రెబల్ స్టార్ ప్రభాస్తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. 2026 జనవరి 9న ఇది విడుదలవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను జియో హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే పాన్ ఇండియా భాషలన్నీ కల్పి మొత్తం రూ.170 కోట్లకుపైగా వెచ్చించి ఈ రైట్స్ను సదరు OTT కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
TG: గుమ్మడి నర్సయ్య మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. తాను ఒకసారి MPగా, ఐదుసార్లు MLAగా గెలిచానని, నర్సన్న ఐదుసార్లు MLAగా గెలిచారని చెప్పారు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరూ ఆయనకు పోటీ కాదన్నారు. MLA అయినా తనకున్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించారని, తనకు వచ్చిన జీతాన్ని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టారని తెలిపారు.
ఇల్లందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో బయోపిక్ రాబోతుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వేడుకలో శివన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబసభ్యులను కలిశానని, తన సొంత మనుషులను కలిసినట్లు అనిపించిందని తెలిపారు. నర్సయ్యను చూస్తుంటే తన నాన్నలా అనిపించిందని అన్నారు.
విప్లవ పార్టీ నాయకుడు, ఇల్లందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య జీవితంపై బయోపిక్ రాబోతుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. మంచి మనిషి జీవిత చరిత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. తెలుగు నేర్చుకుని ఈ మూవీకి డబ్బింగ్ నేనే స్వయంగా చెబుతానని అన్నారు.
అక్కినేని హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి ప్రేమలో ఉన్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై మీనాక్షి టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేసింది. మీనాక్షికి సంబంధించిన ఏదైనా విషయం ఉంటే తాము కచ్చితంగా చెబుతామని, ఇక నుంచి అయిన ఇలాంటి రూమర్స్ను క్రియేట్ చేయడం ఆపండి అని కోరింది.
బాలీవుడ్ స్టార్ అలియా భట్ ముంబై బాంద్రా వెస్ట్లో 6 అంతస్తుల విలాసవంతమైన భవంతిని నిర్మించారు. ఈ కొత్త ఇంటి విలువ సుమారు ₹250 కోట్లు ఉంటుందని సమాచారం. ఇటీవలే ఇందులోకి గృహ ప్రవేశం చేసిన అలియా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆ ఫోటోలను తాజాగా ఇన్స్టాలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 6న రాహా మూడో పుట్టినరోజు వేడుకలు కూడా ఈ కొత్త ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ’45’. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా దర్శకుడిగా మారుతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్పై నయా అప్డేట్ వచ్చింది. ఈ నెల 15న ట్రైలర్ రిలీజ్ కానుండగా.. ఏకంగా 7 జిల్లాల్లో దీని 7 ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇలా చేయడం సినిమా చరిత్రలోనే తొలిసారి అని టాక్.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ధురంధర్’. నిన్న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈద్ కానుకగా వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ భారత్, పాక్ ఉగ్రవాద కాన్సెప్ట్తో రాబోతున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో మరో ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ను సుకుమార్ లాక్ చేశాడట. అంతేకాదు మరికొన్ని రోజుల్లో దీని ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మే నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్నారు. ఈ మూవీని ‘పార్కింగ్’ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించనున్నాడట. అయితే రజినీ అనిరుధ్ని కాదని సాయికి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది, కాగా, 2026 మార్చి నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ధురంధర్’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీకి రణ్వీర్ భార్య, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె రివ్యూ ఇచ్చింది. 3:34 గంటల ఈ సినిమాలోని ప్రతి నిమిషం విలువైనదేనని తెలిపింది. చిత్రయూనిట్ అంతా కలిసి మూవీని విజయంతం చేశారని పేర్కొంది.
బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ-2 చిత్రం రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. అయితే, మూవీ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ‘సినిమాని విడుదల చేసేందుకు చాలా కష్టపడ్డాం. కానీ సాధ్యం కాలేదు. ఫ్యాన్స్, మూవీ లవర్స్ మమ్మల్ని క్షమించాలి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేసింది.
ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓ భారీ ఒప్పందం కుదిరింది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్, హాలీవుడ్ ప్రముఖ స్టూడియో వార్నర్ బ్రదర్స్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. వార్నర్ బ్రదర్స్ సంస్థకు చెందిన సినిమాలు, టీవీ స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్ను కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ 72 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.6.47 లక్షల కోట్లు) ఒప్పందం చేసుకుంది.
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాజీ MLA గుమ్మడి నర్సయ్య బయోపిక్లో నటిస్తున్నారు. ఇవాళ ఆయన ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగులో మరో 3 చిత్రాల్లో ఆఫర్ వచ్చిందని, అయితే ఇంకా ఓకే చెప్పలేదన్నాడు. చంద్రబాబు బయోపిక్లో అవకాశం వస్తే చేస్తారా..? అని రిపోర్టర్ ప్రశ్నిస్తే, ‘దాని గురించి తర్వాత ఆలోచిస్తా’ అని తెలిపాడు.
ఘట్టమనేని జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవికతకు దగ్గరగా మనసుల్ని హత్తుకునే ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్నాడు. ఇప్పటివరకూ ఇలాంటి కథను ఎవరూ రూపొందించలేదని, ఆ ప్రేమలో అమాయకత్వం, భావోద్వేగం అన్నీ ఉంటాయని తెలిపాడు.