాడు. ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఈ పాత్ర యాస, డబ్బింగ్ ఓ సవాలని, మేకప్కే 3 గంటలు పట్టేదని చెప్పాడు. చరణ్ పడిన కష్టం చూసి ఆశ్చర్యపోయానని, ఆయనో మంచి వ్యక్తి అని ప్రశంసించాడు. తమ మధ్య సినిమాలో మంచి అనుబంధం ఉంటుందని తెలిపాడు.
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. RRతో జరిగిన ఎలిమినేటర్లో SRH 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యఛేదనలో RR బౌలర్లు చెలరేగడంతో సన్రైజర్స్ 196 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్(0), హెడ్(17), ఇషాన్(33) వికెట్లు పడగొట్టి ఆర్చర్.. SRH పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో RR.. ఈ నెల 29న GTతో జరిగే క్వాలిఫయర్-2లో తలపడనుంది.
AP: గోదావరితో పాటు ఇతర నదుల్లో కాలుష్య నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్గా, 6 జిల్లాల కలెక్టర్లు, పలు శాఖల అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. పుష్కరాల లోపు పొల్యూషన్ ఆడిట్ నిర్వహించి, ప్రతి 2 వారాలకోసారి ఈ కమిటీ సమీక్ష జరపనుంది.
చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నాడు. ‘సందిగ్ధం’ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ..ఈ చిత్రానికి అచ్చతెలుగు టైటిల్ పెట్టడం, అడవుల్లో కష్టపడి షూటింగ్ చేయడం అభినందనీయమన్నాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, అందరికీ తెలిసేలా ప్రతి ఒక్కరూ ముందుండి చిన్న చిత్రాలను ప్రమోట్ చేయాలని కోరాడు.
జర్మనీలోని మునిచ్లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో 43 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన ఇషా.. సౌత్ కొరియా షూటర్ కిమ్ యె జి (42) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇషాకు ఇది రెండో ప్రపంచకప్ స్వర్ణం కాగా, ఒలింపియన్ మను భాకర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది.
TG: రాష్ట్రంలో 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, CCLA కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన తహసీల్దార్లు ఎలాంటి ఆలస్యం చేయకుండా, వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాలలో విధుల్లో చేరి ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు.