MHBD: బయ్యారం మండలంలోని సంతులాల్ పోడు తండా వద్ద ఇల్లందు–మహబూబాబాద్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు గోగినేని బాబురావు (82) మృతి చెందాడు. గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన ఆయనను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.