• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

డిసెంబర్ 23: మంగళవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, పుష్య మాసం, శుక్లపక్షం తదియ: ఉ. 10-27 తదుపరి చవితి; శ్రవణ: తె. 5-41 తదుపరి ధనిష్ఠ; వర్జ్యం: ఉ. 8-49 నుంచి 10-30 వరకు; అమృత ఘడియలు: సా. 6-50 నుంచి 8-30 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-41 నుంచి 9-25 వరకు ; తిరిగి రా. 10-40 నుంచి 11-32 వరకు; రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6.30; సూర్యాస్తమయం: […]

December 23, 2025 / 03:08 AM IST

ఈనెల 23న తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో ఈనెల 23వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

December 19, 2025 / 06:28 PM IST

డిసెంబర్ 19: శుక్రవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళపక్షం అమావాస్య: తె.6:23 తదుపరి; పుష్య శుక్ల పక్ష పాడ్యమి; జ్యేష్ఠ: రా.10:51 తదుపరి మూల; వర్జ్యం: లేదు; అమృత ఘడియలు: మ.1:07 నుంచి 2:53 వరకు; దుర్ముహూర్తం: ఉ.8:39 నుంచి 9:23 వరకు; తిరిగి మ.12:18 నుంచి 1:02 వరకు; రాహుకాలం: ఉ.10:30 నుంచి 12:00 వరకు; సూర్యోదయం: ఉ.6:28; సూర్యాస్తమయం: సా.5:26.

December 19, 2025 / 03:45 AM IST

నేడు శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

AP: శ్రీవారి దర్శనానికి సంబంధించి మార్చి నెల కోటా టికెట్లు ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందిన వారి వివరాలు ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడిస్తారు.

December 18, 2025 / 08:29 AM IST

ధనుర్మాసం ప్రారంభం.. ఆలయంలో పూజలు

KDP: నేటి నుంచి పవిత్ర ధనుర్మాసం ప్రారంభమైంది. కాగా జనవరి 16 వరకు ధనుర్మాసం ఉంటుంది. ఇందులో భాగంగా కడప గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ బట్టర్ ఆధ్వర్యంలో విశేషమైన అభిషేకాలు, పూజల నిర్వహించగా… పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు.

December 16, 2025 / 09:00 AM IST

మంగళ రూపిని అలంకారంలో శ్రీ వీరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం ప్రైవేటు బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా మంగళ రూపిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను పంచామృతలతోపాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సింధూరం, కుంకుమ, పసుపు, వివిధ పుష్పాలతో మంగళ రూపినిగా అలంకరించి పూజలు నిర్వహించారు.

December 16, 2025 / 08:20 AM IST

నేటి నుంచి యాదగిరిలో ధనుర్మాస వేడుకలు

TG: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. ధనుర్మాస వేడుకలకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జనవరి 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ నెల రోజులపాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు, పారాయణికులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కైంకర్యాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

December 16, 2025 / 07:19 AM IST

డిసెంబర్ 16: మంగళవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళపక్షం ద్వాదశి: రా.12:01 తదుపరి త్రయోదశి; స్వాతి: మ.3:11 తదుపరి విశాఖ; వర్జ్యం: రా.9:22 నుంచి 11:08 వరకు; అమృత ఘడియలు: ఉ.7:18 వరకు; దుర్ముహూర్తం: ఉ.8:37 నుంచి 9:21 వరకు; తిరిగి రా.10:36 నుంచి 11:28 వరకు; రాహుకాలం: మ.3:00 నుంచి 4:30 వరకు; సూర్యోదయం: ఉ.6:26; సూర్యాస్తమయం: సా.5:24 ధనుర్మాస ఆరంభం మ.1:23.

December 16, 2025 / 02:10 AM IST

శ్రీవారి దర్శనం.. టికెట్ల విడుదల తేదీలివే

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 2026 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటా టికెట్ల విడుదల తేదీలు వచ్చాయి. మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 22న ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

December 15, 2025 / 08:18 PM IST

ముగిసిన భవానీ దీక్షల విరమణ

విజయవాడలోని ఇంద్రకీలాద్రీపై పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ ముగిసింది. ఈ 5 రోజుల్లోనే దుర్గమ్మను 5 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ ప్రోటోకాల్ సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భవానీలు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

December 15, 2025 / 12:37 PM IST

అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

VSP: సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు.

December 15, 2025 / 10:10 AM IST

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజూ దాదాపు 80 వేల మంతి భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారని, ఈ సీజన్‌లో ఇప్పటికే 24 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

December 15, 2025 / 08:27 AM IST

ఇంద్రకీలాద్రి వెళ్లే భక్తులకు అలర్ట్

AP: ఇవాళ్టి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఉ.6 గం.లకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదర్శన ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉ. 7 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గం.ల వరకు దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు.

December 11, 2025 / 06:44 AM IST

ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: TTD

AP: డిసెంబరు, జనవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసినట్లు TTD ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం), 29న (వైకుంఠ ఏకాదశి ముందు రోజు), డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు (వైకుంఠ ద్వార దర్శనాలు), జనవరి 25 (రథ సప్తమి) రోజుల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొంది.

December 10, 2025 / 08:17 PM IST

శబరిమల 18 మెట్లు ఏం సూచిస్తాయి?

శబరిమలలోని 18 మెట్లు లోతైన ఆధ్యాత్మిక అర్థం కలిగి ఉన్నాయి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను అదుపు చేయాలని సూచిస్తాయి. తర్వాతి 8 మెట్లు కామం, కోపం వంటి 8 రాగద్వేషాలను త్యజించాలనే భావాన్ని వ్యక్తపరుస్తాయి. ఆపై వచ్చే 3 మెట్లు త్రిగుణాల(సత్త్వ, రజో, తమో)కు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు సూచికగా నిలుస్తాయి. ఈ మొత్తం మెట్లు మనిషి సరైన మార్గంలో నడవాలనే సందేశాన్నిస్తాయి.

December 10, 2025 / 12:37 PM IST