విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా పడింది. జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలో మరో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ సినిమాకు సెన్సార్బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో మద్రాస్ హైకోర్టులో విచారణ సాగింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేశారు. జనవరి 9న ఉదయానికల్లా తుది ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తే చూడాలని ఎంతో మంది డ్రీమ్ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ‘నాది 8 సినిమాల ప్రయాణం. చిరంజీవితో 9వ మూవీ. ఏదైనా సినిమా మొదలు కావాలంటే, కథ ముఖ్యం. ఒక కథను పుట్టించడం చాలా కష్టం. వెంకటేష్ నాకు స్నేహితుడు, మార్గదర్శి, అంతకుమించి. మీరు ఎంజాయ్ చేస్తారు. కుదిరితే పుల్ లెంగ్త్ సినిమా చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
చిరంజీవితో కలిసి నటించడం నిజంగా అద్భుతమైన అనుభూతి అని మరో అగ్ర కథానాయకుడు వెంకటేష్ అన్నారు. మహేష్, పవన్లతో కలిసి మల్టీస్టారర్ చేశానని చెప్పిన ఆయన.. ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు అనిల్తో తనది మంచి కాంబినేషన్ అని, ఈ సినిమాకు మంచి టీమ్ పనిచేసిందన్నారు. ఈ సంక్రాంతికి మంచి ఎంటర్టైన్ ఫిల్మ్ రాబోతోందన్నారు.
ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు మంచిగా ఆడాలని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ‘మన శంకర వరప్రసాద్గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ సుభిక్షంగా ఉండాలి. ప్రభాస్, రవితేజ, శర్వానంద్ చిత్రాలు హిట్ అవ్వాలి. నా శిష్యుడు నవీన్ పోలిశెట్టి సినిమా కూడా ఆడాలి. వెంకీతో షూటింగ్ చాలా సరదాగా సాగింది. ఇదే కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తాం అని తెలిపారు.
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆషికా రంగనాథ్ సందడి చేసింది. ట్రైలర్ లాంచ్కి వస్తేనే.. సినిమా చూస్తున్నట్టు ఉందని తెలిపింది. ఫ్యామిలీస్తో కలిసి సినిమా చూడాలని కోరింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ ఈ నెల 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్స్ ప్రారంభించనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో టికెట్స్ను డిస్ట్రిక్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని.. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. కాగా, రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించింది. మరోవైపు 10రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో రూ.150, మల్టీప్లెక్స్లో రూ.200 పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ‘జన నాయగన్’కు సెన్సార్ సర్టిఫికెట్పై మద్రాసు హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 9న ఉదయం తుది తీర్పు వెలువరిస్తామని కోర్టు వెల్లడించింది. దీంతో సినిమా 9న విడుదలవుతుందా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒకరాజు’ జనవరి 14న విడుదలవుతుంది. మొత్తం రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ రూ.27 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. OTT హక్కులు రూ.19 కోట్లు, శాటిలైట్ హక్కులు రూ.5 కోట్లు, ఆడియో హక్కులు రూ.3 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
తమిళ హీరో విజయ్ దళపతి ‘జన నాయగన్’ సెన్సార్ సర్టిఫికెట్పై మద్రాసు హైకోర్టులో విచారణ జరుగుతోంది. మూవీని నిలిపివేయాలని CBFC ఛైర్పర్సన్ ముందే సమాచారం ఇచ్చారని ASG సుందరేశన్ కోర్టుకు తెలిపారు. ఈ మూవీని కొత్త కమిటీ సమీక్షిస్తుందని, ఇందుకు 15 రోజుల టైం పడుతుందని అన్నారు. కొత్త కమిటీ ఏర్పాటుకు 20 రోజులు అవసరమని, JAN 5నే ఈ విషయం నిర్మాతలకు తెలిపినట్లు వెల్లడించారు.
తమిళ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత బన్నీ.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరోగా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా 2026 అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని స్కిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ రూ.1000కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని అందుకుందని మేకర్స్ పోస్ట్ పెట్టారు. ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిందని తెలిపారు. ఇది భారతీయ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని, రాబోయే సినిమాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒకరాజు’. 2026 JAN 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ట్రైలర్ వాయిదా పడింది. జనవరి 8న ఉదయం 10 గంటలకు మూసాపేట్లోని శ్రీరాముల థియేటర్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.
సినీఇండస్ట్రీలో 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నటి తాప్సీ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన పని భవిష్యత్తు తరాలకు గుర్తింపుగా నిలవాలని భావిస్తున్నానని పేర్కొంది. ఎవరినీ కాపీ చేయడానికి తాను ఈ రంగంలోకి రాలేదని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో వాణిజ్య చిత్రాలతో ఎదురైన పరాజయాలే తనకు జీవిత పాఠాలు నేర్పించాయని చెప్పింది.
‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కేవలం ‘పుష్ప-2, OG, గేమ్ ఛేంజర్, అఖండ-2’ చిత్రాలకే పరిమితమని కోర్టు పేర్కొంది. టికెట్ ధరల పెంపుపై నిర్మాతలు చేసుకున్న విజ్ఞప్తిని పరిశీలించి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తాజా ఉత్తర్వులతో టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభ...