పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘రాకాస’ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారని నిర్మాత నిహారిక కొణిదెల చెప్పింది. సినిమాని థియేటర్లో చూడాలని కొన్ని సినిమాలకే అనిపిస్తుందని, ‘రాకాస’ అలాంటిదేనని పవన్ చెప్పారని నిహారిక వెల్లడించింది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ఆరు సినిమాలు విడుదల కాబోతున్నాయని, 2026 మొత్తం తమ కుటుంబం ఖాతాలోనే ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
నటి మంచు లక్ష్మి సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షపై ఘాటుగా స్పదించింది. మగవారు కఠిన నిర్ణయాలు తీసుకుంటే మెచ్చుకుంటారని, మహిళలు చేస్తే తప్పుగా చూస్తారని ఆవేదన చెందింది. తన భర్త గురించి చెబుతూ.. ‘నువ్వు ఏ పని చేయగలవో, నేను కూడా అదే చేయగలను’ అని పెళ్లిలోనే ఆయనకు చెప్పానని వెల్లడించింది. తను ఏదైనా తప్పు చేస్తే, నేను కూడా అదే చేస్తాననే భయం తన భర్తలో ఎప్పుడూ ఉంటుందని చెప్పింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి దెబ్బ తగిలినప్పటికీ షూటింగ్లో పాల్గొంటున్నారని నిహారిక వెల్లడించింది. అందుకే తన సినిమా ‘రాకాస’ చూడమని ఆయనను ఇబ్బంది పెట్టలేదని, సమయం దొరికినప్పుడు కచ్చితంగా చూస్తారని చెప్పింది. చరణ్కు SM వాడకం అంతగా తెలియకపోయినా, తమ సినిమా గురించిన సమాచారం ఆయన వరకు చేరిందని ఆమె పేర్కొంది. చరణ్ అన్న సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపింది.
TG: తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెంటల్ విధానం బదులు పర్సంటేజీ విధానానికి 23 థియేటర్ల యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ విధానం రేపటి నుంచి అమల్లోకి రానుంది. దీంతో చిత్ర పరిశ్రమలో పంపిణీదారులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
నిర్మాతగా సక్సెస్ అయిన నిహారిక కొణిదెల నటనకు గుడ్బై చెప్పడం లేదని స్పష్టం చేసింది. ఆమె నిర్మించిన ‘రాకాస’ మూవీ రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. యాక్టింగ్ చేస్తూనే నిర్మాతగా కొనసాగుతానని చెప్పింది. ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందని, మొదటి సీన్ నుంచి చివరి వరకు ఆకట్టుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
హనుమాన్ జయంతి పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం నుంచి సరికొత్త ఫొటోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పవిత్ర దినాన అందరికీ ఆ హనుమంతుడి బలం, భక్తి, సానుకూలత లభించాలని కోరుకుంటూ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. రామ్ చరణ్ పవర్ఫుల్ లుక్ చూస్తుంటే ఈ సినిమాతో ఆయన మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించేలా కనిపిస్తున్నాడు.
నటి సోనాలి బింద్రే, ఆమె భర్త గోల్డీ బెల్పై పూణేలో భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. తనకు సంబంధించిన 30 గుంటల భూమిని అక్రమంగా దక్కించుకున్నారని ఓ రైతు కోర్టుకెక్కారు. అయితే, సోనాలి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తన పేరు ఏ పత్రాల్లోనూ లేదని, కేవలం డబ్బు కోసమే తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
భారతీయ వెండితెరపై రెండు మెగా ప్రాజెక్టుల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ టీజర్ ఇవాళ విడుదలవగా, విజువల్ వండర్గా తెరకెక్కిన ‘వారణాసి’ మరోవైపు నెటిజన్లను ఊపేస్తోంది. ఈ రెండింటిలో మీకు ఏది బాగా నచ్చింది? ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ‘నీలిర’ సినిమా ఈవెంట్లో హీరో రానా సందడి చేశాడు. సాధారణ కమర్షియల్ చిత్రాల్లో ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం చాలా అరుదని ప్రశంసించాడు. యుద్ధం నేపథ్యంలో సాగే సినిమాలో కేవలం పోరాటాలే కాకుండా, మానవీయ కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని రానా కొనియాడాడు. ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలు టాలీవుడ్కు అవసరమని పేర్కొన్నాడు.
