E.G: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను (26) సెంట్రల్ జోన్ శక్తి టీం గుర్తించి మాట్లాడగా, కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్లు తెలిపింది. వెంటనే స్పందించిన శక్తి టీం ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు.