మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘సంచారి’.. ‘రణ కుంభ’ అనే సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ 2027 వేసవిలో విడుదల ...
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓ నెటిజన్కు కౌంటర్ ఇచ్చింది. జిమ్ చేస్తున్న ఫొటోలను సమంత తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే, ఎక్కువగా వ్యాయామం చేయడం మంచిది కాదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో ‘అవసరం అయినప్పుడు మీ సలహా అడుగుతాను’ అని అతడికి కౌంటర్ ఇస్తూ సమంత రిప్లై ఇచ్చింది.
‘మఫ్టీ’లోని శివ రాజ్కుమార్ గెటప్ను తాను ‘వీరసింహారెడ్డి’లో కాపీ కొట్టానని బాలకృష్ణ తెలిపారు. ఆ లుక్ స్ఫూర్తినిచ్చిందన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన కొత్త సినిమా ‘అఖండ 2’. ఈ మూవీ డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిక్కబళ్లాపురలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో శివ రాజ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వర్షం పడినా లెక్క చేయకుండా ‘అఖండ 2’ ట్రైలర్ రిలీజ్ వేడుకకు వచ్చిన అభిమానులందరికీ బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు, ప్రకృతి, ధర్మం జోలికి వస్తే భగవంతుడు మనిషిలో ఆవహిస్తాడని చెప్పే సినిమా ‘అఖండ’ అని అన్నారు. సనాతన హైందవ ధర్మం ప్రధానాంశంగా ‘అఖండ 2’ రూపొందిందని వెల్లడించారు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుందని పేర్కొన్నారు.
బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ-1’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘అఖండ-2’ ట్రైలర్కూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖండ-1 కుటుంబం కోసం అయితే.. ‘ఇప్పటి వరకూ ప్రపంచపటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్’ అనే డైలాగ్తో అఖండ-2 దేశం కోసం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుందని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తెలిపారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. దర్శకుడు సాయిలు ఈ చిత్రాన్ని చాలా సహజంగా తీశారని కొనియాడారు. థియేటర్లలో తప్పకుండా చూడాల్సిన మూవీ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడంతో చిత్రబృందం సంబరాలు చేసుకుంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో CID సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన అధికారులు.. తాజాగా నటి నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృతా చౌదరిలను విచారిస్తున్నారు. కాగా, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే.
వరంగల్లోని రైల్వే కాలనీలో ఉంటున్న కార్తీక్(అల్లరి నరేష్) ప్రేయసి, తన తల్లితో సహా హత్యకు గురవుతుంది. దీన్ని చూసిన కార్తీక్ ఏం చేశాడు?.. తల్లీకూతుళ్లను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. నరేష్ నటన, సెకండాఫ్లో కొన్ని ట్విస్టులు, ఇన్వెస్టిగేటివ్ సీన్స్ మూవీకి ప్లస్. ఫస్టాఫ్, కొన్ని చోట్ల సాగదీత మైనస్. రేటింగ్: 2.5/5.
నిర్మాత దిల్ రాజు బ్యానర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘అర్జున’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిలిం ఛాంబర్లో ఈ పేరును రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నట్లు సమాచారం.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు అనిల్ స్పందించాడు. తామిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు వచ్చిన బాక్సాఫీస్ బద్దలవుతుందని చెప్పాడు. దీంతో నెటిజన్లు ‘We Are Waiting’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మధుసూదనరావు(ప్రియదర్శి), రమ్య(ఆనంది) ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అయితే వీరిద్దరి వైవాహిక జీవితానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?.. ఇద్దరి మధ్య బంధం కొనసాగిందా?.. లేదా? అనేది ‘ప్రేమంటే’ కథ. సుమ, వెన్నల కిషోర్ నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి. కథ, నటీనటుల నటన మూవీకి ప్లస్. వైవిద్యం లేని కథనం, సెకండాఫ్లో కొన్ని సీన్స్ మైనస్. రేటింగ్:2.5/5.
దర్శకుడు రాజమౌళి వివాదంపై RGV పోస్ట్ పెట్టాడు. ‘నాస్తికుడైన రాజమౌళికి దేవుడు సక్సెస్, సంపాదన, ఫేమ్ ఇచ్చాడు. దీన్నిబట్టి చూస్తే దేవుడికి నాస్తికుడు అంటే ఎక్కువ ఇష్టం కావచ్చు. రాజమౌళి నాస్తికుడు కావడం వల్ల దేవుడి స్థాయి తగ్గదని మూర్ఖులంతా గుర్తించండి. ఇదంతా దేవునిపై నమ్మకంగా ముసుగు వేసుకున్న వారు అసూయతో చేస్తున్నదే.. జై శ్రీరామ్’ అని పేర్కొన్నాడు.
క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్న కిట్టు( రాజ్ తరుణ్)ను కాంట్రాక్టు కిల్లర్లు ఎందుకు చంపాలనుకుంటారు?.. వారి నుంచి కిట్టు ఎలా తప్పించుకున్నాడనేది ‘పాంచ్మినార్’ కథ. నటీనటుల యాక్టింగ్ బాగుంది. కామెడీ సీన్స్, మ్యూజిక్ మూవీకి ప్లస్. కథలో బలం, ట్విస్టులు లేకపోవడం మైనస్. రేటింగ్: 2.25/5.
‘3’ మూవీలో సరదాగా పాడిన ‘వై దిస్ కొలవరి’ పాటకు మంచి క్రేజ్ వచ్చిందని ధనుష్ చెప్పాడు. ‘సరదాగా ఒకరోజు చిన్న ట్యూన్ చేసి పాట పాడాను. అది ఫన్నీగా ఉండటంతో సినిమాలో భాగం చేశాం. ఆ పాటకు చాలా క్రేజ్ వచ్చింది. అది వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఇంకా నన్ను వదలడం లేదు. 10ఏళ్లు గడిచినా ఆ పాటను మాత్రం ప్రేక్షకులు మర్చిపోవడం లేదు’ అని తెలిపాడు.
విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా డిసెంబర్ 15 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ వెంకీపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమాలో కన్నడ నటి శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.