AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో ఈనెల 23వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
AP: శ్రీవారి దర్శనానికి సంబంధించి మార్చి నెల కోటా టికెట్లు ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందిన వారి వివరాలు ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడిస్తారు.
KDP: నేటి నుంచి పవిత్ర ధనుర్మాసం ప్రారంభమైంది. కాగా జనవరి 16 వరకు ధనుర్మాసం ఉంటుంది. ఇందులో భాగంగా కడప గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ బట్టర్ ఆధ్వర్యంలో విశేషమైన అభిషేకాలు, పూజల నిర్వహించగా… పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు.
CTR: పుంగనూరు పట్టణం ప్రైవేటు బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా మంగళ రూపిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను పంచామృతలతోపాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సింధూరం, కుంకుమ, పసుపు, వివిధ పుష్పాలతో మంగళ రూపినిగా అలంకరించి పూజలు నిర్వహించారు.
TG: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. ధనుర్మాస వేడుకలకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జనవరి 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ నెల రోజులపాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు, పారాయణికులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కైంకర్యాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 2026 మార్చి నెలకు సంబంధించి ఆన్లైన్ కోటా టికెట్ల విడుదల తేదీలు వచ్చాయి. మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 22న ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రీపై పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ ముగిసింది. ఈ 5 రోజుల్లోనే దుర్గమ్మను 5 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ ప్రోటోకాల్ సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భవానీలు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
VSP: సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు.
శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజూ దాదాపు 80 వేల మంతి భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారని, ఈ సీజన్లో ఇప్పటికే 24 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
AP: ఇవాళ్టి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఉ.6 గం.లకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదర్శన ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉ. 7 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందన్నారు. రేపటి నుంచి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గం.ల వరకు దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు.
AP: డిసెంబరు, జనవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసినట్లు TTD ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం), 29న (వైకుంఠ ఏకాదశి ముందు రోజు), డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు (వైకుంఠ ద్వార దర్శనాలు), జనవరి 25 (రథ సప్తమి) రోజుల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొంది.
శబరిమలలోని 18 మెట్లు లోతైన ఆధ్యాత్మిక అర్థం కలిగి ఉన్నాయి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను అదుపు చేయాలని సూచిస్తాయి. తర్వాతి 8 మెట్లు కామం, కోపం వంటి 8 రాగద్వేషాలను త్యజించాలనే భావాన్ని వ్యక్తపరుస్తాయి. ఆపై వచ్చే 3 మెట్లు త్రిగుణాల(సత్త్వ, రజో, తమో)కు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు సూచికగా నిలుస్తాయి. ఈ మొత్తం మెట్లు మనిషి సరైన మార్గంలో నడవాలనే సందేశాన్నిస్తాయి.