నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. నిన్న రాత్రి జరిగిన ఈరోస్ సంస్థ,14రీల్స్ చర్చలు సఫలం అయ్యాయి. ఈ మూవీ విడుదలకు ఈరోస్ సంస్థ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ మద్రాస్ హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా.. ‘అఖండ 2’ విడుదలకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.
దర్శకుడు వెంకీ కుడుములతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా దివంగత నటి ప్రత్యూష జీవితంగా ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రష్మికకు మేకర్స్ కథను వినిపించగా.. ఆమె ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్స్లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్లో పర్యటిస్తున్నారు. అయితే అక్కడి ఉత్తర తీరంలో భూకంపం రావడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి స్పందించాడు. ప్రభాస్ క్షేమంగా ఉన్నాడని తెలిపాడు. ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ‘NBK-111’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయినట్లు సంగీత దర్శకుడు తమన్ అప్డేట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘నరసింహ'(పడయప్ప) మూవీ ఈ నెల 12న రీ-రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సీక్వెల్పై రజినీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘నరసింహ 2’ ఉంటుందని, తాము దీనికి ‘నీలాంబరి’ అనే టైటిల్ లాక్ చేశామని చెప్పారు. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇక దివంగత నటి సౌందర్య, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ మూవీ 1999లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ ...
‘అఖండ 2’ ఇష్యూ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. నిన్నరాత్రి ఈరోస్ సంస్థతో 14రీల్స్కు సానుకూల చర్చలు జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ కోర్టులో ఈ సెటిల్మెంట్ విషయం తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12న రిలీజ్, ఈ నెల 11న ప్రీమియర్ షోలు వేసే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇవాళ ఉదయం 10:30 గంటలకు మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనుంది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ వేయనున్నట్లు సమాచారం. ఈ సెట్లో ప్రభాస్పై ఎంట్రీ సాంగ్ను షూట్ చేయడంతో పాటు యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ హీరో లక్ష్య ప్రధాన పాత్రలో దర్శకుడు రాజ్ మెహతా ‘లగ్ జా గాలే’ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రేమ, ప్రతీకారం లాంటి అంశాలతో యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కనున్నట్లు, ఇందులో టైగర్ ష్రాఫ్ విలన్గా కనిపించనున్నట్లు టాక్. అంతేకాదు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం.
మత్తు పదార్థాల కేసులో సినీ నిర్మాత దినేష్ రాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 19న మత్తుపదార్థాలు విక్రయిస్తున్న దియానేశ్వరన్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన వివరాల ఆధారంగా నిర్మాతతో పాటు ఎంబీఏ గ్రాడ్యుయేట్ శరత్, లా గ్యాడ్యుయేట్ శ్రీనివాసన్, సర్బుద్దీన్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డిల్లోకి తాజాగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ ముందుకువచ్చినట్లు తెలుస్తోంది. WB కోసం 108.4 బిలియన్ డాలర్లు(రూ.9.77 లక్షల కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ఈ విలువ నెట్ఫ్లిక్స్ ఆఫర్ కంటే ఎక్కువ.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమన్నా, శ్రీలీల AI ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. బాత్రూమ్లో టవల్ కట్టుకుని మిర్రర్ సెల్ఫీలు తీసుకున్నట్లు ఉన్న పిక్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇద్దరి AI వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయట. అయితే గతంలో కూడా పలువురు హీరోయిన్ల ఫొటోలను AIతో మార్ఫింగ్ చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఓ తమిళ రీమేక్ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన కాలికి తీవ్రగాయం కావడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా రాజశేఖర్ తమిళ మూవీ ‘లబ్బర్ పందు’ రీమేక్లో నటిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రముఖ హీరో జూ.ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా, ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్, సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తూ.. ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.