• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

ఏసీ టెంపరేచర్ తగ్గిస్తే వేడి పెరుగుతుందా..?

ఏసీ టెంపరేచర్ తగ్గించడం అంటే వేడి పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు. మీరు నంబర్‌ను పెంచితే (ఉదాహరణకు 18°C నుంచి 26°C కి) గదిలో చల్లదనం తగ్గి, వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల వేడి రాదు కానీ, చల్లదనం తగ్గుతుంది. మీ ఏసీలో ‘Heat’ మోడ్‌లో ఉంటే తప్ప, అది వేడి గాలిని బయటకు వదలదు.

April 3, 2026 / 03:47 PM IST

ఏసీలో టెంపరేచర్ పెంచితే వేడి వస్తుందా?

ఏసీ టెంపరేచర్ నంబర్‌ను పెంచితే వేడి పెరుగుతుందని పొరబడతారు. నిజానికి, మీరు ఏసీలో నంబర్‌ను పెంచినప్పుడు (ఉదాహరణకు 18°C నుండి 26°C కి) ఏసీ కంప్రెసర్ పనితీరు తగ్గి గదిలో చల్లదనం తగ్గుతుంది. దీనివల్ల వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుంది తప్ప, ఏసీ నుంచి వేడి రాదు. మీ ఏసీలో ప్రత్యేకంగా ‘Heat Mode’ ఉంటే తప్ప, అది వేడిని విడుదల చేయదు.

April 3, 2026 / 03:47 PM IST

అతిగా నవ్వడం కూడా ఓ జబ్బే!

సంతోషం, సందర్భం లేకపోయినా కంట్రోల్ చేసుకోలేనంతగా నవ్వడం ‘లాఫింగ్ ఎపిలెప్సీ’ అనే అరుదైన వ్యాధి లక్షణం. మెదడులోని హైపోథాలమస్ భాగంలో చిన్న గడ్డ ఏర్పడటం వల్ల ఇలా నియంత్రణ కోల్పోయి నవ్వుతూ ఫిట్స్ బారిన పడతారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు ‘మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ’ ద్వారా ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం కనుగొన్నారు.

April 3, 2026 / 12:11 PM IST

కొబ్బరి ఉండలతో కలిగే లాభాలు తెలుసా?

కొబ్బరి, బెల్లం కలిపి తయారు చేసే ఉండలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, బెల్లంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక కొబ్బరి ఉండను తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలకు, ఎదిగే పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది.

April 3, 2026 / 11:20 AM IST

పెరుగుతున్న సోలో లైఫ్ ట్రెండ్!

ప్రస్తుతం ఒంటరిగా ఉండటం ఒక ట్రెండ్‌గా మారింది. వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం స్వీడన్ (51%), డెన్మార్క్ (50%) తదితర దేశాల్లో దాదాపు సగం మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఫిన్లాండ్, జర్మనీల్లో కూడా ఇదే పరిస్థితి. వ్యక్తిగత స్వేచ్ఛ కోసం మన దేశంలోనూ 25% మంది ఒంటరి జీవితానికే మొగ్గు చూపుతున్నారు. ‘బాధ్యతల కంటే సొంతంగా బతకడమే మిన్న’ అని యువత భావిస్తుండటమే ఇందుకు కారణం.

April 3, 2026 / 10:53 AM IST

టీ తాగడం మానుకోలేరా? ఇలా చేయండి!

ఉదయాన్నే వేడివేడిగా టీ తాగడం చాలామందికి ఇష్టం. అయితే పరగడుపునే తాగడం వల్ల కొందరిలో ఎసిడిటీకి దారితీస్తుంది. దీంతో ప్రత్యామ్నాయంగా టీలో అల్లం, యాలకులు, సోంపు చేర్చుకోండి. ఇవి జీర్ణక్రియకు తోడ్పడతాయి. టీ పొడిని ఎక్కువగా మరిగించడంతో టానిన్లు పెరిగి ఎసిడిటీ వస్తుంది, కాబట్టి తక్కువ సేపు మరగబెట్టాలి. టీ తాగడానికి 5 నిమిషాల ముందు గ్లాసు నీళ్లు తాగితే ఎసిడిటీ ప్రభావం తగ్గుతుంది.

April 3, 2026 / 08:11 AM IST

విదుర నీతి: ఈ గాయానికి మందు లేదు!

యుద్ధంలో బాణాలతో అయిన గాయాలనైనా వైద్యంతో నయం చేయవచ్చు. కాలిపోయిన అడవి వర్షానికి మళ్లీ చిగురిస్తుంది. కానీ, ఒకరి మనసును గాయపరుస్తూ అనే ‘కఠినమైన మాటలు'(వాక్శరాలు) చేసే గాయానికి మందు లేదు. ఆ గాయం జీవితాంతం మానదని విదురుడు బోధించాడు. అందుకే మాట్లాడేటప్పుడు ఎదుటివారి మనసు నొప్పించకుండా జాగ్రత్తగా, మృదువుగా మాట్లాడాలని, నోరు జారకూడదని విదుర నీతి సారాంశం.

