అక్కినేని నాగచైతన్య తన వంట గది ముచ్చట్లను సరదాగా పంచుకున్నాడు. ఖాళీ దొరికితే కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటానని అన్నాడు. తాను చేసిన వంటలకు తన భార్య శోభిత ఇచ్చే ఫీడ్బ్యాకే ఫైనల్ అని తెలిపాడు. ఇక తన తండ్రి నాగార్జున డైట్ పక్కన పెట్టి మరీ ఆదివారం ‘స్కూజీ’ పిజ్జాలను ఇష్టంగా తింటారని వెల్లడించాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ నెల 19న నిర్వహించనున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి చిరంజీవిని ఆహ్వానించారు. కాగా, ఇటీవల చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
TG: ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ను CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ సినీ రంగంలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బన్నీ చిత్రాలు భవిష్యత్తులో హాలీవుడ్ స్థాయికి చేరుకోవాలన్నారు. అంతర్జాతీయ వేదికలపై మన సినిమా సత్తా చాటాలని పేర్కొన్నారు.
దేశంలోని సినిమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు తప్పనిసరిగా సబ్టైటిల్స్తో పాటు, అంధుల కోసం దృశ్యాలను వివరించే ఆడియో డిస్క్రిప్షన్ ఉండాలని ఆదేశించింది. వినికిడి, దృష్టి లోపం ఉన్నవారు కూడా సినిమాల్లోని భావోద్వేగాలను, శబ్దాలను సులభంగా ఆస్వాదించేలా చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
TG: హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు అర్జున్ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం మల్టీప్లెక్స్లోని స్క్రీన్లను ఆయన పరిశీలించారు. ఇందులో 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కలిగి ఉండటం విశేషం.
SM ప్రచారాలపై నటి రష్మిక స్పందించింది. ఎనిమిదేళ్లుగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తన పాత ప్రైవేట్ ఆడియోను లీక్ చేశారని, తన కుటుంబం, స్నేహితుల ప్రైవసీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో SM నుంచి ఆ కంటెంట్ తొలగించాలని హెచ్చరించింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. తన వ్యక్తిగత జీవితంపై ఇతరులు జోక్యం అనవసరమని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. OTT వేదిక జీ5లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇటీవల జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ అయింది. తాజాగా వెల్లడైన TRP రేటింగ్స్లో ఈ సినిమా సత్తా చాటింది. అర్బన్లో 12.52 రేటింగ్, అర్బన్ + రూరల్లో 10.35 రేటింగ్ సాధించింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ టాక్ సాలిడ్గా వచ్చినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం బ్లాక్బస్టర్ రేంజ్లో ఉంటుందని తెలుస్తోంది. అలాగే, సెకండ్ హాఫ్లో పవన్ పీక్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది ఓ కమర్షియల్ ఎంటర్టైనర్.
తమిళ హీరో ధనుష్ వరుస మూవీలతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో ‘D55’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా.. మమ్ముట్టి త్వరలోనే భాగం కానున్నాడు. ఈ మూవీని SEP వరకు పూర్తి చేసి.. మారి సెల్వరాజ్తో ‘D56’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత తమిళరసన్ పచ్చ ముత్తు దర్శకత్వంలో ‘D57’ సినిమా చేయనున్నట్లు, 2027లో ఇది స్టార్ట్ క...
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా, నిన్న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు ఫర్మాన్ ఖాన్ను ఆమె హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. అయితే, ఈ పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని కొందరు విమర్శిస్తుండటంతో మోనాలిసా ఘాటుగా స్పందించింది. తన వివాహానికి ‘లవ్ జిహాద్’ అని ముద్ర వేయవద్దని కోరింది. తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని స్పష్టం చేసింది.
నటి ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రా.కార్తిక్ తెరకెక్కించిన మూవీ ‘మేడిన్ కొరియా’. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ప్లిక్స్లో తమిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ డ్రామాలు, సినిమాలు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను చూడొచ్చు. కాగా, ఇందులో దక్షిణ కొరియా వెళ్లాలనే లక్ష్యం ఉన్న అమ్మాయిగా ప్రియాంక నటించింది.
నయనికతో పెళ్లి తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ తన అన్నయ్య అల్లు అర్జున్ ఇచ్చిన సలహా గురించి చెప్పాడు. ‘పరిస్థితులు ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఫంక్షన్లో డ్రెస్సులు సరైన సమయానికి రాకపోవచ్చు. ఆలస్యం కావొచ్చు. ఇలాంటి చిన్న విషయాలకు ఒత్తిడికి లోనవ్వద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు, ఏమీ ఆలోచించకుండా పెళ్లిని ఎంజాయ్ చేయి’ అని బన్నీ చెప్పినట్లు తెలిపాడు.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించాలని, సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 అదనంగా పెంచుకోవాలని కోరినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
TVK పార్టీ అధినేత విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’ చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు మరో భారీ షాక్ తగిలింది. ఈ మూవీ ఓటీటీ ఒప్పందాన్ని అమెజాన్ ప్రైమ్ రద్దు చేసుకుంది. సెన్సార్ వివాదాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందన్న కారణంతో ఆ సంస్థ ఈ డీల్ నుంచి తప్పుకుంది. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ రూ.120 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసింది.
టాలీవుడ్లో ఈ వారం సందడి లోపించింది. మార్చి రెండో వారంలో ఒక్క కొత్త సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. గత వారం వచ్చిన మూవీలు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో థియేటర్ల వద్ద జనం తగ్గారు. దీంతో పాత సినిమాలే తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. అయితే మార్చి 19న ఉగాది సందర్భంగా రానున్న భారీ సినిమాలపైనే ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలన్నీ ఉన్నాయి. అప్పటివరకు బాక్సాఫీస్ వెలవెలబోనుంది.