• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగానే ఉంది: జై శంకర్‌

ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి సవాళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆహార భద్రత, వాతావరణ ఆందోళనలను ప్రపంచం ఎదుర్కొంటోందని తెలిపారు. రానున్న కాలంలో ఏఐ, అంతరిక్షం, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు.

February 21, 2025 / 11:25 AM IST

‘బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి’

KMR: ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి కోరారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

February 21, 2025 / 11:19 AM IST

‘నీటి వాటాల విషయంలో కాంగ్రెస్‌కు సోయి లేదు’

TG: రాష్ట్రంపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు KCR అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘BRS పాలనలో KCR ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. నీళ్లలో నిప్పు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ మాది. నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు మించి నీళ్లని AP తీసుకెళ్తోంది. ఇప్పుడు సాగు, తాగునీరుకు ఇబ్బంది ఏర్పడింది’ అని చెప్పారు

February 21, 2025 / 11:18 AM IST

మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

ప్రకాశం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కనిగిరి డిపో నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసి బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ నయాన తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలోని శైవక్షేత్రాలైన పునుగోడు, చంద్రశేఖరపురంలోని మిట్టపాలెం నారాయణస్వామి, భైరవకోన క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. 26న శివరాత్రి రోజున ప్రతి 15 నిమిషాలకు బస్సు అందుబాటులో ఉంటుందన్నారు.

February 21, 2025 / 10:54 AM IST

ప్రతి అర్జీని పరిష్కరించేలా కృషి చేస్తా: ఎమ్మెల్యే

ELR: ప్రతి అర్జీని పరిష్కరించేలా కృషి చేస్తానని అన్ని విధాల నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు.

February 21, 2025 / 10:27 AM IST

గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమం

ELR: ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

February 21, 2025 / 10:10 AM IST

జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

NRML: పట్టణంలోని బంగాల్‌పేట్ కాలనీలో శుక్రవారం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థులైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య, పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

February 21, 2025 / 10:07 AM IST

‘దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

కడప: సిద్దవటం మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా జనసేన నేత అతికారి కృష్ణ అన్నారు. మాధవరం-1 గ్రామంలోని TDP మైనార్టీ నాయకుడు వీరభద్రయ్య ఇంట్లో పట్టపగలే చోరీ జరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి వీరభద్రయ్యకు మనోధైర్యాన్ని నింపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిఘా ఉంచాలని సూచించారు.

February 21, 2025 / 09:49 AM IST

కారు ఢీకొనడంతో మహిళ మృతి

KMR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డిలో జరిగింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. శాబ్దిపూర్ గ్రామానికి చెందిన యశోద కామారెడ్డిలోని ఓ గోదాం పక్కన నిలబడి ఉంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు.

February 21, 2025 / 09:22 AM IST

నేటి నుంచి శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

AP: ఇవాళ్టి నుంచి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. స్వామివారి ప్రథమ భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహోత్సవాలు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆర్జిత అభిషేక సేవలు, అంతరాలయం దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

February 21, 2025 / 08:28 AM IST

నేడు మెదక్‌లో కిషన్ రెడ్డి పర్యటన

TG: నేడు మెదక్ జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. బీజేపీ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

February 21, 2025 / 08:25 AM IST

మంచి నీటి సమస్యపై తండాలో గ్రామస్తుల ఆందోళన

SRD: తమ గ్రామంలో మంచినీటి ఎద్దడి నెలకొందని, మిషన్ భగీరథ నీరు రావడంలేదని సిర్గాపూర్ మండలం సుర్త్యాతాండ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయని శంకర్, భీమ్ రావు, తదితరులు ఆవేదనతో తెలిపారు. గత వారం రోజుల నుండి నిల్వ ఉన్న ఉంచిన నీటిని సేవిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య తీర్చాలని కోరారు.

February 21, 2025 / 08:17 AM IST

నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం

SRD: డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు నిర్వహిస్తున్న డీఎం మల్లేశయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు 90634 17161 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 21, 2025 / 08:07 AM IST

పురాతన తిమ్ములమ్మ దేవాలయం గుర్తింపు

కడప: మైదుకూరు పరిధిలోని మావిళ్ళపల్లెకు ఉత్తర దిక్కులో తిమ్ములమ్మ దేవాలయాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ మీడియాకు తెలిపారు. ఈ దేవాలయ పరిసర ప్రాంతాలలో పురాతన కాలంలో పిచ్చిపాడు అనే గ్రామం ఉండేది. కాలక్రమేణా అంతరించిపోయిందన్నారు. ఆలయ ఛాయాచిత్రాలను ప్రముఖ స్థపతి, వాస్తు శిల్ప కళా వాచస్పతి శివ నాగిరెడ్డికి పంపగా 2వశాతాబ్దా చెందినదని తెలిపారు.

February 21, 2025 / 08:04 AM IST

రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా మల్లయ్య యాదవ్

ATP: గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు మల్లయ్య యాదవ్‌ను ఏపీ రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా ఎంపిక చేసినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఈ పదవి కేటాయించిన ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డికి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2025 / 08:03 AM IST