April 3, 2026 / 08:00 AM IST

గర్భ పిండాసనం వల్ల కలిగే ఉపయోగాలు

గర్భ పిండాసనం అనేది పద్మాసనంలో ఉండి, చేతులను కాళ్ల మధ్య నుంచి దూర్చి సమతుల్యతను సాధించే యోగా భంగిమ. ఇది ఉదర అవయవాలను మసాజ్ చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నుముకను రిలాక్స్ చేస్తుంది. నడుము కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, చేతులు, తొడలు, కోర్ కండరాలను బలోపేతం చేస్తుంది. నాడీ వ్యవస్థను నియంత్రించి, కోపాన్ని తగ్గించడంలో, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

April 3, 2026 / 07:25 AM IST

ALERT: నైట్ షిఫ్ట్‌తో క్యాన్సర్ ముప్పు

రాత్రిపూట పనిచేసే వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నైట్ షిఫ్టుల వల్ల శరీర జీవ గడియారం దెబ్బతిని మహిళల్లో రొమ్ము, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పోలీసులు, టెకీలు, డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటూ.. సరైన నిద్ర, పోషకాహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రాత్రిపూట పని చేసేవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

April 2, 2026 / 12:57 PM IST

వేసవిలో వేడి పానీయాలతోనే చల్లదనం!

వేసవిలో వేడి పానీయాలు తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వేడి పానీయాలు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి, మెదడు చెమట గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. దీంతో చెమట ఎక్కువగా పట్టి, అది ఆవిరయ్యే క్రమంలో శరీరంలోని వేడిని బయటకు పంపి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే, గాలిలో తేమ (Humidity) ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇది అంతగా పనిచేయదు.

April 2, 2026 / 12:19 PM IST

మొటిమలు రావడానికి అసలు కారణం ఇదే!

జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వల్ల శరీరంలో ఇన్సులిన్ పెరిగి మొటిమలు వస్తాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్యాక్టీరియా చేరుతుంది. అందుకే మైదా వస్తువులకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా చేపలు, వాల్‌నట్స్, ఆకుకూరలు, క్యారెట్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. ఇలా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

April 2, 2026 / 10:10 AM IST

కర్ణపీడాసనం వల్ల కలిగే ఉపయోగాలు

కర్ణపీడాసనం అనేది హలాసనం యొక్క పొడిగింపు. ఇది వెన్నెముకను సాగదీసి, ఒత్తిడిని తగ్గించి, వినికిడి శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. హలాసనం స్థితి నుంచి మోకాళ్లను వంచి, చెవుల పక్కన నేలపై ఉంచడం ద్వారా ఈ ఆసనం వేస్తారు. ఇది యోగాలో మెడ, భుజాలు, వెన్నుముక ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనది. ఒత్తిడి, ఆందోళన తగ్గి, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

April 2, 2026 / 06:36 AM IST

కళ్లు తాజాగా ఉండాలంటే..

ప్రస్తుతం మారిన జీవన విధానంలో కళ్లు జీవం కోల్పోయినట్లు అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజులో కనీసం నాలుగైదు సార్లైనా కళ్లను చన్నీటితో కడగాలని నిపుణులు చెబుుతన్నారు. కళ్లకు తరచూ విశ్రాంతినివ్వాలి. సరిపడా నిద్ర లేకపోయినా కంటి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. నిద్రలేమి వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, గీతలు, ముడతలు ఏర్పడతాయి. నాణ్యమైన ఐ మేకప్ ఉత్పత్తులు వాడాలి.

April 1, 2026 / 09:45 PM IST

వాము నీళ్లతో బోలెడు లాభాలు

వాము నీళ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాము నీళ్లు తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలో ఈ నీళ్లు సహాయపడుతాయి. జీర్ణక్రియ మెరుగుపడి.. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పంటి నొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన మాయమవుతుంది.

April 1, 2026 / 09:06 PM IST

మొటిమల్ని తగ్గించే కలబంద ప్యాక్!

కలబంద చర్మానికి చలువ చేయడమే కాకుండా మొటిమల్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఒక స్పూన్ కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మొటిమల మచ్చలు తగ్గుతాయి. అలాగే కలబందలో చిటికెడు పసుపు కలిపి వాడితే బ్యాక్టీరియా నశించి చర్మం కాంతివంతంగా మారుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది.

April 1, 2026 / 05:06 PM IST