హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ మాజీ భార్య శ్యామాలి పెట్టిన పోస్ట్ SMలో వైరల్ అవుతోంది. ‘ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం’ అని అర్థం వచ్చేలా ఓ ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. అంతేకాదు సామ్, రాజ్ పెళ్లి రోజున ఆమె.. ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’ అని పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మ...
తెలుగు సినిమా కథలను జపాన్తో లింక్ చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల రిలీజైన ‘OG’, ‘పుష్ప 2’ సినిమాల్లో జపాన్కు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. అంతేకాదు జపాన్లో తెలుగు సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో జపాన్ టాలీవుడ్కు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్గా మారిపోయిందని సినీవర్గాలు తెలిపాయి.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. కొన్ని రోజుల నుంచి ఈ మూవీలో ఆరుగురు హీరోయిన్లు అంటూ వస్తోన్న వార్తలపై రవితేజ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి ఫేక్ అని స్పష్టం చేసింది. దయచేసి అభిమానులు ఇలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఈ మూవీ అధికారిక అప్డేట్లను మాత్రమే షేర్ చేయాలని కోరింది.
‘కాంతార 1’ వివాదంపై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్పందించాడు. కేవలం రిషబ్ శెట్టి అద్భుతమైన ప్రదర్శనను హైలైట్ చేయడమే తన ఉద్దేశమని, ఆ సంఘటన వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే తాను నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం, నమ్మకాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని పేర్కొన్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. 2026 జనవరి 9న ఇది విడుదలవుతుంది. ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇది 3:15 గంటల నిడివితో రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండింగ్కు వచ్చేసింది. 13వ వారం స్టార్ట్ అయ్యేసరికి హౌస్లో 8 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ వారం నామినేట్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. ఈ వారం హౌస్ నుంచి బయటకెళ్లేందుకు కెప్టెన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ మినహా సంజన, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజ, భరణి నామినేట్ అయ్యారు.
బాలీవుడ్పై మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్కడ స్టార్ అని నిరూపించుకోకపోతే.. వాళ్లు మనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని.. సరిగ్గా పట్టించుకోరని చెప్పాడు. అక్కడ లగ్జరీ కారులో వస్తేనే స్టార్ అని అనుకుంటారని, అది దురదృష్టకరమని అన్నాడు. కానీ మలయాళ సినీ పరిశ్రమలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని, లగ్జరీకి ప్రాధాన్యం ఇవ్వరని పేర్కొన్నాడు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు వస్తోన్న వార్తలను అక్కడి ప్రభుత్వం ఖండించింది. అయితే ఇమ్రాన్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. భారీ ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు రావల్పిండిలో ప్రభుత్వం సెక్షన్ 144 విధించింది. రేపటి వరకు అన్ని బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్టార్ నటి, మిల్కీ బ్యూటీ తమన్నా రూటు మార్చింది. ఓదెల-2, రైడ్-2 తర్వాత ప్రస్తుతం మరో క్రేజీ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లెజెండరీ డైరెక్టర్ వి. శాంతారాం బయోపిక్ లో ఆయన భార్య ‘సంధ్య’ పాత్రలో తమన్నా నటించనుంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా, అభిజిత్ దేశ్పాండే దర్శకుడు. కథ వినగానే తమన్నా ఓకే చెప్పేసిందట. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.
సినీప్రముఖులు చనిపోయినప్పుడు మీడియా వ్యవహరిస్తోన్న తీరుపై జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లి చనిపోయినప్పుడు తనని టార్గెట్ చేశారని, తల్లి గురించి చెప్పిన మాటలపై మీమ్స్ చేశారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు దివంగత నటుడు ధర్మేంద్ర విషయంలోనూ ఇలాగే జరుగుతుందని తెలిపింది. వ్యూస్, లైక్స్ కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, ఇలాంటి ధోరణిని ప్రోత్సహించకూడదని పేర్కొంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘థామా’. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగులో ఇది అందుబాటులో ఉంది. కాగా, డిసెంబర్ 16 నుంచి ఈ మూవీ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కు అందుబాటులో రానున్నట్లు సమాచారం.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘థామా’. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగులో ఇది అందుబాటులో ఉంది. కాగా, డిసెంబర్ 16 నుంచి ఈ మూవీ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కు అందుబాటులో రానున్నట్లు సమాచారం.
ప్రపంచ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఫ్రాంఛైజీల్లో ‘అవతార్’ ఒకటి. ఈ సిరీస్ నుంచి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఈ నెల 5న ఓపెన్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకుడు రాజ్ నిడిమోరును నటి సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ సామ్.. ఇన్స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. 16 గంటల వ్యవధిలోనే ఈ పోస్టుకు 79.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు ఈ జోడీకి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు. కాగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2లో సామ్ నటించిన విషయం తెలిసిందే.
నిర్మాత నాగవంశీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘ఎపిక్’ మూవీ ఈవెంట్లో నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ రవినే రాబిన్ హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం’ అంటూ వ్యాఖ్యానించాడు. ‘రవి మాకు రాబిన్ హుడ్ అయిపోయాడు. రూ.50 టికెట్ రేటు పెంచితే, మేము ఏదో తప్పు చేసిన వారిలా అయిపోయాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు’ అని ఆయన వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు SMలో వైరల్ అవుతున్న...