రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రష్మిక స్పందించింది. ‘ఈ వార్తలను నేన్ను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని ఖండించలేను. పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను. తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను’ అని తెలిపింది.
రకుల్ ప్రీత్ సింగ్ తన కుటుంబ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన ఆర్థికంగా ఎప్పుడూ స్థిరంగా ఉంటారనేది సరికాదని తెలిపింది. సినీ రంగంలో ఒడిదొడుకులు చాలా సహజమని, అమితాబ్ బచ్చన్ వంటి వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చింది. సినిమా నిర్మాణం అనేది అతిపెద్ద రిస్క్తో కూడుకున్న వ్యాపారమని.. ఒడుదొడుకులు సాధారణమని పేర్కొంది.
ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్(85) కన్నుమూశారు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళంలో ఆయన 300కి పైగా సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ సహా పలు సినిమాలు తీశారు.
పవన్ కళ్యాణ్తో మరో చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘అర్జున’ అనే ఓ పవర్ఫుల్ టైటిల్ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అయితే ఈ మూవీకి పవన్ ఓకే చెప్పాడా? ఎవరితో డైరెక్ట్ చేయిస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో దిల్ రాజు.. పవన్ ‘వకీల్ సాబ్’ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.
‘ద్రౌపది 2’లోని ‘ఎం కోనె’ పాట పాడినందుకు సింగర్ చిన్మయి సడన్గా క్షమాపణ చెప్పారు. సినిమా ఐడియాలజీ తెలియక పాడానని, తెలిసి ఉంటే ఒప్పుకునేదాన్ని కాదని ఆమె కామెంట్ చేశారు. దీనిపై డైరెక్టర్ మోహన్ సీరియస్ అయ్యారు. తమతో మాట్లాడకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని, వెంటనే ఆ ట్వీట్ డెలీట్ చేయాలని లేదా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘అఖండ 2’ ప్రమోషన్స్లో భాగంగా నందమూరి బాలకృష్ట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ తన జన్మభూమి అని చెప్పారు. అలాగే, తెలంగాణ తన కర్మభూమి అని.. ఆంధ్రప్రదేశ్ ఆత్మభూమి అన్నారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటం గర్వంగా ఉందన్నారు. కాగా, బాలయ్య నటించిన ‘అఖండ-2’ శుక్రవారం విడుదల కానుంది.
‘ది ఫ్యామిలీ మ్యాన్3’ వెబ్సిరీస్ అమెజాన్ ప్రైమ్లో మరో రికార్డు సృష్టించింది. ఇది తొలివారంలో ఇండియాలోని 96శాతం పిన్కోడ్స్కు చేరువైంది. అంతేకాకుండా, భారత్ సహా 35 దేశాల్లో టాప్-5 ట్రెండింగ్లో నిలిచింది. UK, కెనడా, AUS, UAE, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ ఈ సిరీస్ను ఎక్కువమంది వీక్షించారు.
తమిళ హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘తేరే ఇష్క్ మే’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.71 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రాబోయే రోజుల్లో దీని కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీలో కృతి సనన్ కథానాయికగా నటించగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందించారు.
చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. NOV 21న విడుదలైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT వేదిక ఈటీవీ విన్లో సంక్రాంతి కానుకగా జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక యువ నటీనటులు అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సాయిలు కంపాటి తెరకెక్కించాడు.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా కథకు, అమరుడైన మేజర్ మోహిత్ శర్మ జీవితానికి సంబంధం లేదని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సినిమాను పునఃపరిశీలించిన CBFC.. ఈ మూవీ కథ కల్పితమని తెలిపింది. అనుమతి లేకుండా తమ కుమారుడి జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారని మోహిత్ తల్లిదండ్రులు ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను అసభ్యకర రీతిలో ఎడిట్ చేసి కొందరు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశంపై రష్మిక మందన్న స్పందిస్తూ.. మానవుల్లాగా ప్రవర్తించని వారికి శిక్ష విధించాలంటూ Xలో పోస్ట్ పెట్టింది. దానికి సైబర్ దోస్త్ అకౌంట్ను ట్యాగ్ చేసింది.
నటసింహం బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ 2’. ఈ నెల 5న ఇది రిలీజ్ కానుంది. ఈ సినిమా ముందు భారీ టార్గెట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.114 కోట్లు జరిగిందట. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.116 కోట్లకు పైగా వసూళ్లు సాధించాల్సి ఉంది. మరోవైపు ఈ మూవీ ఈజీగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తనపై నమోదైన బెంగళూరు రేవ్ పార్టీ కేసును కొట్టేసిన విషయాన్ని తక్కువమంది రాశారని నటి హేమ తెలిపింది. తాను బర్త్ డే పార్టీకి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ దొరికాయని, కానీ రెడ్హ్యాండెడ్గా దొరికిన హేమ అని రాశారని చెప్పింది. ఆ సమయంలో తనకు రోజుకు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపింది. వాటికి సంధానం చెప్పలేక వీడియో చేసి పెట్టానని, దాన్ని కూడా తప్పుగా చూపారని పేర్కొంది.
2025లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల, దర్శకుల జాబితాను IMDB ప్రకటించింది. ‘సైయారా’ స్టార్స్ అహాన్ పాండే, అనీత్ పడ్డా, ఆమిర్ ఖాన్ టాప్ 3లో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇషాన్ ఖట్టర్, లక్ష్య, రష్మిక మందన్న, కళ్యాణి ప్రియదర్శన్, త్రిప్తి డిమ్రి, రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి ఉన్నారు. దర్శకుల జాబితాలో మోహిత్ సూరి, ఆర్యన్ ఖాన్, లోకేష్ కనగరాజ్ టాప్ 3లో నిలిచారు.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనికి ‘ఇరుముడి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ కూతురిని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి పడే తాపత్రయం నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.