NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి పౌర్ణమి పూజలను శనివారం వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవను చేశారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఉన్న యాగశాల నందు చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు చేశారు.
NLR: సంగంలోని కామాక్షీ దేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లు పులి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి పులి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఊరేగించారు. హేమంత్ కృష్ణ అనే ప్రముఖ కళాకారుడు ముక్కుతో ఫ్లూట్ వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి 33వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా 18న అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటలకు లక్ష కుంకుమార్చన, 19న నవగ్రహ చండీ హోమం, అన్నసంతర్పణ, 20న బోనాలు ఉంటాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.
NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
కోనసీమ: మామిడికుదురు పెరెళ్ల కాలువ గట్టు వద్ద ఉన్న రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అర్చకులు సుదర్శనం వెంకట శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామికి తమలపాకులు, గంధ సింధూరంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.
SRCL: వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తుల పోటెత్తారు. సోమవారం శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది.
ATP: అక్కమాంబ అమ్మవారి జాతర సందర్బంగా ఆలయంలో కొలువైన శ్రీ అక్కమహాదేవి, పరమేశ్వరుడికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, వారి సోదరుడు అమిలినేని ఎర్రిస్వామి పట్టు వస్త్రాలు అందించారు. పట్టు వస్త్రాలతో వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ ఛైర్పర్సన్ పద్మావతి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ATP: గుంతకల్లు కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం సాయంకాలం ప్రత్యేకంగా అలంకరించిన వెండి రథంలో కొలువు తీర్చి స్వామివారికి ఆలయ వాణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
AP: శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి భారీగా కన్నడ భక్తులు తరలివస్తున్నారు. పాదయాత్రగా కన్నడిగులు నల్లమల అడవుల నుంచి వస్తున్నారు. ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరపనున్నారు. భారీగా వస్తున్న భక్తుల రద్దీతో ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా రేపటి నుంచి 31 వరకు స్వామివారి స్పర్శదర్శనానికి అనుమతిలేదు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 1,39,595 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 227 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అన్నదాన ట్రస్ట్ ద్వారా 2400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
KRNL: కోసిగి మండలం అగసనూరు గ్రామంలోని తుంగభద్ర నది తీరంలో శ్రీ రాఘవేంద్ర స్వామి నూతన ఆలయ ప్రతిష్టాపన మరియు మూల బృందావన ప్రతిష్టాపన సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయం వైసీపీ యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ. 1,22,565 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 202 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. అన్నదాన ట్రస్ట్ ద్వారా 1500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
SKLM: శ్రీకాకుళంలో ఉన్న సంతోషిమాత అమ్మ వారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మూలవిరాట్కు సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, అలంకరణ సేవ, నీరాజనం, మంత్రపుష్పం, మంగళ హారతి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కే.సర్వేశ్వరరావు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రసాదాలు స్వీకరించారు.
KRNL: దేవనకొండ మండలం గద్దెరాళ్ల శ్రీమారెమ్మ అవ్వ దేవర ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దేవర సందర్భంగా హుండీలో వేసిన కానుకలను ఈవో వీరయ్య ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తంగా రూ.13,85,174 వచ్చినట్టు ఈవో తెలిపారు. ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగిందన్నారు.
జనగామ ఆర్టీసీ బస్సు డిపో కార్గో ద్వారా భక్తుల ఇంటివద్దకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలియజేశారు. తలంబ్రాల బుకింగ్ కొరకు కార్గో లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్, కార్గో ఏజెంట్ రూ.151 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు.