తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం అన్నికంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.