*వెలుతురు, శబ్దం లేని ప్రశాంతమైన గదిలో విశ్రాంతి తీసుకోండి.*డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి పెరుగుతుంది, కాబట్టి తగినంత నీరు తాగండి.* వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం.*పౌష్టికాహారం తీసుకోండి. అల్లం టీ ఉపశమనం ఇస్తుంది.*ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోండి.
*ప్యాకెట్లు విప్పడానికి దంతాలను వాడకండి.*మంచు, పెన్నులు నమలడం వల్ల ఎనామిల్ దెబ్బతింటుంది.*పళ్లు కొరకడం, గట్టిగా బ్రష్ చేయడం మానుకోండి.*ఐస్ క్రీమ్స్, తీపి, కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండండి.*పొగాకు, ధూమపానం వల్ల నోటి క్యాన్సర్ ముప్పు ఉంది.*తిన్న వెంటనే కాకుండా 30 నిమిషాల తర్వాత బ్రష్ చేయండి.
కొన్ని చిట్కాలతో కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించుకోవచ్చు. శొంఠి, జీలకర్రతో తయారుచేసిన కషాయం తాగితే జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చిటికెడు వాము, ఉప్పు కలిపి తింటే గ్యాస్ త్వరగా తగ్గుతుంది. అంతేకాదు రోజంతా తగినంత నీరు తాగాలి. జంక్ ఫుడ్, నూనె వస్తువులు, మసాలాలు తగ్గించాలి. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం, నడక వంటి అలవాట్లు ఈ సమస్యను దూరం చేస్తాయి.
21-21-21 రూల్ పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మొదటి 21 రోజులు: స్ట్రెచింగ్, జంపింగ్ జాక్స్ వంటి వ్యాయామాలు రోజుకు 20 నిమిషాలు చేస్తూ శరీరానికి శ్రమను అలవాటు చేయండి. మధ్య 21 రోజులు: కాఫీకి బదులు నిమ్మరసం, పంచదారకు బదులు బెల్లం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. చివరి 21 రోజులు ధూమపానం, మద్యపానం, కెఫిన్ అలవాట్లను పూర్తిగా నియంత్రించండి.
ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయాలి. సహజంగా పండిన పండు నీటిలో మునుగుతుంది. రసాయనాలతో పండించినవి నీటిపై తేలుతాయి. మామిడి పండ్లను తినేముందు కనీసం గంటసేపు నానబెట్టి, ఆపై బాగా కడిగి తొక్క తీసి తినడం వల్ల రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. విశ్వసనీయమైన రైతుల వద్ద లేదా సేంద్రియ పండ్లను కొనుగోలు చేస్తే ఆరోగ్యానికి మంచిది. నిగనిగలాడే పండ్లను చూసి మోసపోకుండా జాగ్రత్తలు పాటించాలి.
వేప ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఉదయాన్నే వేపాకులు నమిలితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. నోటి దుర్వాసనను తగ్గించి చిగుళ్లను బలోపేతం చేస్తాయి. శరీరంలోని మలినాలను తొలగించడం ద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మంపై సానుకూల ప్రభావం చూపుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గించి మెరిసే చర్మాన్ని పొందడానికి సహాయపడతాయి.
మనం రోజువారీ వంటల్లో వాడే సాధారణ ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చేరి రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే బీపీ కంట్రోల్లో ఉండాలంటే ముందుగా ఉప్పు వాడకాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. రుచి కోసం ఉప్పును ఎక్కువగా వాడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం కంటే తగ్గించడం మేలు.
40 ఏళ్ల వయసులో మనుషులు తమ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే గతంలోని కొన్ని అలవాట్లు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, ఎక్కువసేపు కూర్చోవడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, చెడు అలవాట్లు, నీళ్లు తాగకపోవడం, బరువు పెరగడం, తరచు హెల్త్ చెకప్ చేసుకోకపోవడం వంటి అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
అమెరికాలోని సౌత్ రీసెర్చ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కాఫీలోని కెఫీన్, లివర్ సమస్య మధ్య ఉన్న సంబంధంపై పరిశోధన చేశారు. కామెర్లు, మద్యపానం అలవాటు ఉన్నవాళ్లలో కాలేయంలోని టిష్యూలు దెబ్బతింటాయి. మధుమేహ బాధితులకైతే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల కాలేయ సమస్య వస్తుంది. కాఫీలోని కెఫీన్ ఈ ఫైబర్ కణాల ఉత్పత్తిని అడ్డుకుని కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు.
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి, జీలకర్ర కలిపిన నీటిని తీసుకోవాలి. ఈ నీరు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి.. అంతర్గత అవయవాలను శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. జీలకర్ర జీర్ణ ఎంజైములను ఉత్తేజపరుస్తుంది.
కడుపు ఉబ్బరం తగ్గడానికి సరైన ఆహార అలవాట్లు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పుదీనా టీ తాగడం, భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కూల్ డ్రింక్స్కు దూరంగా ఉంటూ, పీచు పదార్థాలు తీసుకోవాలి. పాల ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉంటూ, చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మృదువైన పెదవుల కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. రోజూ తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచాలి. నాణ్యమైన లిప్ బామ్ రాస్తూ పెదవుల పొడిబారకుండా చూడాలి. తేనె, చక్కెర కలిపి మెల్లగా పెదవులపై స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పెదవులను నాలుకతో తడపడం మానేయాలి. పడుకునే ముందు నెయ్యి లేదా బాదం నూనె రాస్తే పెదవులు కోమలంగా మారుతాయి.
కర్బూజా వేసవిలో శరీరానికి అమృతం వంటిది. ఇందులో 90 శాతానికి పైగా నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్ ఏ, సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఇది ఉపయోగపడుతుంది.
వేసవి తాపాన్ని తగ్గించేందుకు కొన్ని డ్రింక్స్ సహాయపడుతాయి. నీటిలో కీరా, నిమ్మ, పుదీనా కలిపి తాగితే డీహైడ్రేషన్ తగ్గుతుంది. గుప్పెడు వట్టి వేర్లను నీటిలో వేసి తాగితే ఒత్తిడి తగ్గి, శరీరం చల్లబడుతుంది. పుచ్చకాయ ముక్కలు, కీరా, పుదీనా మిశ్రమం తాగాలి. స్ట్రాబెర్రీ, నారింజలతో కలిపి చేసిన డ్రింక్ తాగితే మంచిది. గులాబీ రేకులు వేసిన నీరు శరీర వేడిని తగ్గిస్తుంది.