TG: హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు అర్జున్ నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం మల్టీప్లెక్స్లోని స్క్రీన్లను ఆయన పరిశీలించారు. ఇందులో 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ కలిగి ఉండటం విశేషం.