‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీతో చిరంజీవి, వెంకటేష్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి 3 పాటలను విడుదల చేయగా, తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈనెల 4న ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ను విడుదల చేశారు.
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్టు డ్రామా ‘హక్’ హిట్ అందుకుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మహిళ తన హక్కుల కోసం భర్తపై చేసిన న్యాయ పోరాటం కథతో ఈ సినిమా తెరకెక్కింది.
హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత టొమ్మీ లీ జోన్స్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కూతురు, నటి విక్టోరియా జోన్స్(34) అనుమానాస్పదంగా మృతి చెందింది. జనవరి 1న తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ లగ్జరీ హోటల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. కాగా, టొమ్మీ, ఆయన మాజీ భార్య కింబర్లీ క్లౌలీల కూతురే విక్టోరియా. ‘మెన్ ఇన్ బ్లాక్ 2’ సినిమాతో పాటు పలు TV సిరీస్ల్లో ఆమె నటించింది.
తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు H. వినోద్ తెరకెక్కించిన సినిమా ‘జన నాయగన్’. ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ మూవీ తమిళ వెర్షన్కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా ఇప్పటివరకు ఈ సినిమా రూ.15 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విజయ్ చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ ‘హైంధవ’. ఈ సినిమా నుంచి రేపు సాలిడ్ అప్డేట్ రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘ధర్మాన్ని కాపాడేందుకు హింసతో యోధుడు హైంధవ డ్యూటీ స్టార్ట్’ అని క్యాప్షన్ ఇచ్చారు. పురాతన దశావతార దేవాలయాన్ని హీరో రక్షించే కథతో దర్శకుడు లుధీర్ బైరెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘వృషభ’ మూవీ డిజాస్టర్గా నిలిచింది. భారీ అంచనాల మధ్య 2025 DEC 25న రిలీజైన ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రూ.70కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే దాదాపు రూ.150 కోట్లకుపైగా కలెక్షన్స్ చేయాల్సి ఉంది. అయితే కనీస బడ్జెట్లో 10% కూడా రికవరీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
‘అఖండ 2’లో విలన్గా మెప్పించిన హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘డ్రైవ్’. ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించాడు.
న్యూ ఇయర్ సందర్భంగా రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఒడిలో చిన్నారిని పెట్టుకుని దిగిన ఫొటోను ఆమె షేర్ చేసింది. ‘పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల్లా ఉంటారు. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా మనసును దోచుకున్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ పిల్లాడు ఎవరని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, ఆ పోస్టుకు ఆమె కామెంట్స్ ఆఫ్ చేయడం గమనార్హం.
విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరిల ‘కింగ్డమ్’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. అయితే గతంలో ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చని నిర్మాత నాగవంశీ చెప్పాడు. అయితే తమ నిర్మాణ సంస్థలో గౌతమ్తో మాత్రం వేరే సినిమా ఉంటుందన్నాడు.
ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ పొందిన ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్ 5 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ నుంచి యానిమేషన్ సిరీస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒరిజినల్ సిరీస్ సీజన్ 2, 3 మధ్య టైంలో జరిగే అంశాలపై దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం. 2026లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఎన్నో వివాదాలు, విమర్శలు మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ మూవీ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సీక్వెల్ మరింత భయంకరమైన చీకటి కథతో రాబోతున్నట్లు, 2026 ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ చిత్రం ట్రైలర్ను జనవరి 4న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను తిరుపతిలో నిర్వహించనున్నట్లు టాక్. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1000కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. నార్త్ అమెరికాలో కూడా ఈ చిత్రం అదరగొడుతోంది. అక్కడ 17.50 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్స్ సాధించి ‘పఠాన్’ $17.49 మిలియన్ల వసూళ్లను దాటినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో అమెరికాలో ‘బాహుబలి 2′, కల్కి’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా నిల...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమా ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘చికిరి’ పాట రిలీజై సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకే నేను పెళ్లి చేసుకుంటా’ అని చమత్కరించాడు. తన కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రమోషన్లలో ఆయన ఈ మాటలన్నాడు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్.