తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనను ICUలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది తన కుమారుడు మరణించడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు.
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) అనారోగ్యంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనను ICUలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది తన కుమారుడు మరణించడంతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు.
‘మన శంకరవరప్రసాద్ గారు’లో చిరంజీవి టైమింగ్ని పూర్తిగా వాడుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ చిత్రం అభిమానులకు రెండున్నర గంటల పాటు ‘టైమ్ మెషిన్’ రైడ్ లాగా ఉంటుందని అతడు పేర్కొన్నాడు. ‘లీడర్ రాజు’ (ముఠామేస్త్రి), ‘ఆటో జానీ’ (రౌడీ అల్లుడు), ‘గ్యాంగ్ లీడర్’లోని రఘురామ్ పాత్రలను ఆధారంగా చేసుకుని ఆయన పాత్రను తీర్చిదిద్దినట్...
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమాపై సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. జనవరి 8న ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా APలో భారీగా ప్రీమియర్స్కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ షోలకు టికెట్ ధర రూ.800 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’పై దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించాడు. ‘ధురంధర్ ఒక అద్భుతం. అయితే ఈ సినిమాలో రెండు చోట్ల నాకు ఇబ్బందిగా అనిపించింది. ఒకటి మాధవన్ చెప్పే ‘దేశం గురించి ఆలోచించే రోజు వస్తుంది’ అనే డైలాగ్.. రణ్వీర్ సింగ్ చెప్పే ‘ఇది నవ భారతం’ అనే డైలాగ్. ఈ రెండు ఒక పార్టీకి చెందిన ప్రచార ధోరణిలో ఉన్నాయని నా అభిప్రాయం...
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ‘NBK-111’ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ రెండు వేర్వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ కథతో.. చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీతో రాబోతుంది. తాజాగా ఈ కథ మారినట్లు వార్తలొస్తున్నాయి. ఎపిక్ కథను పక్కనబెట్టి మరో సాలిడ్ కథతో సినిమా చేయనున్నారట. హిస్టారికల్ మూవీకి చాలా టైం పడుతుందని, బడ్జెట్ ఎక్కువవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జై భానుశాలి, మాహి విజ్ విడాకులు ప్రకటించారు. 2011లో పెళ్లి చేసుకున్న వారు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నట్లు తెలిపారు. కాగా, హిందీలో జై భానుశాలి అనేక హిందీ సీరియల్స్లో నటించింది. పలు షోలలో హోస్ట్గా చేసింది. బిగ్ బాస్ 12, 13లో పాల్గొంది. మాహి ‘తపన’ మూవీ, చిన్నారి పెళ్లికూతురు వంటి సీరియల్స్లో నటించాడు. BB 13లో పాల్గొన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకుపైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లీన్ హిట్ అందుకోవాలంటే రూ.450-500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదరగొడుతోంది. ఈ సినిమా కేవలం ఇండియా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.800 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. త్వరలోనే బాలీవుడ్లో కలెక్షన్స్ పరంగా ‘పుష్ప 2’ మీద ఉన్న రికార్డును ఇది బ్రేక్ చేయనునట్లు సినీ వర్గాలు తెలిపాయి.
మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్పై సాలిడ్ అప్డేట్ వచ్చింది. జనవరి 5న రాత్రి 9 గంటలకు టీజర్ విడుదల కానుంది. యూరప్లోనే అతిపెద్దది అయిన పారిస్లోని ‘లే గ్రాండ్ రెక్స్’ లో దీన్ని రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్ను ప్రదర్శించిన తొలి భారతీయ సినిమాగా ఈ మూవీ నిలవనుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్ఫ్లిక్స్ పోస్టు పెట్టింది. ఇక ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు నటించారు.
➠ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 – రూ.4300CR➠ స్టార్ వార్స్ అండోర్ సీజన్ 2 – రూ.2400CR➠ సెవెరెన్స్ సీజన్ 2 – రూ.1800CR➠ ప్లూరిబస్ – రూ.1125CR➠ ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 – రూ.1000CR+.
మలయాళ హీరో నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన ‘సర్వం మాయ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డిసెంబర్ 25న రిలీజైన ఈ సినిమా 10 రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ హర్రర్ కామెడీ సినిమా నివిన్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.
తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకురాలు సుధా కొంగర కాంబోలో ‘పరాశక్తి’ మూవీ తెరకెక్కింది. 2026 జనవరి 10న ఇది థియేటర్లలో సందడి చేయనుంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా.. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రవి మోహన్, అథర్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తిరుమల శ్రీవారిని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నాడు. నిర్మాత సాహు గారపాటి తదితరులతో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఈ నెల 12న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ విడుదల కాబోతుందని చెప్పాడు. తిరుపతిలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలిపాడు.