SDPT: ఈ నెల 8న శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈ విషయాన్ని గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు, భకరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు శనివారం తెలిపారు. ఈ దైవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
బీహార్ వైశాలీ జిల్లాలోని సర్సాయ్ గ్రామం గబ్బిలాల సంరక్షణకు పేరుగాంచింది. ఇక్కడి చెట్లపై లక్షల గబ్బిలాలు నివసిస్తాయి. వీటిని గ్రామ సంరక్షకులుగా కొలిచే స్థానికులు నీళ్లు పెట్టడమే కాక, వాటికి ఎవరైనా హాని చేస్తే జరిమానాలు విధిస్తూ ఉంటారు. గ్రామస్థులు జబ్బు పడినా త్వరగా నయం కావాలని వీటినే ప్రార్థిస్తారు. విశ్వాసం, పర్యావరణ రక్షణ కలగలిసిన సంప్రదాయంగా పాటిస్తున్నారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనాలకు శ్రీవాణి కోటా టికెట్లు అన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. జనవరి 2 – 8 తేదీలకు గాను రోజుకు 1000 చొప్పున 7 వేల టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. కాగా DEC 30, 31, JAN 1కి సంబంధించిన టికెట్లను ఈ-డిప్ ద్వారా కేటాయించిన సంగతి తెలిసిందే.
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ నిర్వహించాల్సిన గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో టీటీడీ కార్తీక దీపోత్సవం నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు సమర్పించనున్నారు. కార్తీక దీపోత్సవం కారణంగా భక్తుల సౌకర్యార్థం గరుడ సేవ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
BDK: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీరామ దీక్షలో భాగంగా రామ దీక్ష తీసుకున్న స్వాములకు ఆలయం నందు చందన గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్తీక పునర్వసు రోజు శ్రీరామ దీక్ష తీసుకున్న దీక్షితులు పాల్గొన్నారు.
RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి మల్కాపూర్లో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ, ఇరుముడి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు ప్రత్యేక పూజలు చేశారు. మహా పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేటతుల్లి ఆటలు, భజనలతో గ్రామం భక్తిమయంగా మారింది. మండపంలో పాలాభిషేకం, నెయ్యాభిషేకం, 18 కళాశాల అర్చన ఆకర్షణగా నిలిచాయి.
BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో గురువారం చండీహోమం జరుగుతుందని ఆలయ ఈవో రజిని కుమారి బుధవారం తెలిపారు. చండీహోమంలో పాల్గొనే దంపతులకు అమ్మవారి శేష వస్త్రాలతో పాటు ప్రసాదం అందజేస్తామని తెలిపారు. చండీహోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలతో అదే రోజు నమోదు చేసుకోవాలని సూచించారు.
RR: మార్గశిర పౌర్ణమి సందర్భంగా శంకర్పల్లిలోని కొత్తగూడ లోఉన్న పాతాళ త్రికోన మహాకాళి ఆలయంలో రేపు ఉదయం 11 గంటల 10 నిమిషములకు గంగ యమునా సరస్వతి జల మహా హోమం ఉంటుందని ఆలయ ధర్మాధికారి మాధవ రెడ్డి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణాకటాక్షలు పొందాలని కోరారు.
తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం) ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రం అరుణాచలం కొండపై కార్తీక మహాదీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలొస్తున్నట్లు సమాచారం.
మార్గశిర పౌర్ణమి రోజున బ్రహ్మముహూర్తం చాలా దైవిక శక్తి కలదని పండితులు చెబుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రేపు ఉదయం 4:19 నుంచి 4:58 మధ్య బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో 4 మంత్రాలను పఠిస్తే సిరిసంపదలు కలుగుతాయి. 1. ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసిద్ధః 2. శ్రీ హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మమాయై నమః 3. ఓం శ్రీం శ్రీం శ్రీం శ్రీం సః చంద్రాంశే నమః 4. ఓం నమః […]
AP: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తుల వివరాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 30వ తేదీకి 57వేలు, 31వ తేదీకి 64వేలు, జనవరి 1వ తేదీకి 55 వేల టోకెన్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
సత్యసాయి: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ రాత్రి 7.30 గంటలకు వెండి రథ ప్రాకారోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉ. 7 నుంచి 9 గంటల మధ్య స్వామివారికి అభిషేకం, స్వర్ణకవచ సేవలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, తిరిగి సా.5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వదర్శనం కల్పిస్తారు.
AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. దర్శనీయ ప్రవేశాలు పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను మూసేశారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులను అలిపిరి వద్ద TTD భద్రతా సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు తిరుమలలోని ఐదు డ్యామ్లు పూర్తి నిండి పొంగి పొర్లుతున్నాయని TTD వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.
TG: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాలను నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తులు కొండ కింద కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.