బాలీవుడ్ కపుల్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వాటిపై సోనాక్షి స్పందించింది. ఇదంతా న్యూసెన్స్ అంటూ కొట్టిపారేసింది. తమ పెళ్లి జీవితం ఎంతో ఆనందంగా గడుపుతున్నామని, తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. వాటిని పరిష్కరించుకున్నామని తెలిపింది. కపుల్స్ థెరపీ ద్వారా తమ బంధాన్ని మరింత బలంగా చేసుకున్నామని పేర్కొంది.
‘రాజాసాబ్’ మూవీ వాయిదా పడనున్నట్లు, ఆ మూవీ మేకర్స్ ఓ బాలీవుడ్ సంస్థకు క్లియర్ చేయాల్సిన ఫైనాన్స్ పెండింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నిర్మాత విశ్వప్రసాద్ స్పందించాడు. ‘రాజాసాబ్ మేకింగ్కు తీసుకున్న పెట్టుబడులను మేము క్లియర్ చేశాం. అలాగే వడ్డీని త్వరలోనే క్లియర్ చేస్తాం’ అని తెలిపాడు. ఇక ఈ సినిమా 2026 JAN 9న విడుదలవుతుంది.
విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నట్లు, 2026 వేసవిలో ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో ‘వారణాసి’ తెరకెక్కిస్తున్నాడు. ఇది 2027 సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత తన డ్రీం ప్రాజెక్టు ‘మహాభారతం’పై రాజమౌళి ఫోకస్ పెట్టనున్నాడట. గతంలో ఆయన.. మహాభారతాన్ని 18 పార్ట్లుగా తీస్తానని చెప్పాడు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి అవన్నీ పూర్తయ్యే సరికి ఇంకో 15ఏళ్లు పట్టొచ్చని టాక్. మధ్యలో ‘RRR 2’ తెరకెక్కించే...
హీరోయిన్ సమంత వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో సామ్.. తన తల్లి నినెట్ ప్రభుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం సామ్ ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బిజీగా ఉంది.
‘అఖండ 2’ రిలీజ్ వాయిదా పడటంపై టాలీవుడ్ బడా నిర్మాత విశ్వప్రసాద్ టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అఖండ 2’ వాయిదా వేయడం తనను తీవ్రంగా కలవరపెట్టిందన్నారు. భవిష్యత్లో మరోసారి ఇలా థర్డ్ పార్టీలు(ఫైనాన్స్) చేసే చివరి నిమిషం అంతరాయాలను నివారించడానికి చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. అన్ని సమస్యలు అభిగమించి అఖండ 2 రిలీజ్ కావాలని ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు.
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న ‘అఖండ 2’ చిత్రం పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా కొత్త విడుదల తేదీని నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. 2026 జనవరి 9న ఇది విడుదలవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను జియో హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే పాన్ ఇండియా భాషలన్నీ కల్పి మొత్తం రూ.170 కోట్లకుపైగా వెచ్చించి ఈ రైట్స్ను సదరు OTT కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
TG: గుమ్మడి నర్సయ్య మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. తాను ఒకసారి MPగా, ఐదుసార్లు MLAగా గెలిచానని, నర్సన్న ఐదుసార్లు MLAగా గెలిచారని చెప్పారు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరూ ఆయనకు పోటీ కాదన్నారు. MLA అయినా తనకున్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించారని, తనకు వచ్చిన జీతాన్ని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టారని తెలిపారు.
ఇల్లందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో బయోపిక్ రాబోతుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వేడుకలో శివన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబసభ్యులను కలిశానని, తన సొంత మనుషులను కలిసినట్లు అనిపించిందని తెలిపారు. నర్సయ్యను చూస్తుంటే తన నాన్నలా అనిపించిందని అన్నారు.
విప్లవ పార్టీ నాయకుడు, ఇల్లందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య జీవితంపై బయోపిక్ రాబోతుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. మంచి మనిషి జీవిత చరిత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. తెలుగు నేర్చుకుని ఈ మూవీకి డబ్బింగ్ నేనే స్వయంగా చెబుతానని అన్నారు.
అక్కినేని హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి ప్రేమలో ఉన్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై మీనాక్షి టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేసింది. మీనాక్షికి సంబంధించిన ఏదైనా విషయం ఉంటే తాము కచ్చితంగా చెబుతామని, ఇక నుంచి అయిన ఇలాంటి రూమర్స్ను క్రియేట్ చేయడం ఆపండి అని కోరింది.
బాలీవుడ్ స్టార్ అలియా భట్ ముంబై బాంద్రా వెస్ట్లో 6 అంతస్తుల విలాసవంతమైన భవంతిని నిర్మించారు. ఈ కొత్త ఇంటి విలువ సుమారు ₹250 కోట్లు ఉంటుందని సమాచారం. ఇటీవలే ఇందులోకి గృహ ప్రవేశం చేసిన అలియా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆ ఫోటోలను తాజాగా ఇన్స్టాలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 6న రాహా మూడో పుట్టినరోజు వేడుకలు కూడా ఈ కొత్త ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ’45’. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా దర్శకుడిగా మారుతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్పై నయా అప్డేట్ వచ్చింది. ఈ నెల 15న ట్రైలర్ రిలీజ్ కానుండగా.. ఏకంగా 7 జిల్లాల్లో దీని 7 ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇలా చేయడం సినిమా చరిత్రలోనే తొలిసారి అని టాక్.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ధురంధర్’. నిన్న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈద్ కానుకగా వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ భారత్, పాక్ ఉగ్రవాద కాన్సెప్ట్తో రాబోతున్నట్లు తెలుస్తోంది.