మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలకు మాజీ సర్పంచ్ నవ్య మద్దతు ప్రకటించారు. తమ దుస్తులు తమ ఇష్టం అంటున్న వారిపై ఆమె మండిపడ్డారు. ‘పశువులకు ఏమీ తెలియదు కాబట్టే అవి బట్టలు కట్టుకోవు. కానీ మనం కడుపుకు అన్నం తింటున్నాం, మనుషుల్లాగా బట్టలు కప్పుకోవాలి కానీ విప్పుకోకూడదు. బట్టలు విప్పుకునే మీలాంటి వారి వల్లే సమాజంలో మంచి మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మూవీ ఇవాళ రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. తాజాగా దీని OTTపై అప్డేట్ వచ్చింది. రూ.12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ఆహా రూ.10 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి మూడో వారంలో ఇది OTTలో స్ట్రీమింగ్ కానుందట. ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ కొనుగోలు చేసినట్లు టాక్.
నటుడు శివాజీ కాంట్రవర్సీపై అనసూయ SMలో పోస్టులు పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాను ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని బలంగా చెబుతానని పోస్ట్ పెట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి సమాజంలో పట్టించుకోని అంశంపై పోరాటం చేయడం తన ఉద్దేశమని, ఎన్ని జరిగినా తాను చెప్పిన దానిపై కట్టుబడి ఉంటానని పేర్కొంది. మీరు అలా అసూయపడుతూనే ఉండండని.. తాము మరింత శక్తివంతంగా, ఆకర్షణీయంగా ముందుకుసాగుతామని తెలిపింది.
నటుడు శివాజీ కాంట్రవర్సీపై అనసూయ SMలో పోస్టులు పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాను ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని బలంగా చెబుతానని పోస్ట్ పెట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి సమాజంలో పట్టించుకోని అంశంపై పోరాటం చేయడం తన ఉద్దేశమని, ఎన్ని జరిగినా తాను చెప్పిన దానిపై కట్టుబడి ఉంటానని పేర్కొంది. మీరు అలా అసూయపడుతూనే ఉండండని.. తాము మరింత శక్తివంతంగా, ఆకర్షణీయంగా ముందుకుసాగుతామని తెలిపింది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ‘జైలర్ 2’ మూవీలో షారుఖ్ ఖాన్ నటించనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నటుడు మిథున్ చక్రవర్తి హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలో మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్లు అతిథిపాత్రల్లో కనిపించనున్నట్లు తెలిపాడు. దీంతో ఈ సినిమాలో షారుఖ్ ఉండనున్నట్లు కన్ఫర్మ్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘సైక్ సిద్ధార్థ’ ప్రమోషన్స్లో నటుడు నందు ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తాను చేయని పనికి తన మీద ఆరోపణలు వచ్చాయన్నాడు. ఆ సమయంలో తనతో పాటు కుటుంబం మొత్తం బాధపడిందని తెలిపాడు. అప్పుడు గీత తనతో ‘ఇక్కడ ఉండలేం.. అనీ వదిలేసి వేరే దేశానికి వెళ్లిపోయి హోటల్లో పని చేసుకుందామని చెప్పిందని, అవి గుర్తుచేసుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవని అన్నాడు.
ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతపై సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అభిమానులు దగ్గరగా వస్తే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని, వారిలో చాలామందికి ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవని తెలిపింది. అభిమానంతో, ఆనందంగా దగ్గరికి వస్తారని పేర్కొంది. కానీ ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా, బాధ్యతతో ఉంటే సరిపోతుందని తెలిపింది.
అది నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న కాలం. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకున్న మైఖేల్(రోషన్) రజాకార్లపై పోరుకు ఎందుకు సిద్ధమయ్యాడు? అనేది ‘ఛాంపియన్’ కథ. రోషన్ నటన బాగుంది. పాటలు, విజువల్స్ బాగున్నాయి. కథ, సెకండాఫ్, వార్ సీక్వెన్స్, క్లైమాక్స్ మూవీకి ప్లస్. ఊహకు అందేలా సాగే కథనం, కొన్ని సాగదీత సన్నివేశాలు మైనస్. రేటింగ్: 2.5/5.
కుల వివక్షతతో నిండిన తుళ్లూరు అనే పల్లెటూరి(TG)లో ఉన్నత కులానికి చెందిన శివాజీ ఎందుకు బహిష్కరణకు గురవుతాడు?.. ఆ గ్రామంలో ఎలాంటి సంఘర్షణలు జరిగాయనేది ‘దండోరా’ కథ. నటీనటుల నటన బాగుంది. బలమైన పాత్రలు, కథ, మ్యూజిక్, డైలాగ్స్, క్లైమాక్స్ మూవీకి ప్లస్. ఫస్టాఫ్, కొన్ని సీన్స్ మైనస్. రేటింగ్:2.75/5.
‘బాహుబలి’ రెండు పార్ట్లు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో OCT 31 రీ-రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ఎపిక్ వెర్షన్లో సుమారు 90 నిమిషాలు తగ్గించారు. మరి ఈ సినిమాకు OTT ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీ ‘నారీనారీ నడుమ మురారి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీలో శ్రీవిష్ణు క్యామియో రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎంట్రీ సినిమాకు కీలకమైందని, ఆయన పాత్ర కామెడీ, ఎమోషన్ మిక్స్తో అదిరిపోతుందని టాక్.
వెయ్యేళ్ల చరిత్ర గల శంబాల గ్రామంలో ఆకాశం నుంచి ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేది మూవీ కథ. మూఢ నమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో దర్శకుడు యుగంధర్ ముని కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆది సాయికుమార్ నటన బాగుంది, కథాంశం, ఉత్కంఠతో సాగే కథనం, మ్యూజిక్, విజువల్స్ మూవీకి ప్లస్. రొటీన్ క్లైమాక్స్ మైనస్. రేటింగ్: 2.75/5.
జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా మంచి హట్ అందుకుంది. గతంలో ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు రాగా.. తాజాగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొరటాల ఎన్టీఆర్కు కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై నటి అనసూయ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై తనకు అనిపించింది తాను చెప్పానని తెలిపింది. అందరూ మమ్మల్ని ఫేక్ ఫెమినిస్టులు అనడం మొదలు పెట్టారని వ్యాఖ్యానించింది. తాను కూడా హీరోయిన్నేనని.. ఆయన వ్యాఖ్యలు తనకూ వర్తిస్తాయని పేర్కొంది.
హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్స్టాగ్రామ్లో మరో పోస్ట్ చేసింది. అయితే నటుడు శివాజీ తాను హీరోయిన్ డ్రెస్స్లపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు. నిధి అగర్వాల్ పడిన ఇబ్బందిని ఉద్దేశిస్తూ అలా మాట్లాడానని చెప్పాడు. తాజాగా దీనిపై నిధి అగర్వాల్ ఇన్స్టాలో స్పందించింది. బాధితులపై తప్పు నెట్టడాన్నే అతి తెలివి అంటారంటూ పోస్ట్లో పేర్కొంది.