VSP: చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7వరకు దర్శనలు నిలిపి వేస్తున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేస్తారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారు జామున సంప్రోక్షణ నిర్వహించి శ్రీ అమ్మవారికి 5కు ప్రాతః కాల పంచామృతాభిషేకం అనంతరం 7కు తిరిగి దర్శనములకు అనుమతిస్తారు.
NTR: ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మూసివేయబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, ఉదయం 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.
కృష్ణా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల సందర్భంగా శనివారం శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు ముఖ్య అతిధులుగా విచ్చేసి స్వామివార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సత్కరించారు.
VSP: విశాఖ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు కావడంతో వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, బహుముఖ రూపల పోలమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ దేవస్ధానంలో ఈనెల 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు దేవాలయం మూసి వేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి వి. సత్యనారాయణ తెలిపారు. సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారి సర్వదర్శనాలకు అనుమతిస్తామని అన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
MDK: ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని పాపన్నపేట మండలం ఏడుపాయలలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకే రాజగోపురంలో అమ్మవారి దర్శనం ఉంటుందని ఆలయ ఈవో శుక్రవారం తెలిపారు. తిరిగి మరుసటి రోజు సోమవారం ఉదయం గంటలు 5:30కు ఆలయం తెరచి సంప్రోక్షణ అభిషేకం అనంతరం రాజగోపురం వద్ద భక్తులకు వన దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.
ATP: ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం ఆలయాన్ని ఈనెల 7న చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో తిరుమల రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు. అలాగే మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.
PDPL: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సింగరేణి ఆర్జీ 1 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి బుధవారం 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. ముఖ్య అతిథులుగా ఆర్జీ 1 జీఎం డీ. లలిత్ కుమార్ అనిత దంపతులు హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను సమర్పించారు. ప్రతి ఒక్కరిపై గణనాథుడి కృపాకటాక్షలుండాలని స్వామివారిని ఈ సందర్భంగా వేడుకున్నారు.
NTR: మెట్టగూడలో బుధవారం రెడ్డిగూడెం అంకమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జనోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గణనాథుడిని ఉంచి, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ, యువకుల ఆనందోత్సాహాల మధ్య పూలతో స్వాగతం పలుకుతూ.. నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా అంకమ్మ తల్లి దేవస్థానం వద్ద గణనాథుని 17కేజీల లడ్డును వేలం వేశారు.
NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు బుధవారం చేపట్టారు. మొత్తం 84 రోజులకు గాను దాదాపుగా రూ.1,13,12,632 లు నగదు వచ్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు.
ATP: తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రం భక్తులతో కోలాహలం నెలకొంది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని బుధవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామిని 1,116 లడ్డూలతో ప్రత్యేకంగా అలంకరించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. దక్షిణ కాశీగా పిలవబడే ఈ క్షేత్రంలో స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆశీస్సులతో కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావాలి ఆధ్వర్యంలో ఇవాళ స్వచ్ఛ మంత్రాలయం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1500 మంది బీజేపీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమం చేశారు. గోశాల, పబ్లిక్ గార్డెన్, ప్రసాద వితరణ, నది తీరా ప్రాంతాలలో వ్యర్ధాలను తొలగించారు.
MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని ప్రధాన దేవాలయం, అన్ని దేవాలయాలను మూసివేస్తామన్నారు. సెప్టెంబర్ 8న దేవాలయంలో సంప్రోక్షణ అనంతరం దేవాలయాన్ని తెరుస్తామన్నారు.
AP: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 7న మ.3:30 నుంచి 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 8వ తేదీ దర్శనం కోసం 7వ తేదీ వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. 8వ తేదీన నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇస్తారు. 7వ తేదీ శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేశారు.