బిగ్బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫీనాలే రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈసారి టైటిల్ రేసులో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, పవన్ ఉన్నారు. అయితే, టాప్-3 నుంచి ఇమ్మాన్యుయేల్, సంజన ఎలిమినేట్ అయినట్లు సమాచారం. కాగా, రేపు జరిగే ఫీనాలేకు మెగాస్టార్ చిరంజీవి, లేదా ప్రభాస్ అతిథిగా వచ్చే అవకాశం ఉంది. విజేతకు రూ.50 లక్షల నగదుతో పాటు బిగ్బాస్ ట్రోఫీ లభిస్తాయి.
★ సీజన్ 1 (2017): శివ బాలాజీ★ సీజన్ 2 (2018): కౌశల్ మందా★ సీజన్ 3 (2019): రాహుల్ సిప్లిగంజ్★ సీజన్ 4 (2020): అభిజీత్ దుద్దల★ సీజన్ 5 (2021): వీజే సన్నీ★ సీజన్ 6 (2022): సింగర్ రేవంత్★ సీజన్ 7 (2023): పల్లవి ప్రశాంత్★ సీజన్ 8 (2024): నిఖిల్
సినిమా టికెట్ ధరల పెంపుపై ఇటీవల కాలంలో ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టికెట్ ధరలను పెంచడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని చిన్న చిత్రాలు, ధరలు పెంచకుండానే మంచి విజయాలను అందుకున్నాయి. అదే బాటలో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా రాబోతోంది. టికెట్ ధరల పెంపు లేకుండానే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపాడు.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమా మొదటగా ఈనెల 26న విడుదల కానున్నట్లు ప్రకటించగా, తాజాగా వాయిదా పడింది. జనవరి 1న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా, నందు విలన్ పాత్రలో నటించారు.
2025 ఏడాదికిగానూ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల జాబితాను IMDb విడుదల చేసింది. ఈ లిస్టులో మొదటి స్థానంలో ‘సైయారా’ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ‘మహావతార్ నరసింహ’, ‘ఛావా’, ‘కాంతార 1’, ‘కూలీ’, ‘డ్రాగన్’, ‘సితారే జమీన్ పర్’, ‘దేవా’, ‘రైడ్ 2’, ‘కొత్తలోక’ సినిమా...
‘ధురంధర్’ సినిమాలో మాధవ్కు సరైన గుర్తింపు రాలేదని, అక్షయ్ ఖన్నా నటనపై ప్రశంసలు వస్తున్నాయంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై మాధవన్ స్పందించాడు. అక్షయ్ని చూసి తాను అసూయపడట్లేదని, ఆయన ప్రశంసలకు అర్హుడని అన్నాడు. ‘ధురంధర్’ లాంటి సినిమాలో నటించాలని అనుకున్నానని, ఇంత గొప్ప మూవీలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపాడు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ దాదాపు ఆరేళ్ల తర్వాత కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనీస్ బాజ్మీతో అక్షయ్ ఓ మూవీ చేయనున్నాడు. ఇందులో కథానాయికగా విద్యా బాలన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ‘హే బేబీ’, ‘భూల్ భులయ్యా’ సినిమాల్లో వీరిద్దరూ నటించారు. అయితే ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా.. 2026లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.700కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇదే హవా కొనసాగితే ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఇండియన్ సినీ చరిత్రలో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ జాబితాలో ఇది చేరుతుందని వెల్లడించాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సాలిడ్ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథ కూడా ట్రైబల్ నేపథ్యంలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ భారీగా వసూళ్లు రాబడుతోంది. తాజాగా భారత్లో ఈ సినిమా ‘అవతార్ 3’ని బీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 19న విడుదలైన ‘అవతార్ 3’ ఫస్ట్ డే అన్ని భాషల్లో కలిపి రూ.20 కోట్లు వసూళ్లు సాధించగా.. ఈ మూవీ 15వ రోజు కూడా రూ.22.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది ఇలాగే కొనసాగితే మరిన్ని రికార్డులు స...
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. నవంబర్లో రిలీజైన ఈ సినిమా హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. ఈ నెల 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. వచ్చే నెల 12న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్లో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే టీజర్ కూడా విడుదల కాకుండానే US, UK దేశాల్లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నయనతార, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఢిల్లీలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం అక్కడి వెళ్లినట్లు.. ఆ షెడ్యూల్తో మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలవుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న హైదరాబాద్లో జరగనున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శక నటుడు, రచయిత శ్రీనివాసన్(69) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆయన 220కుపైగా సినిమాల్లో నటించడంతో పాటు పలు సినిమాలకు దర్శకత్వం వహించి అవార్డులు సొంతం చేసుకున్నాడు. కాగా, ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.