ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా గురించి గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోందని తెలిపాడు. తాను ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేశానని చెప్పాడు. ప్రభాస్ క్యారెక్టర్ ‘మాస్’గా ఉంటుందని, పాటలు చాలా ‘క్లాస్’గా ఉంటాయని పేర్కొన్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమా నైజాం పంపిణీ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
హీరోయిన్ జాన్వీకపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. 15 ఏళ్ల వయసులో అశ్లీల వెబ్సైట్లో తన మార్ఫింగ్ ఫొటోలు చూసి షాక్కు గురైనట్లు తెలిపింది. ‘అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నా. మాకు ఐటీ క్లాస్ జరిగినప్పుడు తోటి విద్యార్థులు అలాంటి సైట్స్ ఓపెన్ చేస్తుండేవారు. అలా ఓసారి ఆ వెబ్సైట్లో నా ఫొటోలు చూసి చెప్పారు. ఆక్షణం నేనెంతో బాధపడ్డా’ అని పేర్కొంది.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ‘యుగానికి ఒక్కడు’. ఇందులో ఆండ్రియా, రీమాసేన్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ప్రచారంపై ఆండ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెల్వరాఘవన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఏదీ జరగదని.. ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమంటూ పేర్కొంది. మళ్లీ ఆయనతో సినిమా చేయడం తన వల్ల కాదని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన ‘బాస్టియన్’ రెస్టారెంట్ ధరల గురించి ఓ వార్త SMలో హల్చల్ చేస్తోంది. బాస్టియన్లో ఫుడ్ తిన్న కొందరు తమ బిల్లును SMలో షేర్ చేయగా అందులోని ధరలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. నలుగురికి కలిపి రూ.21,731 బిల్లు అయినట్లు తెలిపారు. చికెన్ న్యూడిల్స్ ధర రూ.950, ఫ్రెంచ్ ఫ్రైస్ ధర రూ.1450 ఉండటంతో మాటలు రావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఆస్మాన్ అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేశారు. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సస్పెన్స్, థ్రిల్లర్ జోన్లో ఈ మూవీని రూపొందించనున్నారు. కొండారు వెంకటేశ్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తుండగా.. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందించనున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన ఇన్స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్తో రూపొందించిన లైట్ పింక్ కలర్ శారీని కియారా ధరించింది. మెడలో అందమైన నెక్లెస్ ధరించి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన ఈ పిక్స్ ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి.
‘ఫౌజీ’ మూవీలో ప్రభాస్ లుక్కు సంబంధించి ఇటీవల కొన్ని ఫొటోలు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ‘సెట్స్ నుంచి లీకైన ఫొటోలను SMలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వారికి ఇదొక వార్నింగ్. అనధికారిక కంటెంట్పై ఫిర్యాదు చేస్తాం. దయచేసి ఇలాంటి లీక్ అయిన కంటెంట్ను షేర్ చేయకండి’ అని పోస్ట్ పెట్టింది.
హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో జైలర్ 2 వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిందని రజనీకాంత్ తెలిపాడు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయని వెల్లడించాడు. అతి త్వరలోనే నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తుందని స్పష్టం చేశాడు. కాగా ఇందులో మోహన్ లాల్, శివరాజ్కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు.
రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ఆమె లీడ్ రోల్ చేస్తున్న ‘మైసా’ సినిమా నుంచి తాజాగా మరో పోస్టర్ విడుదలైంది. ముఖం నిండా గాయాలతో సీరియస్గా ఉన్న నేషనల్ క్రష్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవీందర్ పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేమపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ కోసం హద్దులు దాటే సమయం వస్తోందని.. అది రాగానే తప్పకుండా అందరికీ చెబుతా అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు SMలో వైరల్ అవుతున్నాయి. కాగా, మృణాల్ గతంలోనూ ప్రేమ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. తొలిచూపు ప్రేమను తాను నమ్ముతానని, ఆడవాళ్లు భావోద్వేగాలను మరిచిపోలేరని తెలిపింది.
మద్యానికి బానిస కావడం వ్యక్తిగత పతనం కాదని, దాన్నొక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా చూడాలని బాలీవుడ్ నటి జాన్వీకపూర్ అన్నారు. ఇటీవల ఓ సెమీనార్లో జాన్వీ పాల్గొని మాట్లాడారు. మద్యానికి బానిసైన వాళ్ల క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్దతి కాదని, నిజానికి ఏ వ్యసనమైనా విలాసం కాదన్నారు. సమాజం వారిని నేరస్థుల్లా కాకుండా.. చికిత్స అవసరమైన రోగుల్లా గుర్తించాలన్నారు.
‘అఖండ’ విజయం తర్వాత బాలయ్య మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూ.100 కోట్ల ప్రాజెక్ట్, విజయ్ కనకమెడలతో రూ.60 కోట్ల సినిమా పట్టాలెక్కనున్నాయి. వీటితో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న రెండు భాగాల చిత్రానికి రూ.250 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.
‘డెకాయిట్’ ప్రమోషన్స్లో అడవి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ చిత్రంలో నటిస్తున్న అనురాగ్ కశ్యప్కు షూటింగ్ సమయంలోనే టామ్ క్రూజ్ సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ వచ్చిందని తెలిపాడు. కానీ ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారని శేష్ వెల్లడించాడు. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా నటించే జెన్యూన్ పర్సన్ అని కొనియాడాడు. ఏప్రిల్ 10న ‘డెకాయిట్’ విడుదల కానుంది.