మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ 2026 జనవరి 12న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్పై అప్డేట్ వచ్చింది. తిరుపతిలోని SV సినీప్లెక్స్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ఈ ట్రైలర్ 2:30 నిమిషాల రన్ టైంతో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ‘నారీనారీ నడుమ మురారి’ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను శర్వా పూర్తి చేశాడు. ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య నటించారు. 2026 జనవరి 14న ఇది రిలీజ్ కానుంది.
ఇటీవలే ‘ఛాంపియన్’ మూవీతో వచ్చిన రోషన్ మరో క్రేజీ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యాడు, దర్శకుడు శైలేష్ కొలనుతో రోషన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడట. ఈ చిత్రంలో అతను ఏజెంట్గా కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం మారుతి రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. ప్రభాస్ రూ.100 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 2:55 గంటల నిడివితో రాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
టాలీవుడ్ హారో చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలో దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రుథ్’ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో చైతన్య రావు ఒంటిపైన బట్టలు లేకుండానే న్యూడ్గా కనిపించాడు. ఇక ఈ సినిమా 2026 సమ్మర్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ 2026 జనవరి 12న రిలీజ్ కాబోతుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా రిలీజ్కు ఇంకా 9రోజులు మాత్రమే ఉన్నాయని తెలుపుతూ కౌంట్డౌన్ పోస్టర్ పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న పవర్ఫుల్ ప్రాజెక్టు ‘మహాకాళి’. దర్శకురాలు పూజా అపర్ణ కొల్లూరు ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రీకరణలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ ఖన్నా జాయిన్ అయ్యాడు. కాళికాదేవి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటి భూమి శెట్టి ‘మహా’ పాత్రలో కనిపిం...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబోలో తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ బాలీవుడ్లో రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్పై ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, ప్రతిభా రంతా ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది.
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని దర్శకుడు శిబి చక్రవర్తి తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు కమల్తో పాటు R మహేంద్రన్ నిర్మాతగా వ్యవహరించనుండగా.. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ‘డాన్ 3’ నుంచి హీరో రణ్వీర్ సింగ్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆయన స్థానంలో హృతిక్ రోషన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రకు హృతిక్ సరిగ్గా సెట్ అవుతాడని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ మూవీ 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీలోని రెండు పాటలు రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని మరో పాట ‘NacheNache’ను జనవరి 5న రిలీజ్ చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించాడు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడు.
➠ముగింపు దశలో ‘మృత్యుంజయ్’, ‘కామ్రేడ్ కళ్యాణ్’➠’సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరో సినిమా.. 2026 మార్చిలో స్టార్ట్!➠సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘అనగనగా’ దర్శకుడు సన్నీ సంజయ్తో వినోదాత్మక సినిమా!➠జీఏ2 బ్యానర్లో కొత్త దర్శకుడితో కొత్త సినిమా!.
దర్శకుడు కార్తీక్ దండుతో అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చైతూ.. ‘బెదురులంక’ దర్శకుడు క్లాక్స్తో సినిమా చేయనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా విషయమై చర్చలు జరుగుతున్నాయట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాసు మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించనున్నట్లు సమాచారం.
అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఇటీవలే ముగిసింది. ఈ సీజన్లో విన్నర్గా కామనర్ కళ్యాణ్ పడాల నిలిచాడు. తాజాగా ఈ షో అరుదైన రికార్డు సృష్టించింది. గత ఐదేళ్లలోనే ఎప్పుడూ లేని విధంగా సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఏకంగా 19.6 రేటింగ్ నమోదు చేసింది. జియో హాట్స్టార్లో 285 మిలియన్ నిమిషాల పాటు ప్రేక్షకులు వీక్షించారు.