బాలీవుడ్ నటి హుమా ఖురేషి, నటుడు రచిత్ సింగ్తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్లో వీరి వివాహం ఘనంగా జరగబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ విషయమై ఇప్పటివరకు వీరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి కన్నుమూశారు. ఉదయ్పూర్ రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్పై ఆయన తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించారు. ముఖ్యంగా తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా వంటి సూపర్ హిట్ మూవీలను తెరకెక్కించారు.
బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ గల్ఫ్ యుద్ధంలో చిక్కుకుపోయింది. న్యూయార్క్ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న ఆమె విమానం మధ్యలో దుబాయ్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, UAEపై క్షిపణి దాడులు జరగడంతో ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దీంతో ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని మస్కట్కు మళ్లించారు. ‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో దయచేసి అందరూ నా కోసం ప్రార్థించండి’ అంటూ SMలో పోస్ట్ చేసింది.
శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ఇప్పటికే దర్శకుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతికను హీరోయిన్గా ఖరారు చేసినట్లు సమాచారం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అమితాబ్, కమల్ హాసన్లకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం, ఈరోజు నుంచి ప్రభాస్ కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాల షూటింగ్ కూడా వేగంగా జరుగుతున్నాయి.
బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో ‘NBK 112’ చిత్రం రాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 9న ఈ చిత్రాన్ని అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా విద్యా బాలన్ నటించనుంది. అలాగే, సంజయ్ దత్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజయ్, సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నాడు. విజయ్ CM అయిన తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టి, తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది.
రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న చిత్రం ‘తలైవర్ 173’. ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను అశ్వత్ మారిముత్తు అందుకున్నాడు. అశ్వత్ చెప్పిన కమర్షియల్ స్క్రిప్ట్కు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది జూలైలో షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ ప్రతిష్టాత్మక మూవీ 2026, జూన్ 4న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రమోషన్స్ను ఈనెల 8 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తుండటంతో, అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
తిరువీర్, అజయ్ ఘోష్, రాశి, పాయల్ రాధాకృష్ణ నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. మే 7 నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ పోస్టర్ విడుదల చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హ్యూమా ఖురేషి త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రచిత్ సింగ్తో ప్రేమలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్లో హ్యూమా- రచిత్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఒక ఫ్రెండ్ పెళ్ళిలో పరిచయం అయిన వీరిద్దరూ డేటింగ్ మొదలుపెట్టి ఇప్పుడు ప్రేమలో ఉన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విజయ్కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘సినిమాకు ఉన్న పవర్ ఇది. అది ప్రజలను కదిలించగలదు.. వ్యవస్థలను గడగడలాడించగలదు. ఒక సామాన్య వ్యక్తి ఉనికిని పవర్గా మార్చగలదు. ఎలాంటి ఆర్భాటాలు లేవు. పెద్దగా ప్రచారాలు లేవు.. అయినా విజయం వరించింది’ అని పోస్ట్ పెట్టాడు.
TG: హీరో ప్రభాష్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో షూటింగ్కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రొడక్షన్ యూనియన్కి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో షూటింగ్కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రొడక్షన్ యూనియన్కి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మమత తనను బెంగాల్లో అడుగుపెట్టనివ్వనని అన్నారని, తన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్నూ అడ్డుకున్నారని వెల్లడించారు. తన సినిమా ప్రదర్శనను నిలిపివేయడమే కాకుండా, రాష్ట్రంలోకి రాకుండా ఆంక్షలు విధించారని వివేక్ పేర్కొన్నారు.