‘వారణాసి’ గ్లింప్స్లో ప్రతి షాట్ తనను షాక్కు గురిచేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. అంత క్రియేటివ్గా ఉంటుందని తాను ఊహించలేదన్నాడు. ప్రతి ఫ్రేమ్ టైం ట్రావెలర్లా అనిపించిందని, రాజమౌళి నుంచి మరో అద్భుతం రాబోతుందని తెలిపాడు. గ్లోబ్ ట్రాటర్ వేడుకలో మహేష్ ఎంట్రీ ప్లాన్ చూసి తనకు మాటలను రాలేదని, ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రాజమౌళికే వస్తాయని అన్నాడు.
‘కొత్త లోక’ సినిమాతో నటి కళ్యాణి ప్రియదర్శన్ మంచి ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా మరో విభిన్న పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు కళ్యాణి సిద్ధమవుతుంది. తమిళ హీరో కార్తీ నటిస్తోన్న ‘మార్షల్’ మూవీలో ఆమె పెక్యులర్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం.
ఈ వారంలో ఏకంగా 8 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ నెల 12న ‘అన్నగారు వస్తారు’, ‘సైక్ సిద్ధార్థ’, ‘మోగ్లీ’, ‘ఘంటసాల ది గ్రేట్’, ‘ఈషా’, ‘మిస్ టీరియస్’, ‘నా తెలుగోడు’, ‘ఇట్స్ ఓకే గురు’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు జియో హాట్స్టార్లో ‘సూపర్ మ్యాన్’ ఈ నెల 11 నుంచి,...
సీనియర్ నటి జయా బచ్చన్ 1981 తర్వాత 14ఏళ్లు నటనకు బ్రేక్ తీసుకున్నారు. తాజాగా ఆమె దీనిపై వివరణ ఇచ్చారు. ”ఆ సమయంలో నా కూతురు శ్వేత చిన్నపిల్ల. నేను షూటింగ్కు వెళ్తుంటే ‘అమ్మా నువ్వు వెళ్లొద్దు. నాన్నని వెళ్లమని చెప్పు’ అని అడిగింది. ఆ ఒక్క మాట నన్ను తీవ్రంగా కదిలించింది. ఆమెకు ఆ సమయంలో తల్లి ప్రేమ ముఖ్యమని అనిపించి నేను సినిమాలకు బ్రేక్ తీసుకున్నా” అని చెప్పారు.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన 3 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఈ మూవీ రూ.103కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించాయి. కాగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణ్వీర్ గూఢచారి పాత్రలో కనిపించాడు.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన మూవీ ‘కాంత’. NOVలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. వెంకీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 13న ఈ చిత్రం టైటిల్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే పేరుతో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న మూవీ ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ ఎంట్రీ సీన్ అదిరిపోతుందట. ఓ రాజు పాత్ర పోషిస్తున్న నిఖిల్.. ఓ వార్ సీక్వెన్స్తో సినిమాలో ఎంట్రీ ఇస్తాడని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సీక్వెన్స్లోని విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయని తెలిపాయి. ఇక ఈ సినిమా 2026 FEB 13న రిలీజ్ కానుంది.
విక్టరీ వెంకటేష్కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ, దర్శకుడు అనుదీప్ KV కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రష్మికకు అనుదీప్ కథను వినిపించగా.. ఆమె ఓకే చెప్పినట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
డైరెక్టర్ వైశాఖ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న సినిమా ‘ఖలీఫా’. ఈ మూవీలో మోహన్ లాల్.. మంబరక్కల్ అహ్మద్ అలీ పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే మోహన్ లాల్, పృథ్వీరాజ్ ఇందులో తాతామనవళ్లుగా కనిపిస్తారని టాక్. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం 2026 ఓనం సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా HYDలో ఈ మూవీకి సంబంధించి భారీ యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇందులో నాని, రాఘవ్లతో పాటు కొందరు ఫైటర్లపై ఫైట్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారట. ఈ నెల చివరి వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 ఏప్రిల్లో ఈ మూవీ విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మనమెప్పుడూ చట్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని హీరో రానా దగ్గుబాటి అన్నాడు. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసు తదితర అంశాలను ఉద్దేశించి రానాకు ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి జవాబు చెబుతూ.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని రానా తెలిపాడు. ప్రొడక్ట్ క్వాలిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే దేనికైనా తాను ప్రచారం చేస్తానని చెప్పాడు.
జూ.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో నీల్ స్పెషల్ గెస్ట్ రోల్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటి కాజోల్ను సంప్రదించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 జూన్ 25న విడుదలవుతుంది.
ఓ ప్రేమకథ చిత్రాన్ని తెరకెక్కించడానికి తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం విజయ్ సేతుపతి, సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇందుకు విజయ్, పల్లవి కూడా ఓకే చెప్పారట. 2026 జనవరిలో ఈ మూవీపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు, ఏప్రిల్లో దీని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.