రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ ‘రౌడీ జనార్ధన’. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘కూలీ’లో మెరిసిన పూజ, విజయ్తో కలిసి డ్యాన్స్ చేయనుండటం ఆసక్తిగా మారింది. ఇక ఈ మూవీ ఫ్లాష్బ్యాక్లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపిస్తాడని, మూవీ మొత్తానికి ఈ యాక్షన్ సీన్లే ప్రధాన హైలైట్గా నిలుస్తాయని టాక్.
హైదరాబాద్ తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ డ్రగ్ పార్టీ కలకలం రేపింది. పోలీసులు జరిపిన దాడిలో బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్ సహా పలువురు పట్టుబడ్డారు. పరీక్షల్లో అబ్దుల్, మరో ఐదుగురు కొకైన్, గంజాయి వాడినట్లు తేలింది. సుమారు 300 మంది పాల్గొన్న ఈ పార్టీపై నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా మూలాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్లో, చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ మూవీ 2026, జూన్ 26న విడుదల కానుంది. ప్రస్తుతం అఖిల్ తన పాత్ర కోసం చిత్తూరు యాసలో డబ్బింగ్ చెబుతున్నాడు. ఇంకా ఘాట్ సీన్లు బ్యాలెన్స్ ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను టీమ్ వేగవంతం చేస్తోంది. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొత్త ప్రయత్నాలు చేయకపోతే.. కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించింది. తన సినిమాని ఏ భాషలో చూసినా ప్రేక్షకులు ఆ భావోద్వేగాల్ని ఆస్వాదించాలన్నదే తన తపన అని పేర్కొంది. అది దృష్టిలో పెట్టుకునే కథల్ని ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పింది. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో నటించడాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఏప్రిల్ 10న విడుదల కానున్న నేపథ్యంలో AI టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘AI వల్ల వస్తున్న మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు వాస్తవికతను దెబ్బతీస్తున్నాయి. మనుషుల కంటే చాట్బాట్లను ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టాం’ అని చెప్పాడు. ఈ అంశాల చుట్టూనే తన కొత్త సినిమా కథ తిరుగుతుందని తెలిపాడు.
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫ్లైట్లో ప్రయాణించిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఈ సందర్భంగా శ్రీను స్పందిస్తూ.. ‘చిన్నప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంటే అందులో చిరంజీవి గారు ఉన్నారని అరిచేవాళ్లం, ఇప్పుడు ఆయనతోనే కలిసి ప్రయాణించడం కలగా ఉంది’ అని ఎమోషనల్ అయ్యాడు. కాగా, శ్రీను నటించిన తాజా చిత్రం ‘రాకాస’ ఏప్రిల్ 3న విడుదలైంది.
శర్వానంద్ నటించిన ‘బైకర్’ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలోని తండ్రి–కొడుకుల (రాజశేఖర్, శర్వానంద్) ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. ఇలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్ను ఎంచుకున్నందుకు దర్శకుడు అభిలాష్ కృష్ణను అభినందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తోంది.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డిల నిశ్చితార్థం హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఘనంగా జరిగింది. వధువు కావ్య రెడ్డి హైదరాబాద్కు చెందిన లాయర్ కుమార్తె కాగా, వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనెల 29న తిరుపతిలో సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.
అనిల్ రావిపూడి హీరోగా సినిమా నిర్మించేందుకు తాను సిద్ధమని నిర్మాత దిల్ రాజు అన్నాడు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై అదే వేదికపై స్పందించిన అనిల్.. దిల్ రాజు ఆఫర్ బాగుందని, అయితే కోలీవుడ్ నటుడు ప్రదీప్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా తాను ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని సరదాగా బదులిచ్చాడు.
హీరోయిన్ జాన్వీ కపూర్ తరచూ తిరుమల శ్రీవారిని కాలినడకన మెట్లెక్కి దర్శించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, సామాన్య భక్తురాలిలా దేవుడిని దర్శించుకోవడమే తనకు ఇష్టమని పేర్కొంది. కాలినడకన వెళ్లి దర్శించుకోవడం వల్ల కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి చేరువైనట్లు అనిపిస్తుందని తెలిపింది. స్వామివారి దర్శనం చేసుకోవడం ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పింది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ‘ది వైట్ లోటస్’ సీజన్ 3లో షారుఖ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, బాలీవుడ్లో షారుఖ్ ఇప్పటికే భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీంతో ఇవన్నీ కేవలం తప్పుడు ప్రచారాలే అంటూ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా గురించి గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోందని తెలిపాడు. తాను ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేశానని చెప్పాడు. ప్రభాస్ క్యారెక్టర్ ‘మాస్’గా ఉంటుందని, పాటలు చాలా ‘క్లాస్’గా ఉంటాయని పేర్కొన్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమా నైజాం పంపిణీ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
హీరోయిన్ జాన్వీకపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. 15 ఏళ్ల వయసులో అశ్లీల వెబ్సైట్లో తన మార్ఫింగ్ ఫొటోలు చూసి షాక్కు గురైనట్లు తెలిపింది. ‘అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నా. మాకు ఐటీ క్లాస్ జరిగినప్పుడు తోటి విద్యార్థులు అలాంటి సైట్స్ ఓపెన్ చేస్తుండేవారు. అలా ఓసారి ఆ వెబ్సైట్లో నా ఫొటోలు చూసి చెప్పారు. ఆక్షణం నేనెంతో బాధపడ్డా’ అని పేర్కొంది.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ‘యుగానికి ఒక్కడు’. ఇందులో ఆండ్రియా, రీమాసేన్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ప్రచారంపై ఆండ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెల్వరాఘవన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఏదీ జరగదని.. ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమంటూ పేర్కొంది. మళ్లీ ఆయనతో సినిమా చేయడం తన వల్ల కాదని చెప్పుకొచ్చింది.