ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సదరు సంస్థలో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ తాజాగా రిలీజ్ అయింది. ఇక విక్కీ కౌశల్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
స్టార్ హీరోయిన్ సమంత త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో వివాహం చేసుకున్నాడు. అయితే సమంత కొంత కాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అతడితో త్వరలోనే మూడు ముళ్లు వేయించుకోనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈనెల 12న ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ‘రామ రామ’ అంటూ సాగే పాటను విడుదల చేస్తామని తెలిపింది. బింబిసార ఫేం వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.
మాఫియా కథ నేపథ్యంలో తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫర్వాలేదనిపిస్తుంది. అజిత్ నటన, జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. పాత కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తడబాటుకు గురయ్యాడు. అజిత్ ఎలివేషన్ సీన్లు అలరిస్తాయి. త్రిష, సిమ్రాన్ పాత్రలు ఆకట్టుకోవు. రేటింగ్: 2.5/5.
‘స్త్రీ 2’ కోసం నటి శ్రద్ధా కపూర్ను ఎంపిక చేసింది తాను కాదని దర్శకుడు అమర్ కౌశిక్ చెప్పాడు. నిర్మాత దినేష్ విజయ్ తనని ఎంపిక చేశాడని, ఆమెను ఎంపిక చేయడానికి కారణం కూడా ఆయన తనతో చెప్పాడని తెలిపాడు. ‘శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్వుతుందని, ఈ పాత్రకు తను అయితే పూర్తి న్యాయం చేయగలదని దినేష్ నాతో చెప్పాడు’ అని కౌశిక్ పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు నిర్మాతపై ఫైరవుతున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం అప్డేట్ పంచుకుంది. రిలీజ్ డేట్తో కూడిన గ్లింప్స్ను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉదయం 11:45 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. దీంతో నెట్టింట మెగా అభిమానులు సందడి చేస్తున్నారు.
హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో సీ. సుప్రీత్ కృష్ణ తెరకెక్కించిన సినిమా ‘టుక్ టుక్’. ఇది ఈ నెల 10 నుంచి ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు పలు సినిమాలు సదరు సంస్థలో రిలీజ్ కాబోతున్నాయి. రేపు ‘ఉద్వేగం’ మూవీ విడుదల కానుండగా.. ‘కొత్త కొత్తగా’ అనే మూవీ ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉండనుంది.
నటుడు మాధవన్ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకానొక సమయంలో తీరిక లేకుండా పని చేయాల్సి వచ్చింది. ఆ విసుగుతో నటనకు కొన్నాళ్లు విరామం ఇచ్చి, కేరళ వీధుల్లో తిరిగేవాడిని. పొటాటో, పప్పుల ధరలెంత? ప్రజలు వేటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? తదితర విషయాలు తెలుసుకోవాలనుకున్నా. గడ్డం పెంచి, దేశం మొత్తం తిరిగా’ అని పేర్కొన్నాడు.
కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని హీరో శర్వానంద్ దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. నాగపుట్టలో పాలుపోసి గర్భాలయంలో పూజలు చేశాడు. అనంతరం అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీని హీరో విజయ్ దేవరకొండ కలిశాడు. ఢిల్లీలో జరిగిన ఓ సమ్మిట్లో ప్రధాని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, హీరోయిన్ యామి గౌతమ్, బ్యాట్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ కలిసి ప్రధానితో ఫొటో దిగారు.
విజయాలు సాధించడమే సక్సెస్ కాదని, నచ్చిన విధంగా జీవించడమే అని నటి సమంత చెప్పింది. ‘సక్సెస్ అంటే.. నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ అన్నింటిలోనూ సమర్థవంతంగా రాణించగలగడం. అలాగే మన ఇష్టాయిష్టాలకు తగ్గట్లుగా పనిచేయడం. అంతేకానీ మహిళలను ఒకచోట బంధించి ఇది చేయాలి? ఇది చేయకూడదు అని చెప్పడం కాదు’ అని పేర్కొంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ పునర్జన్మ కాన్సెప్ట్తో ముడిపడి ఉన్న భారీ పీరియాడిక్ డ్రామాతో తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్టుగా బన్నీ 2 భిన్న గెటప్ల్లో కనిపించనున్నాడట. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యత ఉండనున్నట్లు, జూలై లేదా ఆగస్టులో షూటింగ్ మొదలుకానున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
దర్శకుడు మెహర్ రమేశ్ సోదరి సత్యవతి మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. సత్యవతి స్వర్గస్థులవటం ఎంతగానో కలచి వేసిందని అన్నారు. ఆమె తనకూ సోదరేనని.. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. తన సోదరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏప్రిల్ 11న ఇది విడుదల కాబోతుంది. ఇక అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో సంజోష్ కీలక పాత్ర పోషించగా.. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించాడు.
శబరిమలలో మమ్ముట్టి పేరిట మోహన్లాల్ ప్రత్యేక పూజలు చేయించడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఈ అంశంపై మోహన్లాల్ స్పందించారు. ‘అందులో తప్పేముంది?. అతను నా ఫ్రెండ్ కాబట్టి ప్రత్యేక పూజ చేయించాను. అది నా వ్యక్తిగత విషయం’ అని ఓ ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు.