సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సికిందర్’. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వెంకీ కీలకపాత్రలో కనిపించారు. కానీ డిజాస్టర్గా నిలిచింది. దీనిపై స్పందించిన రష్మిక.. ‘మురగదాస్ సార్ చెప్పిన స్క్రిప్ట్తో ఫైనల్గా షూట్ అయిన సినిమా చాలా తేడా వచ్చింది. నేను విన్న స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది’ అని తెలిపింది.
మీడియా ప్రతినిధులపై అరవడంపై సినీ నటి రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. తాను మాట్లాడేటప్పుడు మీడియా ప్రతినిధి తనపై అరిచాడని చెప్పింది. అందుకే తాను తిరిగి అరిచానని, దానిలోకి తన పర్సనల్ జీవితాన్ని ముడిపెట్టవద్దని పేర్కొంది. అలాగే.. తనకు పాలిటిక్స్ ఇష్టం లేదని, ఏ రాజకీయపార్టీలో చేరనని చెప్పింది.
త్రివిక్రమ్, వెంకీ మామ కలిసి తీస్తున్న కొత్త సినిమాలో నారా హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం నారా రోహిత్ను సంప్రదించారట. ఈ పాత్రకు రోహిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. కాగా, ఈ సినిమా సమ్మర్లో రాబోతోంది.
మనుషులతో పాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని సినీనటి రేణూ దేశాయ్ తెలిపింది. ‘మనిషిని కుక్క కరిస్తే స్పందించే వ్యవస్థలు.. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదు? సమాజంలో చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించరు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ కుక్కలను చంపడం అమానవీయం కాదా?’ అని ప్రశ్నించింది.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒకరాజు’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై డీఎంకే స్పందించింది. రెహమాన్ మైనార్టీ కాబట్టే బీజేపీ టార్గెట్ చేసిందని ఆరోపించింది. అతడి స్టేట్మెంట్ కావాలనే వక్రీకరించారని మండిపడింది. కాగా, రెహమాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. దానిపై అతడు క్లారిటీ ఇచ్చాడు.
బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. దాదాపు 112 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణం తర్వాత కమెడియన్ గిల్లి నటా విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. రక్షితా శెట్టి రన్నరప్గా నిలిచారు. గిల్లికి రూ.50 లక్షల ప్రైజ్ మనీ లభించగా హోస్ట్ కిచ్చా సుదీప్ వ్యక్తిగతంగా మరో రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.
హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘నా కెరీర్ బిగినింగ్లో ఓ సినిమా షూటింగ్ సమయంలో అనుమతి లేకుండానే హీరో నా క్యారవాన్లోకి వచ్చాడు. ఆ తర్వాత అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో నాకు ఏమి చేయాలో కూడా అర్థం కాక.. అతన్ని లాగిపెట్టి కొట్టాను’ అని వెల్లడించింది. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.
దర్శకుడు అనిల్ రావిపూడి వరుస హిట్లతో సరికొత్త రికార్డు సృష్టించాడు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో వరుస సంవత్సరాల్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మూవీలు అందించిన తొలి టాలీవుడ్ దర్శకుడిగా నిలిచాడు. తన తొలి సినిమా పటాస్ నుంచి నేటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుసగా 9 విజయాలను సాధించాడు.
నటి రేణు దేశాయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ మూవీలో తనకు అవకాశం వచ్చిందని.. కథ, పాత్ర తనకు నచ్చాయని తెలిపింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఆ కారణాలు బయటపెడితే అనవసరమైన వివాదాలు చెలరేగే అవకాశం ఉందని, దానిపై మౌనంగా ఉండటమే మంచిదని వెల్లడించింది.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.292 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ మూవీలో నయనతార, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్వీన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి’ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభంకానున్నట్లు టాక్ తెలుస్తోంది. దాదాపు 6 నెలల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులే జరుగుతున్నాయట. ఇక కల్కి 2 మూవీని 2028లో విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్ SMలో తన పాత జ్ఞాపకాలను పంచుకుంది. ‘2026 ఈజ్ ది న్యూ 2016’ ట్రెండ్లో భాగంగా తన మెడికల్ కాలేజీ రిపోర్ట్ కార్డును పోస్ట్ చేస్తూ.. ఆ ఏడాది తన జీవితంలో ఎంతో కీలకమని పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్లో MBBS చదువుతూనే మిస్ ఇండియా పోటీలకు సిద్ధమయ్యానని, చదువు, కెరీర్ మధ్య అప్పట్లో ఎంతో కష్టపడ్డానని గుర్తుచేసుకుంది.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా నుంచి ఓ భారీ అప్డేట్ SMలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది శ్రీరామవమి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. మార్చి 26న ఈ బిగ్ రివీల్ ఉండే అవకాశం ఉందట. కాగా, 2027 ఏప్రిల్ 9న మూవీ విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.