E.G: గోదావరి పుష్కరాలు-2027ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఖాళీ స్థలాల గుర్తింపు, 16 పుష్కర్ నగర్ల లేఅవుట్లు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాల ప్రణాళికలను తక్షణం సిద్ధం చేయాలన్నారు.