• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చేపల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి

NRML: జిల్లాలో చేపల పెంపకం పెరుగుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ సూచించింది. చెరువుల నీటి నాణ్యత, ఆమ్లజని స్థాయిని క్రమం తప్పకుండా పరిశీలించాలి. అధిక ఆహారం వేయడం వల్ల నీరు కలుషితం కావచ్చని హెచ్చరించారు. మంచి నాణ్యత గల చేప పిల్లలను ఎంచుకోవడం, వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు.

April 11, 2026 / 08:28 AM IST

రక్తదానం చేసిన కలెక్టర్ బాలాజీ

కృష్ణా: జాతీయ సర్వే దినోత్సవ సందర్భంగా మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ బాలాజీ నిన్న రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడి, ఉత్సాహంగా ఆరోగ్యకరంగా జీవిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పాల్గొన్నారు.

April 11, 2026 / 08:27 AM IST

‘ప్రయోగాలు చేసేందుకు సిద్ధం’

తన కెరీర్‌లో ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు హీరోయిన్ తమన్నా వెల్లడించింది. మహిళా ప్రాధాన్య చిత్రాలు, ఓటీటీ కంటెంట్, స్పెషల్ సాంగ్స్ ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. తాను నటించిన చిత్రాలన్నీ వరుసగా విడుదల కాబోతున్నాయని, ఈ కొత్త ప్రయాణం తనలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోందని మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.

April 11, 2026 / 08:27 AM IST

‘జలధార కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయాలి’

అన్నమయ్య: జిల్లాలో జలధార ప్రాజెక్ట్ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. భూగర్భ జలాల పెరుగుదలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రతి చెరువు నీటితో నిండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు తదితర అధికారులతో చర్చించారు.

April 11, 2026 / 08:25 AM IST

మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

JN: రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. రైతులు 14% తేమలోపు మక్కలను తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలో 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.

April 11, 2026 / 08:24 AM IST

సర్వేయర్ల పనితీరును ప్రశంసించిన కలెక్టర్

PPM: విలేజ్‌ సర్వేయర్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్‌ ఎన్.ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సర్వే శాఖ ఆధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సర్వేయర్ల సేవలను కొనియాడారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్ల పనితీరు చూసి అన్ని శాఖల అధికారులు ప్రశంసిస్తున్నారన్నారు.

April 11, 2026 / 08:21 AM IST

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఈనెల 19న పరీక్ష

KNR: సైదాపూర్ మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి, ఏడవ తరగతి ప్రవేశాలకు ఈనెల 19న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడవ తరగతి విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

April 11, 2026 / 08:21 AM IST

‘గర్భిణీలకు సకాలంలో వైద్య సేవ అందించాలి’

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన గర్భిణీలకు సకాలంలో వైద్య సేవలు అందించకపోతే సంబంధిత వైద్యులకు నోటీసులు ఇవ్వాలని జేసీ సంజనా సింహ ఆదేశించారు. నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ రక్తం అందించడంలో జరిగిన పొరపాటుపై వివరాలు తెలుసుకున్నారు.

April 11, 2026 / 08:20 AM IST

చందోలులో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

బాపట్ల జిల్లా చందోలు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శనివారం రాత్రి పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చందోలు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి కాలనీలో బస చేసి, స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామంలో శాంతిభద్రతలు, రాత్రి గస్తీ, స్థానిక మౌలిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

April 11, 2026 / 08:20 AM IST

సీపీఐ ఆధ్వర్యంలో మంత్రితో చర్చలు

NDL: కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ పరిశ్రమ వద్ద శుక్రవారం జరగాల్సిన సీపీఐ రైతు ధర్నా వాయిదా పడింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా ఎస్పీ, యాజమాన్యం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. ఇవాళ మంత్రి సహకారంతో యాజమాన్యంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తామన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలన్నారు.

April 11, 2026 / 08:19 AM IST

IPL కోసం కోర్టు మెట్లెక్కిన RCB బౌలర్

IPLలో ఆడేందుకు తనకు NOC ఇవ్వలేదని శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే, ఆ తర్వాత తన నిర్ణయంపై వెనక్కి తగ్గిన అతడు.. బోర్డుకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. బోర్డు తన పట్ల పారదర్శకతతో వ్యవహరించడం లేదన్నదే తన బాధ అని పేర్కొన్నాడు. కాగా, RCB జట్టుకు ఆడాల్సిన తుషార ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతోనే బోర్డు అతడికి NOC నిరాకరించింది.

April 11, 2026 / 08:18 AM IST

అరైవ్ అలైవ్’తో రోడ్డు భద్రత అవగాహన

గద్వాల్ జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన కోసం ఏప్రిల్ 13 నుంచి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, హెల్మెట్, సీటుబెల్ట్ అవగాహన, గోల్డెన్ అవర్ చికిత్సపై శిక్షణ ఇస్తారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

April 11, 2026 / 08:17 AM IST

యువకుడి అనుమానాస్పద మృతి

BDK: బూర్గంపాడు మండలం సారపాక-మణుగూరు క్రాస్ రోడ్డు సమీపంలో రెడ్డిపాలెం దారి వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు పక్కన మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.

April 11, 2026 / 08:14 AM IST

రాయలసీమకు YCP చేసిందేమీ లేదు: మంత్రి

KRNL: రాయలసీమను YCP రాజకీయం కోసమే వాడుకుందని శుక్రవారం మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమకు YCP ఏం చేసిందో చెప్పాలన్నారు. ఆ ప్రాంతంపై ప్రేమ ఉంటే.. ఎంత ఖర్చు పెట్టారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీమలో హార్టికల్చర్ హబ్ పెడతామని చెప్పామని.. చేస్తామని స్పష్టం చేశారు. YCP మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

April 11, 2026 / 08:14 AM IST

మిడ్జిల్‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం మిడ్జిల్ మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం 1 గంటలకు చిల్వేర్ గ్రామంలో రాజారెడ్డి సతీమణి జ్ఞాపకార్థం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

April 11, 2026 / 08:13 AM IST