హెబ్బా పటేల్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’. ఈ సినిమాను శ్రీనివాస్ మన్నే తెరకెక్కిస్తున్నాడు. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ను ఈనెల 25కు వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ‘భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది’ అంటూ పోస్టర్ విడుదల చేసింది.
2025లో గూగుల్లో అత్యధికంగా వెతికిన టాప్-10 సినిమాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో బాలీవుడ్ మూవీ ‘సైయారా’ అగ్రస్థానంలో ఉంది. రిషభ్ శెట్టి కాంతార: ఛాప్టర్ 1, రజనీకాంత్ కూలీ, వార్ 2, సనమ్ తేరీ కసమ్, మార్కో, హౌస్ఫుల్, గేమ్ ఛేంజర్, మిసెస్, మహావతార్ నరసింహ చిత్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటిలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ‘అన్నగారు వస్తారు’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డిసెంబరు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో పాల్గొన్న కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాను ఇలానే తీయాలి అని ఎలాంటి రూల్స్ లేవు తెలిపాడు. మంచి కథ ఉంటే ప్రేక్షుకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ‘అన్నగారు వస్తారు’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డిసెంబరు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో పాల్గొన్న కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాను ఇలానే తీయాలని ఎలాంటి రూల్స్ లేవు తెలిపాడు. మంచి కథ ఉంటే ప్రేక్షుకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు.
యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ‘మోగ్లీ’. ఈ సినిమా తొలుత డిసెంబర్ 12న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బాలకృష్ణ ‘అఖండ 2’ ఈనెల 12న విడుదల కానున్న నేపథ్యంలో ‘మోగ్లీ’ డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 12న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
టాలీవుడ్ సినీ నటి శ్రియ శరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన కుమార్తెతో కలిసి వేకువజామున జరిగే అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు శ్రియ కుటుంబానికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.
వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న మూవీకి ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై S.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. తన పుట్టినరోజులు కూడా మిస్ అయినట్లు తెలిపింది. ‘నా తండ్రి ఆసుపత్రిలో ఉంటే ఆయన చివరి రోజులలో కూడా నేను చూసుకోలేకపోయాను. నా కుటుంబంతో గడిపిన సందర్భాలూ చాలా తక్కువ. 20 ఏళ్లు త్యాగం చేసి ఈరోజు ఇలా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.
స్టార్ హీరో నాగార్జునపై తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన చిన్నప్పటి నుంచి నాగార్జున ఒకేలా ఉన్నారని తెలిపాడు. తన మనవళ్లకు కూడా వయసు వస్తుంది కానీ.. ఆయనకు మాత్రం రాలేదని అన్నాడు. నాగ్ ఎప్పటికీ యంగే అని చెప్పుకొచ్చాడు.
బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ-2. ఇటీవల వాయిదా పడిన సినిమాను ఈ నెల 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చెప్పింది. ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా అడ్డంకులన్నీ తొలగడంతో విడుదలకు సిద్ధమైంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి జియోహాట్స్టార్ 18 కొత్త ప్రాజెక్టులతో సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులలో ‘ఫార్మా’, ‘కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 3’, ‘కజిన్స్ అండ్ కల్యాణమ్స్’, ‘అనాలీ’, ‘రాస్లిన్’, ‘1000 బేబీస్ సీజన్ 2’, ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’, ‘వరమ్’, ‘బ్యాచ్మేట్స్’, ‘సేవ్ ది టైగర...
TG: గ్లోబల్ సమ్మిట్కు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘విభిన్న రంగాలకు చెందిన దిగ్గజాలు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి దిగ్గజాల మధ్య నేను ఉండటం నిజంగా గొప్ప గౌరవం’ అని పేర్కొన్నారు. HYDను గ్లోబల్ సినిమా హబ్గా చేయాలనేది CM రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్లుగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్రంలో మహేష్ ఏకంగా ఐదు పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, సూపర్ స్టార్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగడం ఖాయం. కాగా, ఈ సినిమాలో మహేశ్.. రాముడి పాత్రలో కనిపించనున్నారని రాజమౌళి ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్హిత్ ఇబ్రాన్తో టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. తమ ఇన్స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్టును డిలీట్ చేయడం, ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఇందుకు కారణం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.