సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో కొందరు నటులు రెండేసి సినిమాల్లో నటించారు. ‘రాజాసాబ్’లో ప్రభాస్ నానమ్మగా నటించిన జరీనా వహాబ్.. ‘MSVG’లో చిరంజీవికి తల్లిగా కనిపించింది. అలాగే, బుల్లిరాజుగా గుర్తింపు పొందిన రేవంత్.. చిరంజీవి సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’లోనూ నటించాడు. రవితేజ, శర్వానంద్ సినిమాల్లో సునీల్, సత్య, వెన్నెల కిశోర్లు సందడి...
బాలీవుడ్ కపుల్ రాజ్కుమార్ రావు, పత్రలేఖ పాల్ దంపతులకు గతేడాది కూతురు పుట్టిన విషయం తెలిసిందే. తాజాగా తమ గారాల పట్టి పేరును ఆ జంట ప్రకటించారు. తమ పాపకు ‘పార్వతి పాల్ రావు’ అని నామకరణం చేసినట్లు ఇన్స్టా వేదికగా వెల్లడిస్తూ ఫొటో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు వారికి మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నారు.
TG: టీటీడీలో లక్కీడ్రా ప్రచారం చేసిన ఇన్ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పీఎస్లో నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్ క్యాసా, మహేందర్పై కేసు నమోదు చేశారు. రూ.399 కడితే ఫార్చ్యూనర్, ఐఫోన్, టీవీ, బైక్ అంటూ ప్రజల నుంచి కోట్లల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. SM ఇన్ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ కోసం తిరుమల ఆలయాన్ని ఎంచుకుని ప్రచారం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా-158’ సినిమా రాబోతుంది. ఈ మూవీ జనవరి 25న అధికారికంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని, కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇక KVN ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.
నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒకరాజు’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 4 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇదే జోరుతో మరో రెండురోజుల్లో ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఇక దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై నయా న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో నటి టబు నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్లో ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్ర కాళ్లు పోతాయని, అయినప్పటికీ ఆటలో ఛాంపియన్గా నిలుస్తాడని టాక్. ఇక ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతుంది.
తిరుమలకు సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని ఆయన తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు షాద్నగర్లోని తన నివాసం నుంచి ‘సంకల్ప యాత్ర’ ప్రారంభిస్తానని బండ్ల గణేష్ వెల్లడించారు. ఆ శ్రీనివాసుడి అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటానని, ఇది రాజకీయ యాత్ర కాదన్నారు.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దూసుకుపోతోంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.261 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఇక దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్లో జయకృష్ణపై యాక్షన్ సీన్స్తో పాటు ఓ పాటను కూడా షూట్ చేయనున్నారట. ఇక బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
హీరో శర్వానంద్తో నటి ఆషిక రంగనాథన్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీను వైట్లతో శర్వా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆషిక కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు, ఫస్ట్ షెడ్యూల్లో శర్వాపై ఎంట్రీ సీక్వెన్స్ను చిత్రీకరించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇవాళ్టి నుంచి HYDలోని రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అంతేకాదు విదేశీ షెడ్యూల్ లాక్ చేశారట. ఆ తర్వాత గుజరాత్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
విక్టరీ వెంకటేష్తో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్పై మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్పై ఫోకస్ పెట్టారట. దర్శకుడు త్రివిక్రమ్తో వెంకీ చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఏప్రిల్లో పూర్తి కానుందట. ఆ తర్వాత ఈ సినిమాలో ఆయన జాయిన్ కానున్నట్లు...
హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న నటి శ్రీలీల. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో ఓ సినిమా చేస్తుండగా.. తాజాగా మరో హిందీ ప్రాజెక్టుకు ఒకే చెప్పినట్లు టాక్. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రాబోతున్న ఫాంటసీ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించనుందట. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేయనున్నట్లు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 1, 2’ మూవీలు భారీ విజయం అందుకున్నాయి. త్వరలోనే ‘పుష్ప 3’ రాబోతుంది. తాజాగా ఈ మూవీపై క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ వర్క్, కథా చర్చలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక పుష్పరాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా సొంతం చేసుకుంటాడు.. శత్రువులను ఎలా ఎదుర్కొంటాడనేది మెయిన్ కథ అని టాక్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.226 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.