రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో అత్యంత ఘనంగా జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘రాజాసాబ్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ రిద్ది కుమార్ కట్టుకున్న చీరను ప్రభాస్ గిఫ్ట్గా ఇచ్చినట్లు SMలో చర్చ జరుగుతోంది. దీనిపై రిద్ది కుమార్ స్పందిస్తూ.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తాను ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వగా, దానికి రిటర్న్ గిఫ్ట్గా ఆయన ఈ చీరను ఇచ్చారని క్లారిటీ ఇచ్చింది.
ప్రముఖ కన్నడ, తమిళ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. APకి చెందిన ఆమె.. తమిళ సీరియల్ ‘గౌరీ’లో దుర్గ, కనకగా ద్విపాత్రాభినయంతో ఫేమస్ అయ్యింది. కాగా బెంగళూరులోని తన ఫ్లాట్లో ఆమె సూసైడ్ చేసుకోగా.. పెళ్లి విషయమై తల్లిదండ్రులు ఒత్తిడి చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అటు కొంతకాలంగా ఆమె డిప్రెషన్లో ఉన్నారని సన్నిహితులు తెలిపారు.
ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరు, గొంతు, ఫొటోలు వంటి వ్యక్తిగత అంశాలను వాణిజ్య పరంగా వాడుకోకుండా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా దీనిపై నటుడు NTR స్పందించాడు. ‘ఢిల్లీ హైకోర్టు ద్వారా ‘పర్సనాలిటీ రైట్స్’ రక్షణను పొందాను. నేటి AI, డీప్ఫేక్ యుగంలో ఒక నటుడికి ఇది అత్యంత అవసరమైన రక్షణ. ఈ విజయంలో పాలుపంచుకున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు’ అని ఆయన ట్వీట్ చేశాడు.
నటి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమెతో పాటు పలువురు యూట్యుబర్లపై కూడా కేసు నమోదైంది. సాయిబాబ దేవుడు కాదు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రేపు ఉదయం 10 గంటకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
నటి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమెతో పాటు పలువురు యూట్యుబర్లపై కూడా కేసు నమోదైంది. సాయిబాబ దేవుడు కాదు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రేపు ఉదయం 10 గంటకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
నటి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమెతో పాటు పలువురు యూట్యూబర్లపై కూడా కేసు నమోదైంది. సాయిబాబా దేవుడు కాదు అంటూ మాధవీలత, యూట్యూబర్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచింది. ఇప్పటికే రెండు పాటలు విడుదలై అలరించగా, తాజాగా రేపు ‘మెగావిక్టరీమాస్’ సాంగ్ను విడుదల చేయబోతున్నారు. ఈ పాట లాంచ్ కార్యక్రమం గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మ.3 గంటలకు ఘనంగా జరగనుంది.
‘ఈటీవీ విన్’ వేదికగా విడుదలైన ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్-1 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మేకర్స్ సీజన్-2ను కూడా సిద్ధం చేశారు. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ‘ఈటీవీ విన్’ అధికారికంగా ప్రకటించింది. ఈ థ్రిల్లర్ సిరీస్కు ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించగా, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించింది.
రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. నటుడు జగపతి బాబు ఈ చిత్రంలో ‘అప్పలసూరి’ అనే కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు. చిత్రంలోని ఆయన పోస్టర్ను కూడా విడుదల చేశారు.
టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లవ్ సింబల్ పోజుతో ఆకట్టుకున్న ఈ ఫొటోల్లో, ఆమె చేతిపై పెన్నుతో ఏదో రాసి ఉండటాన్ని గమనించిన ఓ అభిమాని దాని గురించి ఆరా తీశాడు. దీనికి నిధి సరదాగా స్పందిస్తూ.. ‘అయ్యో.. మళ్లీ దొరికిపోయానా?’ అంటూ రిప్లై ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఈ క్యూట్ సమాధానం ప్రస్తుతం SMలో నెటిజన్లను అలరిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘AA22’. ఈ మూవీని దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కులను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాపై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది.. ఈసారి అఖిల్ హిట్ కొట్టడం ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ గెస్ట్ రోల్లో మెరవనుందట. నిర్మాత మాటలతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
‘రాజాసాబ్’ రిలీజ్ హడావుడిలో ఉన్నా ప్రభాస్ తన మంచి మనసు చాటుకున్నాడు. హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ సినిమా విజయం సాధించడంపై డార్లింగ్ స్పందించాడు. ‘ఆది అండ్ టీమ్కు కంగ్రాట్స్’ అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. తన సినిమా బిజీలోనూ పక్కోడి విజయాన్ని గుర్తించి విష్ చేయడం ప్రభాస్కే చెల్లిందంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ ఈరోజే వచ్చేస్తోంది. నిజానికి నిన్నే రిలీజ్ కావాల్సి ఉన్నా, టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ఇవాళ పక్కాగా రిలీజ్ ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మారుతి డైరెక్షన్లో జనవరి 9న సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ మూవీలో.. ప్రభాస్ వింటేజ్ లుక్, హారర్ కామెడీ హైలైట్ కానున్నాయి.