బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా కథకు, అమరుడైన మేజర్ మోహిత్ శర్మ జీవితానికి సంబంధం లేదని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సినిమాను పునఃపరిశీలించిన CBFC.. ఈ మూవీ కథ కల్పితమని తెలిపింది. అనుమతి లేకుండా తమ కుమారుడి జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారని మోహిత్ తల్లిదండ్రులు ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను అసభ్యకర రీతిలో ఎడిట్ చేసి కొందరు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశంపై రష్మిక మందన్న స్పందిస్తూ.. మానవుల్లాగా ప్రవర్తించని వారికి శిక్ష విధించాలంటూ Xలో పోస్ట్ పెట్టింది. దానికి సైబర్ దోస్త్ అకౌంట్ను ట్యాగ్ చేసింది.
నటసింహం బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ 2’. ఈ నెల 5న ఇది రిలీజ్ కానుంది. ఈ సినిమా ముందు భారీ టార్గెట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.114 కోట్లు జరిగిందట. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.116 కోట్లకు పైగా వసూళ్లు సాధించాల్సి ఉంది. మరోవైపు ఈ మూవీ ఈజీగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తనపై నమోదైన బెంగళూరు రేవ్ పార్టీ కేసును కొట్టేసిన విషయాన్ని తక్కువమంది రాశారని నటి హేమ తెలిపింది. తాను బర్త్ డే పార్టీకి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ దొరికాయని, కానీ రెడ్హ్యాండెడ్గా దొరికిన హేమ అని రాశారని చెప్పింది. ఆ సమయంలో తనకు రోజుకు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపింది. వాటికి సంధానం చెప్పలేక వీడియో చేసి పెట్టానని, దాన్ని కూడా తప్పుగా చూపారని పేర్కొంది.
2025లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల, దర్శకుల జాబితాను IMDB ప్రకటించింది. ‘సైయారా’ స్టార్స్ అహాన్ పాండే, అనీత్ పడ్డా, ఆమిర్ ఖాన్ టాప్ 3లో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇషాన్ ఖట్టర్, లక్ష్య, రష్మిక మందన్న, కళ్యాణి ప్రియదర్శన్, త్రిప్తి డిమ్రి, రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి ఉన్నారు. దర్శకుల జాబితాలో మోహిత్ సూరి, ఆర్యన్ ఖాన్, లోకేష్ కనగరాజ్ టాప్ 3లో నిలిచారు.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికి ‘ఇరుముడి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ కూతురిని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి పడే తాపత్రయం నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ ఈ నెల 5న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా రాబోతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షేర్ చేసిన ఫొటోల్లో బ్యాక్గ్రౌండ్లో ‘జై అఖండ’ అని కనిపిస్తుంది. దీంతో ‘అఖండ 3’ టైటిల్ ఇదే అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాలంటే ఎల్లుండి వరకు ఆగ...
నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ SVC కీలక ప్రకటన చేసింది. తమ ప్రాజెక్టుల గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్తో సినిమా చేయనున్నట్లు, దీన్ని దర్శకుడు అనీస్ బజ్మీ తెరకెక్కించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.
నటి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ మూవీకి ‘ఓ సుకుమారి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి డైరెక్టర్ భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తన వద్ద ఆయుధాలు లేకపోయినా ఐదేళ్లు జైలుశిక్ష అనుభవించినట్లు నటుడు సంజయ్ దత్ తెలిపాడు. తన దగ్గర తుపాకీ ఉందని అరెస్ట్ చేశారని, తన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని నిరూపించడానికి 25ఏళ్ల టైం ఎందుకు పట్టిందో అర్థం కాలేదన్నాడు. తన కేసును వేగవంతంగా పరిష్కరించాలని ఎన్నోసార్లు అభ్యర్థించినట్లు చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు మత గ్రంథాలు చదవడంతో పాటు న్యాయశాస్త్రంపై అధ్యయనం చేశానని అన్నాడు.
తమిళ హీరో కార్తీతో దర్శకుడు నలన్ కుమార్ స్వామి తెరకెక్కించిన సినిమా ‘అన్నగారు వస్తారు’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 12న తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ మూవీలో కృతి శెట్టి, సత్యరాజ్, రాజకీయం ఆనందరావు, శిల్పా మంజునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన వర్కింగ్ అవర్స్ అంశంపై రానా దగ్గుబాటి స్పందించాడు. నటన అంటే ఉద్యోగం కాదన్నాడు. ‘ఇది లైఫ్స్టైల్, దీన్ని పాటించాలా లేదా అనేది పూర్తిగా మీ నిర్ణయమే. 8 గంటలు నిరంతరంగా పనిచేస్తే బెస్ట్ అవుట్పుట్ రావడానికి నటన ప్రాజెక్టు కాదు. ఇక్కడి ప్రతి విభాగంలో నటీనటులు భాగమైతేనే గొప్ప సీన్స్ వస్తాయి. ఇన్ని గంటలే పని చేయాలని అనుకోవడం కష్టం’ అని అన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 4 ఎపిసోడ్స్తో వచ్చిన ఈ సిరీస్ OTTలో అదరగొడుతోంది. ఈ సిరీస్కు ఏకంగా 59.6 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 90కిపైగా దేశాల్లో టాప్ 1లో ట్రెండ్ అవుతోంది.
రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఆస్తులపై చర్చ మొదలైంది. 2025 నాటికి ఆమె ఆస్తుల విలువ రూ.100 కోట్లు-రూ.150 కోట్ల వరకు ఉండొచ్చట. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు- రూ.5కోట్లు వరకు పారితోషికం, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఏడాదికి దాదాపు రూ.8 కోట్ల వరకు సంపాదిస్తుందట. HYDలో రూ.8 కోట్ల లగ్జరీ డూప్లెక్స్ ఫ్లాట్, ముంబైలో రూ.15 కోట్ల సీ-ఫేసింగ్ 3BHK ఫ్లాట్, పలు కార్లు ఉన్నట్లు సమాచారం.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ మంచి హిట్ అందుకుంది. తాజాగా మేకర్స్.. ఈ సినిమా సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చేయకపోయి ఉంటే నిజంగా బాధపడేదాన్ని అని చెప్పింది. దీనికి వస్తోన్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉందని పేర్కొంది.