మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.226 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ తనను ఎనిమిదేళ్లుగా పక్కన పెట్టిందని, దీనికి మతపరమైన అంశాలు కూడా ఒక కారణమంటూ AR రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవని ప్రముఖ రచయిత్రి శోభా డే అభిప్రాయపడ్డారు. మరోవైపు, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాలీవుడ్లో ప్రతిభకు తప్ప మతానికి తావు లేదని ఆయన పేర్కొన్నారు.
‘కాంతార’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. తన బెస్ట్ ఫ్రెండ్ సిద్ధాంత్తో రుక్మిణి డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అతను పాపులర్ ఫొటోగ్రాఫర్ అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వారిద్దరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
‘యుఫోరియా’ ప్రమోషన్స్లో భూమికపై దర్శకుడు గుణశేఖర్ ప్రశంసలు కురిపించాడు. కొందరు హీరోయిన్స్ కేవలం గ్లామర్ పాత్రలే చేస్తామని, 50 ఏళ్లు వచ్చినా 5,6 ఏళ్ల పిల్లలకు మాత్రమే తల్లిగా చేస్తామని రూల్స్ పెడతారని, కానీ భూమిక అలా చేయలేదన్నాడు. ఈ మూవీలో 17ఏళ్ల అబ్బాయికి తల్లిగా చేసిందని, మూవీ విడుదలయ్యాక ఆమె కచ్చితంగా ప్రశంసలు అందుకుంటుందని తెలిపాడు. హ్యాట్సాఫ్ భూమిక అని కొనియాడాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమ తనను కావాలనే పక్కన పెట్టిందని ఆయన ఆరోపించాడు. బాలీవుడ్లో క్రియేటివిటీ తక్కువని అందుకే తనను దూరం పెట్టారని వ్యాఖ్యానించాడు. అలాగే, మతపరమైన అంశాలు కూడా ఒక కారణం కావొచ్చని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ 2026లో రాబోయే తెలుగు సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’, ‘ఆకాశంలో ఒక తార’, ‘ఫంకీ’, ‘రాకాస’, ‘ఛాంపియన్’, ‘418’, ‘బైకర్’, ‘ఆదర్శ కుటుంబం’, విజయ్ దేవరకొండ.. రాహుల్ సాంకృత్యాయన్ కాంబో మూవీ...
‘యుఫోరియా’ ప్రతి కుటుంబంలో ఒకరికి కనెక్ట్ అవుతుందని దర్శకుడు గుణశేఖర్ అన్నాడు. అంతేకాదు సారా అర్జున్పై ప్రశంసలు కురిపించాడు. ‘కథ వింటున్నప్పుడే సారా అయితే బాగుంటుందని నిర్మాత చెప్పింది. ఆమె నటిస్తేనే ఈ మూవీ తీయాలనుకున్నాం. లేదంటే ఆపేద్దాం అని ఆమెతో చెప్పా. ఈ మూవీ చూశాక మీకే అర్థమవుతుంది. అంత గొప్పగా నటించింది. చిన్నమ్మాయే అయిన ఉన్నతంగా ఆలోచిస్తుంది’ అని తెలిపాడు.
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న సారా అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని తెలిపింది. దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒకరాజు’. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. మూడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.61.1 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ‘VT-15’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 19న టైటిల్ గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ పోస్టర్ పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ భారీ విజయం అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షోలో అత్యంత వేగంగా 25 లక్షల టికెట్స్ అమ్ముడైన ఈ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.226కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
‘పరాశక్తి’ మూవీలో కామెడీ ఎలిమెంట్స్ లేవని, అందుకే హిట్ కాలేదని వస్తోన్న కామెంట్స్పై హీరో శివకార్తికేయన్ స్పందించాడు. కామెడీ మూవీలు ఎందుకు తీయడం లేదని ప్రేక్షకులు అడుగుతున్నారని చెప్పాడు. కానీ తన దగ్గరకు దర్శకులు అలాంటి స్క్రిప్ట్లు తీసుకురావడం లేదన్నాడు. ప్రస్తుతం పూర్తిస్థాయి కామెడీ మూవీ కథ కోసం ఎదురుచూస్తున్నానని, త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తానని చెప్పాడు.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు విజయ్ కార్తికేయ కాంబోలో ‘మార్క్’ సినిమా తెరకెక్కింది. 2025 డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్స్టార్లో జనవరి 23 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
సినీ చరిత్రలో తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శారదకు అరుదైన గౌరవం లభించింది. మలయాళ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగానూ అత్యున్నత సినీ పురస్కారం JC డేనియల్ అవార్డును కేరళ ప్రభుత్వం ప్రకటించింది. JAN 25న జరగనున్న కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె దీన్ని అందుకోనుంది. ఇక ఈ అవార్డు కింద శారదకు రూ.5 లక్షల నగదు, ప్రశంస పత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు.