బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన నటీమణుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. పలువురు హాలీవుడ్ దిగ్గజ హీరోయిన్లను ఆమె వెనక్కునెట్టింది. ఈ విషయాన్ని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ హైప్ ఆడిటర్ ప్రకటించారు. కాగా, ఆలియాకు ఇన్స్టాలో 85 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రముఖ హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి పీటలెక్కారు. ప్రియుడు, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్తో ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. కాగా, ప్రియా బెనర్జీ.. తెలుగులో జోరు, కిస్ తదితర సినిమాలతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించారు.
ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ చనిపోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ రాహుల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలాగే తన మామయ్య చనిపోయారని సింగర్ చిన్మయి వెల్లడించారు.
TG: టాలీవుడ్ నటుడు పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రెండ్రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. ఫోన్కాల్స్, మెసేజ్లతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా పృథ్వీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇన్స్టాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్ఫాలో చేశారు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సాయి దుర్గా తేజ్ బన్నీని అన్ఫాలో చేయగా.. తాజాగా చరణ్ కూడా చేశారు. కొంత కాలంగా అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీలోని దబిడి దిబిడి పాటపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంట్రవర్సీపై నటి ఊర్వశి రౌతేలా స్పందించారు. ‘రిహార్సల్స్ సమయంలో అనుకున్న విధంగా.. ఎంతో ప్రశాంతంగా ఈ పాటను చేశాము. కానీ ఉన్నట్టుండి ఈ పాటపై అంతటి నెగిటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అసలు దాన్ని అంచనా వేయలేకపోతున్నాం’ అని పేర్కొన్నారు.
కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘భైరతి రణగల్’. గతేడాదిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా OTTలోకి రాబోతుంది. తెలుగు OTT వేదిక ‘ఆహా’లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక గీతా పిక్చర్స్ బ్యానర్పై దర్శకుడు నర్తన్ ఈ మూవీని తెరకెక్కించారు.
హీరో నాగచైతన్య-శోభిత దంపతులు ప్రధాని మోదీని కలిశారు. పార్లమెంట్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తకావిష్కరణ నిమిత్తం ఈ జంట ప్రధానితో భేటీ అయింది. ఈ మేరకు నాగచైతన్య ట్వీట్ చేశారు. మోదీతో కలిసి తీసుకున్న ఫొటోని పోస్ట్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘VD12’. ఈ మూవీ అప్డేట్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా రౌడీ హీరో అభిమానులకు చిత్ర బృందం గుడ్న్యూస్ చెప్పింది. ఈనెల 12న మూవీ టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వైదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను షేర్ చేసింది.
తన భార్య శోభితా ధూళిపాళ్ల గురించి నాగచైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శోభిత నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్’ మూవీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ‘మేజర్’లో శోభిత యాక్టింగ్ బాగుంటుందని తెలిపారు. ఆమె తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుందని, భాష విషయంలో తనకు సాయం చేస్తుందన్నారు. ఏదైనా ప్రోగ్రాంలో తాను స్పీచ్ ఇవ్వాల్సి వస్తే శోభితనే హెల్ప్ చేస్తుందని చెప్పారు.
నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమా ‘ఛావా’. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో డైరెక్టర్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలోని కీలక సీన్ షూటింగ్ సమయంలో విక్కీ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దాదాపు నెలన్నర బ్రేక్ తీసుకున్నారని వెల్లడించారు.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్తో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘L2 ఎంపురాన్’. ఈ ఏడాది మార్చి 27న విడుదల కానుంది. అయితే రిలీజ్కు ముందే ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో అరుదైన రికార్డును నెలకొల్పింది. 6 దేశాలు, 25 పట్టణాల్లో షూటింగ్ జరుపుకున్న తొలి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయం కానున్న విషయం తెలిసిందే. ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ పేరుతో ఓ సిరీస్ను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రధానపాత్రలో షారుఖ్ కుమార్తె సుహానా నటించింది. ఈ నేపథ్యంలో షారుఖ్ మాట్లాడుతూ.. తనపై ఉన్న ప్రేమలో సగమైనా సుహానా, ఆర్యన్లకు అందించాలని అభిమానులకు రిక్వెస్ట్ చేశారు.
లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి అరెస్టయ్యాడు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల వేసి బెడ్రూమ్స్లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేశాడు. అతడి హార్డ్డిస్క్లో 300 మంది యువతుల వీడియోలు ఉన్నట్లు సమాచారం. యువతులను డ్రగ్స్కు బానిసలుగా చేసి బెదిరించి వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో డార్లింగ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.