CTR: జిల్లాలో మాత, శిశు మరణాలను పూర్తిగా నివారించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వైద్య అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మాత, శిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటంపై అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు.