AP: బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. అందుకే ఉపాధిహామీ పథకంపై మాట్లాడటం లేదన్నారు. జగన్ మూడు రాజధానుల పేరిట ప్రజలను అయోమయానికి గురిచేశారన్నారు. వీబీ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుందన్నారు. 150 రోజులు పని కల్పించి.. రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచుతామన్నారు.
AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు జారీ చేసిన వారెంట్ను రద్దు చేయాలని ఆమె కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు వెల్లడించనున్న ఉత్తర్వుల్లో వారెంట్ రద్దు అవుతుందా లేదా అన్నది తేలనుంది.
సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సహా మిగిలిన సరిహద్దు దేశాల FDIల విషయంలో ఉన్న నిబంధనలను సులభతరం చేసింది. ఇప్పటివరకు ఉన్న ‘ముందస్తు అనుమతి’ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. తాజాగా దీన్ని తొలగించారు.
NZB: కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజ్య లక్ష్మి (27) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా వారి ఆచూకీ లభించలేదని భర్త గంగాధర్ పేర్కొన్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సాయిలు(27) హోటల్కు వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయారు.
కామారెడ్డి పట్టణంలోని వార్డుల్లో శానిటేషన్ లేబర్లు ఎక్కడ పని చేస్తున్నారని BJP కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు. తమ వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నేడు కమిషనర్ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను కమిషనర్ ముందు ప్రస్తావించగా కమిషనర్ నుంచి సమాధానం రాకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
NTR: నందిగామ కాకాని నగర్ వారి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం పొందిన 58 మంది లబ్ధిదారులకు రూ.33.54 లక్షలు విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా కూటమి పేదలు, బడుగు, బలహీన, సామాన్య వర్గాల పట్ల బాధ్యతను విస్మరించకుండా, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతపురం కలెక్టరేట్లోని జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) జిల్లా ఇన్ఫర్మాటిక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఎం.రవి శంకర్ కర్ణాటకకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం తన బాధ్యతలను అడిషనల్ డీఐఓ టి.భారతికి అప్పగించారు. ఇక నుంచి ఆమె జిల్లా ఇన్ఫర్మాటిక్స్ ఆఫీసర్ ఇన్చార్జ్గా విధులు నిర్వర్తించనున్నారని అధికారులు తెలిపారు.
GNTR: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తలపకట్టి హోటల్ పక్కన అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోగా, ముగ్గురు సెల్ ఫోన్లు, 2 నిరోధ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న లక్ష్మి, రాపోలు శివను గుర్తించారు.
NTR: ఇబ్రహీంపట్నంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నూతన ట్రాఫిక్ సీఐ డి. చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం రింగ్ సెంటర్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వస్తే ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణరక్షణ కవచంగా ఉంటుందని చెప్పారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాలపై ఆయన కీలక సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పెండింగ్ పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్తో సాగే ఈ కథలో సంతోష్ మార్క్ కామెడీ, మానస నటన ప్రత్యేకం. ఈ వీకెండ్ వినోదం కోసం ఓటీటీ ప్రియులు సిద్ధమైపోవచ్చు.
KRNL: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నాయకత్వంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
VKB: వికారాబాద్ మండలం జైలుపల్లిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్, మెటీరియల్ గోడౌన్ను రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించనున్నారని విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) రవి ప్రసాద్ తెలిపారు. దాదాపు రూ. 6 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారన్నారు. ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రకాశం: అర్థవీడు మండలంలోని యాచవరం గ్రామ శివార్లలో మంగళవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.27,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాంచారయ్య తెలిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.