కొత్త ఆశలు, అంచనాలతో సినీ ప్రముఖులు 2026కు స్వాగతం పలికారు. న్యూ ఇయర్ సందర్భంగా సినీ మేకర్స్.. కొత్త మూవీ పోస్టర్లను షేర్ చేశారు. ఈ ఏడాది ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, నటీనటులకు హిట్స్ పడాలని కోరుకుంటూ పోస్టులు పెట్టారు. దీంతో సినీప్రియులు నెట్టింట పండుగ చేసుకుంటున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం మారుతి రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది ఇక ఈ చిత్రం దాదాపు రూ.350-400 కోట్ల బడ్జెట్తో రూపొందినట్లు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు.
స్టార్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు AR మురుగదాస్.. ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ను చూశాడు. తాజాగా ఆయన మరో కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యాడు. తన తదుపరి సినిమాలో కోతిని లీడ్ రోల్లో చూపించనున్నట్లు ఆయన వెల్లడించాడు. అయితే ఆ కోతిని గ్రాఫిక్స్లో రూపొందించనున్నట్లు తెలిపాడు. ఈ మూవీ పూర్తిగా పిల్లల కోసం ఉంటుందన్నాడు.
హీరోయిన్స్ డ్రెస్సింగ్పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై పరస్పరం స్పందిస్తూ యాంకర్ అనసూయ వార్తల్లో నిలిచింది. న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్సూట్లో దిగిన ఫొటోలు SMలో షేర్ చేసి మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా.. ఎవరు ఎన్ని చెప్పిన కూడా తన పంథా మార్చుకోనని ఆమె ప్రూవ్ చేసిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేసిన ఆస్కార్ విజేత AR రెహమాన్ నటుడిగా మారనున్నారు. కొరియోగ్రాఫర్, దర్శకనటుడు ప్రభుదేవా హీరోగా నటిస్తోన్న కామెడీ మూవీ ‘మూన్వాక్’లో రెహమాన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పేరుతూనే ఉన్న ఓ మూవీ డైరెక్టర్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి మనోజ్ నిర్మల శ్రీధరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ హర్రర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ ‘డిమాంటి కాలనీ’. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సినిమాలు విడుదల కాగా.. తాజాగా మూడో సినిమా ‘డిమాంటి కాలనీ 3’ తెరకెక్కుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.
మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్పై నెట్టింట చర్చ జరుగుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీరిద్దరూ రోమ్కు వెళ్లారు. అయితే ఒకే లొకేషన్లో సింగిల్గా దిగిన ఫొటోలను రష్మిక, విజయ్ షేర్ చేశారు. దీంతో మరోసారి వారి పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. 2026లో ఫిబ్రవరిలో వారి పెళ్లి జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
న్యూ ఇయర్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆయన హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇక జైత్ర రామ్ మూవీస్ బ్యానర్పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
కొత్త ఆశలు, ఆశయాలతో యావత్ దేశం ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ 2026కి ఘన స్వాగతం పలుకుతోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తమ అభిమానులకు, ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. ‘కోటి ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదిని స్వాగతిద్దాం. అందరం అందమైన అనుభవాలను పోగు చేసుకుందాం’ అని చిరంజీవి పోస్ట్ పెట్టారు. అలాగే మహేష్ బాబు, కమల్ హాసన్, కిరణ్ అబ్బవరం, ఎన్టీఆర్ తదితరులు విషెస్ చెబుతున్నారు.
టాలీవుడ్ నటుడు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ‘డెకాయిట్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ను చిత్రీకరిస్తున్నారు. ఓ కొండపైన షూట్ చేస్తున్నామని, ఇలా న్యూఇయర్ సందర్భంగా కొండపై క్లైమాక్స్ చేయడం హ్యాపీగా ఉందని అడివి శేష్ చెప్పాడు. ఇక షానీల్ డియో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 19న ఇది విడుదలవుతుంది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో క్రేజీ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు సంపత్ నందితో ఆయన సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దుల్కర్కు సంపత్ కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పాడట. అయితే పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత 2026 మార్చిలో ఈ సినిమాపై పూర్తి నిర్ణయం తీసుకోవాలని దుల్కర్ చూస్తున్నాడట. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నట్లు టాక్.
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ‘మోగ్లీ’. DEC 12న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. సాక్షి మడోల్కర్ కథానాయికగా నటించింది.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంకాంత్రి కానుకగా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్తో వస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ నటిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ నుంచి న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. ప్రభాస్ ఇంటెన్స్ లుక్లో శరీరంపై గాయాలతో, చేతిలో మందు బాటిల్తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. డైరెక్టర్ సందీప్ ‘ఇండియన్ సినిమా.. 2026లో మీ ఆజానుబాహుడిని చూడు’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.
‘రాజాసాబ్’ ఈవెంట్లో స్టేజ్పై ఎమోషనలైన దర్శకుడు మారుతిని ప్రభాస్ ఓదార్చాడు. తాజాగా దీనిపై మారుతి మాట్లాడాడు. ‘ఆ సమయంలో ప్రభాస్ వేదికపైకి వస్తాడని ఊహించలేదు. వెంటనే నేను సారీ డార్లింగ్ అని చెప్పా. ఆయన పర్వాలేదు.. ఈ కన్నీరు హృదయంలో నుంచి వచ్చేవి. నువ్వు ఎమోషనల్ అవుతావని ముందే ఊహించా. నేను స్టేజ్పైకి ఆలస్యంగా వచ్చా.. ముందు రావాల్సిందని చెప్పాడు’ అని తెలిపాడు.