• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

పెద్దగట్టు జాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ

NLG: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సూర్యపేటలోని లింగమతుల స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకొని స్వామి కృపకు పాత్రులవుతున్నారు. భారీగా వాహనాలు తరలివస్తుండటంతో అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. HYD నుంచి VJWD వెళ్లే వాహనాలను NKP వద్ద దారి మళ్లిస్తున్నారు.

February 18, 2025 / 11:15 AM IST

ముగిసిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

పార్వతీపురంమండలంలోని తాళ్లబురిడి గ్రామంలో ఆరవిల్లి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు అయ్యల స్వామి యాజుల శ్రీనివాసశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు బసవ రాజుల పర్యవేక్షణలో శివాలయ ప్రతిష్ట పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడు రోజుల నుంచి గ్రామస్తుల సహాయ సహకారాలతో శివాలయపునఃప్రతిష్ట పూజలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

February 18, 2025 / 10:52 AM IST

మహాశివరాత్రి పూజలకు ఏర్పాట్లు

VSP: మధురవాడ ఐటీ రోడ్డులోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని అర్చకులు సుబ్బారావు తెలిపారు. నమకం చమకం – మహన్యాస పూర్వక అభిషేకంతో ప్రారంభమై రుద్రాభిషేకం, అభిషేకాలు, లింగోద్భవ పూజలు ఉంటాయన్నారు. సోమవారం ప్రత్యేక అభిషేకాలు చేశారు.

February 17, 2025 / 09:02 AM IST

వాడపల్లి వేంకటేశ్వర ఆలయ ఆదాయం ఎంతంటే.?

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ. 38,02,281 ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు.

February 15, 2025 / 04:59 PM IST

ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం వేకువజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి మూలమూర్తికి సింధూర, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.

February 15, 2025 / 01:06 PM IST

కుల్లూరులో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయపునః ప్రతిష్ఠ

NLR: కలువాయి మండలం కుల్లూరులో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం దంపతులు, చల్ల సీతారామ్, కమల ఆధ్వర్యంలో ఆలయం నూతనంగా నిర్మించారు. వడ్డెరల కుల ఆది గురువు ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి జీ సారథ్యంలో ప్రత్యేక యజ్ఞ యాగాలు జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

February 13, 2025 / 11:03 AM IST

బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం వద్ద గిరిప్రదక్షిణ

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలోని శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘపౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆలయ కొండకు ఇరువైపులా గిరి ప్రదర్శన చేశారు. ప్రతి ఏడాది మాఘపౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన చేస్తున్నట్లు వీరు తెలిపారు.

February 12, 2025 / 11:15 AM IST

రూ.4కోట్లతో సింహాచలం ఆలయ పైకప్పుకు మరమ్మతులు

VSP: సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.

February 12, 2025 / 06:19 AM IST

రేపు కందుకూరు అంకమ్మ తల్లి ఆలయంలో ఏకాహం

NLR: కందుకూరు పట్టణంలోని శతాబ్దాల నాటి ప్రాచీన ప్రసిద్ధి అంకమ్మ తల్లి దేవాలయంలో ఈనెల 12వ తేదీ ఏకాహం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు (ఏకాహం) లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఏకాహంలో పాల్గొంటారని తెలిపారు.

February 11, 2025 / 11:17 AM IST

కూరగాయల అలంకరణలో ఆంజనేయుడు

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామిని మంగళవారం సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజామనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తికి పలు రకాల పుష్పాలు, తమలపాకుల తోరణాలతో అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

February 11, 2025 / 10:12 AM IST

విగ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 3,18,218 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 795 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, అన్న ప్రసాద ట్రస్ట్ ద్వారా 4,190 మంది భక్తులు అన్నదానం స్వీకరించారని వెల్లడించారు.

February 9, 2025 / 07:00 PM IST

శ్రీ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కోష్ట జాతీయ రహదారి పక్క శ్రీ కృష్ణ చైతన్య మఠం వారి గోశాల, శ్రీ రాధా గోవిందా గోకులానంద ఆశ్రమంలో శ్రీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రతిష్ట కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తు శ్రీ విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, సాధువులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

February 7, 2025 / 10:48 AM IST

పల్లకీ మోసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటరమణుడి మూల విరాట్‌ను భక్తులు పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రావణి భక్తులతో కలిసి పల్లకీని మోశారు.

February 6, 2025 / 10:10 AM IST

కాలేశ్వరం ఆలయంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం

PDPL: కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగే మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు, కాలేశ్వరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణింద్ర శర్మ అన్నారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి కరకమలములతో శతచండీ మహారుద్ర సహిత సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

February 5, 2025 / 06:49 PM IST

రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

CTR: పుంగనూరులో మంగళవారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవలలో భక్తులు పాల్గొనాలని కోరారు.

February 3, 2025 / 02:59 PM IST