• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈనెల 16న పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

VZM: ఈనెల 16న తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎం. సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటలో సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్‌తో కలసి ఆహ్వాన ప్రతులను ఇవాళ ఆవిష్కరించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.

March 12, 2026 / 04:52 PM IST

చిరు ‘MSVG’ సూపర్ TRP

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. OTT వేదిక జీ5లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇటీవల జీ తెలుగు ఛానల్‌లో టెలికాస్ట్ అయింది. తాజాగా వెల్లడైన TRP రేటింగ్స్‌లో ఈ సినిమా సత్తా చాటింది. అర్బన్‌లో 12.52 రేటింగ్, అర్బన్ + రూరల్‌‌లో 10.35 రేటింగ్ సాధించింది.

March 12, 2026 / 04:50 PM IST

రజక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: బీసీల అభివృద్ధికి టీడీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. గురువారం గుంటూరు నగరంలోని అరండల్‌పేట 12/2 లైన్‌లో నిర్మించిన మూడు అంతస్తుల రజక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

March 12, 2026 / 04:47 PM IST

మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు: MLA

JN: ప్రస్తుత సమాజాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పాలకుర్తిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు తమ ప్రతిభను మరింతగా వెలుగులోకి తీసుకొని వచ్చి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.

March 12, 2026 / 04:46 PM IST

‘ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక’తో సమగ్ర అభివృద్ధి

KMR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నేడు పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యచరణ ప్రణాళికను అమలు చేశామన్నారు.

March 12, 2026 / 04:46 PM IST

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

BHNG: భువనగిరి మండలం తుక్కాపురంలో పేరబోయిన కొండయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబానికి గురువారం తుక్కాపురం ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్ రూ. 5000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 04:46 PM IST

ఆదోని జిల్లా కోసం 117వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష

KNRL: కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలను కలిపి ఆదోని కేంద్రంగా జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష ఇవాళ 117వ రోజు కొనసాగుతోంది. వందకు పైగా రైళ్లు నడిచే ముఖ్య రైల్వే స్టేషన్ ఉన్న పట్టణంగా ఆదోని పరిపాలన సౌలభ్యానికి అనుకూలమని నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా జీఎస్టీ చెల్లించే పట్టణాల్లో ఆదోని ముందంజలో ఉందని పేర్కొన్నారు.

March 12, 2026 / 04:45 PM IST

‘ప్రజలు ప్రొద్దుటూరుకు రావాల్సిన అవసరం లేదు’

KDP: మైదుకూరులో రేపటి నుంచి ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కార్యాలయంలో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యాలయంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, ప్రజలు ఇకపై ప్రొద్దుటూరుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 12, 2026 / 04:45 PM IST

‘ప్రజలు ప్రొద్దుటూరుకు రావాల్సిన అవసరం లేదు’

KDP: మైదుకూరులో రేపటి నుంచి ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కార్యాలయంలో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యాలయంలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, ప్రజలు ఇకపై ప్రొద్దుటూరుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 12, 2026 / 04:45 PM IST

నిలిచిన రిజిస్ట్రేషన్‌లతో రైతుల ఇబ్బందులు

NLG: చిట్యాల తహశీల్దార్ కార్యాలయంలో గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత తహశీల్దార్ ఏసీబీకి పట్టుబడటంతో, డీటీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆమె ఫీల్డ్ వర్క్, జనగణన శిక్షణలో ఉండటంతో కార్యాలయానికి రావడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక రైతులు రోజుల తరబడి తిరుగుతున్నారు. వరుస సెలవులతో సోమవారం వరకు సేవలు లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 12, 2026 / 04:45 PM IST

నిలిచిన రిజిస్ట్రేషన్‌లతో రైతుల ఇబ్బందులు

NLG: చిట్యాల తహశీల్దార్ కార్యాలయంలో గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత తహశీల్దార్ ఏసీబీకి పట్టుబడటంతో, డీటీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆమె ఫీల్డ్ వర్క్, జనగణన శిక్షణలో ఉండటంతో కార్యాలయానికి రావడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక రైతులు రోజుల తరబడి తిరుగుతున్నారు. వరుస సెలవులతో సోమవారం వరకు సేవలు లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 12, 2026 / 04:45 PM IST

జిల్లాలో మూడు రైళ్లకు కొత్త హల్ట్‌

SKLM: జిల్లాలో ప్రయాణించే 3 రైళ్లకు రైల్వే శాఖ కొత్త హల్ట్‌లను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ హరిశ్చంద్రపురం వద్ద, బెరహంపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ మందస రోడ్ వద్ద, రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ పాతపట్నం వద్ద ఆగనున్నాయన్నారు. ఈహల్ట్‌లతో జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.

March 12, 2026 / 04:45 PM IST

‘ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’

WNP: 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక 10 థీమ్‌ల వారిగా విభజించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట సమయంలో అమలు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకలను అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 12, 2026 / 04:44 PM IST

ఉస్తాద్ భగత్ సింగ్.. సెన్సార్ టాక్ అదిరింది!

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సెన్సార్ టాక్ సాలిడ్‌గా వచ్చినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. అలాగే, సెకండ్ హాఫ్‌లో పవన్ పీక్ పర్ఫార్మెన్స్‌ కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్.

March 12, 2026 / 04:44 PM IST

వేలం నుంచి తప్పుకున్న పాక్ స్టార్ పేసర్

పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘హండ్రెడ్ లీగ్ 2026’ వేలం నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. అఫ్రిదితో పాటు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అల్లా ఘజన్‌ఫర్, పీటర్ సిడిల్ కూడా చివరి నిమిషంలో వేలం నుంచి తప్పుకున్నారు. కాగా, నిన్న జరిగిన మహిళల విభాగం వేలంలో పాక్‌ ప్లేయర్ల అందరూ అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు.

March 12, 2026 / 04:43 PM IST