మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు క్లబ్లో చేరగా.. తాజాగా 200 కోట్ల క్లబ్లో చేరింది.
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీ కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు క్లబ్లో చేరగా.. తాజాగా 200 కోట్ల క్లబ్లో చేరింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీలోని చికిరి చికిరి పాట రిలీజ్ కాగా మిలియన్ల వ్యూస్తో అదరగొడుతోంది. తాజాగా ఈ పాట ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమాని ఒకరు రాసిన లేఖ SMలో వైరలవుతోంది. ‘ఓయ్ ప్రసాదు.. ఇదిగో నిన్నే’.. నిన్నేనయ్యా ప్రసాదు.. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా?..ఏడు పదుల వయసులో జనాలు ఆసుపత్రుల చుట్టూ తిరిగితే.. హుక్కు స్టెప్పు అంటూ డ్యాన్సులు వేసి ఎవరిని రెచ్చగొడదామని నీ ప్లాన్’ అంటూ రాసుకొచ్చ...
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ’45’. 2025లో రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5 వేదికగా జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ జన్య తెరకెక్కించాడు.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒకరాజు’. జనవరి 14న రిలీజైన ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా-158’ సినిమా రాబోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం బెంగాల్ బ్యాక్డ్రాప్ కథను బాబీ రెడీ చేశాడట. ఇందులో చిరు బెంగాల్ మాఫియా డాన్గా చాలా పవర్ఫుల్ కనిపిస్తారట. ఆయన లుక్ కూడా కొత్తగా ఉంటుందని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. జనవరి 9న రిలీజైన ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. GSTతో కలిపి మొత్తం రూ.130కోట్లు(GST లేకుండా రూ.120కోట్లు) షేర్ కలెక్షన్స్ సాధించినట్లు పేర్కొన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటోంది. జనవరి 12న రిలీజైన ఈ సినిమా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.190 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. దీనికి ‘స్లమ్డాగ్’ అనే పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. దీనికి ’33 టెంపుల్ రోడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. దీనికి ‘స్లమ్డాగ్’ అనే పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. దీనికి ’33 టెంపుల్ రోడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 ఏప్రిల్లో దీన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయింది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా కీలక పాత్రలు పోషించగా...
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ‘తు మేరీ మెయిన్ తేరా మేన్ తేరా తు మేరీ’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు నష్టాలు చవి చూశారు. ఈ నేపథ్యంలో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుంచి కార్తీక్ రూ.15 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం అతను దాదాపు రూ.50కోట్లు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.
జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ భాగమైనట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ అనిల్ కపూర్ పోస్ట్ పెట్టాడు. ఈ మూవీలో తాను నటిస్తున్నట్లు వెల్లడించారు. NTRతో రెండోసారి నటిస్తున్నానని చెప్పాడు. కాగా, ‘వార్ 2’లో వీరిద్దరూ నటించారు.
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న సినిమా ‘ఏక్ దిన్’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా పోస్టర్పై విమర్శలు వస్తున్నాయి. 2016లో వచ్చిన థాయ్ మూవీ ‘వన్ డే’ను పోలి ఉందని.. మూవీని కాపీ చేశారని పలువురు విమర్శలు చేస్తున్నారు. పేరు దగ్గర నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.