నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై నటి అనసూయ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై తనకు అనిపించింది తాను చెప్పానని తెలిపింది. అందరూ మమ్మల్ని ఫేక్ ఫెమినిస్టులు అనడం మొదలు పెట్టారని వ్యాఖ్యానించింది. తాను కూడా హీరోయిన్నేనని.. ఆయన వ్యాఖ్యలు తనకూ వర్తిస్తాయని పేర్కొంది.
హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్స్టాగ్రామ్లో మరో పోస్ట్ చేసింది. అయితే నటుడు శివాజీ తాను హీరోయిన్ డ్రెస్స్లపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు. నిధి అగర్వాల్ పడిన ఇబ్బందిని ఉద్దేశిస్తూ అలా మాట్లాడానని చెప్పాడు. తాజాగా దీనిపై నిధి అగర్వాల్ ఇన్స్టాలో స్పందించింది. బాధితులపై తప్పు నెట్టడాన్నే అతి తెలివి అంటారంటూ పోస్ట్లో పేర్కొంది.
విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’. ప్రస్తుతం జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ రెండు OTTల్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జియో హాట్స్టార్లో తెలుగు సినిమాల్లో టాప్ 1లో, ప్రైమ్లో ఇండియాలో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఇక సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
తమిళ స్టార్, TVK అధినేత విజయ్ దళపతిని మలేషియా పోలీసులు హెచ్చరించారు. ఈ నెల 27న కౌలాలంపూర్లో విజయ్ సినిమా ‘జన నాయగన్’ గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆంక్షలు విధించారు. ఇక ఈ ఈవెంట్కు దాదాపు 90 వేల అభిమానులు వస్తారని సమాచారం. కాగా, ఈ మూవీ 2026 జనవరి 9న విడుదల కానుంది.
‘ధురంధర్’కి వస్తున్నవన్నీ కార్పొరేట్ బుకింగ్స్ మాత్రమేనని కొందరు పెట్టిన పోస్టులపై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించాడు. ‘ఈ మూవీ సాధించిన అత్యుత్తమ విజయం ఏంటంటే.. ఈ మూవీకి వచ్చిన ప్రతి టికెట్ ఆర్గానిక్గా కొన్నదే. కార్పొరేట్ బుకింగ్స్ అన్నవారంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. భారతీయ సినీ రంగంలో ఈ మూవీ చిరస్థాయిలో నిలిచిపోతుంది. దేశంపై ఉన్న ప్రేమకు ఈ మూవీ నిదర్శనం’ అని అన్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టులపై నిర్మాత బన్నీ వాసు అప్డేట్ ఇచ్చాడు. దర్శకుడు అట్లీతో పాటు బన్నీ చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పాడు. అందులో ఒకటి 2026 జూలై లేదా ఆగస్టులో స్టార్ట్ అవుతుందని, మరొకటి 2027 మార్చిలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించాడు. వీటిపై జనవరిలో అధికారిక ప్రకటన చేస్తామని అన్నాడు.
హీరోయిన్స్ డ్రెసులపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరో క్షమాపణలు చెప్పాడు. ‘మొదట నేను ఆపాలజీ చెప్పింది నా భార్యకే. ఆరోజు స్టేజ్పైన ఉన్న మహిళలందరికి, తోటి నటీనటులకు సారీ చెబుతున్నా. నోరు జారినట్లు అర్థమైంది. ఆ మాటలు మాట్లాడినందుకు చాలా బాధపడ్డా. సినిమా నటీనటులు ఎవరికీ టార్గెట్ కాకూడదనే నా ఉద్దేశం. నిధి అగర్వాల్, సమంత పడిన ఇబ్బందులు నన్ను కలిచివేశాయి’ అని అన్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో దర్శకుడు త్రివిక్రమ్ మరో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్తో చేయనున్న మైథలాజికల్ సినిమాను ఇప్పుడు బన్నీతో చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే అల్లు అర్జున్తో చర్చలు జరపగా.. ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’. రేపు ఇది విడుదలవుతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి 15 మార్పులు సూచించింది. ‘ఇందులో వాడిన కొన్ని అసభ్య పదాలను తొలగించాలి. సినిమా ప్రారంభంలో వాయిస్ ఓవర్తో ఇందులోని పాత్రలను కల్పితమని చెప్పాలి’ అని పేర్కొంది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.925కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మరికొన్ని రోజుల్లో ఇది రూ.1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇదే హవా కొనసాగితే ఈ సినిమా ‘జవాన్’, ‘పఠాన్’, ‘కల్కి’ల రికార్డులను బ్రేక్ చేస్తుందన...
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.925కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మరికొన్ని రోజుల్లో ఇది రూ.1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇదే హవా కొనసాగితే ఈ సినిమా ‘జవాన్’, ‘పఠాన్’, ‘కల్కి’ రికార్డులను బ్రేక్ చేస్తుందని...
ఇండిగో సిబ్బందిపై నటుడు నరేష్ విమర్శలు గుప్పించాడు. బస్సు నిండిపోయినా ఇంకా ప్రయాణికులను ఎక్కించిందని, వారి ఇబ్బందులను సిబ్బంది పట్టించుకోవడం లేదని ఫైరయ్యాడు. విమానం దగ్గరికి తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా కుక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండిగో తీరుపై న్యాయం పోరాటం చేస్తానని, లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ట్వీట్ చేశాడు.
ప్రముఖ మలయాళ దర్శకుడు, మాజీ MLA P.T కుంజు మహమ్మద్ అరెస్ట్ అయ్యారు. తనను మహమ్మద్ లైంగికంగా వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం సినిమాలను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఒక హోటల్లో బస చేసిన సమయంలో దర్శకుడు ఇబ్బంది పెట్టారని పేర్కొంది. దీంతో పోలీసులు అతని అరెస్ట్ చేసి.. ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు.
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటివరకు రూ.800కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమ ప్రాంతాన్ని చూపించి డబ్బులు సంపాదిస్తున్నారని, వసూళ్లలో తమకు వాటా ఇవ్వాలని పాకిస్తాన్ కరాచీలోని లయరీ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 50-80% వరకు తమకు ఇవ్వాలని, లేదంటే తమ ఊరిలో ఒక ఆసుపత్రి అయినా కట్టించాలని కోరుతున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. అక్కడి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంతో పాటు AP భవన్, ఇండియా గేట్, పార్లమెంట్, ప్రధాని కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇక బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలవుతుంది.