‘ధురంధర్ 2’ సంచలన విజయం దర్శకుడు రాజమౌళి ఆలోచన విధానంలో మార్పు తెచ్చినట్లు తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్ట్ ‘వారణాసి’ని కేవలం ఒకే భాగంగా కాకుండా, రెండు భాగాలుగా తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. తన రూ.1000 కోట్ల బడ్జెట్ కథను కుదించకుండా ఎపిక్ నెరేటివ్గా అందించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇందుకోసం సీనియర్ రైటర్లతో చర్చలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.
స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1390 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కర్ణాటకలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అలాగే, అత్యధిక వసూళ్లు చేసిన టాప్ భారతీయ చిత్రాల జాబితాలో, గతంలో నాలుగో స్థానంలో ఉన్న ‘ధురంధర్ 1’ (రూ.1350 కోట్లు) రికార్డును దాటేసింది.
‘ధురంధర్ 2’లో రణ్వీర్ నటనపై దర్శకుడు RGV ప్రశంసలు కురిపించాడు. రణ్వీర్ కళ్లలో కనిపించే ఆ తీవ్రత, భావోద్వేగాలు అద్భుతమని అన్నాడు. ఆయన ఎనర్జీకి, మాధవన్ నిశ్శబ్దమైన అథారిటీ తోడై సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పాడు. ప్రతి చిన్న పాత్రకు ఒక డెప్త్ ఇవ్వడం ఆదిత్య ధర్ గొప్పతనమని, నటుల నుంచి మైక్రో ఎక్స్ప్రెషన్స్ రాబట్టడంలో అతను సక్సెస్ అయ్యాడని చెప్పాడు.
దర్శకనటుడు తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘గాయపడ్డ సింహం’. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ‘బ్రైడ్ సాంగ్’ అనే తొలి పాట ఏప్రిల్ 1, 2026న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఇక దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
క్యాస్టింగ్ కౌచ్పై సీనియర్ నటి సత్యకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది కేవలం సినీ రంగంలోనే కాదు, ప్రతి చోటా ఉంది. మా వారు ధైర్యంగా బయటకు చెబుతున్నారు కాబట్టి అందరికీ తెలుస్తోంది. ఎవరైనా హద్దు దాటితే మహిళలు నో చెప్పే ధైర్యం కలిగి ఉండాలి. సినీ అవకాశాల కోసం కొంతమంది తప్పుదోవ పడుతున్నారు. మూవీ లేకపోతే జీవితమే లేదనుకునే వారే ఇలాంటి వలలో పడుతున్నారు’ అని చెప్పింది.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో క్రేజీ ప్రాజెక్టు రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఇందులో స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటించనున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానుంది.
సాధారణంగా ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడమే గొప్ప విషయం అనుకునే రోజుల్లో, ప్రభాస్ ఏకకాలంలో మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ విభిన్న సినిమాల కోసం వేర్వేరు బాడీ లాంగ్వేజ్, లుక్స్ కోసం అతడు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాడట. ప్రభాస్ డెడికేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
లాస్ ఏంజిల్స్లోని ఐమాక్స్లో రణ్బీర్ కపూర్ ‘రామాయణ’ గ్లింప్స్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రణ్బీర్ మాట్లాడుతూ.. ‘శ్రీరాముడు కేవలం పురాణ పాత్ర కాదు.. కోట్ల మంది అంతరాత్మ. కరుణ, ధైర్యం, నీతికి ఆయన నిలువుటద్దం. కష్టకాలంలో మనిషి ఎలా ఉండాలో నేర్పిన మర్యాద పురుషోత్తముడు ఆయనే. అలాంటి గొప్ప పాత్రను పోషించడం నా అదృష్టం’ అని అన్నాడు.
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబోలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(LIK). ఏప్రిల్ 10, 2026న ఈ సినిమా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా రన్టైం 2:36 గంటలుగా లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది.
యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ పైరసీ ఉచ్చులో చిక్కుకుంది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ చిత్ర పూర్తి వెర్షన్ యూట్యూబ్లో లీక్ కావడం కలకలం రేపింది. అప్రమత్తమైన అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్కు సమాచారం అందించగా, చిత్రబృందం వెంటనే యూట్యూబ్కు ఫిర్యాదు చేసింది. దీంతో యూట్యూబ్ ఆ పైరేటెడ్ లింక్ను తక్షణమే తొలగించడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న మూవీ ‘రామాయణ’. ఏప్రిల్ 2న ఈ మూవీ గ్లింప్స్ విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ గ్లింప్స్ సెన్సార్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డు ‘U’ సర్టిఫికెట్ జారీ చేసిందట. ఇక ఈ గ్లింప్స్ 2:38 నిమిషాల నిడివితో రాబోతున్నట్లు టాక్.
సినిమా నేపథ్యం లేని నటీనటులు కెరీర్ మొదట్లో ఎదుర్కొనే ఒత్తిళ్లు, విమర్శలపై కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన చిరునవ్వుపై కూడా విమర్శలు వచ్చేవని, అయితే వాటిని అధిగమించి ముందుకు సాగడమే ముఖ్యమని పేర్కొంది. ‘మిమ్మల్ని మీరు నమ్మడమే మీ సూపర్ పవర్’ అని చెబుతూ, విమర్శలకు కుంగిపోకుండా కష్టపడితేనే మార్పు సాధ్యమని చెప్పింది. మనసు మాట వింటూ శ్రమించాలని తెలిపింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య, తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ H. వినోద్ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినోద్ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని జాగారం స్టూడియోస్ భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లు టాక్. ఈ వార్తతో సూర్య అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘వృషకర్మ’. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ చిత్రం, కీలకమైన యాక్షన్ షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. మే చివరికి షూటింగ్ ముగించి, అక్టోబర్ 2026 (దసరా) కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చైతన్య సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు.
టాలీవుడ్లో భారీ చిత్రాల వాయిదాల పరంపర పరిశ్రమను కలవరపెడుతోంది. ‘ప్యారడైజ్’, ‘పెద్ది’ వంటి క్రేజీ ప్రాజెక్టులు గ్రాఫిక్స్, నిర్మాణ జాప్యాల వల్ల వెనక్కి తగ్గడంతో థియేటర్ల క్యాలెండర్ తలకిందులవుతోంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందులు ఎదురవడంతో పాటు చిన్న సినిమాల విడుదలపై అనిశ్చితి నెలకొంది. ఈ గందరగోళం ఇండస్ట్రీ ప్లానింగ్ను దెబ్బతీస్తోంది.