‘డెకాయిట్’ ప్రమోషన్స్లో అడవి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ చిత్రంలో నటిస్తున్న అనురాగ్ కశ్యప్కు షూటింగ్ సమయంలోనే టామ్ క్రూజ్ సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ వచ్చిందని తెలిపాడు. కానీ ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారని శేష్ వెల్లడించాడు. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా నటించే జెన్యూన్ పర్సన్ అని కొనియాడాడు. ఏప్రిల్ 10న ‘డెకాయిట్’ విడుదల కానుంది.
రాజమౌళి, మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ ప్రస్తుతం HYD శంకర్పల్లిలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నారు. దీని తర్వాత చిత్ర బృందం చిన్న బ్రేక్ తీసుకోనుంది. ఈ విరామంలో మహేష్ విదేశాలకు, రాజమౌళి ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లనున్నారట. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయినట్లు సమాచారం.
టాలీవుడ్ హీరో నాగశౌర్య, దర్శకుడు రామ్ దేశిన కాంబోలో రాబోతున్న సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ మూవీ 2026 ఏప్రిల్ 17, 2026న విడుదల కానుంది. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 6న ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో విధి యాదవ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘ధురంధర్ 2’లో రణ్వీర్ సింగ్కు జోడీగా సారా అర్జున్ను ఎంపిక చేయడంపై కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రణ్వీర్తో గతంలో నటించిన వారు కాకుండా, కొత్త ముఖం ఉండాలన్న ఉద్దేశంతో 1300 మందిని ఆడిషన్ చేసి సారాను ఎంచుకున్నట్లు తెలిపాడు. ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకే దర్శకుడు ఆదిత్య ధర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.
‘బైసన్’ సినిమా తర్వాత కోలీవుడ్ యువ హీరో ధృవ్ విక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ (DV4)పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘సూర్య కరుప్పు’ రచయిత కరణ్ అరవింద్ కుమార్ దీనికి దర్శకత్వం వహించనుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
వేణు యెల్దండి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూ సంగీతం అందిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. అయితే ఈ సినిమా కోసం DSPను ఎంపిక చేసుకోవడంపై వేణు స్పందించాడు. కథా గమనానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ పాత్రకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్, కథలోని సహజత్వం, భావోద్వేగాలను పండించడానికి DSPనే పర్ఫెక్ట్ అని అన్నాడు. సినిమా స్పాన్ పెరగడంతో ఈ మార్పు చేసినట్లు తెలిపాడు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘టైసన్ నాయుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ఈ చిత్ర హక్కులను దాదాపు రూ. 20 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ డీల్ కూడా పూర్తయ్యాక విడుదల తేదీని ప్రకటించనున్నారట.
‘బాహుబలి’ షూటింగ్ విశేషాలను అడివి శేష్ గుర్తుచేసుకున్నాడు. ఒక సీన్లో అనుష్కను బలంగా తన్నాలని రాజమౌళి చెప్పడంతో తాను నిజంగానే తన్నానని, దీనివల్ల ఆమె మెడ బెణికినట్లు అనిపించిందని తెలిపాడు. అంత నొప్పి కలిగినా ఆమె కేవలం సీన్ అవుట్పుట్ గురించే ఆలోచించారని, అందుకే అనుష్క పేరుకు తగ్గట్టే ‘స్వీటీ’ అని ఆయన కొనియాడాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ హాలీవుడ్ ఆఫర్ దక్కించుకుంది. ‘ది జెయింట్’ అనే భారీ అమెరికన్ వెబ్ సిరీస్లో ఆమె కీలక పాత్ర పోషించనుంది. ఇది తన కెరీర్లోనే అత్యంత విభిన్నమైన ప్రాజెక్ట్ అని సన్నీ సంతోషం వ్యక్తం చేసింది. మొత్తం 6 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ 30 నిమిషాల నిడివి ఉంటుంది. కెవిన్ బి ప్లాత్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
శర్వానంద్ ‘బైకర్’ మూవీపై అక్కినేని నాగార్జున ప్రశంసలు కురిపించారు. ‘బైకర్ కుటుంబ భావోద్వేగాలను, బంధాలను అత్యంత సుందరంగా ఆవిష్కరించే ఒక అద్భుతమైన సినిమా. ఇందులోని రేసింగ్ సన్నివేశాలను, క్లైమాక్స్ను అస్సలు మిస్ అవ్వకండి. దర్శకుడు అభిలాష్ పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రముఖ హాలీవుడ్ నటి డీ ఫ్రీమాన్ (66) చనిపోయింది. గత కొంతకాలంగా స్టేజ్ 4 ఊపిరితిత్తుల క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచింది. ‘ది యంగ్ అండ్ ది రెస్ట్లెస్’, ‘సిస్టాస్’, ‘సీన్ఫెల్డ్’ వంటి పాపులర్ షోలతో ఆమె గుర్తింపు పొందింది. నటనలోకి రాకముందు అమెరికా మెరైన్ కార్ప్స్లో 6 ఏళ్లు పనిచేసి, జపాన్లో రేడియో డిజెగానూ రాణించింది.
నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్తో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అగ్రెసివ్ ప్రమోషన్స్, వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీలే ఈ భారీ ఓపెనింగ్స్కు కారణమట. ప్రస్తుతం బుక్మైషోలో ఈ చిత్రం టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది.
నార్త్ అమెరికాలో ‘బాహుబలి’ రికార్డును ‘ధురంధర్ 2’ అధిగమించడంపై రానా దగ్గుబాటి హర్షం వ్యక్తం చేశాడు. ‘ధురంధర్ 2 సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దశాబ్ద కాలంగా బాహుబలి పేరిట ఉన్న రికార్డును ఇది సొంతం చేసుకోవడం గొప్ప విషయం. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. ఎన్ని రికార్డులు వచ్చినా, వేటికవే ప్రత్యేకం’ అని అన్నాడు.
రణ్బీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ సినిమా రన్టైంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో దాదాపు 6 గంటల నిడివితో ఈ ఎపిక్ విజువల్స్ ఉండబోతున్నట్లు రణ్బీర్ నోరు జారాడు. అయితే ఇది రెండు భాగాలకా లేక ఒక దానికా అనేది తెలియాల్సి ఉంది. నమిత్ మల్హోత్రా ₹4000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది.