ఉదయం లేవగానే మొబైల్ చూడటం ఆరోగ్యానికి హానికరం. నిద్రలేవగానే ఫోన్ స్క్రీన్ వైపు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పడటమే కాకుండా, సోషల్ మీడియాలోని సమాచారం వల్ల మెదడు ఒక్కసారిగా ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల ఆ రోజంతా మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి, కనీసం మొదటి గంట సేపు ఫోన్కు దూరంగా ఉండి, ధ్యానం లేదా వ్యాయామం వంటి పనులపై దృష్టి పెట్టడం ఉత్తమం.
బెండకాయ నీళ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అధోముఖ శ్వానాసనం (Downward Facing Dog) శరీరంలోని ప్రతి అవయవానికి శక్తినిస్తుంది. తల కిందికి ఉంచడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇది చేతులు, భుజాలు, కాళ్ల కండరాలను దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడం తగ్గడానికి, ముఖం కాంతివంతంగా మారడానికి ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. సూర్య నమస్కారాలలో ఇది కీలకమైనది.
చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, మంచి వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం(క్యారెట్, పాలకూర, టమాట, బాదం), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం లేవగానే శరీరం బరువుగా అలసటగా ఉంటే అది ఆరోగ్య సంకేతం కావచ్చు. నిద్రలేమి, డీహైడ్రేషన్, విటమిన్ D లోపం, ఒత్తిడి కారణమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని హెచ్చరించారు. సరిపడా నిద్ర, వ్యాయామం, ఉదయం ఎండలో ఉండటం, గోరువెచ్చని నీరు తాగడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. అయినా మార్పు లేకపోతే వైద్యుల సలహా తీసుకోవాలి.
వాము నీళ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులు, వాపు తగ్గించడంతో పాటు మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేళ చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో లైవ్ బర్డ్ ధర రూ. 183 ఉంది. డ్రెస్డ్ చికెన్ కేజీ ధర రూ. 265, స్కిన్ లెస్ కేజీ ధర రూ.302గా ఉంది. 12 ఎగ్స్ ధర రూ.76గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి. ప్రాంతాన్ని కేజీ మటన్ ధర రూ. 800 నుంచి రూ. 1200 వరకు ఉంది.
గర్భిణులు నువ్వులు తినకూడదని చెప్పడం ఒక అపోహ మాత్రమేనని వైద్యులు చెప్తున్నారు. నువ్వుల్లో ఉండే కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, గర్భధారణ సమయంలో తల్లికి, బిడ్డకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. అందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే, వాటిని ఎక్కువ కాకుండా మితంగా మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సెలవుల్లో ఎంజాయ్ చేయబోయి గుండెకు ముప్పు తెచ్చుకుంటున్నారా? రోజూ కదలని వారు హాలిడేస్లో ఒక్కసారిగా అతిగా శ్రమించడం గుండెపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. పార్టీలు, మద్యం, జంక్ ఫుడ్, నిద్రలేమి తోడైతే బీపీ పెరిగి సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశముంది. రొటీన్ మారడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి కూడా ప్రమాదకరమే. పండగ పూట ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
కొన్ని చిట్కాలతో నోటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు. నోటి అల్సర్ల దగ్గర కొద్దిగా తేనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెలో చిటికెడు పసుపు కలిపితే బెటర్. లవంగాలు నమిలిన లేదా లవంగాల నూనె సమస్య ఉన్న చోట రాసిన మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 4-5సార్లు తులసి ఆకులను నమిలితే సమస్య తగ్గుతుంది. కొద్దిగా కొబ్బరి నూనెను అల్సర్ల దగ్గర రాస్తే ఉపశమనం కలుగుతుంది. పచ్చి కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాలి.
పిలవకుండానే ఎక్కడికైనా వెళ్లడం, అడగకముందే ఎక్కువగా మాట్లాడటం, నమ్మకూడని వారిని గుడ్డిగా నమ్మడం… ఈ మూడు లక్షణాలు ఉన్నవారే ‘మూర్ఖులు’ అని విదురుడు స్పష్టం చేశాడు. ఇలాంటి వారిని సమాజం చాలా చులకనగా చూస్తుంది. నలుగురిలో గౌరవం, విలువ కావాలనుకునేవారు కచ్చితంగా ఈ మూడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే వ్యక్తిత్వం నిలబడుతుందని విదురనీతి చెబుతోంది.
సమయం లేదనో, ఇతర కారణాల వల్ల కొంతమంది గబగబా భోజనం చేస్తుంటారు. ఇలా త్వరత్వరగా తినడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా కడుపులోకి వెళ్లి గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం చాలా ముఖ్యం. అలా చేస్తేనే పదార్థం రుచిని ఆస్వాదించడంతో పాటు జీర్ణవ్యవస్థ కూడా చురుగ్గా ఉంటుంది. దీంతో ఆహారం పరిమితి దాటకుండా జాగ్రత్త పడవచ్చు.
కీరదోస తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, నీటితో సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్కు గురి కాకుండా చేస్తుంది. ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ను క్రమబద్ధీకరిస్తుంది.
ఒత్తయిన జుట్టు కోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డులోని తెల్లసొన కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. 10గంటలు నీటిలో నానబెట్టిన మెంతులను పేస్ట్లా చేసుకుని జుట్టుకు అప్లై చేసి 30-40నిమిషాల తర్వాత కడగాలి. సహజసిద్ధంగా తయారుచేసిన ఉసిరి, శీకాకాయ పొడులను వాడాలి. ఉల్లిరసం, కలబంద, ఆముదం వంటి వాటితో కుదుళ్లను మర్దన చేయాలి.
పరగడుపున కొబ్బరినూనెతో పుక్కిలించడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. ఫ్రిజ్లో పెట్టిన టీ బ్యాగులను కళ్లపై పెట్టుకోవడం వల్ల ట్యాన్, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ఒక టీ స్పూన్ చక్కెర నోట్లో వేసుకుని చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి. ఉల్లిగడ్డ రసాన్ని కుదుళ్లకు పట్టించి కాసేపు ఉంచితే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. దంతాలు పసుపు పచ్చగా ఉన్నవారు రోజుకో యాపిల్ తింటే మంచిది.