W.G: పోడూరు మండలం పెనుమదంలో రూ.4 కోట్ల 49 లక్షలతో పలు 17 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులును ఎదుర్కొంటూ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. మేలుచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.