1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.2. గుండె జబ్బులను దూరం చేస్తుంది.3. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.5. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.6. కంటి చూపును మెరుగరుస్తుంది.7. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
చలికాలంలో చర్మ సమస్యలను తగ్గించుకోవడం కోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. సువాసనగల సబ్బులు వాడటం తగ్గించాలి. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటం కోసం మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పెదవులకు లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. అంతేకాదు రోజుకు సరిపడా నీరు త్రాగాలి. పండ్లు, కూరగాయలు తినాలి.
బాత్రూమ్లో స్నానం చేసేటప్పుడు లైట్ ఆఫ్ చేసుకోండి. అంటే చీకట్లో స్నానం చేయడం అన్నమాట. దీన్నే ‘డార్క్ షవరింగ్’ అంటారు. చీకటిగా ఉన్నప్పుడు చుట్టూ ఏమున్నాయన్న స్పష్టత ఉండదు. ట్యాప్లు, సబ్బు అన్నింటినీ తడిమి చూసుకోవాల్సిందే. దృష్టంతా స్నానం మీదే ఉంటుంది. ఇక వేరే ఆలోచనలకు తావుండదు. అంటే మైండ్ ఫుల్గా స్నానం చేస్తామన్నమాట. ఈ క్రమంలో ఒత్తిడి దూరమవుతుందట.
సాధించిన దానితో సంతృప్తిపడటం అనేది చేతకానివారి పని. మనిషి ఇంకా సాధించాలనే పట్టుదలతో పనిచేయాలి. జీవితంలో చివరి రోజు వరకూ అదే పట్టుదల కొనసాగాలి. ఆకాశానికి హద్దు ఎలా ఉండదో మన లక్ష్యాలూ అలాగే ఉండాలి. అవి సాధించేందుకు అడ్డదారులు తొక్కకూడదు. మంచి ఆలోచనలు, సామర్థ్యంతో శ్రమించాలి.
బీర్ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మితంగా తాగేవారిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నాయి. బీరులో ఉండే డైటరీ సిలికాన్ ఎముకలను బలోపేతం చేస్తాయని తేలింది. అలాగే, ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నాయి.
డార్క్ చాక్లెట్స్ను క్రమం తప్పకుండా మోతాదులో తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడి తగ్గించి మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. శరీర నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 10 తర్వాత అల్పాహారం తినకుండా ఉండాలి. ఉదయం భోజనం శరీరానికి రోజంతా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల మధ్య భోజనం చేయాలి. అల్పాహారం, భోజనం మధ్య 4 గంటల విరామం ఉండాలి. దీనివల్ల మొదటి భోజనం సరిగ్గా జీర్ణమవుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఏమీ తినకూడదు. తిరిగి రాత్రి 6 నుంచి 8 గంటల మధ్య తినడం […]
రాస్ బెర్రీస్లో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. మెదడు, కంటి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జామపండును ఖాళీ కడుపుతో తింటే దాని ఫైబర్, సహజ ఎంజైములు పేగులను శుభ్రం చేస్తాయి. పేగు కదలికను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉదయం క్రమం తప్పకుండా జామపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. రోగ నిరోధకశక్తిని బలపరుస్తుంది. జలుబు, ఫ్లూ, అలసట వంటి కాలానుగుణ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
రాగి పాత్రలో నీళ్లను తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. అయితే రాగి పాత్రలో నీటిని 6-7 గంటలపాటు నిల్వ చేసి తాగితే మంచిది.
ఫోన్ ఛార్జ్ చేసేందుకు కంపెనీ ఛార్జర్ అయితే చాలా మంచిది. నాసిరకం ఛార్జర్ ఉపయోగిస్తే ఫోన్ లేదా ఛార్జర్ కాలిపోయే ప్రమాదం ఉంది. తప్పని పరిస్థితుల్లో సాధారణ ఛార్జర్లు ఉపయోగించాల్సి వస్తే.. వాటితో వందశాతం ఛార్జ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే 100 శాతం ఛార్జ్ చేస్తే.. పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వైట్ బ్రెడ్లో గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెరస్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ బ్రెడ్ మంచిది కాదు. ఈ బ్రెడ్ తరచూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే, వైట్ బ్రెడ్కు బదులుగా బ్రౌన్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ బ్రెడ్ తింటే మంచిది.
చలికాలంలో వ్యాయామం చేసేవారు తప్పనిసరిగా కొన్ని రూల్స్ పాటించాలి. వ్యాయామానికి ముందు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు వార్మప్ చేస్తే గాయాలు కాకుండా నివారించవచ్చు. పొరలు పొరలుగా దుస్తులు ధరించడం, వ్యాయామం చేసేటప్పుడు శరీరం వేడెక్కుతుంది. అందుకే ఉష్ణోగ్రతకు అనుగుణంగా తీసివేయడానికి వీలుగా పలుచని దుస్తులు ధరించాలి. లోపలి పొర చెమటను పీల్చుకునే విధంగా ఉండాలి.
ప్రతి ఏడాది నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే నిర్వహిస్తారు. డయాబెటిస్ ఉంటే శరీరంలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే..తరచుగా మూత్ర విసర్జన, అసాధారణంగా దాహం, ఆకలి, బరువు తగ్గడం, గాయాలు నెమ్మదిగా నయమవ్వడం, అలసట, బలహీనత, దృష్టి మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు.
ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టినప్పుడు BPA, థాలేట్స్ వంటి హానికర కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి ఆహారంలో కలిసి శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలు వస్తాయి. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. జీర్ణ, శ్వాసకోశ, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావం పడుతుంది.