AP: కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, తూ.గో, ఏలూరు, కృష్ణా, GNT, పల్నాడు, NTR జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు చోట్ల 50-60 KM వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ప్రజలు ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచించింది.