• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

జపాన్‌లోనూ తుఫాను సృష్టించే వ్యక్తి ప్రభాస్: SKN

‘రాజాసాబ్’ 3 గంటల 10 నిమిషాల పాటు ప్రేక్షకులకు మాస్ ధమాకా పంచనుందని నిర్మాత SKN తెలిపాడు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘ప్రతిసారి పండక్కి కోళ్ల మీద పందాలు వేస్తారు.. కానీ ఈసారి వేసేది డైనోసర్ మీద’ అంటూ ప్రభాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. జపాన్‌లో కూడా తుఫాను సృష్టించగల వ్యక్తి ప్రభాస్ అని కొనియాడాడు. ‘పండక్కి వస్తున్నాం.. హిట్ కొడుతున్నాంR...

December 27, 2025 / 09:42 PM IST

‘రాజాసాబ్’ ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ HYDలోని ఖైత్లాపూర్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో హైటెక్ సిటీ నుంచి మూసాపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు.

December 27, 2025 / 07:57 PM IST

నేను భయపడే రకం కాదు: శివాజీ

నటుడు శివాజీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో వార్నింగ్ ఇస్తే భయపడే రకం తాను కాదని ఆయన స్పష్టం చేశాడు. ‘నేను బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాడిని.. ఇక్కడ కాకపోతే మరొక చోటకి వెళ్లి బతుకుతాను. అంతేకానీ ఆత్మాభిమానం చంపుకోను. వ్యవస్థలను, పరిశ్రమను గౌరవించకుండా, విలువలు లేని బతుకు బతకడం నాకు ఇష్టం లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు.

December 27, 2025 / 06:03 PM IST

మళ్ళీ ఎగరనున్న ‘ఈగ’..!

‘బాహుబలి: ది ఎపిక్’ రీరిలీజ్ భారీ విజయం సాధించడంతో రాజమౌళి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఈగ’ను కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను భారీ స్థాయిలో రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

December 27, 2025 / 04:48 PM IST

‘ధురంధర్‌’ నటుడిపై ‘దృశ్యం 3’ నిర్మాత దావా

‘ధురంధర్’ నటుడు అక్షయ్ ఖన్నాపై ‘దృశ్యం 3’ నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ దావా వేశాడు. ‘దృశ్యం 3’ కోసం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడని ఆయనకు లీగల్ నోటీసులు పంపాడు. ఒప్పందం జరిగినప్పుడే కొంతమొత్తంలో అడ్వాన్స్ చెల్లించినట్లు, ఆయన సినిమాలో భాగం కావడం లేదని టెక్స్ట్ మెసేజ్ చేశాడని నిర్మాత ఆరోపించాడు. కాగా, రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన విభేదాలతో అక్షయ్ ఈ మూవీ నుంచి ...

December 27, 2025 / 04:20 PM IST

బాధతోనే ఆ వ్యాఖ్యలు చేశా: శివాజీ

తాను చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషనర్ వివరణ అడిగారని నటుడు శివాజీ తెలిపారు. తన కామెంట్స్‌పై ఇప్పటికే క్షమాపణలు అడిగానని గుర్తు చేశారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టాలని తాను మాట్లాడలేదన్నారు. జరిగిన సంఘటనలు చూసిన బాధతోనే ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కొంతమందికి తనపై వ్యతిరేకత ఉందని.. అందుకే తనపై కుట్ర చేశారని ఆరోపించారు.

December 27, 2025 / 03:28 PM IST

శివాజీ వ్యాఖ్యలకు నిర్మాత SKN కౌంటర్

ఆడవాళ్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు నిర్మాత SKN కౌంటర్ ఇచ్చాడు. అమ్మాయిలు తమకు నచ్చిన బట్టలు ధరించి కంఫర్ట్‌గా ఉండాలని ఆయన పేర్కొన్నాడు. ‘ఏ బట్టల సత్తి మాటలు వినకండి’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే అంతా మంచే జరుగుతుందని, బట్టల్లో ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశాడు.

December 27, 2025 / 03:25 PM IST

2025 ఎక్కువగా సెర్చ్ చేసిన హీరోయిన్ ఎవరంటే?

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్లలో తమన్నా భాటియా ప్రథమ స్థానంలో నిలిచింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ ద్వారా ఆమె పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ జాబితాలో రష్మిక మందన్న రెండో స్థానంలో, సమంత మూడో స్థానంలో, కియారా అద్వానీ నాలుగో స్థానంలో, శ్రీలీల ఐదో స్థానంలో ఉన్నారు.

December 27, 2025 / 02:43 PM IST

BREAKING: అల్లు అర్జున్‌పై ఛార్జ్‌షీట్

పుష్ప-2 తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు తాజాగా అల్లు అర్జున్ సహా 24 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్‌ను A-1గా, హీరో అల్లు అర్జున్‌ను A-11గా చేర్చారు. అల్లు అర్జున్ మేనేజర్, 8 మంది బౌన్సర్లపై కూడా అభియోగాలు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ విషాద ఘటన జరిగినట్లు పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు.

December 27, 2025 / 02:18 PM IST

‘శంబాల’ రెండు రోజుల కలెక్షన్స్

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ. 5.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు వెల్లడించారు. ఇక యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమాలో అర్చనా అయ్యర్, శ్వాసిక విజయ్, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. 

December 27, 2025 / 01:54 PM IST

రెండు రోజుల్లో ‘ఛాంపియన్’ సాలిడ్ కలెక్షన్స్

నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛాంపియన్’ మూవీ మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్‌పై అప్‌డేట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.91 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీలో అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది.

December 27, 2025 / 01:41 PM IST

శివాజీ.. ఒళ్లు దగ్గర పెట్టుకో: ప్రకాష్ రాజ్

శివాజీ ఆడవాళ్ల గురించి చెత్తగా మాట్లాడాడని నటుడు ప్రకాష్ రాజ్ అన్నాడు. ‘శివాజీ అయినా.. ఎవరైనా ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆడవాళ్ల బాడీ పార్ట్స్ గురించి మాట్లాడటం తప్ప.. వాళ్లకు తెలుగు రాదు. స్టేజీలపై మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి. శివాజీ క్షమాపణలు చెప్పినా.. మిగితా వాళ్లు వదలరు. ఆడవాళ్లకు సపోర్ట్ చేయడం నా బాధ్యత’ అని మండిపడ్డాడు.

December 27, 2025 / 01:33 PM IST

అనసూయకే.. నా మద్దతు: ప్రకాష్ రాజ్

శివాజీ ఆడవాళ్ల గురించి చెత్తగా మాట్లాడాడని నటుడు ప్రకాష్ రాజ్ అన్నాడు. ‘శివాజీ అయినా.. ఎవరైనా ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆడవాళ్ల బాడీ పార్ట్స్ గురించి మాట్లాడటం తప్ప.. వాళ్లకు తెలుగు రాదు. స్టేజీలపై మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి. అనసూయకు నా మద్దతు. ఆడవాళ్లకు సపోర్ట్ చేయడం నా బాధ్యత’ అని మండిపడ్డాడు.

December 27, 2025 / 01:33 PM IST

మహిళల పట్ల చులకనగా మాట్లాడను: శివాజీ

తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట నటుడు శివాజీ విచారణ ముగిసింది. గంటన్నర పాటు విచారణ జరిగింది. ‘మీ వ్యాఖ్యలు మహిళలపై దాడులు పెంచేలా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని, మీ వ్యాఖ్యలు మహిళలపై ప్రభావం చూపుతాయని తెలియదా?’.. అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మహిళల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని శివాజీకి మహిళా కమిషన్ సూచించింది. ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని శివాజీ చెప్పాడు.

December 27, 2025 / 01:18 PM IST

‘రాజాసాబ్’ నుంచి మాళవిక పోస్టర్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి మాళవిక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ఆమె భైరవిగా కనిపించనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా వచ్చే నెల 9న రిలీజ్ కాబోతుంది.

December 27, 2025 / 01:04 PM IST