NTR: ధనుర్మాసం సందర్భంగా రామకృష్ణాపురంలో బుధవారం ఉదయం 9 గంటలకు వెంకటేశ్వర స్వామి గుడిలో అమ్మవార్లకు సారెతో పాటుగా మూలవిరాట్లకు పుష్పార్చన చేశారు. ఈ విశేషమైన కార్యక్రమంలో భక్తమహాశయులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నీరద ఆలయ ధర్మకర్త అద్దంకి సత్యనారాయణ ప్రసాద్ ఆర్ఎస్ఎస్ శర్మ, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో ఆఫ్లైన్లో ఇస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల జారీపై TTD కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ కింద ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రేపటితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనుండగా.. 9 నుంచి ఆన్లైన్లో జారీ చేయనుంది. భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు ఆఫ్లైన్ జారీని టీటీడీ నిలిపివేసింది. జనవరి 9 నుంచి ఆన్లైన్లో జారీ చేయనుంది. నెలపాటు ప్రయోగాత్మకంగా టికెట్లను ఆన్లైన్లో ఇవ్వనుంది. అడ్వాన్స్ బుకింగ్, విమానాశ్రయంలో ఇచ్చే ఆఫ్లైన్ టికెట్లు అధికారులు యథావిధిగా జారీ చేయనున్నారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, పుష్యమానం, బహుళపక్షం తదితయ: ఉ.11:34 తదుపరి చవితి; వర్జ్యం: ఉ.6:49 వరకు; తిరిగి తె.4:08 నుంచి 5:43 వరకు; అమృత ఘడియలు:మ.2:48 నుంచి 4:12 వరకు; దుర్ముహూర్తం: ఉ.8:48 నుంచి 9:31 వరకు, తిరిగి రా.10:47 నుంచి 11:39 వరకు; రాహుకాలం:సా.3:00 నుంచి 4:30 వరకు; సూర్యోదయం:ఉ.6:36; సూర్యాస్తమయం:సా.5:36; సంకట హర చతుర్ధి.
JAN 19- అమ్మవారి గద్దెలు, ప్రాంగణం ప్రారంభోత్సవంJAN 28- జాతర ప్రారంభంJAN 28- సారలమ్మ దేవత ఆగమనంJAN 29- సమ్మక్క దేవత ఆగమనంJAN 30- అమ్మవార్లను దర్శించుకోనున్న భక్తులు JAN 31- తిరిగి అమ్మవార్లు వన ప్రవేశం
AP: ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో కొలువుదీరిన తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రంగుల మహోత్సవాన్ని నిర్వహించారు. పెనుగంచిప్రోలు రంగుల మండపం నుంచి జగ్గయ్యపేట రంగుల మండపం వరకు ఎద్దుల బండ్లపై దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు పెనుగంచిప్రోలు గ్రామస్తులకు అవకాశం కల్పించారు. లాటరీ ద్వారా భక్తులను ఎంపిక చేశారు. రెండేళ్లకోకసారి రంగుల మహోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, పుష్యమాసం, బహుళపక్షం విదయ: మ.12:50 తదుపరి తదియ, పుష్యమి: సా.4:45 తదుపరి అశ్లేష, వర్జ్యం: తె.5:15 నుంచి, అమృత ఘడియలు: ఉ.10:35 నుంచి 12.08 వరకు, దుర్ముహూర్తం: మ.12:27 నుంచి 1:11 వరకు తిరిగి 2:39 నుంచి 3:23 వరకు, రాహుకాలం: ఉ.7:30 నుంచి 9:00 వరకు, సూర్యోదయం: ఉ.6:36, సూర్యాస్తమయం: సా.5:35.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, పుష్యమాసం, బహుళపక్షం పాడ్యమి: మ2-29 తదుపరి విదియ పునర్వసు: సా5-40 తదుపరి పుష్యమి; వర్జ్యం: ఉ7-48 వరకు తిరిగి రా1-22 నుంచి 2-54 వరకు; అమృత ఘడియలు: మ3-24 నుంచి 4-55 వరకు; దుర్ముహూర్తం: సా4-07 నుంచి 4-51 వరకు; రాహుకాలం: సా4-30 నుంచి 6-00 వరకు; సూర్యోదయం: ఉ6-36; సూర్యాస్తమయం సా5-35.
ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడికి, సృష్టిని పాలించే విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో లింగం భూమిపై ఆవిర్భవించింది. దాని ఆది, అంతం కనుగొనడానికి వారు ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదు. వారు అలా వెతుకుతుండగా, ఆ అగ్నిస్తంభం మధ్యభాగం నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సృష్టి, స్థితి, లయలకు తానే మూలమని శివుడు వెల్లడించాడు.
ఇవాళ పరమేశ్వరుని అనంత శక్తికి ప్రతీకగా నిలిచే శివలింగం ఆవిర్భవించిన పవిత్ర దినం. హిందూ పురాణాల ప్రకారం, శివలింగం అనేది సృష్టి, స్థితి, లయకారకుడైన శివుడి నిరాకార రూపాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక ఆకారం కాదు, అంతులేని శక్తికి, సమస్త విశ్వానికి మూలమైన బ్రహ్మాండ తత్త్వానికి ప్రతిబింబం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 20 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్ శిలాతోరణం వరకు నిలిచిపోయింది. నిన్న ఒక్కరోజే 83,032 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.10 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
AP: విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు టికెట్ తీసుకోవడం తప్పనిసరి చేశారు. రోజుకు 300 మంది సిఫార్సు లెటర్లతో.. టికెట్ లేకుండానే ఉచితంగా దర్శనం చేసుకుంటున్నారని, దీనివల్ల ఆలయానికి గండి పడుతోందని అధికారులు గుర్తించారు. ఈ ఆదాయ నష్టాన్ని అరికట్టేందుకే టికెట్ నిబంధనను కఠినతరం చేసింది.
AP: తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు అరుదైన అవకాశం లభించింది. శ్రీవారి అభిషేక సేవ జరుగుతుండగా సామాన్య భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. వీలైనంత ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇచ్చింది. అలాగే నేటి నుంచి టోకెన్లు లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించింది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ అర్ధరాత్రి నుంచి టోకెన్లు లేనివారిని కూడా వైకుంఠ ద్వారదర్శనాలకు అనుమతించనున్న నేపథ్యంలో.. ముందుగానే భక్తులు తిరుమల బాట పట్టారు. అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో TTD, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లతో పాటు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
AP: చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాలనికి అరుదైన గుర్తింపు లభించింది. ఆలయం చేస్తున్న నాణ్యమైన పాలన, పారిశుద్ధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తున్నందుకు గాను తాజాగా ISO సర్టిఫికెట్ మంజూరైంది. ఈ మేరకు స్థానిక MLA కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ఛైర్మన్, ఈవోలకు సర్టిఫికెట్లు అందజేశారు.