• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘దురంధర్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే రూ.102 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిందని Sacnilk తెలిపింది. ప్రీమియర్స్‌తో కలుపుకొని రూ.145 కోట్లు(రూ.172 కోట్ల గ్రాస్) రాబట్టిందని వెల్లడించింది. 12,735 ప్రీమియర్ షోలు, తొలి రోజు 21,728 షోలు పడినట్లు చెప్పింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

March 20, 2026 / 07:34 AM IST

తెలంగాణ సర్కార్‌కు ధన్యవాదాలు: మాధురీ దీక్షిత్

TG: తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉందని మాధురీ దీక్షిత్ కొనియాడింది. గద్దర్ అవార్డుల వేదికపై టాలీవుడ్ సినీ లెజెండ్స్‌ను కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. దక్షిణాది సినిమా సాధిస్తున్న విజయాలు భారతీయ సినిమాకే గర్వకారణమని వ్యాఖ్యానించింది.

March 20, 2026 / 12:15 AM IST

చిత్ర పరిశ్రమ కోసం ఏ బాధ్యతకైనా సిద్ధం: చిరంజీవి

TG: పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానని చిరంజీవి ప్రకటించారు. దేశ జీడీపీలో చిత్ర పరిశ్రమ పాత్ర కీలకమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం(AP) కళాకారులను ఉత్సాహపరచడంలో వెనుకంజలో ఉందన్నారు. చంద్రబాబు కూడా రేవంత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇండియన్ సినిమా అంటే తెలంగాణ గుర్తుకురావాలన్నదే సీఎం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

March 19, 2026 / 11:25 PM IST

హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మారుస్తాం: సీఎం

TG: హైదరాబాద్ బిర్యానీకే కాక, తెలుగు సినిమాకు కూడా దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సౌత్ కొరియా తరహాలో సినిమా రంగాన్ని తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు హైదరాబాద్ కేంద్రంగా మారాలని, గద్దర్ పేరుతో అవార్డులు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

March 19, 2026 / 11:06 PM IST

మెగాస్టార్‌కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

TG: హైటెక్స్‌లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. అవార్డులు నటుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. కొన్నాళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సినిమా పురస్కారాలను సీఎం రేవంత్ పునరుద్ధరించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.

March 19, 2026 / 10:55 PM IST

రాజశేఖర్ – బాలయ్య క్రేజీ కాంబో!

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో బాలకృష్ణతో కలిసి నటించబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడ వేగ-2’ కోసం సిద్ధమైన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. తామిద్దరం కలిసి నటిస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శర్వానంద్ ‘బైకర్’ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

March 19, 2026 / 10:26 PM IST

సిద్ధు జొన్నలగడ్డ కొత్త మూవీ ప్రారంభం

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇవాళ ఉగాది సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అఫీషియల్‌ అనౌన్స్ చేశాడు. కొత్త చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించాడు. ఈ మూవీకి అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఈవెంట్‌కు నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా హాజరయ్యాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాలు బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

March 19, 2026 / 08:16 PM IST

ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘సీతా పయనం’. FEB 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సన్ నెక్ట్స్‌లో వీక్షించవచ్చు. కాగా, నిరంజన్  హీరోగా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

March 19, 2026 / 07:46 PM IST

అవార్డు అందుకోవడం సంతోషం: శివాజీ

హైదరాబాద్ హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నటుడు శివాజీ మాట్లాడుతూ.. గద్దర్ అవార్డు అందుకోవడం సంతోషకరమని పేర్కొన్నాడు. ప్రభుత్వాలు అవార్డులు ఇస్తే అందరికీ ప్రోత్సహకంగా ఉంటుందని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నాడు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నాడు.

March 19, 2026 / 07:03 PM IST

ప్రారంభమైన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

TG: హైదరాబాద్ హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కళాకారులను ప్రోత్సహించడానికే అవార్డులు ఇస్తున్నామన్నారు. మన ఇండస్ట్రీ యావత్ భారత్‌ను ఆకర్షిస్తోంది అని పేర్కొన్నారు.

March 19, 2026 / 06:54 PM IST

‘నాటక రంగానికి కూడా అవార్డులు ఇవ్వాలి’

సినిమాలకు పోటీగా టీవీ రంగం కూడా ఉందని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నాడు. టెలివిజన్ రంగానికీ అవార్డులు ఇవ్వాలిని ఆకాంక్షించాడు. సినిమాకైనా.. టీవీకైనా మూలం నాటకమని పేర్కొన్నాడు. అందుకే నాటకాలకు కూడా అవార్డులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు పేరిట సినీరంగంలోని పలువురికి అవార్డులు ఇచ్చిన విషయం తెలిసిందే.

March 19, 2026 / 06:38 PM IST

సంయుక్త కొత్త మూవీ పోస్టర్ విడుదల

హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది బ్లాక్ గోల్డ్’. యోగేష్ KMC దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం నుంచి ఉగాది కానుగా చిత్రయూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంయుక్త యాక్షన్-ప్యాక్డ్ పోలీస్ పాత్రలో కనిపించనుంది.

March 19, 2026 / 06:08 PM IST

నిఖిల్ ‘స్వయంభు’ నుంచి క్రేజీ పోస్టర్ విడుదల

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో నిఖిల్ చేతిలో శ్రీరాముడి విగ్రహం పట్టుకుని ఆలయంలోకి వెళ్తున్నట్లుగా ఉంది. ఇక చిత్రం ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

March 19, 2026 / 05:24 PM IST

మెగాస్టార్ కీలక నిర్ణయం

ఉగాది పండుగ వేళ నటుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు మరో సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాడు. భవిష్యత్‌లో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమని తెలిపాడు. పండుగని పురస్కరించుకుని పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ అంశాన్ని వెల్లడించాడు.

March 19, 2026 / 04:59 PM IST

ఆది సాయి కుమార్ కొత్తమూవీ పోస్టర్ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ ‘ఇగో రాజా’. గురు సరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘ఆది తన కెరీర్‌‌లోనే అత్యంత అగ్రెసివ్ అవతార్‌లో కనిపించనున్నాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని చిత్రయూనిట్ రాసుకొచ్చింది.

March 19, 2026 / 04:34 PM IST