కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార 1’ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా తాజాగా రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.509.25 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన మూవీ ‘కిష్కింధపురి’. హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ OTTలోకి రాబోతుంది. జీ5లో ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న సాయంత్రం జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. కాగా, కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ మూవీ SEP 12న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
దర్శక దిగ్గజం రాజమౌళి బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకు విషెస్ చెప్పారు. ఈ మేరకు స్పెషల్ ఫొటో SMలో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే రాజమౌళి.. మీకు అంత మంచి జరగాలని, మీరు మరింత ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్ పెట్టారు. కాగా, వీరి కాంబోలో ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్తో సినిమా తెరకెక్కుతోంది.
వర్కింగ్ అవర్స్ కారణంగా తాను భారీ మూవీల నుంచి తప్పుకున్నట్లు వస్తోన్న వార్తలపై నటి దీపికా పదుకొనె స్పందించారు. ‘ఒక ఆత్మభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే వాటిని అంగీకరించను. ఎన్నో ఏళ్లుగా చాలామంది హీరోలు 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెబితే మొత్తం విషయం తప్పుదోవ పడుతుంది. అందుకే వారి పేర్లు చెప్పాలనుకోవడం లేదు’ అని తెలిపారు.
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న ‘ప్యారడైజ్’ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ అండ్ షెడ్యూల్ సమస్యల కారణంగా సినిమా షూటింగ్ మార్చి చివరి వరకు కొనసాగుతోందని, అందుకే సినిమా రిలీజ్ను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పంజాబీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు, బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ ఘుమాన్ కన్నుమూశారు. అమృత్సర్లోని ఆసుపత్రిలో వరీందర్కు సర్జరీ జరుగుతుండగా.. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినట్లు కుటుంబీకులు వెల్లడించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వరీందర్ ‘టైగర్ 3’ సినిమాలో నటించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా? అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ 2026 జనవరిలో పూర్తి కాబోతుందట. ఈ సినిమా తర్వాత సుకుమార్తో సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అక్కినేని నాగార్జున, నటి టబు జోడీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జోడీ మరోసారి వెండితెరపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న ‘కింగ్ 100’ మూవీలో ఆమె భాగం కానున్నట్లు సమాచారం. ఇందుకు ఆమె అంగీకరించారట. ఆమెతో పాటు ఈ మూవీలో మరో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నట్లు టాక్.
టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘జటాధర’. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘పల్లో లట్కె’ రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఈ పాటలో సుధీర్, శ్రేయ శర్మ డ్యాన్స్ చేయనున్నట్లు తెలిపారు. ఇక బాలీవుడ్ నటి మీనాక్షి సిన్హా నటిస్తున్న ఈ మూవీ NOV 7న విడుదలవుతుంది.
స్టార్ హీరోయిన్ ఇలియానా చేసిన బోల్డ్ కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి. బాడీ మేకోవర్ కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలని ఆమె సూచించింది. కొన్నిసార్లు శృంగారం కూడా మంచి వ్యాయామంలా పనిచేస్తుంది, అందులోనూ అలసిపోతాం కాబట్టి బాడీకి మంచిదే అని ఇలియానా వ్యాఖ్యానించింది. తన వ్యాఖ్యలను మెచ్యూరిటీతో ఆలోచిస్తేనే సరైన అర్థం తెలుస్తుందని ఈ బ్యూటీ వివరించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ‘వారణాసి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అలాగే, ఈ సినిమా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ను నవంబర్ 14న రివీల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తమిళ స్టార్ సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో ‘సూర్య 46’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్పై అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యూరప్ దేశం బెలారస్లో జరుగుతోంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఓ పాటను షూట్ చేయనున్నారట. ఇక మమితా బైజు, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో AA22xA6 వర్కింగ్ టైటిల్తో మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా రిలీజ్పై నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. ‘మిత్రమండలి’ ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. 2026 పొంగల్కు ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ ప్రకటిస్తారని చెప్పారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తమిళ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై నయా అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్ ఫొటో షేర్ చేశారు.
కన్నడ బిగ్బాస్ను కాలుష్య నియంత్రణ మండలి సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ను ఆదేశించగా.. తాజాగా బిగ్బాస్ మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆ షో హోస్ట్ కిచ్చా సుదీప్ డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు చెప్పారు.