KDP: సిద్దవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాల మహోత్సవం మే 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 20న గణపతి పూజ పుణ్యాహవాచనం, ద్వజారోహణ, అంకురార్ప పంచామృతాభిషేకం, ఆకు పూజ, అర్చన, మంగళ హారతి వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంను వైసీపీ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి శనివారం దర్శించుకుని, శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ స్వామి గంగుల గోత్రనామాలతో పూజలు నిర్వహించారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి గురువారం ఆలయ ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో భాగంగా కళ్యాణకట్ట రూ.75,000, ప్రసాద విక్రయాలు రూ.11,02,680, VIP దర్శనాలు రూ.2,25,000, బ్రేక్ దర్శనాలు రూ.1,64,700, కార్ పార్కింగ్ రూ.3,11,500, వ్రతాలు రూ.1,37,600 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.34,67,268 ఆదాయం వచ్చిందన్నారు.
SRD: జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. గణపతి పూజ, పంచామృత అభిషేకం, దత్త హోమం, పూర్ణాహుతి, హారతి, అన్నప్రసాద కార్యక్రమలు ఉంటాయని వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుడు ఆశీస్సులు పొందగలరని కోరారు.
MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. తెల్లవారు జామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నిమ్మకాయల మాలతో కుంకుమార్చన నిర్వహించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.
SKLM: తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న TTD వారు సకల మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇటీవల తన తల్లి మృతి చెందిన తర్వాత మొదటిసారిగా స్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు.
HYD: ఫిలింనగర్ దైవ సన్నిధానంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువ జామునే పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, హోమం జరిపించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌఖ్యాలు లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ASR: ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉత్సవాలు ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఉత్సవాలు కట్టుదిట్టంగా జరగడానికి పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రకాశం: వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మన ఆర్మీకి రక్షణ వ్యవస్థకు మద్దతుగా ఆలయ పాలక మండల సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పహల్గాంలో హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులలో మరణించిన మన భరతమాత ముద్దుబిడ్డలపై జరిగిన ఉగ్రదాడి ప్రతీకారంగా తీర్చుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి అందరూ మద్దతు తెలపాలన్నారు.
WGL: శ్రీ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారికి పూజలు చేసి హారతినిచ్చారు. భద్రకాళి దేవస్థాన అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురుపూజ ఆరాధన మహోత్సవాలు మే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 7వ తేదీ వైశాఖ శుద్ధ దశమి స్వామివారి సజీవ సమాధి వహించిన పవిత్ర దినం, 8వ తేదీ మహా రథం, 9వ తేదీ మహా ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
CTR: పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీ విరుపాక్షి మారెమ్మకు మంగళవారం సందర్భంగా పూజలు చేశారు. అమ్మవారు మంగళరూపిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహాన్ని అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, నిమ్మకాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన హారంతో అలంకరించారు.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని సమాచారం. కంపార్ట్మెంట్లన్ని నిండి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,568 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ. 3.36 కోట్ల ఆదాయం వచ్చింది.
NLR: నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాత్రి స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.