AKP: మలేరియా మహోత్సవాల్లో భాగంగా నాతవరంలో మంగళవారం పీహెచ్సీ నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా నివారణ, నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. జ్వరం, చలి, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ సూచించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.