బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం అఖండ 2 వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ వెల్లడించింది. కొన్ని గంటల ముందే గురువారం రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్స్ను చిత్ర బృందం రద్దు చేసినట్లు ప్రకటించింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
‘అఖండ-2’ ప్రీమియర్ షోలు రద్దు కాగా, రేపు సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ కాకపోవడం గమనార్హం. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం.. చిత్ర నిర్మాణ సంస్థ రూ.40 కోట్లు ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి ఉందని.. అందుకే ప్రీమియర్స్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు కూడా సినిమా విడుదలవడం కష్టమేనని టాక్.
సాంకేతిక సమస్యల కారణంగా దేశంలో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రదయ్యాయి. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్.. బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్పింది. ‘మేము చాలా ప్రయత్నించాం. కానీ, కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. ప్రేక్షకుల అసౌకర్యానికి క్షమించండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఓవర్సీస్లో మాత్రం ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయని పేర్కొంది.
బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ 2’. ఈ చిత్రం రేపు విడుదల కానుండగా, ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అనుమతినిచ్చాయి. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
తెలంగాణలో ‘అఖండ 2’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన ధరల ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం ‘మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్’కు వెళ్లనుంది. ఈ మేరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను తెరిచింది. ఈ మొత్తాన్ని సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.
బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ రేపు విడుదల కానుంది. తాజాగా తెలంగాణలోనూ ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి లభించింది. GSTతో కలిపి సింగిల్ స్క్రీన్లో రూ.50, మల్టీప్లెక్స్లో రూ.100 పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ రాత్రి 8 గంటల షో(రూ.600 టికెట్)కు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ధరలు 3రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి.
ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత శ్రీ శరవణన్ కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య.. శరవణన్ భౌతికకాయానికి నివాళులర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టారు. సూర్యతో పాటు ఆయన తండ్రి శివకుమార్, తమిళనాడు CM స్టాలిన్, రజినీకాంత్, విశాల్ తదితరులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.
దర్శకుడు అశ్విన్ గంగరాజుతో రిషబ్ శెట్టి మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన ‘ఆనంద్మఠ్’ నవల ఆధారంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘1763-1800 మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు చేసిన సాయుధ పోరాటం, తిరుగుబాటు నేపథ్యంలో ఈ మూవీ రాబోతుంది. దీనికి ‘1770’ టైటిల్ ఫిక్స్ చేశారు’ అని సినీవర...
ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత శ్రీ శరవణన్ మృతిపై AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘శరవణన్ మరణవార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన వైవిధ్యమైన కథలను, కుటుంబసమేతంగా చూసే విలువలతో కూడిన మూవీలను నిర్మించారు. సినీపరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన AVMను సమర్థవంతంగా నడిపారు’ అని తెలిపారు.
‘అఖండ 2’ మూవీ ప్రమోషన్స్లో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస సినిమాలతో విజయం సాధించానని, ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరే మరో మూవీ అని అన్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ చదివి ఒకేరోజులోనే ఓకే చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు తాను ఒక పాత్రలోకి పూర్తిగా ప్రవేశిస్తే పూనకాలే అని, ఆ పాత్రలో లీనమైపోతానని చెప్పారు. ఇక ఈ సినిమా రేపు విడుదల కానుంది.
సమంతతో పెళ్లి నేపథ్యంలో దర్శకుడు రాజ్ మాజీ భార్య శ్యామాలి మరో పోస్టు పెట్టింది. తాను ఎవరి సానుభూతి కోసం ఎదురుచూడటం లేదని తెలిపింది. ‘ప్రస్తుతం ఏ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేను. నా గురువు ఆరోగ్యం బాగాలేదు. ఆయనకోసం ప్రార్థిస్తున్నా. నా నుంచి బ్రేక్ న్యూస్లు ఆశించకండి. మీడియా నాపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా’ అని పేర్కొంది.
బాలకృష్ణ ‘అఖండ 2’ మూవీకి విడుదలకు ముందే బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ విడుదల ఆపాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ.. ‘అఖండ 2’ విడుదలను ఆపాలని హైకోర్టును ఆశ్రయించింది. ఆ మూవీ నిర్మాణ సంస్థ 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ తమకు రూ.28 కోట్ల నష్టాలను చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని చెల్లించేంతవరకు మూవీ విడుదలను నిలిపివేయాలని కోరింది.
ప్రముఖ హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు జేనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన సినిమా ‘డ్రైవ్’. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ టీజర్ ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. ఇక భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
తన డ్రీమ్ ప్రాజెక్టు ‘వెల్పరి’పై దర్శకుడు శంకర్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఆయన.. ప్రభాస్, మహేష్ బాబులను సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అవతార్ లెవల్ టెక్నాలజీ, భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ మూవీకి వారిద్దరిలో ఒకరిని తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాడట. ఇక ఈ సినిమా 2026 జూన్ నాటికి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రష్మిక స్పందించింది. ‘ఈ వార్తలను నేన్ను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని ఖండించలేను. పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను. తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను’ అని తెలిపింది.