KKD: మహిళలపై అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసుల నియంత్రణకు ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు SP బిందు మాధవ్ తెలిపారు. మంగళవారం SP కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మహిళలపై జరిగే నేరాల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేయడం, సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చూస్తామన్నారు.