• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 1.22 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 1,22,565 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 202 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. అన్నదాన ట్రస్ట్ ద్వారా 1500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.

March 21, 2025 / 07:00 PM IST

సంతోషిమాతకి విశేష పూజలు

SKLM: శ్రీకాకుళంలో ఉన్న సంతోషిమాత అమ్మ వారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మూలవిరాట్‌కు సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, అలంకరణ సేవ, నీరాజనం, మంత్రపుష్పం, మంగళ హారతి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కే.సర్వేశ్వరరావు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రసాదాలు స్వీకరించారు.

March 21, 2025 / 05:09 PM IST

మారెమ్మ అవ్వ హుండీ ఆదాయం ఎంతంటే..?

KRNL: దేవనకొండ మండలం గద్దెరాళ్ల శ్రీమారెమ్మ అవ్వ దేవర ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దేవర సందర్భంగా హుండీలో వేసిన కానుకలను ఈవో వీరయ్య ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తంగా రూ.13,85,174 వచ్చినట్టు ఈవో తెలిపారు. ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగిందన్నారు.

March 21, 2025 / 11:18 AM IST

ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు

జనగామ ఆర్టీసీ బస్సు డిపో కార్గో ద్వారా భక్తుల ఇంటివద్దకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలియజేశారు. తలంబ్రాల బుకింగ్ కొరకు కార్గో లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్, కార్గో ఏజెంట్ రూ.151 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు.

March 19, 2025 / 09:48 AM IST

అయినవిల్లి ఆలయ ఆదాయ వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 2,93,437 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 694 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, అన్నదాన ట్రస్ట్ ద్వారా 3510 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వెల్లడించారు.

March 16, 2025 / 05:00 PM IST

ఘనంగా వల్లభరాయుడి సూర్యప్రభ వాహనసేవ

సత్యసాయి: కదిరిలో శ్రీ వసంతవల్లభరాయుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ ఘనంగా జరిగింది. సప్త అశ్వాలతో సూర్యనారాయణుడు రథాన్ని నడుపుతున్నట్లుగా వాహనం రూపొందించారు. భక్తులు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవం కోలాహలంగా సాగింది.

March 16, 2025 / 01:35 PM IST

ఘనంగా లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

VKB: పరిగి పట్టణంలోని శ్రీశ్రీ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి-ఉమారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, స్వామివారికి అభిషేకం, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హోమం, అంజనేయ, నాగ, ధ్వజ హోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు.

March 11, 2025 / 04:15 PM IST

నేటి నుంచి అయ్యప్ప ఆలయంలో ఉత్సవాలు

మేడ్చల్: జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని హరిహర అయ్యప్ప దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలు ఈనెల 11 నుంచి 13 వరకు కొనసాగుతాయన్నారు. మంగళవారం మహాగణపతిపూజ, ప్రసాదశుద్ధి, స్థలశుద్ధి, మహాగణపతిహోమం, వాస్తుహోమం, బుధవారం మహాగణపతిహోమం, కలశపూజ, ధ్వజారోహణం, పడిపూజ ఉంటాయన్నారు.

March 11, 2025 / 09:48 AM IST

అయినవిల్లి ఆలయ ఆదాయం ఎంతంటే.?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని గురువారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ. 1,26,495 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, అన్నదాన ట్రస్ట్ ద్వారా 1510 మంది అన్నదానం స్వీకరించారని వెల్లడించారు.

March 6, 2025 / 05:08 PM IST

వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

KDP: సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, త్రికాలారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

March 1, 2025 / 10:39 AM IST

మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏంటి?

హిందువులకు ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. పౌరాణిక కథల ప్రకారం ఈ రోజున శివుడు, పార్వతి ఏకమయ్యారని చెప్తుంటారు. ఈ పండుగ ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక మేల్కొలుపు వంటి విషయాలను బోధిస్తుంది. మహాశివరాత్రి పండుగ ప్రజలను పునర్జన్మ స్వీకరించడానికి, ప్రతికూలతను విడిచిపెట్టడానికి ప్రోత్సహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

February 26, 2025 / 08:21 AM IST

భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

అన్నమయ్య: మహాశివరాత్రి వేల మదనపల్లె పట్టణంలో వేకువజాము నుండే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ మంజునాథ స్వామి ఆలయంలోని బ్రహ్మసూత్ర శివలింగానికి, మడి కయ్యల శివాలయంలోని యోగ భోగేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ తగు ఏర్పాట్లు చేశారు.

February 26, 2025 / 08:06 AM IST

జోగులాంబ ఆలయాన్ని దర్శించిన పంచాయతీరాజ్ ఎస్ఈ

MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం పంచాయతీ రాజ్ SE సురేష్ చంద్రా రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద శర్మ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.

February 22, 2025 / 01:34 PM IST

రేపు దేశపాత్రునిపాలెంలో భూలోకమాంబ ఉత్సవం

VSP: పెందుర్తికి బార్డర్గా ఉన్న దేశపాత్రుని పాలెం గ్రామంలో ఫిబ్రవరి 23న ఆదివారం శ్రీభూలోకమాంబ అమ్మవారి ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఉదయం ఊరేగింపుగా జాతర ప్రారంభమవుతుందన్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

February 22, 2025 / 10:36 AM IST

నేటి నుంచి శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

AP: ఇవాళ్టి నుంచి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. స్వామివారి ప్రథమ భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహోత్సవాలు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆర్జిత అభిషేక సేవలు, అంతరాలయం దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

February 21, 2025 / 08:28 AM IST