శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, పుష్యమాసం, బహుళపక్షం విదయ: మ.12:50 తదుపరి తదియ, పుష్యమి: సా.4:45 తదుపరి అశ్లేష, వర్జ్యం: తె.5:15 నుంచి, అమృత ఘడియలు: ఉ.10:35 నుంచి 12.08 వరకు, దుర్ముహూర్తం: మ.12:27 నుంచి 1:11 వరకు తిరిగి 2:39 నుంచి 3:23 వరకు, రాహుకాలం: ఉ.7:30 నుంచి 9:00 వరకు, సూర్యోదయం: ఉ.6:36, సూర్యాస్తమయం: సా.5:35.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, పుష్యమాసం, బహుళపక్షం పాడ్యమి: మ2-29 తదుపరి విదియ పునర్వసు: సా5-40 తదుపరి పుష్యమి; వర్జ్యం: ఉ7-48 వరకు తిరిగి రా1-22 నుంచి 2-54 వరకు; అమృత ఘడియలు: మ3-24 నుంచి 4-55 వరకు; దుర్ముహూర్తం: సా4-07 నుంచి 4-51 వరకు; రాహుకాలం: సా4-30 నుంచి 6-00 వరకు; సూర్యోదయం: ఉ6-36; సూర్యాస్తమయం సా5-35.
ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడికి, సృష్టిని పాలించే విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో లింగం భూమిపై ఆవిర్భవించింది. దాని ఆది, అంతం కనుగొనడానికి వారు ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదు. వారు అలా వెతుకుతుండగా, ఆ అగ్నిస్తంభం మధ్యభాగం నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సృష్టి, స్థితి, లయలకు తానే మూలమని శివుడు వెల్లడించాడు.
ఇవాళ పరమేశ్వరుని అనంత శక్తికి ప్రతీకగా నిలిచే శివలింగం ఆవిర్భవించిన పవిత్ర దినం. హిందూ పురాణాల ప్రకారం, శివలింగం అనేది సృష్టి, స్థితి, లయకారకుడైన శివుడి నిరాకార రూపాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక ఆకారం కాదు, అంతులేని శక్తికి, సమస్త విశ్వానికి మూలమైన బ్రహ్మాండ తత్త్వానికి ప్రతిబింబం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 20 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్ శిలాతోరణం వరకు నిలిచిపోయింది. నిన్న ఒక్కరోజే 83,032 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
AP: విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు టికెట్ తీసుకోవడం తప్పనిసరి చేశారు. రోజుకు 300 మంది సిఫార్సు లెటర్లతో.. టికెట్ లేకుండానే ఉచితంగా దర్శనం చేసుకుంటున్నారని, దీనివల్ల ఆలయానికి గండి పడుతోందని అధికారులు గుర్తించారు. ఈ ఆదాయ నష్టాన్ని అరికట్టేందుకే టికెట్ నిబంధనను కఠినతరం చేసింది.
AP: తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు అరుదైన అవకాశం లభించింది. శ్రీవారి అభిషేక సేవ జరుగుతుండగా సామాన్య భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. వీలైనంత ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇచ్చింది. అలాగే నేటి నుంచి టోకెన్లు లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించింది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ అర్ధరాత్రి నుంచి టోకెన్లు లేనివారిని కూడా వైకుంఠ ద్వారదర్శనాలకు అనుమతించనున్న నేపథ్యంలో.. ముందుగానే భక్తులు తిరుమల బాట పట్టారు. అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో TTD, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లతో పాటు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
AP: చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాలనికి అరుదైన గుర్తింపు లభించింది. ఆలయం చేస్తున్న నాణ్యమైన పాలన, పారిశుద్ధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తున్నందుకు గాను తాజాగా ISO సర్టిఫికెట్ మంజూరైంది. ఈ మేరకు స్థానిక MLA కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ఛైర్మన్, ఈవోలకు సర్టిఫికెట్లు అందజేశారు.
TG: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. HYD నాచారంలోని HMT నగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 12వేల మంది దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. స్వామివారికి తులసిమాలలు, ప్రసాదాలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ తెరుచుకోనుంది. మకరవిళక్కు కోసం ఆలయాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేయనున్నట్లు ట్రావెన్కోర్ బోర్డ్ తెలిపింది. ముందుగా ఆలయంలో పవిత్ర దీపాన్ని వెలిగించి.. అనంతరం స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. మకరవిళక్కు నేపథ్యంలో భారీగా అయ్యప్ప భక్తులు కొండకు వచ్చే అవకాశం ఉండటంతో.. వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉత్తర ద్వారా తెరుచుకోగా.. సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. రాములోరి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అటు ద్వారకా తిరుమలలోనూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారదర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. గోవింద నామస్మరణతో చిన్న తిరుమల మార్మోగుతోంది.
తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారికి ధనుర్మాస కైంకర్యాల అనంతరం భక్తులను వైకుంఠ ప్రదక్షిణగా అనుమతించారు. కాగా తొలి 3 రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందినవారిని అనుమతిస్తారు. జనవరి 2-8 తేదీల్లో టోకెన్లు లేనివారికీ అవకాశం కల్పిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ప్రాకారాలు, గోపురాలు విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తున్నాయి.
‘వైకుంఠ ఏకాదశి’ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం, జాగరణ ఉండి, ఆలయాల్లోని ‘ఉత్తర ద్వారం’ గుండా శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారు. ఇలా దర్శనం చేసుకోవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు...