మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది. తన వ్యాఖ్యలకు సంబంధించి శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని అసోసియేషన్ తెలిపింది. కాబట్టి, ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరింది. శివాజీ క్షమాపణలు చెబుతున్న వీడియోను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ను ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భాటియాను రంగంలోకి దింపబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘X’ వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తయిందని పేర్కొన్నాడు. కాగా, ఈ చిత్రంలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ల డ్రెస్సింగ్పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై RGV ఘాటుగా స్పందించాడు. ‘హే శివాజీ, నువ్వు ఎవరైనా కావచ్చు.. నీ ఇంట్లో ఆడవాళ్లు నీలాంటి సంస్కారం లేని వ్యక్తిని భరించగలిగితే, వెళ్లి వారికి నీతులు చెప్పుకో. అంతే కానీ, ఇతర మహిళల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీ పనికిమాలిన అభిప్రాయాలను నీ దగ్గరే ఉంచుకో’ అంటూ ‘X’ వేదికగా ట్విట్ చేశాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా జనవరి 9న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం 3 గంటల 06 నిమిషాల సుదీర్ఘ రన్ టైంతో రానున్నట్లు సమాచారం. ఇందులో ఫస్ట్ హాఫ్ గంటా 23 నిమిషాలు, సెకండ్ హాఫ్ గంటా 43 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి’ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘రాజాసాబ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల నిధి అగర్వాల్, సమంత ఘటనలను దృష్టిలో పెట్టుకునే శివాజీ ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, వాడిన భాష సరిగ్గా లేదని కొందరు మండిపడుతున్నారు. ఈ వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
బరువు పెరగడం వల్ల ఓ భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయినట్లు నటి రాధికా ఆప్టే వెల్లడించింది. ‘షూటింగ్కు ఇంకా టైం ఉందని విహారయాత్రకు వెళ్లొచ్చేసరికి 4 కేజీల బరువు పెరిగాను. ఫొటో షూట్లో లావుగా కనిపించడంతో నన్ను ఆ సినిమా నుంచి తప్పించారు’ అని ఆమె తెలిపింది. తన తాజా చిత్రం ‘సాలీ మొహబ్బత్’ ప్రమోషన్స్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
లూలు మాల్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నటి నిధి అగర్వాల్ విముఖత చూపింది. రాజాసాబ్ మూవీ పాట రిలీజ్ సందర్భంగా వచ్చిన నటిని అభిమానులు ఇబ్బందికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పోలీసులు ఆమెను కలిసి ఫిర్యాదు చేయమని కోరారు. కానీ తాను ఎవరిపై కేసు పెట్టాలనుకోవడం లేదని నిధి స్పష్టం చేసింది.
హీరోయిన్ల డ్రెస్సింగ్పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు మంచు మనోజ్ పేర్కొన్నాడు. ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించడమే. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలి. ఇలాంటి వ్యవహారశైలిని ఉపేక్షించవద్దు. వారిని అగౌరవ పరిచేలా చేసిన వ్యాఖ్యలకు.. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా’ అని పేర్కొన్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉ.10:30 ప్రకటించనున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థ, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన ఓ పోస్టర్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్, తాజాగా సెకండ్ సింగిల్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘రాజు గారి పెళ్లిరో’ అనే సాంగ్ ప్రోమోను ఈరోజు విడుదల చేయనుండగా, పూర్తి పాటను ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ‘అఖండ 2’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. 11 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.88.25 కోట్లు రాబట్టినట్లు తెలిపాయి.
నటుడు మాధవన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా పలు వెబ్సైట్లు, ప్లాట్ఫామ్లు వాణిజ్య లాభం కోసం పేరుని, ఫొటోలను వినియోగిస్తూ అసభ్యకర కంటెంట్ను సృష్టిస్తున్నాయని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అశ్లీల కంటెంట్ను తొలగించాలని ఆదేశించింది.
మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కలిసి ఒకే చిత్రంలో నటించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రంలో మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో చిరు-బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఈ ‘మెగా 158’ చిత్రంపై భారీ అంచనాలు నె...