తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ను త్వరలోనే తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బన్నీని ఇటీవల ఆమిర్ కలిశాడట. ఇక మొత్తం 5 భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగాన్ని సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన హిట్ మూవీ ‘భద్ర’ విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమాకు మొదటి ఛాయిస్ రవితేజ కాదట. బోయపాటి శ్రీను ఈ కథను మొదటగా ఇద్దరు స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూ. ఎన్టీఆర్కు వినిపించారట. పలు కారణాలతో వారిద్దరూ దీన్ని మిస్ చేసుకున్నారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బన్నీ, తారక్లు చెప్పారు.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, కార్తీక్ రాజు కాంబోలో ‘#సింగిల్’ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.16.30కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్ సమంత నిర్మించిన చిత్రం ‘శుభం’. ఒక హారర్ కామెడీ సినిమాకి ఏమేం అవసరమో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ చిత్రం కొత్త నేపథ్యంతో పాటు.. ట్విస్టులు ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. అయితే పాత్రల పరిచయ సన్నివేశాలు నత్తనడకగా సాగుతాయి. ఫస్టాఫ్ ఆసక్తిగా ఉన్నా.. ద్వితీయార్ధంలో ఒకే అంశం చుట్టూ కథ తిరగడంతో బోర్గా ఫీలవుతారు. ఇంటిల్లిపాదీ కలిసి ఈ సినిమాను చూడవచ్చు. రేటింగ్ 2.75/5
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘#సింగిల్’ మూవీ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 2:05 నిమిషాల నిడివితో ఇది థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. ఇక కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా కీలక పాత్రలు పోషించారు.
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విష్ణుప్రసాద్ కన్నుమూశాడు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ట్రీట్మెంట్కు భారీగా ఖర్చు అవగా.. కుటుంబసభ్యులు ఇటీవల ఫండ్ రైజింగ్ చేపట్టారు. అంతలోనే ఈ విషాదం జరిగింది. కాగా, విష్ణు.. మలయాళం, తమిళంలో పలు సినిమాలు చేశాడు.
‘రౌడీ బాయ్స్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్.. దర్శకుడు ఆదిత్యరావు గంగసానితో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రం టైటిల్ వచ్చేసింది. దీనికి ‘దేత్తడి’ పేరు పెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనుంది.
టాలీవుడ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్హుడ్’ మూవీ మార్చిలో రిలీజై పరాజయం పొందింది. తాజాగా ఈ సినిమా OTTపై నయా అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్ను ‘జీ5’ సొంతం చేసుకోగా.. ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలో ఒకే రోజు టీవీతో పాటు OTTలో ఇది రిలీజ్ కానున్నట్లు సమాచారం.
2023 సంవత్సరానికి గానూ ‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ విజేతల జాబితా విడుదలైంది. ఇందులో భాగంగా నటుడు అజిత్కు ‘తునివు’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. అలాగే, నటి త్రిష ‘లియో’ సినిమాలోని నటనకు ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. దీంతో అజిత్, త్రిషకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించాడు. ఆ దాడిని తీవ్రంగా ఖండించాడు. ఈ ఉగ్రదాడి విషయంలో కశ్మీర్ వాసులు ఎంతో బాధపడుతున్నారన్నాడు. ప్రభుత్వం కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. కాగా, ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
భోజ్పురి సింగర్ నేహాసింగ్ రాథోడ్పై కేసు నమోదైంది. పహల్గామ్ కాల్పుల ఘటనను రాబోయే బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుకుంటారని ‘X’లో వచ్చిన పోస్టును రీట్వీట్ చేసింది. దీంతో ఆమెపై లక్నోలో కేసు నమోదైంది. ఈ పోస్ట్ దేశద్రోహానికి సమానమని, పాక్ మీడియాలో వైరల్ అవుతోందని పోలీసులు FIRలో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతుంది. ‘NC-24’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు అప్డేట్ రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. దీంతో ఈ మూవీ టైటిల్ను ప్రకటిస్తారేమోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
పాకిస్తాన్ నటుడు ఫవాద్ఖాన్కు నటి దియా మీర్జా మద్దతు ఇవ్వడంతో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. అవి గతంలో చేసిన వ్యాఖ్యలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఏప్రిల్ 10న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఫవాద్ గురించి మాట్లాడినట్లు తెలిపింది. ఉగ్రదాడికి ముందు చేసిన ఆ వ్యాఖ్యాలను ఇప్పుడు చేసినట్టు చూపించొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది.
నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్ 3’ సినిమా మే 1న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తయింది. ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కొన్ని మార్పులు చేయాలని చిత్ర బృందానికి సూచించింది. ఈ సినిమా రన్టైమ్ 2:37 గంటలు ఉంది. కాగా, ఈ మేరకు వాటిలో మార్పు, చేర్పులు చేసి చిత్ర బృందం తుది కాపీని సమర్పించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. OTTలో సందడి చేస్తోన్న ఈ సినిమా.. ఇటీవల స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అయింది. తాజాగా దీని TRP వచ్చేసింది. ఈ సినిమాకు 12.61 రేటింగ్ నమోదైంది. కాగా, గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జీ తెలుగులో టెలికాస్ట్ కాగా.. 15.92 TRP వచ్చింది.