హీరోయిన్ రష్మిక అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. టోక్యోలో జరగనున్న ‘2026 క్రంచీరోల్ యానిమే అవార్డ్స్’ ప్రదానోత్సవంలో ఆమె ప్రెజెంటర్గా పాల్గొనబోతోంది. 2024లోనూ ఆమె తొలిసారిగా ఈ వేడుకకు హాజరైంది. ఇప్పుడు రెండోసారి కూడా ఈ ప్రతిష్టాత్మక ఆహ్వానాన్ని అందుకోవడం ద్వారా, ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి సెలబ్రిటీగా రష్మిక కొత్త రికార్డు సృష్టించింది.
స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.30 కోట్ల భారీ పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో యాష్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
హీరోయిన్ మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒంటరితనం వల్ల తాను ఎంతో బాధ పడ్డానని తెలిపింది. గత నెల తనకెన్నో అనుభూతులు అందించినట్లు పేర్కొంది. ముఖ్యంగా త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో ‘పాకెట్ నవల్’ కోసం పని చేయడం అద్భుతమైన అనుభవం అని చెప్పింది. అలాగే, ఇంటికి అంతకాలం దూరంగా ఉండటం ఎక్కువగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. రేపు కావ్య రెడ్డి అనే అమ్మాయితో శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక జరగనుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరుకానున్నారు. ఇక వీరి వివాహం ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగనుంది. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈనెల 5న కావ్య రెడ్డి అనే అమ్మాయితో శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక జరగనుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరుకానున్నారు. ఇక వీరి వివాహం ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగనుంది. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.
శ్రీవిష్ణు హీరోగా, రెబా మోనికా జాన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మృత్యుంజయ్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈరోజు నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు, అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం Sony LIVలో అందుబాటులో ఉంది.
ఆది సాయికుమార్ హీరోగా, ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హాస్య మూవీస్’ బ్యానర్పై నిర్మించనుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్ను లాంచ్ చేశారు. ఈ సినిమాకు ‘సైరా భాను’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీతో బాంధవి శ్రీధర్ హీరోయిన్గా వెండితెరకు పరిచయం కాబోతోంది.
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘GOAT’. ఈ సినిమా ట్రైలర్కు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఈనెల 6న ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నట్లు హీరో స్వయంగా వెల్లడించాడు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
బిచ్చగాడు’ వంటి భారీ హిట్ తర్వాత విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వంద దేవుళ్ళు’. ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ను రేపు విడుదల చేయనున్నట్లు హీరో స్వయంగా ప్రకటించాడు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాత్రలో లీనమవడం ఎంత ముఖ్యమో, దానినుంచి బయటకు రావడం కూడా అంతే ముఖ్యమని తెలిపింది. షూటింగ్ ఒత్తిడి నుంచి బయటపడేందుకు సంగీతం వినడం, ఒంటరిగా గడపడం, కుటుంబసభ్యులతో వీడియో కాల్లో మాట్లాడటం వంటివి తనకు ఉపశమనాన్ని ఇస్తాయని పేర్కొంది. ఈ చిన్న చిన్న అలవాట్లే తనను మాములు స్థితికి తీసుకువస్తాయని చెప్పుకొచ్చింది.
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ విడుదలపై వస్తున్న రూమర్లకు ఇప్పటికే చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఏప్రిల్ 8న ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు.
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ విడుదలపై వస్తున్న రూమర్లకు ఇప్పటికే చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఏప్రిల్ 30న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఏప్రిల్ 8న ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు.
దర్శకుడు ఓంరౌత్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై అజయ్ దేవగణ్ టీమ్ తాజాగా స్పందించింది. ఓంరౌత్ దర్శకత్వంలో అజయ్ సినిమా చేస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం అజయ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని వెల్లడించింది.
రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్-2 మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,501 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఇండియాలో రూ.1,134 కోట్లు, విదేశాల్లో రూ.367 కోట్లు రాబట్టినట్లు పేర్కొంది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ నటించారు.
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన నెక్స్ట్ మూవీని అధికారికంగా ప్రకటించాడు. సుజీత్ సందీప్ ఈ క్రేజీ ప్రాజెక్ట్కు దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. ‘విరూపాక్ష’ వంటి హిట్ తర్వాత సాయి దుర్గ తేజ్ ఈ మూవీ చేయనుండటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.