దర్శకుడు సాయి రాజేశ్ ‘బేబీ’ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోగా బాబిల్ ఖాన్ ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్లు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. దీనిపై సాయి రాజేశ్ స్పందించాడు. తాను కలిసిన ప్రతిభావంతులైన, బాగా కష్టపడే నటుల్లో బాబిల్ ఖాన్ ఒకరని తెలిపాడు. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నాడు.
తమిళ హీరోయిన్ మిర్నా మీనన్ ‘డాన్ బాస్కో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రుష్య హీరోగా పి.శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మిర్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీ స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ నేపథ్యంలో సాగుతుందని తెలిపింది. భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
సవాలుగా మారిన వరుస హత్యల కేసును ACP అరవింద్(నవీన్ చంద్ర) ఎలా సాల్వ్ చేశాడనేది ‘లెవెన్’ కథ. హత్యల వెనుక ఎవరున్నారనేది ఉత్కంఠభరితంగా ఉంటుంది. అనూహ్యమైన ట్విస్టులతో సాగుతుంది. నవీన్ చంద్ర నటన, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మూవీకి ప్లస్. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలు మైనస్. రేటింగ్:2.75/5.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదాలు పడింది. అయితే ఇటీవల పవన్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 12న ఈ మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 19న అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. ఈ సినిమాకు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
ఎన్నో సూపర్డూపర్ హిట్లు కొట్టి, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరావు నటవారసత్వాన్ని అత్యంత విజయవంతంగా నిలబట్టిన ఘనత యువసమ్రాట్ నాగార్జునకి ముమ్మాటికి దక్కుతుంది. కెరీర్ బిగినింగ్లో కొన్ని వైఫల్యాలను చవిచూసినా సరే. నిలకడగా కెరీర్ని విజయపథంలోకి నడిపించుకున్ని పత్యేకతకి నాగార్జున ఎప్పటికీ చెరగని సంతకం. మణిరత్నం అంటే ఏంటో కూడా తెలుగు చిత్రపరిశ్రమకి పూర్తిగా తెలియని రోజుల్లోనే, ఏటికి ఎదురీదినట్టుగ...
తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్పై హీరో నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్కు మద్దతుగా ఎర్డోగాన్ మాట్లాడటం పట్ల నిఖిల్ అసహనం వ్యక్తం చేశాడు. మనకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం మనం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిఖిల్ పేర్కొన్నాడు.
తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ను త్వరలోనే తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బన్నీని ఇటీవల ఆమిర్ కలిశాడట. ఇక మొత్తం 5 భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగాన్ని సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన హిట్ మూవీ ‘భద్ర’ విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమాకు మొదటి ఛాయిస్ రవితేజ కాదట. బోయపాటి శ్రీను ఈ కథను మొదటగా ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూ. ఎన్టీఆర్కు వినిపించారట. పలు కారణాలతో వారిద్దరూ దీన్ని మిస్ చేసుకున్నారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బన్నీ, తారక్లు చెప్పారు.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, కార్తీక్ రాజు కాంబోలో ‘#సింగిల్’ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.16.30కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్ సమంత నిర్మించిన చిత్రం ‘శుభం’. ఒక హారర్ కామెడీ సినిమాకి ఏమేం అవసరమో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ చిత్రం కొత్త నేపథ్యంతో పాటు.. ట్విస్టులు ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. అయితే పాత్రల పరిచయ సన్నివేశాలు నత్తనడకగా సాగుతాయి. ఫస్టాఫ్ ఆసక్తిగా ఉన్నా.. ద్వితీయార్ధంలో ఒకే అంశం చుట్టూ కథ తిరగడంతో బోర్గా ఫీలవుతారు. ఇంటిల్లిపాదీ కలిసి ఈ సినిమాను చూడవచ్చు. రేటింగ్ 2.75/5
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘#సింగిల్’ మూవీ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 2:05 నిమిషాల నిడివితో ఇది థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. ఇక కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా కీలక పాత్రలు పోషించారు.
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విష్ణుప్రసాద్ కన్నుమూశాడు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ట్రీట్మెంట్కు భారీగా ఖర్చు అవగా.. కుటుంబసభ్యులు ఇటీవల ఫండ్ రైజింగ్ చేపట్టారు. అంతలోనే ఈ విషాదం జరిగింది. కాగా, విష్ణు.. మలయాళం, తమిళంలో పలు సినిమాలు చేశాడు.
‘రౌడీ బాయ్స్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్.. దర్శకుడు ఆదిత్యరావు గంగసానితో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రం టైటిల్ వచ్చేసింది. దీనికి ‘దేత్తడి’ పేరు పెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనుంది.
టాలీవుడ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్హుడ్’ మూవీ మార్చిలో రిలీజై పరాజయం పొందింది. తాజాగా ఈ సినిమా OTTపై నయా అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్ను ‘జీ5’ సొంతం చేసుకోగా.. ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలో ఒకే రోజు టీవీతో పాటు OTTలో ఇది రిలీజ్ కానున్నట్లు సమాచారం.
2023 సంవత్సరానికి గానూ ‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ విజేతల జాబితా విడుదలైంది. ఇందులో భాగంగా నటుడు అజిత్కు ‘తునివు’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. అలాగే, నటి త్రిష ‘లియో’ సినిమాలోని నటనకు ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. దీంతో అజిత్, త్రిషకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.