• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

ఇలాంటి వారు అరటిపండు తినకూడదా?

అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.

March 10, 2026 / 09:34 PM IST

రోగాలను నయం చేసే గుబ్బకాయలు

గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే గుబ్బకాయలు ఆయుర్వేదంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి గుజ్జు గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఆకులతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దీని కషాయం మొండి గాయాలను మాన్పడమే కాక జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాకుండా, పంటలకు సహజ కీటక నాశినిగా కూడా పనిచేసి రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం.

March 10, 2026 / 12:30 PM IST

నిద్ర సరిగా పట్టడం లేదా?.. ఇలా చేయండి!

చాలా మంది పడకపైకి వెళ్లిన తర్వాత గంటల తరబడి నిద్ర కోసం పోరాటం చేస్తుంటారు. ఇలా ఇబ్బంది పడేవారి కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం, నిద్రపోవడానికి ముందు ఫోన్, టీవీ, లాప్‌టాప్‌లకు దూరం, యోగాసనాలు చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

March 10, 2026 / 08:37 AM IST

ఎండకాలంలో బెల్లం తింటే ఏమవుతుంది?

బెల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దాని స్వభావం వేడి. వేసవిలో ఎక్కువగా తింటే శరీరంలో అంతర్గత వేడి పెరుగుతుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు, తరచుగా ముక్కు నుంచి రక్తం పడేవారు, సహజంగానే శరీర తత్వం వేడిగా ఉండేవారు వేసవిలో బెల్లానికి దూరంగా ఉండటం లేదా చాలా తక్కువగా తీసుకోవడం మంచిది. బెల్లం తిన్నప్పుడు దాని వేడిని తగ్గించడానికి మజ్జిగ, సోంపు లేదా తగినంత నీరు తీసుకోవాలి.

March 10, 2026 / 07:43 AM IST

విపరీత శలభాసనం వల్ల కలిగే లాభాలు

విపరీత శలభాసనం వెన్నుముక, నడుము, పిరుదుల కండరాలను బలోపేతం చేసే శక్తివంతమైన యోగాసనం. ఇది వెన్నుముక కండరాలను బలోపేతం చేసి, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇది చాలా మంచిది. ఈ ఆసనం కడుపుపై ఒత్తిడి తెచ్చి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఈ ఆసనం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

March 10, 2026 / 07:13 AM IST

జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

March 9, 2026 / 09:42 PM IST

కర్బూజ పండు తింటే కలిగే లాభాలు తెలుసా?

కర్బూజ పండులో దాదాపు 90% నీరే ఉంటుంది. ఎండల వల్ల మనం కోల్పోయే శక్తిని, తేమను ఇది తక్షణమే తిరిగి ఇస్తుంది. రోజూ ఈ పండు తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు. ముఖ్యంగా అలసటగా అనిపించినప్పుడు ఒక కప్పు కర్బూజ ముక్కలు తింటే బాడీకి గ్లూకోజ్ ఎక్కినంత వేగంగా శక్తి వస్తుంది. ఇది మనల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. చర్మం మెరవాలన్నా, బరువు తగ్గాలన్నా ఈ పండు అద్భుత వరం.

March 9, 2026 / 02:43 PM IST

నువ్వుల లడ్డూతో బోలెడు ప్రయోజనాలు

నువ్వులు, బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో ఉన్న కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలసటగా ఉన్నప్పుడు ఒక లడ్డూ తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.

March 9, 2026 / 01:55 PM IST

మహిళల ఆరోగ్యం కోసం ఈ గింజలు తప్పనిసరి

హలీమ్ గింజలు మహిళల్లో రక్తహీనత, హార్మోన్ల సమస్యలను తొలగించి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ సూపర్ ఫుడ్ బాలింతలకు, బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల విటమిన్ సప్లిమెంట్ల అవసరం లేకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చు.

March 9, 2026 / 11:43 AM IST

తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నారా?

వాము గింజల్లో ఉండే థైమాల్ అనే నేచురల్ ఆయిల్ జీర్ణరసాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక టీ స్పూన్ వాము గింజలను నీటిలో మరిగించి తాగితే గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఈ నీరు తీసుకోవడం వల్ల కడుపు భారంగా ఉండే సమస్య తగ్గుతుంది. లేదా పెరుగు నీటిని పలుచగా చేసి అందులో వేయించిన జీలకర్ర పొడి, అల్లం కలిపి తాగాలి.

March 9, 2026 / 10:57 AM IST

డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్ట్రాబెర్రీలు తినొచ్చా?

డయాబెటిస్ ఉన్నవారు స్ట్రాబెర్రీలను మితంగా తీసుకోవాలి. ఇందులో పోషకాలు కలిగి ఉండటంతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్లో వచ్చే హెచ్చు తగ్గులను తగ్గించడంలో సహాయపడుతాయి. విట‌మిన్ సితో పాటు ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

March 9, 2026 / 08:37 AM IST

శిశు ఆసనం వల్ల కలిగే ఉపయోగాలు

శిశు ఆసనం ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వెన్నుముక, భుజాలు, నడుము నొప్పిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే, జీర్ణక్రియను మెరుగుపరచి, అలసటను తగ్గిస్తుంది. ఇది మెదడును చల్లబరిచి, ఆందోళన, కోపాన్ని తగ్గించి మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఉదరంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం దూరమవుతుంది. తల భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

March 9, 2026 / 06:50 AM IST

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండిలా!

కొన్ని చిట్కాలతో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. విటమిన్లు (A, C, E), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న క్యారెట్లు, ఆకుకూరలు, చేపలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. స్క్రీన్ చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఎండలో వెళ్లేటప్పుడు UV ప్రొటెక్షన్ ఉన్న గ్లాసెస్ ధరించాలి. కళ్లకు విశ్రాంతి కోసం రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి.

March 8, 2026 / 02:07 PM IST

బాడీ లోషన్ రాస్తున్నారా..?

చర్మతత్వానికి నప్పే లోషన్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖానికి క్రీమ్‌లు రాసే ముందు చర్మాన్ని శుభ్రం చేయాలి. చర్మం కాస్త తడిగా, వెచ్చగా ఉన్నప్పుడు వీటిని రాస్తే రంధ్రాల్లోకి సులభంగా ఇంకి, తేమను కాపాడతాయి. అందుకే స్నానం చేసిన వెంటనే లోషన్ రాయడం మంచిది. చర్మం చల్లగా ఉంటే గోరువెచ్చని టవల్‌తో తుడుచుకున్నాక అప్లై చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

March 8, 2026 / 01:50 PM IST

లంచ్‌లో ఆకుకూర తప్పనిసరి

మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలను భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో కనీసం మూడు సార్లు తోటకూర, పాలకూర వంటివి పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకోవాలి. వీటిలో ఉండే ఐరన్, కాల్షియం ఎముకల పుష్టికి, రక్తహీనత తగ్గడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా కంటిచూపు మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

March 8, 2026 / 01:00 PM IST