టాలీవుడ్ హీరో గోపీచంద్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబోలో మూవీ రాబోతుంది. ఈ నెల 12న గోపీచంద్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. మూవీకి సంబంధించిన గ్లింప్స్ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, ‘గోపీచంద్ 33’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా హిస్టారికల్ ఎపిక్ మూవీగా రాబోతుంది.
నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని ఓ సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘NBK 111’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. కాగా, వీరిద్దరి కాంబోలో గతంలో ‘వీరసింహారెడ్డి’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
యువసమ్రాట్ నాగార్జున చేయబోతున్న 100వ చిత్రం అక్కినేని అభిమానులలో పెద్ద సందడిగా మారింది. కింగ్ 100 టైటిల్ ఫిక్స్ అయినట్టుగా వినిపిస్తున్న ఈ చిత్రం నాగార్జున కెరీర్లోనే అతి పెద్ద ప్రయత్నం అవుతుందని కూడా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి తెలుగులో డబ్ అయిన తమిళ చిత్రం ఆకాశం డైరెక్ట్ చేసిన ఆర్ఎ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్స్టర్ డ్రామా కథాంశంతో తెరకెక్కుత...
ఇండియన్ సినిమాలో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నది మోడర్న డైరెక్టర్లలో ఒక్క ఆర్జీవి మాత్రమే. కానీ ఆయన గత దశాబ్దంలో తీసిన సినిమాలు అన్నీ ఆయన పేరుప్రతిష్టలను కించపరిచేవిధంగానే ఉన్నాయి తప్పితే ఆయన ఫేంకి ఏమాత్రం కల్సిరాలేదు. దీనికి తోడు ఆయన విచ్చలవిడి నైజం, సోషల్ మీడియాలలో ఆయన విశృంఖలమైన వ్యవహారశైలి, ఆయన ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడే తిక్కమాటలు వెరసి ఆయన స్థాయిని పూర్తిగా అంటే పూర్తిగా దిగజార్చేశ...
ఇదే ప్రస్తుతం కన్నడ మీడియా నుంచి తెలుగు మీడియా వరకూ అంటే సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా జరుగుతున్న హోరాహోరీ చర్చ. దీనికి మొదలు ఎక్కడంటే, మొన్నీ మధ్యనే బెంగళూరులో కన్నప్ప సినిమా ఈవెంటె జరిగింది. ఆ ఈవెంట్ యాంకర్ మోహన్బాబుని పద్మభూషణ్ అని సంభోదిస్తూ ఆయనను ప్రసంగించమని కోరింది. ఆ ఎడ్రసింగ్ని విని కొందరు అక్కడికక్కడే అవాక్కయ్యారు. దేశంలో ఎవరికేం బిరుదులు వచ్చాయి అనే లౌకికజ్ఞానం దాదాపుగా అందరిక...
తమిళ హీరో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను నాగార్జున పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఫొటోలు షేర్ చేశారు. అలాగే సినిమా ప్రమోషన్స్ను కూడా త్వరలో ప్రారంభించనున్నారు. కాగా, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’లో దీపిక కీలక పాత్రలో నటించింది. అయితే, సీక్వెల్లో ఆమె ఉండదని వార్తలొస్తున్నాయి. దీపిక ప్లేస్లో యంగ్ హీరోయిన్కి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై మేకర్స్, దీపికా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
అరవింద్కీ బన్నీవాసుకి చెడిపోయిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అరవింద్ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం చేస్తున్నారని, దాని వల్ల సంస్ధకి చేద్దామనుకుంటున్న హీరోలు మరో సంస్థకి మళ్ళిపోతున్నారనే ఆవేదన బన్నీవాసుని ఆవేదనకి గురి చేస్తున్నాయని, అందుకే తను వేరే నిర్మాణ సంస్థను ప్రారంభించే ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోతున్నాడని, అందుకు అల్లు అర్జున్ మద్దతు కూడా లభించిందని అనుకుంటున్నారు.
బాలీవుడ్లో కొంతకాలంగా రిలీజ్ అవుతోన్న మూవీలు ఆశించిన ఫలితం అందుకోలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్, రణ్ బీర్ కపూర్ సౌత్ డైరెక్టర్స్తో మూవీలు చేసి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు వారి బాటలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ తదితర హీరోలు నడుస్తున్నారు.
నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్ చేశాడు. ‘నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షుకులను థియేటర్లలోకి ఎలా రప్పించాలి అనే విషయం గురించి ఆలోచించాలి. మూవీ విడుదలైన 28 రోజుల్లోపే OTTకి ఇచ్చే ట్రెండ్ కొనసాగితే 4-5 ఏళ్లలో 90% థియేటర్లు మూతబడుతాయి. పెద్ద హీరోలు 2-3 ఏళ్లకు ఒక మూవీ చేస్తూ పోతే ప్రేక్షకులు థియేటర్లకు దూరమైపోతారు’ అని చెప్పాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో నెలకొన్న డబ్బు వివాదంలో హీరో విశాల్కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. సదరు సంస్థకు 30% వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని.. తిరిగి ఇవ్వలేదని లైకా 2022లో కోర్టును ఆశ్రయించింది.
భారీబడ్జెట్తో వస్తున్న కుబేర సినిమాకి ఏ లోటు లేదు. డబ్బుకి లోటు లేదు, థియేటర్లకు లోటు లేదు. మంది మార్బలంకి అస్సలు లోటు లేనే లేదు. కానీ ఎన్ని ఉన్నా సరే, సినిమాలో దమ్ము లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది ఈ మధ్య రోజుల్లో ఎన్నో సినిమాల ఫెయిల్యూర్స్ నిరూపించి చూపించాయి.
కానీ, కుబేర ఈ బ్రాకెట్లోనుంచి తప్పించుకున్నట్టుగా కనిపిస్తోంది.
మధ్రాసులో జరిగిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ మాట్లాడుతున్నప్పుడు సభలో కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారబ్బాయి, అక్కడి అందరి అభిమాన కథానాయకుడు శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. ఇప్పుడు కమల్ మీద కన్నడిగులు ఎంతలా ఫైర్ అవుతున్నారో, శివరాజ్ మీద కూడా అంతే ఫైర్ అవుతున్నారు కర్ణాటకలో.
‘వేదం’ సినిమా విడుదలై నిన్నటితో 15ఏళ్లు పూర్తయింది. ఈ సినిమా ప్రమోషన్స్లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోను పెద్ద హోర్డింగ్ చేసి HYD పంజాగుట్ట సర్కిల్లో పెట్టారట. అయితే అనుష్క అందాన్ని చూస్తూ 40 యాక్సిడెంట్స్ జరిగాయట. దీంతో పోలీసులు GHMC అధికారులతో కలిసి వాటిని తొలగించారట.
తమిళభాషలో నుంచే కన్నడ భాష ఆవిర్భవించిందన్న కమల్ మాటకి కర్ణాటక మొత్తం భగ్గుమంది. కమల్ ఎంత గొప్ప నటుడు అనే విషయాన్నే పూర్తిగా విస్మరించి, కమల్ని నానా బూతులు తిడుతున్నారు. ఆయన లేటెస్ట్ సినిమా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో జరిగిన ఈవెంట్లో కమల్ అనాలోచితంగా, అర్ధం పర్థం లేకుండా, అస్సలు సందర్భానికి ఏ మాత్రం సంబంధం లేకుండా తమిళభాషలోనుంచే కన్నడ భాష ప...