NLR: సంక్రాంతి పండుగకు నెల్లూరు జిల్లా కళకళలాడుతోంది. విదేశాల్లో, దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సొంతగూటికి చేరుతున్నారు. నెల్లూరు నగరంలోని జ్యోతినగర్కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు 27 ఏళ్లుగా డల్లాస్(USA) నుంచి క్రమం తప్పకుండా పండుగకు వస్తున్నారు. కుటుంబసభ్యుల మధ్య సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
RR: బీజేపీకి షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు షాక్ తగిలింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణంలో పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ నాయకులు ప్రకటించారు. కానీ, తాజాగా ఆ పార్టీకి చెందిన యువ నాయకుడు ఆకుల ప్రదీప్ పార్టీకి రాజీనామా చేశారు. షాద్ నగర్ పట్టణంలో బీజేపీకి రాజకీయ భవిష్యత్ లేదన్నారు. గ్రూప్ రాజకీయాలతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నామన్నారు.
KDP: హేతువాద ఉద్యమ నేత, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమాజ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఆర్.ఐ సోమశేఖర్ నాయక్ తెలిపారు. ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
HYD: మకర సంక్రాంతి సందర్భంగా గురువారం బొల్లారంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ బోగ్గారపు దయానంద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వెంకటేష్ గుప్తా, రమేష్ బాబు, బీఆర్ఎస్ నాయకుడు చోలేటి రమేష్ పాల్గొన్నారు.
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన హిట్ సినిమా ‘సర్దార్’కు సీక్వెల్గా ‘సర్దార్ 2’ రాబోతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మేకర్స్.. విషెస్ చెప్పారు. అలాగే ఈ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 2026లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై రాబోతున్న ఈ చిత్రాన్ని P.S మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు.
MNCL: కోటపల్లి మండలం పారుపల్లిలో గ్రామ యువత ఆధ్వర్యంలో ‘ఓపెన్ టు ఆల్’ కబడ్డీ టోర్నమెంట్ రేపు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఏ ప్రాంత క్రీడాకారులైనా పాల్గొనవచ్చని నిర్వాహకులు గురువారం తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నారు. ఆసక్తి గల జట్లు 9948629677 నంబరులో సంప్రదించాలని కోరారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
RR: సంక్రాంతి పండుగ వేళ షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు తన గొప్ప మనసు చాటుకున్నారు. అంతరించిపోతున్న గంగిరెద్దు పాటలను బ్రతికించేందుకు తనవంతు కృషి చేశారు. ఇంటి ముందు గంగిరెద్దు ఆట ఆడించగా దానిని తిలకించిన అనంతరం విలువైన కోడెను వాళ్లకు బహుకరించారు. గంగిరెద్దుల సంస్కృతి పూర్తిగా అంతరించి పోతుందని, నేటితరం పిల్లలకు వాటి ఔనత్యాన్ని తెలియజేయలన్నారు.
WGL: దుగ్గొండి (M) కేంద్రంలోని నందిగామ, రేలకుంట, గ్రామ ప్రధాన రహదారికి రోడ్డుకు ఇరువైపులా ఫారెస్ట్ శాఖ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నీరు లేక మొక్కలు ఎండుపోతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోవడ లేదని అవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించాలని తెలిపారు.
ADB: భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిపాని వారి ఆధ్వర్యంలో ఈనెల 17 వ తేదీన జరిగే శ్రీ లక్ష్మీ సమేత పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు ఆహ్వాన పత్రికను నిపాని గ్రామస్థులు అందజేశారు. కల్యాణనికి సంబంధించి పలు ఏర్పాట్లను ఎమ్మెల్యేకు విన్నవించారు.
VZM: రాజాం మండలం గడ్డిముడిదాం గ్రామంలో 2001లో 7వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆ గ్రామంలో పేద విద్యార్థులకు గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. చదువులో ప్రతిభ చూపుతూ ఎక్కువ మార్కులు సాధించి, తల్లిదండ్రులు లేని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఒక్కొక్క విద్యార్థికి రూ.15 వేల సాయం అందజేశారు.
KDP: మకర సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం కాంగ్రెస్ నాయకులు వేంపల్లిలో గాలిపటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి మాట్లాడుతూ… పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపాలన్నారు. మనుషుల మధ్య అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు పెంచడంలో పండుగల పాత్ర ప్రశంసనీయమన్నారు.
HYD: సంక్రాంతి సందర్భంగా ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగ సరదా ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని, ముఖ్యంగా నిషేధిత చైనా మాంజాను వాడొద్దని హెచ్చరించారు. ఈ సింథటిక్ దారాలు పక్షులకే కాక, వాహనదారుల మెడకు చుట్టుకుని ప్రాణాంతకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. పిల్లలను డాబాలపై ఒంటరిగా వదలొద్దని సూచించారు.
NZB: సాలూరు మండల కేంద్రం నుంచి ఎత్తిపోతల పథకానికి సరఫరా చేసే 11 కేవీ విద్యుత్ లైన్లోని ఒక స్తంభం గ్రామ శివారులో ప్రమాదకరంగా వంగిపోయింది. దీనిపై పలుమార్లు ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. స్తంభం ఎప్పుడు కూలుతుందోనని, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఉంచాలని కోరుతున్నారు.
అనంతపురంలోని కలెక్టరేట్లో గురువారం కవిరాజు త్రిపురనేని రామస్వామి జయంతి వేడుకలను నిర్వహించారు. ఆన్సెట్ మేనేజర్ శ్రీనివాసులు.. త్రిపురనేని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాడిన గొప్ప సంస్కర్త త్రిపురనేని అని కొనియాడారు.
SRPT: సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని మార్కెట్ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని బొడ్రాయి బజారులో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులను ఎగరవేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరు చెడు ఆలోచనలను తొలగించుకొని మంచి మార్గంలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.