టైప్-2 మధుమేహం నియంత్రణ కోసం జనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ నాట్కో ఫార్మా ఆవిష్కరించింది. పేటెంట్ ముగిసిన రోజే దీన్ని తీసుకొచ్చింది. దీని ధర నెలకు రూ. 1290 నుంచి ప్రారంభమవుతుంది. నాట్కో ఫార్మా ఈ మందును SEMANAT, SEMAFULL అనే పేర్లతో విక్రయించనుంది. కాగా, ప్రస్తుతం వయల్ రూపంలో అందుబాటులో ఉంది.
కంటి చుక్కల ముందులు ఎక్కువగా వాడటం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కంటి చుక్కల మందుల సీసాను తెరిచిన తర్వాత అందులో బ్యాక్టీరియా చేరకుండా ఉండటానికి PHMB అనే ఒక కెమికల్ను ప్రిజర్వేటివ్గా కలుపుతారు. ఇది మందును పాడవుకుండా ఉంచుతుంది కానీ.. కంటిపై మాత్రం దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
చర్మ సంరక్షణకు కొందరు స్టిరాయిడ్స్ వాడుతుంటారు. అయితే బెటామెథసోన్ వంటి స్టిరాయిడ్ క్రీములను ముఖానికి రాయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి చర్మాన్ని వ్యసనంలా లొంగదీసుకుని, వాడకం ఆపగానే తీవ్రమైన మంట, దురద కలిగిస్తాయట. ఇంకా చర్మం పలుచబడటం, ఇన్ఫెక్షన్లు, మొటిమలు వంటి సమస్యలూ వస్తాయని చెబుతున్నారు. ఇలాంటివి వాడే ముందు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మహిళల్లో డిమెన్షియా ముప్పును 25 ఏళ్ల ముందే గుర్తించే పి-టావ్217 అనే జీవ సూచికను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రక్తంలో దీని మోతాదు ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారు, హార్మోన్ చికిత్స తీసుకునే వారిలో ఈ పరీక్ష ద్వారా ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చు. తద్వారా నివారణ చర్యలు ముందుగానే చేపట్టే వీలుంటుంది.
రక్తహీనత తగ్గడానికి ఐరన్ సప్లిమెంట్ మాత్రలను పరగడుపున వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. వికారం అనిపిస్తే ఏదైనా తిన్నాక వేసుకోవచ్చు. వీటిని నారింజ రసం వంటి విటమిన్-సి పండ్లతో తీసుకుంటే మరింత మంచిది. అయితే క్యాల్షియం మాత్రలతో లేదా పాలతో మాత్రం తీసుకోకూడదు. ఇవి ఐరన్ను శరీరం సరిగా గ్రహించుకోకుండా చేస్తాయి.
వేసవి అంటేనే ఉక్కపోత, చెమటలు, నీరసం. ఫలితంగా శరీరం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించి, వేసవిలోనూ హుషారుగా ఉండాలంటే పుచ్చకాయ, కర్బూజ, పైనాపిల్, పనస, జామ, ద్రాక్ష వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా శరీరానికి కావాల్సిన నీటితో పాటు మినరల్స్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.
జీవితంలో పైకి రావాలని, అభివృద్ధి చెందాలని కోరుకునే ఏ వ్యక్తయినా సరే ఈ ఆరు లక్షణాలను వెంటనే వదిలేయాలని విదురుడు బోధించాడు. అవి: అతినిద్ర, మగత(ఎప్పుడూ మత్తుగా ఉండటం), భయం, క్రోధం(కోపం), సోమరితనం, దీర్ఘసూత్రత(పనులను రేపటికి వాయిదా వేయడం). ఈ 6 గుణాలు మనిషి ప్రగతికి అతిపెద్ద శత్రువులు. వీటిని పూర్తిగా విడిచిపెట్టిన వాడే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడని విదుర నీతి సారాంశం.
అకర్ణ ధనురాసనం వెన్నెముకకు, కాళ్లకు, చేతులకు అద్భుతమైన వశ్యతను ఇస్తుంది. పొత్తి కడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. వెన్నునొప్పిని తగ్గించి, ఛాతి కండరాలను బలోపేతం చేస్తుంది. ఏకాగ్రతను పెంచడం, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఛాతిని విస్తరించడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
TG: చాలా మంది ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటారు. అయితే ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే అనారోగ్యానికి గురవుతారని పండితులు చెబుతున్నారు. సోమవారం, బుధవారం హెయిర్ కటింగ్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం అస్సలు చేయించుకోవద్దని తెలిపారు.
నల్ల క్యారెట్, ఆవాలు, నీరు సరైన నిష్పత్తిలో కలిపి కాంజీ పానీయం తయారు చేస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణాశయంలో వాపులను తగ్గించడంలో, జీర్ణాశయం అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవిలో జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం సమస్యలు రావొచ్చు. కాంజీ వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది బయటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీరాన్ని చల్లబరచి వేడిని తగ్గిస్తుంది.
మనిషిని లోపల నుంచి నిరంతరం బాధించి, కుంగదీసే రెండు మానసిక ముళ్లు ఉన్నాయని విదురుడు చెప్పాడు. పేదవాడై ఉండి విలాసాలు కోరుకోవడం, తన స్తోమతకు మించి గొప్పల కోసం ఆరాటపడటం. బలహీనుడై ఉండి కోపగించుకోవడం.. ఎదుటివారిని ఏమీ చేయలేని అశక్తతలో ఉండి కూడా, అనవసరంగా ప్రతిదానికీ కోపంతో రగిలిపోవడం. ఈ రెండు లక్షణాలు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరని విదుర నీతి సారాంశం.
అర్ధచంద్రాసనం అనేది ఒక అద్భుతమైన సమతుల్య యోగాసనం. శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంచుతుంది. కాళ్లు, పిరుదులు, వెన్నుముకను బలపరుస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. నడుము నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మెడ, వెన్నుముక లేదా మోకాలి గాయాలు ఉన్నవారు ఈ ఆసనాన్ని నివారించాలి. తక్కువ లేదా అధిక రక్తపోటు, కళ్లు తిరిగే సమస్య ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.
రేపటి నుంచి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 6.53 గంటల నుంచి ఉదయం 9.30 గంటల వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు.
పిల్లలు మొబైల్ చూడటాన్ని తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నారు. ఎలా అంటే.. తాత్కాలికంగా పిల్లల నుంచి విరామం పొందడానికి, అన్నం తినిపించడానికి మొబైల్ను వారికి ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలు తెలియకుండానే స్క్రీనింగ్కు అలవాటు పడతారు. అలా కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేయండి. కథలు చెప్తూ అన్నం తినిపించండి. అంతేకానీ వారిని ఫోన్లకు అలవాటు చేయకండి. SHARE IT
సబ్జా గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటిలో నానితే మెత్తని జెల్ లాంటి పదార్థంలా మారుతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సబ్జా గింజలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ గింజలు సహాయ పడుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.