దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంతో వచ్చిన ‘వేదం’ ఈరోజుతో 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2010 జూన్ 4న విడుదలైన హైపర్లింక్ నేరేటివ్ చిత్రం మానవీయ విలువలతో అలరించింది. వేర్వేరు నేపథ్యాలున్న ఐదు పాత్రల కథలను క్లైమాక్స్లో క్రిష్ అద్భుతంగా కలిపారు. కేబుల్ రాజుగా అల్లు అర్జున్, సరోజగా అనుష్క తమ కెరీర్ బెస్ట్ ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు.
మోహన్లాల్, తరుణ్ మూర్తి కాంబో మూవీ ‘అతిమనోహరం ఆగిపోయిందనే ప్రచారంపై దర్శకుడు స్పందించాడు. స్క్రిప్ట్ సమస్యల వల్ల షూటింగ్ ఆగిందనే వార్తల్లో నిజం లేదని, అవి పచ్చి అబద్ధాలని కొట్టిపారేశాడు. గడిచిన 78 రోజులుగా తొడుపుజలో శరవేగంగా షూటింగ్ జరుగుతోందని, భారీ వర్షాల వల్ల చిన్న ఇబ్బందులున్నా టీమ్ ఉత్సాహంగా పని చేస్తోందని తెలిపాడు. వ్యూస్ కోసం అబద్ధాలు ప్రచారం చేయవద్దని కోరాడు.
‘నందూస్ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు రమా నందన ఆమె భర్త మధుకర్లపై భారీ వీసా మోసం ఆరోపణలు వచ్చాయి. యూకే వర్క్ పర్మిట్, వీసా రెన్యూవల్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.15-20 లక్షలు వసూలు చేస్తూ 50 మందికి పైగా మోసగించారని బాధితులు పేర్కొన్నారు. దీనిపై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను నందన ఖండిస్తూ..ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది.
కన్నడ సస్పెన్స్ క్రైమ్ డ్రామా సినిమా ‘పీటర్’ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. సుకేష్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాజేష్ ధ్రువ, జాన్వీ రాయల, రవిక్ష శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయిన క్లాసిక్ ‘లగాన్’. 2001లో సంచలనం సృష్టించిన ఈ ఐకానిక్ స్పోర్ట్స్ డ్రామా విడుదలై 25ఏళ్లు పూర్తవుతుంది. ఈ రజతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని 2026 జూన్ 12, 13, 14 తేదీల్లో ఈ చిత్రం థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. నాటి మ్యాజిక్ను కొత్త తరం వెండితెరపై చూసే అరుదైన అవకాశం ఇది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న మూవీ ‘ఇరుముడి’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘ఇరుముడి’ థీమ్ పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ పాట ‘విల్లాది వీరుడు – వీర మణికంఠుడు’ అని సమాచారం. ఇక ఈ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
థియేటర్లలో ఇవాళ రిలీజైన ‘పెద్ది’ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నిన్న వేసిన ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క ఇండియాలోనే రూ.22 కోట్లు రావడం విశేషం. మరోవైపు బుక్ మై షోలో ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇవాళ భారీ స్థాయిలో విడుదలైంది. నిన్న రాత్రి హైదరాబాద్లోని AMB సినిమాస్లో జరిగిన ప్రీమియర్ షోకు దర్శకులు రాజమౌళి, రమా రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా తదితర ప్రముఖులు హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం సందీప్ వంగా ‘సినిమా బాగుంది’ అని చెప్పాడు. మరోవైపు ‘పెద్ది’ సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.
తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కోలీవుడ్పై కన్నేసింది. తమిళంలో వరుసగా భారీ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నట్లు టాక్. ధనుష్, శివ కాంబోలో ఒక సినిమా, శింబు-కీర్తి సురేష్ జంటగా మరో చిత్రం, అలాగే శివకార్తికేయన్, జగన్ శక్తి కలయికలో ఇంకో మూవీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దర్శకుడు ప్రశాంత్ నీల్కు జూ.ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలియజేశాడు. ‘హ్యాపీ బర్త్ డే డైరెక్టర్ గారు. మీరు చెప్పే కథలంత గొప్పగా ఈ ఏడాది మీకు సాగాలని కోరుకుంటున్నా. మన కాంబోలో రాబోయే సినిమా కోసం, మన భవిష్యత్తు ప్రయాణం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్టీఆర్, నీల్ కాంబోలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో జనసేన పోటీపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర కౌంటర్ ఇచ్చాడు. ‘సింగిల్గా వస్తున్నారా? పొత్తుతోనా?’ అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించగా.. ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరని బండ్ల మండిపడ్డాడు. జడ్జిమెంట్లు ఇవ్వడానికి మీరేమైనా కలెక్టరా, ప్రధానా? అని ప్రశ్నిస్తూ, మీ సంగతి చూసుకున్నాక లోకాన్ని మార్చాలంటూ హితవు పలికాడు.
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. తాను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా, తన మనసంతా ‘పెద్ది’ విజయంపైనే ఉందన్నారు. గత రెండేళ్లుగా చరణ్ పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ బ్లాక్బస్టర్ హిట్ అని, తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సహా చిత్ర బృందం మొత్తానికి చిరు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
బాక్సాఫీస్ వద్ద రూ. 1800 కోట్ల గ్రాస్తో సంచలనం సృష్టించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ కానుంది. జూన్ 5 నుంచి రెగ్యులర్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘స్లమ్డాగ్-33 టెంపుల్ రోడ్’. ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 8న ఈ చిత్ర అఫీషియల్ టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో సంయుక్త మీనన్, టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.