• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

శ్రీ ఈరన్న స్వామి హుండీ ఆదాయం రూ.1,08,37,696

KRNL: కౌతాళం మండలం ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి హుండీ ఆదాయం రూ.1,08,37,696 వచ్చింది. అన్నదానం కోసం రూ.61,422, బంగారం 61.200 గ్రాములు, వెండి 14 కేజీల 70 గ్రాములు వచ్చినట్లు ఈఓ విజయరాజు మంగళవారం తెలిపారు. లెక్కింపులో హుండీ పర్యవేక్షణ అధికారి ఎస్.వెంకటేశ్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

October 22, 2024 / 07:53 PM IST

మంత్రాలయాన్ని సందర్శించిన బిషప్ హెన్రీ డిసౌజా

KRNL: బళ్లారి బిషప్ హెన్రీ డిసౌజా, ఫాదర్ ఇవాన్ పింటో మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. వచ్చే నెల 27న బళ్లారిలో జరగనున్న అంతర్-మత సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రావాలని పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు హాజరై శ్రీ మఠం విశిష్టను తెలపాలని కోరారు.

October 22, 2024 / 07:30 PM IST

రేపు ముత్యాలమ్మ తృతీయ వార్షికోత్సవం సంబరాలు

NLR: దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామంలో వెలసివున్న ముత్యాలమ్మ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రత్యేక పుష్పాలంకరణ, గ్రామ పొంగళ్లు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వైభవంగా ఉయ్యాల సేవ జరగనుంది. భక్తులపై కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా గ్రామస్థులు తెలియ చేశారు.

October 22, 2024 / 06:27 PM IST

శ్రీ మఠంలో కార్తీక దీపోత్సవాలు

KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళవారం కార్తీక దీపోత్సవాలు వెలిగించారు. శ్రీ మఠంలో ఊంజల మండపంలో వెండి ఉయ్యాలలో ప్రహల్లాద మూర్తిని అధిష్టించి సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపోత్సవ సేవ చేయించిన భక్తులు.. కార్తీక దీపాలు వెలిగించారు. ప్రహ్లాద రాయలను వివిధ రకాల రథోత్సవాలపై ఉంచి ప్రాకారం చుట్టూ ఊరేగించారు.

October 22, 2024 / 11:28 AM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి క్షీరాభిషేకం

WGL: నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చకులు ఈరోజు పాలాభిషేకం చేశారు. నేడు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం రోజు కావడంతో స్వామికి పాలతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు, స్థానిక మహిళలు ఆలయానికి చేరుకొని, స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.

October 22, 2024 / 10:19 AM IST

రేపు ఆరుద్ర నక్షత్ర వేడుకలు

SRD: పోతిరెడ్డిపల్లి చౌరస్తా పరిధిలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 23వ తేదీన ఆరుద్ర నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ సభ్యులు మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు అన్నాభిషేకం, పాలాభిషేకం, రుద్రాభిషేకం జరుగుతాయని చెప్పారు. రాత్రి 7 గంటలకు భస్మాభిషేకం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

October 22, 2024 / 08:15 AM IST

భౌమ వాసరే పూజలందుకున్న నల్ల పోచమ్మ

SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ దేవాలయంలో మంగళవారం భౌమ వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం పసుపు కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలు, వివిధ రకాల సుగంధ పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చకులు సిద్దు స్వామి అమ్మవారికి హారతి సమర్పించి నైవేద్యం నివేదన చేశారు.

October 22, 2024 / 08:06 AM IST

రాజగోపురం వద్ద వన దుర్గమ్మకు పూజలు

MDK: పాపన్నపేట మండలంలో మహా పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయలలో రాజగోపురం వద్ద వన దుర్గమ్మకు మంగళవారం ప్రత్యేక అలంకరణలో పూజలు చేశారు. భౌమ వాసరే సందర్భంగా అమ్మవారికి ఒడి బియ్యం, పూలు, పసుపు, కుంకుమలు, గాజులు, నిమ్మకాయలు, పట్టు వస్త్రాలు సమర్పించి మంగళహారతి, నైవేద్యం నివేదన చేశారు. అనంతరం భక్తులకు దుర్గామాత దర్శనం కల్పించారు.

October 22, 2024 / 07:20 AM IST

అక్టోబర్ 22: మంగళవారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం పంచమి: ఉ. 7-28 తదుపరి షష్ఠి మృగశిర: ఉ. 11-30 తదుపరి ఆర్ద్ర వర్జ్యం: రా. 7-49 నుంచి 9-24 వరకు అమృత ఘడియలు: రా. 1-21 నుంచి 2-56 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-16 నుంచి 9-03 వరకు తిరిగి రా. 10-30 నుంచి 11-20 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 5.58; సూర్యాస్తమయం: సా.5.32

October 22, 2024 / 04:54 AM IST

మంగళగిరి: రేపటి నుంచి పానకం రూ.30

GNTR: మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి ఒక బిందె పానకం రూ.30 రూపాయలకే భక్తులకు అందిస్తున్నట్లు దేవస్థాన ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 నిమిషాల వరకు పానకం నివేదన ఉంటుందని చెప్పారు.

October 21, 2024 / 11:17 AM IST

అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు జింకా సాంబయ్య స్వామివారి మూలవిరాట్టుకు జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

October 21, 2024 / 10:11 AM IST

ఆదిత్యని ఆదాయం రూ. 3.72 లక్షల

శ్రీకాకుళం అరసవల్లిలో సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పలువురు కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించారు. ఇంద్రపుష్కరిణిలో పుణ్య స్నానం అనంతరం ఆదిత్యుని దర్శించుకున్నారు. గోశాలలో పూజలు చేశారు. దర్శన టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, ప్రత్యేక పూజల రూపంలో రూ. 3.72 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు.

October 21, 2024 / 05:41 AM IST

గార్మి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి

GNTR: గ్యార్మి పండుగను పురస్కరించుకుని ఆదివారం గుంటూరు 23వ డివిజన్ ఏటి అగ్రహారం మహబూబ్ నగర్ జెండా చెట్టు వద్ద స్థానిక ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్యార్మి పండుగ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం ప్రజలకు భోజనాలు వడ్డించారు.

October 21, 2024 / 03:50 AM IST

అక్టోబర్ 21: సోమవారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం చవితి: ఉ. 8-56 తదుపరి పంచమి రోహిణి: మ. 12-12 తదుపరి మృగశిర వర్జ్యం: ఉ. 6-03 వరకు తిరిగి సా.5-38 నుంచి 7-11 వరకు అమృత ఘడియలు: ఉ. 9-08 నుంచి 10-40 వరకు తిరిగి రా. 2-57 నుంచి 4-30 వరకు దుర్ముహూర్తం: మ. 12-08 నుంచి 12-54 వరకు తిరిగి 2-27 నుంచి 3-13 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి […]

October 21, 2024 / 01:03 AM IST

నవంబర్ 2 నుంచి కార్తీకమాస ఉత్సవం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో కొలువైయున్న భవాని శంకర స్వామి ఆలయంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీకమాస ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతిరోజు శంకర భవాని స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు కార్తీకమాస ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

October 20, 2024 / 02:43 PM IST