ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, దామోదర్ ప్రసాద్, ట్రెజరర్గా ముత్యాల రాందాస్, జనరల్ సెక్రటరీగా అశోక్ కుమార్ విజయం సాధించారు. ప్రొగ్రెసివ్ ప్యానెల్ సహకారంలో సురేష్ బాబు గెలుపొందారు. ఏడాది పాటు అధ్యక్షుడిగా సురేష్ బాబు కొనసాగనున్నారు.
ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ హవా కొనసాగుతోంది. మొత్తం 44 స్థానాలకు గాను ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాల్లో, మన ప్యానెల్ 15 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్: మన – 7, ప్రోగ్రెసివ్ – 5ఎగ్జిబిటర్స్ : ప్రోగ్రెసివ్ – 14, మన – 2స్టూడియో : మన – 3, ప్రోగ్రెసివ్ – 1డిస్ట్రిబ్యూషన్ : ప్రోగ్రెసివ్ – 8, మన – 3
మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘వృషభ’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రూ.70కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. DEC 25న రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.1.11కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహించాడు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్తో ప్రేమకథా సినిమాను తెరకెక్కించాలనేది తన డ్రీమ్ అని దర్శకురాలు సుధా కొంగర చెప్పింది. తనకు లవ్స్టోరీలంటే ఇష్టమని, పూర్తిస్థాయి ప్రేమకథను తెరకెక్కించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికే తన దగ్గర కథ ఉందని, దాన్ని డెవలప్ చేయాలని పేర్కొంది. అంతేకాదు అలసిపోయానని, అందుకే త్వరగానే రిటైర్ కావాలనుకుంటున్నానని తెలిపింది.
తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు H. వినోద్ తెరకెక్కించిన సినిమా ‘జన నాయగన్’. ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు వినోద్ స్పందించాడు. అందులో నిజం లేదని, ఇది విజయ్ ఒరిజినల్ సినిమా అని చెప్పాడు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్లకు చెందిన వారు ఓటింగ్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి సహా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడు బరిలో ఉండటం విశేషం. కాగా సా.4 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుండగా.. సా. 6 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.8.89 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం తెరకెక్కించగా.. అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది.
1. మహిళల డ్రెస్సింగ్ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మీకు తెలియదా?2. మీరు చేసిన కామెంట్స్ మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయని మహిళా కమిషన్ భావిస్తుంది. దీనికి మీరేమంటారు?* తాను మాట్లాడిన రెండు అసభ్యపదాలకు సారీ చెబుతున్నానని చెప్పిన శివాజీ.. మిగతా స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారని సమాచారం.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘జన నాయగన్’ మూవీ తన చివరి చిత్రమని వెల్లడించారు. మలేషియాలో జరిగిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ.. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పారు. ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారికోసం మరో 30 ఏళ్లు నిలబడతానని అన్నారు.
‘మార్క్’ సినిమా ప్రచారంలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ కీలక వవ్యాఖ్యలు చేశాడు. కన్నడ యాక్టర్స్ ఇతర భాషా సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తారన్నాడు. కానీ ఇతర ఇండస్ట్రీ నటులు మాత్రం కన్నడ సినిమాల్లో అలాంటి పత్రాలు చేయడానికి ఆసక్తి చూపారని తెలిపాడు. తాను వ్యక్తిగతంగా కొందరిని అడిగానని, వాళ్ళు నటించడం లేదన్నాడు. శివరాజ్ కుమార్ లాంటి సీనియర్ నటుడు రజినీ ‘జైలర్’లో నటించారని గుర్తుచేశాడు
తల్లి అయ్యాక తన శరీరాన్ని, అందాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయిందని నటి కియారా అద్వానీ చెప్పింది. ‘వార్ 2లో బికినీ షాట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ డెలివరీ అయ్యాక నా శరీరంలో తేడా కనిపించింది. గతంలో ఉన్నట్లు ఉండగలనా అనిపించింది. కానీ అందం, శరీరం ముఖ్యం కాదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నా, నన్ను నేను గౌరవించుకుంటా. నాకు మాతృత్వం నేర్పిన పాఠాలివి’ అని పేర్కొంది.
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో అఖిల్ రాజ్. తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటించనున్నాడట. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా చేయనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే షూట్ స్టార్ట్ అయి.. 2026 వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో యుగంధర్ ముని తెరకెక్కించిన ‘శంబాల’ మూవీ మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమాను హిందీ ప్రేక్షకులకు చూపించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న బాలీవుడ్లో గ్రాండ్గా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు హిందీ వెర్షన్ సెన్సార్ పనులు దాదాపు పూర్తయినట్లు సమాచారం.