‘బైకర్’ హీరో శర్వానంద్తో తన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని హీరోయిన్ మాళవిక నాయర్ చెప్పింది. సెట్లో శర్వా టైమింగ్ అద్భుతమని, తమ ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయని ఆమె పేర్కొంది. సీనియర్ హీరో రాజశేఖర్తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని కొనియాడింది. తండ్రీ తనయుల మధ్య సాగే ఎమోషన్ ఈ సినిమాకు హైలైట్ కానుందని మాళవిక వెల్లడించింది.
‘పళ్లిచట్టంబి’ మూవీలో బలశాలిగా కనిపించేందుకు తాను డైటింగ్ను పక్కనపెట్టి ఇష్టమైనవన్నీ తిన్నానని హీరో టొవినో థామస్ వెల్లడించాడు. విలన్ను ఒంటిచేత్తో విసిరేసే పాత్ర కోసం శారీరకంగా సిద్ధమయ్యానని తెలిపారు. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ ఆస్వాదిస్తున్నానని, మలయాళ చిత్రాల్లో బిజీగా ఉండటం వల్లే నేరుగా తెలుగులో సినిమాలు చేయలేకపోతున్నానని వివరించారు.
TG: ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్, సంక్రాంతికి విడుదలైన రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీనారీ నడుమ మురారి సినిమాలు పైరసీ చేశారని తెలుగు ఫిలిం ఛాంబర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 5 మూవీరుల్జ్, 1 సినీవుడ్, 1 తమిళ్ ఎంవీ వెబ్సైట్లను నిందితులుగా చేరుస్తూ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ తెరపై వస్తున్న తొలి మోటోక్రాస్ సినిమా ‘బైకర్’ అని, దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ కథను మలిచిన తీరు అద్భుతంగా ఉందని హీరోయిన్ మాళవిక ప్రశంసించింది. స్పోర్ట్స్ థ్రిల్లర్తో పాటు తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలమని తెలిపింది. మూడు భిన్నమైన కాలాల్లో సాగే ఈ కథలో నటించడం తనకు సవాల్గా అనిపించిందని, యూత్కు ఈ మూవీ స్ఫూర్తినిస్తుందని చెప్పింది.
హీరోయిన్ మాళవిక నాయర్ నటించిన తాజా చిత్రం ‘బైకర్’ ఈ నెల 3న విడుదల కానుంది. ఇందులో శర్వానంద్కు జోడీగా ఆమె నటించింది. ఈ సినిమాలో తన పాత్ర ఒక వారధిలా ఉంటుందని, ఓ క్రీడాకారుడి జీవితంలో భాగస్వామి పాత్ర ఎంత కీలకమో తన పాత్ర ద్వారా తెలుస్తుందని ఆమె పేర్కొంది. మూడు కాలాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని మాళవిక ధీమా వ్యక్తం చేసింది.
‘యుగానికి ఒక్కడు 2’ సీక్వెల్పై హీరోయిన్ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నా నుంచి యుగానికి ఒక్కడు-2 ఆశించవద్దు. ఆ సినిమా జరిగితే మంచిదే, కానీ అందులో నేను ఉండను. ఎందుకంటే సెల్వరాఘవన్తో పనిచేయడం చాలా కష్టం. మొదటి భాగం కోసం మేము ఏకంగా 200 రోజులు షూటింగ్లో పాల్గొన్నాము’ అని చెప్పింది. కానీ ఆ సినిమా తర్వాత తను చేసిన ఏ పాత్రనైనా సులభంగా చేయగలిగానని పేర్కొంది.