బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ-2’. ఈనెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘Bookmyshow’లో టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. రేపు రాత్రి నుంచి ప్రిమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
అఖండ-2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 14 వరకు టికెట్ల ధరల పెంచుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.50, మల్టీప్లెక్స్లో రూ.100 పెంచుతూ పర్మిషన్ ఇచ్చింది. రేపు రాత్రి 8 గం.ల ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.600 ఖరారు చేసింది. టికెట్ ధరల పెంపుతో వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని ఆదేశించింది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘కళంకావల్’. డిసెంబర్ 5న విడుదలైన ఈచిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 4 రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సైకోగా మమ్ముట్టి ప్రతినాయకుడి పాత్రలో అద్భుత నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాకు జితిన్ జోస్ దర్శకత్వం వహించాడు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ విడుదల చేసిన ‘2025-Most Stylish People’ జాబితాలో షారుఖ్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయుడిగా షారుఖ్ నిలిచాడు. కాగా, జెన్నిఫర్ లారెన్స్, సబ్రినా కార్పెంటర్, డోచి, నికోల్ షెర్జింగర్ వంటి హాలీవుడ్ స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు.
హెబ్బా పటేల్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా’. ఈ సినిమాను శ్రీనివాస్ మన్నే తెరకెక్కిస్తున్నాడు. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ను ఈనెల 25కు వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ‘భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది’ అంటూ పోస్టర్ విడుదల చేసింది.
2025లో గూగుల్లో అత్యధికంగా వెతికిన టాప్-10 సినిమాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో బాలీవుడ్ మూవీ ‘సైయారా’ అగ్రస్థానంలో ఉంది. రిషభ్ శెట్టి కాంతార: ఛాప్టర్ 1, రజనీకాంత్ కూలీ, వార్ 2, సనమ్ తేరీ కసమ్, మార్కో, హౌస్ఫుల్, గేమ్ ఛేంజర్, మిసెస్, మహావతార్ నరసింహ చిత్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటిలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ‘అన్నగారు వస్తారు’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డిసెంబరు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో పాల్గొన్న కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాను ఇలానే తీయాలి అని ఎలాంటి రూల్స్ లేవు తెలిపాడు. మంచి కథ ఉంటే ప్రేక్షుకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ‘అన్నగారు వస్తారు’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డిసెంబరు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో పాల్గొన్న కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాను ఇలానే తీయాలని ఎలాంటి రూల్స్ లేవు తెలిపాడు. మంచి కథ ఉంటే ప్రేక్షుకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు.
యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ‘మోగ్లీ’. ఈ సినిమా తొలుత డిసెంబర్ 12న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బాలకృష్ణ ‘అఖండ 2’ ఈనెల 12న విడుదల కానున్న నేపథ్యంలో ‘మోగ్లీ’ డిసెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 12న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
టాలీవుడ్ సినీ నటి శ్రియ శరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన కుమార్తెతో కలిసి వేకువజామున జరిగే అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు శ్రియ కుటుంబానికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.
వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న మూవీకి ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై S.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. తన పుట్టినరోజులు కూడా మిస్ అయినట్లు తెలిపింది. ‘నా తండ్రి ఆసుపత్రిలో ఉంటే ఆయన చివరి రోజులలో కూడా నేను చూసుకోలేకపోయాను. నా కుటుంబంతో గడిపిన సందర్భాలూ చాలా తక్కువ. 20 ఏళ్లు త్యాగం చేసి ఈరోజు ఇలా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.
స్టార్ హీరో నాగార్జునపై తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన చిన్నప్పటి నుంచి నాగార్జున ఒకేలా ఉన్నారని తెలిపాడు. తన మనవళ్లకు కూడా వయసు వస్తుంది కానీ.. ఆయనకు మాత్రం రాలేదని అన్నాడు. నాగ్ ఎప్పటికీ యంగే అని చెప్పుకొచ్చాడు.
బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ-2. ఇటీవల వాయిదా పడిన సినిమాను ఈ నెల 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చెప్పింది. ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా అడ్డంకులన్నీ తొలగడంతో విడుదలకు సిద్ధమైంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి జియోహాట్స్టార్ 18 కొత్త ప్రాజెక్టులతో సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులలో ‘ఫార్మా’, ‘కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 3’, ‘కజిన్స్ అండ్ కల్యాణమ్స్’, ‘అనాలీ’, ‘రాస్లిన్’, ‘1000 బేబీస్ సీజన్ 2’, ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’, ‘వరమ్’, ‘బ్యాచ్మేట్స్’, ‘సేవ్ ది టైగర...