SRCL: వేములవాడ రాజన్న ఆలయాని భారీగా ఆదాయం సమకూరింది. గత 29 రోజుల హుండీ లెక్కింపులో ఆలయానికి రూ.1 కోటి 21 లక్షల 70 వేల 150 ఆదాయం లభించింది. దీంతో పాటు 64 గ్రాముల బంగారం, 7.3 కిలోల వెండిని భక్తులు సమర్పించారు. కార్యనిర్వహణాధికారి రమాదేవి పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, వివిధ బృందాలు పాల్గొన్నాయి. భద్రతా సిబ్బంది పటిష్ట ఏర్పాట్లు చేశారు.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తరువాత ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై స్వామిని అధిష్ఠించి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి స్వర్ణపుష్పార్చన జరిగింది.
AP: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ తెలిపారు. గతేడాది తిరుమల బ్రహ్మోత్సవాల్లో జరిగిన లోపాలను గుర్తించి సవరించామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఐదు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాగా తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి.
AP: డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వీటిని ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీచేస్తారు. లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్ష రుతువు, భాద్రపద మాసం, బహుళపక్షం ద్వాదశి: రా. 12-25 తదుపరి త్రయోదశి; పుష్యమి: ఉ. 8-59 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: రాత్రి 9-42 నుంచి 11-17 వరకు; అమృత ఘడియలు: లేవు దుర్ముహూర్తం: ఉ. 9-54 నుంచి 10-42 వరకు, తిరిగి మ. 2-45 నుంచి 3-33 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.52; సూర్యాస్తమయం: సా.5.59.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్ష రుతువు, భాద్రపద మాసం, బహుళపక్షం ఏకాదశి: రా. 1-25 తదుపరి ద్వాదశి పునర్వసు: ఉ. 9-35 తదుపరి పుష్యమి వర్జ్యం: సా. 5-22 నుంచి 6-56 వరకు అమృత ఘడియలు: ఉ. 7-01 వరకు తిరిగి రా. 2-45 నుంచి 4-18 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-31 నుంచి 12-19 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.5.51; సూర్యాస్తమయం: సా.6.00.
సత్యసాయి: కదిరిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్నాయి. స్వామి మత్య, కూర్మ, నృసింహ తదితర అవతారాలలో దర్శనం ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. విజయదశమి రోజున అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తామని, భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పద్మారాధన మంగళవారం వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ప్రత్యేక సేవలో ఉభయ దాతలు పాల్గొని అమ్మవారి కటాక్షం కోసం ప్రార్థనలు చేశారు. వేదపండితులు, అర్చకులు మంత్రోచ్ఛారణలతో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా, ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయం అందించారు.
CTR: పుంగనూరు పట్టణం సమీపాన దూల్లవారి ఇండ్ల వద్ద కొలువైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మండల పూజలు వైభవంగా ముగిసాయి. సోమవారం వేద పండితులు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
KKD: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్క రోజులోనే దాదాపు 16వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, దేవస్థానానికి రూ. 6.14 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో తెలిపారు.
NTR: విజయవాడ కనకదుర్గమ్మ దివ్య దర్శనం గన్నవరం విమానాశ్రయంలో కూడా లభ్యం కానుంది. ఆదివారం ఆలయ ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో అరైవల్, డిపార్చర్ బ్లాక్లలో అమ్మవారి భారీ చిత్రపటాలను ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య, అర్చకులు వెంపటి శ్రీధర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,60,856 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 455 మంది స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. 24 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనగా.. 3840 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బంగారు, వెండి, ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
కోనసీమ: మండపేట రైతు బజార్ వద్ద వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం 10 గంటల 59 నిమిషాలకు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొని, తొలుత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం రాట ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
WGL: పట్టణంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో భాద్రపద మాస శుక్రవారం సందర్భంగా అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, హారతులు ఇచ్చారు. శుక్రవారం కావడంతో ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయం మార్మోగింది.