KDP: తమిళనాడులోని రాణిపేట వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కడప జిల్లా వేపరాల గ్రామానికి చెందిన బడి గింజల నాగేంద్ర, గంజికుంట శేషయ్యలు అరుణాచలం దర్శనానికి బైక్పై వెళ్తుండగా రాణిపేటలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఇద్దరు కిందపడగా మరో కారు వారిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
SRPT: క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ తేజస్ పేర్కొన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో 491 వ్యాధిగ్రస్తులు ఉన్నారని వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. క్షయ వ్యాధి అంతానికి అందరితో కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.
SRPT: వెంకేపల్లి నుంచి కోడూరుకు పాలేరు మీదుగా బ్రిడ్జి నిర్మించి రోడ్డు ఏర్పాటు చేయాలని నూతనకల్ మండలం వెంకేపల్లి శివారులోని వాగును, రోడ్డును పరిశీలించిన అనంతరం అధికారుల సమావేశంలో ప్రతిపాదించారు. ఈ ప్రాంత రైతులు తమ వ్యవసాయ పనుల నిమిత్తం వాగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో వాగు దాటుతుండగా ఒక వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నమయ్య: పేదవారికి సీఎం సహాయనిది ఆపదలో అండగా నిలుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు. సోమవారం రాజంపేటలోని బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో రాజంపేట మండలంలోని తొగురు గ్రామానికి చెందిన గునిశెట్టి రంగయ్యకు సీఎం సహాయనిధి రూ. 49,984 వేల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
GNTR: నియోజకవర్గంలో నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం 21వ డివిజన్ చుట్టుగుంట హీరో షోరూం వద్ద సీసీ డ్రైన్లు, కల్వర్టు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.
SRPT: ఐపీఎల్ క్రికెట్ సీజన్ సందర్భంగా యువత ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడవద్దని క్రమశిక్షణతో మంచిగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ అన్నారు. మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు.
అన్నమయ్య: పీలేరు పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి PL నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం పీలేరు పంచాయతీ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయి అధికారులు నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
PLD: పెదకూరపాడు మండలంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యవసర సరుకులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అని తహసీల్దార్ ధనలక్ష్మి తెలిపారు. మండలంలో ఈ కేవైసీ చేయించుకోని వారి లిస్టు విడుదల చేశారు. తమ సమీపంలోని రేషన్ డీలర్లను సంప్రదించి వీఎస్డబ్ల్యూఎస్ యాప్లో వేలిముద్ర వేసి ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. మార్చి 31 వరకే ఈ అవకాశం ఉందని తెలిపారు.
RR: నిన్న సాయంత్రం భారీ గాలులతో కూడిన వర్షానికి రైతులకి తీవ్ర పంట నష్టం ఏర్పడింది. మడుగుల(M) బ్రాహ్మణపల్లి, నల్లచెరువు, ఇర్విన్, ఆర్కపల్లి, అన్నెబోయినపల్లితో పాటు పలు గ్రామాలలో కురిసిన వర్షానికి అనేక ఎకరాలలో నేలకొరిగిన మొక్కజొన్న, వరి, బొప్పాయి,మామిడి పంటలు నెలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు.
TG: బెట్టింగ్ యాప్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్లో నమోదైన కేసులో పోలీసులు యాప్ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు. జాబితాలో మొత్తం 19 యాప్ల యజమానులుండగా.. వారికి నోటీసులిచ్చి విచారించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు, ఇన్ఫ్లూయెన్సర్లు సహా 25 మందిపై కేసు నమోదు కాగా.. తాజాగా యాప్ల యజమానులపై కేసులు పెట్టారు.
SRCL: ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ప్రేమలతని సోమవారం రోజున కోర్ట్ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలతో పాటుగా ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కరించి నేరస్థులకు శిక్షలు పడే దిశగా కృషి చేయాలని అన్నారు.
CTR: వీ.కోట మండలంలోని నెల్లితిప్ప గ్రామంలో బోరు డ్రిల్లింగ్ పనులను జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సోమవారం ప్రారంభించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి జడ్పీ నిధులతో మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ADB: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు.
CTR: అంతర్జాతీయ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నగర ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ANMలు, CHOలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
PDPL: ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ పాఠశాలలో మేడారం PHC వైద్యాధికారి డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకే విధానం, చికిత్స మార్గాల గురించి వివరించారు. కటికనపల్లిలో MLHP డాక్టర్ గౌతమ్, కిలా వనపర్తిలో డాక్టర్ రాజు, ఇతర సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు వ్యాధిపై అవగాహన కల్పించారు.