HNK: హన్మకొండలోని చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామికి ఆర్చకులు మంగళవారం ప్రత్యేక అలంకరణ చేశారు. చతుర్దశి తిదీ, మంగళవారం సందర్భంగా రకాల పూలతో స్వామికి పూలతో అలంకరణ చేసి, పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
సత్యసాయి: హిందూపురం ఎంపీ పార్థసారథి సోమందేపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా చాలకూరు ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న కుంభాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంపీ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఉన్నారు.
అన్నమయ్య: మదనపల్లెలోని గంగమ్మ విశేష అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సుష్మిత్ సాయి అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం కావడంతో ముఖ్యంగా మహిళలు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ప్రకాశం: పామూరు మండలం బొట్లగూడూరు గ్రామంలో మన్నేపల్లి వంశస్థుల ఆధ్వర్యంలో గురువారం నాగర్పమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్ధన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కోనసీమ: మండల కేంద్రమైన అయినవిల్లిలో వేంచేసియున్న విఘ్నేశ్వర స్వామిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు స్వామివారికి సమర్పించిన వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ. 2,83,415ఆదాయం లభించినట్లు ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 78,631 మంది భక్తులు దర్శించుకోగా.. 31,247 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
CTR: పుంగనూరు పట్టణం కోనేటి వద్ద వెలసియుండు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే లింగానికి రుద్రాభిషేకాలు, ఫల పంచామృతాభిషేకాలు, అలంకరణ, బిల్వార్చనలు అర్చకులు సుబ్బయ్య దీక్షితులు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిపించారు.
KDP: రావణాసురుడు మనవడు బాణాసురుడు కడప జిల్లాలో పూజలు చేశారని మీకు తెలుసా? సింహాద్రిపురం మండలం భానుకోట కోన వద్ద ఉన్న గుహలో ఆయన తపస్సు చేసినట్లు పురాణ గాథ. ఇక్కడ సోమేశ్వర స్వామి వెలిశారు. సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం కలియుగ ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కుటుంబ సమేతంగా శనివారం దర్శించారు. స్వామి వారి ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పలు ఆలయాలను సందర్శించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,86,678 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. 34 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని.. 3100 మంది అన్నప్రసాదం స్వీకరించారని అన్నారు.
ATP: గుంతకల్లు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం మన్య సూక్త హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి వారి మూలమూర్తికి వేకువజామున అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో వాణి, ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.
MDK: నర్సాపూర్ నియోజకవర్గ శివంపేట మండల పరిధిలోని సికిందలాపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం స్వామివారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ్ శర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
CTR: కార్వేటినగరంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు బుధవారం సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖ మాసం, బహుళపక్షం దశమి: రా. 8-43 తదుపరి ఏకాదశి పూర్వాభాద్ర: మ. 1-48 తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం: రా. 10-52 నుంచి 12-23 వరకు అమృత ఘడియలు: ఉ. 6-09 నుంచి 7-40 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-47 నుంచి 10-38 వరకు తిరిగి మ. 2-56 నుంచి 3-47 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.30; సూర్యాస్తమయం: సా.6.22 […]