బాలీవుడ్ ప్రముఖ నటుడు విద్యుత్ జామ్వాల్ చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు. నగ్నంగా చెట్టు ఎక్కిన అతను ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. యుద్ధ విద్య ‘కలరిపయట్టు’ సాధకుడిగా తాను ఏడాదికోసారి ‘సహజ’ అనే యోగా ప్రక్రియను ఆచరిస్తానని తెలిపాడు. ఇది ప్రకృతితో మమేకమయ్యేలా చేస్తోందని పేర్కొన్నాడు. అయితే అడవిలో టార్జాన్ ఆకులైనా చుట్టుకుంటాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
డెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, JAN 23న కోర్టులో వారు హాజరుకావాలని వార్తలొస్తున్నాయి. ఆ వార్తలపై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించాడు. ‘ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వ్యక్తిగత హాజరు అవసరం లేదని ఇప్పటికే కోర్టు తెలిపింది. ఇలాంటి బాధ్యతారహితంగా వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించాడు.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒకరాజు’ జనవరి 14న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. GSTతో కలిపి టికెట్పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.75 పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త పాయింట్ చెప్పినప్పుడు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడానికి సమయం పడుతుందని దర్శకుడు మారుతి చెప్పాడు. ‘రాజాసాబ్’ సక్సెస్ మీట్లో ఆయన.. రెబల్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూసి డిజప్పాయింట్ కాలేదు.. అలాగని పూర్తిగా సాటిస్ఫై కాలేదన్నాడు. చివరి 40 నిమిషాలు అందరికీ నచ్చిందని తెలిపాడు. ఒక్క షో, ఒక్కరోజులోనే ఫలితం డిసైడ్ చేయకూడదని, 10రోజులు ఆగితే ఈ సినిమా ఏంటో తెలుస్తుందన్నాడు.
‘రాజాసాబ్’ సక్సెస్ మీట్లో దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. కొత్తగా 8 నిమిషాల సన్నివేశాలను ఈ మూవీలో యాడ్ చేస్తున్నామని తెలిపాడు. ఇవాళ సాయంత్రం 6 గంటల షోలలో ఈ సీన్స్ వస్తాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ అందులో ఉంటుందన్నాడు.
తమిళ స్టార్ విజయ్ దళపతి ‘జన నాయగన్’ మూవీ వాయిదాపై హీరో శివకార్తికేయన్ స్పందించాడు. విజయ్ సినిమా వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదని తెలిపాడు. ఒక పెద్ద సినిమా వాయిదా పడటం అనేది ట్రేడ్ పరంగా ప్రభావం పడుతుందని, సరైన సమయంలో రావడం మూవీ విజయానికి ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అలాగే సినిమా విడుదల విషయంలో తాను ఎవరితోనూ పోటీపడాలని అనుకోవట్లేదని చెప్పాడు.
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా శేరు గుడ్ న్యూస్ చెప్పింది. తాను మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. చాలా ఏళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె.. తన భర్త వరుణ్కు జోడీగా నటించబోతుంది. ఈ జంట ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రానికి కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజాసాబ్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.112 కోట్లు వచ్చాయని ప్రకటించారు. కొన్ని మిశ్రమ కామెంట్స్ వచ్చినప్పటికీ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టిందన్నాడు.
నటి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో ‘ఓ సుకుమారి’ మూవీ తెరకెక్కుతోంది. ఇవాళ ఐశ్వర్య బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేశారు. ఇక గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో త్వరలోనే విడుదల కానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, అల్లు అరవింద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. SM వేదికగా తన తండ్రితో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకుంటూ.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నా జీవితంలో దేవుడికి అత్యంత దగ్గరైన రూపం మీరు. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన బన్నీ ఫ్యాన్స్ ఆయనకు విషెస్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
నటీనటులు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’. ఈ సినిమా OTTలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్లో జనవరి 14న పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. దర్శకుడు మురళీ కాంత్ తెరకెక్కించిన ఈ సినిమా 2025 DECలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీ ‘నారీనారీ నడుమ మురారి’. ఈ సినిమా JAN 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 11 ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆత్రేయపురం హై స్కూల్ గ్రౌండ్లో ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 12:34 గంటలకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై నిన్ననే హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు అక్షింతలు వేసి 24 గంటలు కూడా గడవకముందే, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమ ఆదేశాలను కాదని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.