సత్యసాయి: సోమందేపల్లిలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఈనెల 25న ఘనంగా నిర్వహించనున్నట్లు తొగటవీర క్షత్రీయ సంఘం అద్యక్షుడు సీసీ హరిదాస్ తెలిపారు. 25న అమ్మవారి జయంతి సందర్భంగా బోణాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆరోజు మహిళలు హిందూ సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు ధరించి, అమ్మవారి ఆలయానికి బోనాలు మోయాలని పిలుపునిచ్చారు.
ATP: తాడిపత్రి మండలంలోని ఓబులేసు కోనలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులేసుకోన శ్రీ లక్ష్మీనారసింహ స్వామిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
KRNL: హోళగుంద ఎంఈవో -2గా కబీర్ సాబ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుతం హోళగుంద జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా స్టేట్ టీచర్ యూనియన్ సభ్యులు స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో కబీర్ సాబ్ను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారం, సమన్వయంతో మండల విద్యా శాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
అన్నమయ్య: శ్రీ సౌమ్య నాధుని కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం వేద పండితులు వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజు శ్రీ దేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి కళ్యాణం చూడ ముచ్చటగా సాగింది. కళ్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులతో ఆలయంకిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కళ్యాణవేదికను అలంకరించారు.
W.G: పెనుగొండ పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో గ్రామ కచేరి వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు చేసి అలంకరణ నిర్వహించారు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
CTR: పుంగనూరు గ్రామ దేవత మారెమ్మ ఆలయంలో ఆషాడ మాసం తొలి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. వేకువజాము నుంచి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
NGKL: అచ్చంపేట పట్టణంలో చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత అమ్మవారికి మహిళాలు ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మ వారికి ఒడి బియ్యం, కుంకుమ, పసుపు, గాజులు, కొబ్బరి కుడుకలు, పట్టు చీర, తలంబ్రాలు సమర్పించారు.
CTR: పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీవిరుపాక్షి మారెమ్మకు ఆషాడ మాసంలో తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి శిలా విగ్రహాన్ని అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకించారు. అమ్మవారిని పసుపు, కుంకుమ, ఈత పళ్ళతో, మామిడికాయలతో, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు .
SRCL: ఇల్లంతకుంట మండలం సోమరంపేట గ్రామంలో ఆదివారం గ్రామస్తులు పోచమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తి శ్రద్దలతో బోనాలు వండారు. డప్పు చప్పులతో బోనాలను నెత్తిన ఎత్తుకొని పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, పాడిపంటలు, పిల్లా జెల్లలు బాగుండాలని మొక్కులు చెల్లించుకున్నారు.
NLR: సంగం మండలంలోని వెంగారెడ్డి పాలెం శ్రీ సాయిబాబా మందిరంలో శుక్రవారం ఆరవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్రమైన ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. శ్రీరాముడు, సీతాదేవి కల్యాణం వైదిక మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి క్షీరాభిషేకం, తులసిదళ అర్చన తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి ATGH వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,037 మంది భక్తులు దర్శించుకోగా.. 30,548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, స్వామివారి హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
AP: రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు పెట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి ప్రతిపాదించింది. పేరు మార్పుపై ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించింది. ‘బెంగళూరులో శ్రీవారి ఆలయం పెద్దది నిర్మించాలని అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారు. స్థలం కేటాయించగానే ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
WG: ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో పెనుగొండ రోడ్డులో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మంగళవారం తెల్లవారుజాము భక్తలు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం స్వామివారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
SRD: దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో మంగళవారం సంగమేశ్వరస్వామికి షష్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యేష్ట మాసం కృష్ణపక్షం భూమా వాసవి పురస్కరించుకొని పార్వతీ సంగమేశ్వర స్వామికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి సమర్పించారు.