AKP: కోటవురట్లలో HPV వ్యాక్సిన్ కు 213 మంది అర్హులు ఉన్నట్లు PHC వైద్యాధికారిణి డాక్టర్ ధనలక్ష్మి తెలిపారు. కె.వెంకటాపురం పీహెచ్సీలో 15 ఏళ్లు వయసుగల 20 మంది బాలికలకు గురువారం వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BDK: దమ్మపేట జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన పిల్లల భద్రత – డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవగాహన సదస్సులో గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి సాగుతున్న డ్రగ్స్ నెట్వర్క్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.
SKLM: స్వచ్ఛమైన గ్రామమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. రెంటికోట గ్రామంలో గురువారం స్వచ్ఛతకు కొత్త శకం స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల భాగస్వామ్యమే కీలకమని, ప్రతి ఒక్కరూ తమ గ్రామాలను ఆరోగ్యకరంగా నిర్మించాలని పిలుపునిచ్చారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్ అశోక్ నగర్ వాస్తవ్యులు ఎడమడకల హరికృష్ణ కుటుంబ సభ్యులు రూ.51,116 విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులకు స్వామి చిత్రపటాన్ని అందజేశారు.
SRCL: వేములవాడ పట్టణ పరిధిలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నట్లు చెప్పారు.
MNCL: వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలని గురువారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నస్పూర్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే లక్ష కోట్లు కేటాయిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.
NLR: బుచ్చి, కోవూరు మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలను ఫుడ్ కమిషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు పెట్టే పోషక ఆహారాలను పరిశీలించారు. పాటూరు అంగన్వాడీ కేంద్రంతో పాటు దామర మడుగులోని అంగన్వాడీ కేంద్రం, జడ్పీ హైస్కూల్లో లోపాలను గుర్తించి వారికి షోకాజ్ నోటీసు అందించామని ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి తెలిపారు.
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారత్లో లభించే అన్ని మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెరిగిన ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చుల భారం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
MDK: తూప్రాన్ ఆయుర్వేద ఆసుపత్రిలో సీనియర్ వైద్యాధికారి డాక్టర్ రాణి శర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోగా, మహిళలను సన్మానించారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ భవాని ప్రసాద్, డాక్టర్ బ్లేస్సి, సురేష్ జూనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్టులు వెంకటేశ్వర్ గౌడ్, సౌజన్య, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
BPT: గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఎంతో ప్రభావంతమని డాక్టర్ జయసింహ తెలిపారు. అద్దంకి పట్టణంలోని రెండు అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు మోదేపల్లి PHC సంయుక్తంగా ఇవాళ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాయి. 14 ఏళ్ల కిశోర బాలికలు 250 మందిని గుర్తించి మొదటి రోజు వ్యాక్సిన్ అందజేశారు.
VKB: సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం ఇవ్వాలని అధికారులను దోమ మండల ప్రజలు కోరుతున్నారు. దోమ మండలంలో విద్యా వనరుల కేంద్రం దోమ MRC, MEO కార్యాలయం బోర్డులు మంచిగా ఏర్పాటు చేశారు. కానీ కనిపించని సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టడం మర్చిపోయారు. వెంటనే సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టాలని కోరుతున్నారు.
ADB: నార్నూర్ మండలంలోని మాన్కపూర్ దిశా మోడల్ స్కూల్ను గురువారం ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయుల రికార్డులు, బోధన పద్దతిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పాఠాలు బోధించారు. సీసీ రోడ్డు, RO వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుక నాగోరావ్, సిబ్బంది పాల్గొన్నారు.
JN: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణలో పాలన విధానాల అమలు అంశాలను నేర్చుకుని గ్రామాల అభివృద్ధిలో తోడ్పడాలన్నారు. శిక్షణకు ప్రతీ ఒక్కరు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పాల్గొన్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాల గోడపత్రికలను గురువారం గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాసంస్థల ట్రస్ట్ చైర్మన్ సుంకి రాజేందర్ రెడ్డి, ఆలయ ఈఓ విజయ రాజు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఎమ్మెల్యే సోదరులు పాల్గొన్నారు. స్వామివారి ఉత్సవాలలో భక్తులందరు పాల్గొనాలని కోరారు.
NZB: వర్ని మండలం జలాల్పూర్ శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక మొరం తరలిస్తే వాహనాలతో పాటు యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు.