బత్తాయి జ్యూస్లో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. శరీరం హైడ్రేట్ అవుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బులు దరిచేరవు. చర్మం, జుట్టు సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కొత్త ఏడాదిలో అనవసరపు ఖర్చులు తగ్గించి, మనకు మేలు చేసే వాటిపైనే డబ్బు వెచ్చించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణ భద్రత కోసం నాణ్యమైన హెల్మెట్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, పోషకాహారం కోసం ఖర్చు చేయాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. తప్పనిసరిగా జీవిత, ఆరోగ్య బీమా తీసుకోవాలని కోరారు. ఆరోగ్యం, భద్రతే అసలైన సంపద అని గుర్తుచేశారు.
➠ కండరాలను సాగదీస్తుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నుపూసల మధ్య దృఢత్వాన్ని తొలగిస్తుంది.➠ పొట్టలోని అవయవాలను మసాజ్ చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.➠ పొట్ట, నడుము పక్క భాగాల కండరాలను టోన్ చేసి, బరువు తగ్గడానికి, బొజ్జను తగ్గించడానికి తోడ్పడుతుంది.➠ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
చలికాలంలో చర్మం పగలడం సర్వసాధారణం. అయితే స్నానం చేసిన తర్వాత, పడుకునే ముందు మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాస్తే ఈ సమస్యను కంట్రోల్ చేయొచ్చు. అలాగే రోజూ సరిపడినంతగా నీరు తాగితే శరీరంతో పాటు చర్మం హైడ్రేట్గా ఉంటుంది. చన్నీళ్లతో కాక గోరువెచ్చని నీళ్లతో స్నానం ఉత్తమం. ఇక చర్మంపై పొలుసులు పోతాయని గట్టిగా సబ్బు రుద్దకండి. అలా రుద్దితే సమస్య అలాగే ఉంటుంది.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయం లేవగానే కొన్ని పనులు తప్పక చేయాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే రోజంతా శరీరం హైడ్రేటెడ్గా, చురుగ్గా ఉంటుంది. అలాగే ధ్యానం, యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను పెంచుతాయి. పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇక చర్మంపై సూర్యరశ్మి పడితే ఇమ్యూనిటీ, మానసిక స్థితికి మంచిది.
నేల ఉసిరిలో అనేక ఔషధ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. నరాల సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. యాంటీ బాడీస్ను ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయి. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు దరిచేరవు. కామెర్ల వ్యాధి చికిత్సకు నేల ఉసిరిని ఉపయోగిస్తారు.
రాత్రి వేళల్లో జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కంఫర్ట్ లేక సరిగ్గా నిద్రపట్టదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలుగుతుంది. జీన్స్ బిగుతుగా ఉండటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలర్జీ, దుద్దుర్లు, నడు నొప్పి, ఉబ్బరం, లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. రాత్రి వీటిని ధరించకపోవడమే మంచిది.
వాముతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అసిడిటీతో బాధపడేవారు వాము, జీలకర్ర మరిగించిన నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది. గర్భిణులకు ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని తగ్గిస్తుంది. వామును పాలలో కల్పి వేడి చేసి తాగితే నెలసరి సమయంలో కలిగే కడుపు నొప్పి తగ్గుతుంది. వాము నీళ్లను వేడి చేసి చల్లారాక పుక్కిలిస్తే పంటి నొప్పులు తగ్గుతాయి.
మరో 8:30గంటల్లో భారత్ 2026 ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. కానీ రిపబ్లిక్ ఆఫ్ కిరిటిబాటి ద్వీపం పరిధిలోని క్రిస్ట్మస్ ఐలాండ్ ఇప్పటికే 2026లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం అక్కడ 3:30pmకు NEW YEAR ప్రారంభమైంది. 7500 సగటు జనాభా ఉండే ఈ ద్వీప సమూహం ప్రపంచంలోని అత్యంత రిమోట్ ఐలాండ్స్లో ఒకటి. కాసేపట్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ మొదలవనుంది.
వాల్నట్స్లో ఒమేగా 3, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాల్నట్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చర్మం యవ్వనంగా మారడంతో పాటు మొటిమలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బరువు తగ్గుతారు. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
హనుమాసనం వేయడం వల్ల మీ కదలిక పరిధిని పెంచడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతర్గత అవయవాలను ఉత్తేజపరిచేందుకు, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. కాళ్ల కండరాలను సాగదీయడం ద్వారా కాళ్ల తిమ్మిరిని నివారించడంలో సహాయపడుతుంది. కండరాలను సడలిస్తుంది. నిద్రలో వచ్చే కాళ్ల తిమ్మిరిని కూడా నివారిస్తుంది.
మనం తీసుకునే ఆహారంలో పెరుగు చాలా ముఖ్యమైనది. దీనిలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాంటి వారికి పెరుగు చాలా మంచిది. అంతేకాకుండా మలబద్ధకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి. కాగా, జలుబు, అలర్జీ ఉన్నవారు రాత్రిపూట పెరుగును తినవద్దు.
రేపటితో 2025కి ముగింపు పలకబోతున్నాం. ఈ ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చాలా మంది సాధించవచ్చు, సాధించకపోవచ్చు. అలాగే 2025 అనేది కొంత మందికి సంతోషాలను (గెలుపు) మిగిల్చితే.. మరికొంత మందికి కష్టాలను, దుఃఖాలను (ఓటమి) మిగిల్చింది. మరీ ఈ 2025 సంవత్సరంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మాతో పంచుకోండి.
ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. క్రమరహిత పనివేళలు, సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు సరైన భంగిమలో కూర్చోవడంలో పొరపాట్లు, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్కు కారణాలు. భారతదేశంలో దాదాపు 25 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారని ది లాన్సెట్ నివేదిక పేర్కొంది.
✦ కదలకుండా కూర్చునే లేదా నడుంవాల్చి ఉండే జీవనశైలిని వదిలిపెట్టాలి✦ బరువులెత్తడం లేదా జిమ్ చేయాలి✦ అధిక కొవ్వు పదార్థాలను తగ్గించాలి✦ రోజూ 20 నిమిషాలు నడవాలి✦ రోజూ 8 గంటలు గాఢ నిద్రపోవాలి✦ జంక్, అతిగా శుద్ధి చేసిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని దూరం పెట్టాలి