భోజనం తర్వాత మజ్జిగ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను వేగవంతం చేసి.. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. మజ్జిగ మసాలా ఆహారం వల్ల కలిగే మంటను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. తక్కువ క్యాలరీలతో కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. రోజూ మజ్జిగ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
కలబంద ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద గుజ్జు, పసుపు, రోజ్వాటర్, శెనగపిండి కలిపి పేస్ట్లా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కలబందలో తేనె, పసుపు కలిపి రాస్తే చర్మం శుభ్రపడి వాపు తగ్గుతుంది. జిడ్డు చర్మం వారు నిమ్మరసం కలిపి వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఉదయం లేవగానే నోరు చేదుగా ఉండటానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ (నీరు తక్కువగా తాగడం). అలాగే నోటి శుభ్రంగా లేకపోవడం, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా కొన్ని మందుల ప్రభావం వల్ల కూడా ఇలా జరుగుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, ధూమపానం వంటి అలవాట్లు కూడా దీనికి కారణమే. తగినంత నీరు తాగుతూ, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే ఈ సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చు.
కొన్ని చిట్కాలతో వెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉంచాలి. రోజూ నడక, యోగా లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాలు దృఢపడతాయి. అధిక బరువు వెన్నుపై ఒత్తిడిని పెంచుతుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. నొప్పి ఉన్నచోట ఐస్ ప్యాక్ లేదా హాట్ వాటర్ బ్యాగ్ వాడాలి. వెన్నుకు సపోర్ట్ ఇచ్చేలా గట్టి పరుపుపై పడుకోవాలి.
సగ్గుబియ్యం శరీరానికి తక్షణ శక్తినిచ్చే అద్భుతమైన ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర వేడిని తగ్గించి, పొట్టను చల్లబరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడుతుంది.
ఉదయాన్నే వ్యాయామం లేదా జిమ్ చేసేవారికి అరటి పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి వేగంగా శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తూ.. రోజంతా మన మూడ్ని ఉత్సాహంగా, ఒత్తిడి లేకుండా ఉంచడానికి దోహదపడుతుంది.
మీ ప్రపంచాన్ని విస్తరించుకోవాలంటే రొటీన్కు భిన్నంగా ఆలోచించండి. కొత్త ప్రదేశాలు, వినూత్న మార్గాల అన్వేషణే మీకు సరికొత్త అనుభవాలను అందిస్తాయి. నిరంతరం ప్రశ్నలు అడుగుతూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటేనే అద్బుతమైన అవకాశాలు వస్తాయి. మీ పరిధిని దాటి అడుగులు వేసినప్పుడే జీవితంలో నిజమైన ఎదుగుదల, విజయాలు సాధ్యమవుతాయి.
చక్కీ చలానాసనం (మిల్ చర్నింగ్ పోజ్) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొత్తికడుపు కండరాలను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ ఆసనం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి ఉదర భాగం టోన్ అవుతుంది. వెన్నెముక, తుంటి, భుజాలను సాగదీయడం ద్వారా ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. వెన్నుపాముకు మంచి వ్యాయామం కావడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.
గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే గుబ్బకాయలు ఆయుర్వేదంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి గుజ్జు గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఆకులతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దీని కషాయం మొండి గాయాలను మాన్పడమే కాక జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంతేకాకుండా, పంటలకు సహజ కీటక నాశినిగా కూడా పనిచేసి రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం.
చాలా మంది పడకపైకి వెళ్లిన తర్వాత గంటల తరబడి నిద్ర కోసం పోరాటం చేస్తుంటారు. ఇలా ఇబ్బంది పడేవారి కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం, నిద్రపోవడానికి ముందు ఫోన్, టీవీ, లాప్టాప్లకు దూరం, యోగాసనాలు చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
బెల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దాని స్వభావం వేడి. వేసవిలో ఎక్కువగా తింటే శరీరంలో అంతర్గత వేడి పెరుగుతుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు, తరచుగా ముక్కు నుంచి రక్తం పడేవారు, సహజంగానే శరీర తత్వం వేడిగా ఉండేవారు వేసవిలో బెల్లానికి దూరంగా ఉండటం లేదా చాలా తక్కువగా తీసుకోవడం మంచిది. బెల్లం తిన్నప్పుడు దాని వేడిని తగ్గించడానికి మజ్జిగ, సోంపు లేదా తగినంత నీరు తీసుకోవాలి.
విపరీత శలభాసనం వెన్నుముక, నడుము, పిరుదుల కండరాలను బలోపేతం చేసే శక్తివంతమైన యోగాసనం. ఇది వెన్నుముక కండరాలను బలోపేతం చేసి, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇది చాలా మంచిది. ఈ ఆసనం కడుపుపై ఒత్తిడి తెచ్చి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఈ ఆసనం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
కర్బూజ పండులో దాదాపు 90% నీరే ఉంటుంది. ఎండల వల్ల మనం కోల్పోయే శక్తిని, తేమను ఇది తక్షణమే తిరిగి ఇస్తుంది. రోజూ ఈ పండు తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురికాదు. ముఖ్యంగా అలసటగా అనిపించినప్పుడు ఒక కప్పు కర్బూజ ముక్కలు తింటే బాడీకి గ్లూకోజ్ ఎక్కినంత వేగంగా శక్తి వస్తుంది. ఇది మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది. చర్మం మెరవాలన్నా, బరువు తగ్గాలన్నా ఈ పండు అద్భుత వరం.