పాలలో క్యాల్షియం , విటమిన్ డి, లినోలినిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. పాలను ఉదయం తాగడం వల్ల కండరాలు నిర్మాణమవుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్గా పనిచేయవచ్చు. పాలను రాత్రిపూట తాగితే బరువు తగ్గడంతోపాటు నిద్ర సమస్యలు దూరమవుతాయి. అయితే, రాత్రిపూట పాలు తాగేవారు కొవ్వు తీసిన పాలను తాగాలి.
తాజా అంజీర్ పండ్లు తేలికగా ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. వీటిలో అధిక నీటి శాతం ఉంటుంది. ఇది తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిని తరచుగా తినడం వల్ల స్పష్టమైన, మెరిసే చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. బరువును నియంత్రించుకోవడానికి ఇబ్బంది పడే వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, వీటిని వేసవిలో తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
బెల్లం దాదాపు 70-75 శాతం సహజ చక్కెరను కలిగి ఉంటుంది. అందువల్ల, దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పటికే మధుమేహం ఉంటే దీనికి దూరంగా ఉండటం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 100 గ్రాముల బెల్లం దాదాపు 380 కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
మఖానా(లోటస్ సీడ్స్)లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు అదుపులో ఉంటుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తపోటు కంట్రోల్లో ఉండటంతో పాటు గుండె జబ్బులు దరిచేరవు. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది.
పెళ్లి ఖర్చులు పెరిగి, హనీమూన్ కోసం అప్పులు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ‘మినీ మూన్’. ఇది 2 నుంచి 5 రోజుల చిన్న వెకేషన్. భారీ ఖర్చులు లేకుండా.. దగ్గర్లోని ప్లేస్కి వెళ్లి చిల్ అవ్వడమే దీని కాన్సెప్ట్. దీనివల్ల టైం, మనీ సేవ్ అవుతాయి. లీవ్స్ టెన్షన్ ఉండదు. ఈ షార్ట్ ట్రిప్ కానిచ్చేసి.. తర్వాత తీరిగ్గా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి మీరు రెడీనా?
రాత్రి నిద్రపోయే ముందు ఒకటి లేదా రెండు లవంగాలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. లవంగాలలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే, మంచి, గాఢమైన నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.
అకస్మాత్తుగా వచ్చే సమస్యల్లో చెవి పోటు కూడా ఒకటి. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ను కొద్దిగా వేడి చెవిలో వేయాలి. దీంతో నొప్పి తగ్గడంలో పాటు చెవి కూడా క్లీన్ అవుతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బను వేడి చేసి దంచి వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.
పట్టు, జరీ బట్టలను షాంపూలు, కెమికల్స్తో ఉతికి పాడుచేసుకోకండి. వాటికి కుంకుడుకాయలే బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. కుంకుడుకాయలను చల్లటి నీళ్లలో నానబెట్టి, ఆ రసంతో ఉతికితే చాలు.. పట్టు చీరల రంగు అస్సలు పోదు. పైగా క్లాత్ డ్యామేజ్ కాకుండా ఎక్కువ కాలం మఞ్ఞనికా వస్తాయి. కావున, ఈసారి పట్టుచీరలకు ఈ నేచురల్ వాష్ ట్రై చేయండి.
గజిబిజి జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎదురవుతున్న సమస్యల్లో జట్టు రాలడం కూడా ఒకటి. ఈ క్రమంలోనే చాలా మంది చుండ్రు, పొడిబారిన జట్టు, చిట్లిన కేశాలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు తలకు వారంలో ఒక్కసారైనా కొబ్బరి నూనె లేదా బాదం, ఆలీవ్ ఆయిల్ రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడంతో కుదుళ్లకు రక్తప్రసరణతో పాటు కేశాలు కూడా బలోపేతమవుతాయని చెబుతున్నారు.
ఆఫీసులో టీ తాగేముందు మీ డెస్క్లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. టీ తాగడానికి ముందు ఖచ్చితంగా నీరు తాగండి. ఆ తర్వాతే టీ, కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ డీహైడ్రేటింగ్గా పనిచేస్తుంది. అందుకే ముందుగా నీరు తాగడం వలన శరీరంలో కోల్పోయే నీటిని తిరిగి సమతుల్యం చేసుకోవచ్చు.
పెరుగు, చక్కెర కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు కలిపి తింటే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాదు ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ రెండు కలిపి తింటే ఆ పని విజయవంతం అవుతుందని పెద్దలు చెబుతుంటారు.
అకస్మాత్తుగా బరువు తగ్గటం, ఉన్నట్టుండి జుట్టు ఎక్కువగా రాలడం, మూత్రం, మలంలో రక్తం పడటం, తరుచూ కడుపుబ్బరం, పొట్ట నొప్పి రావడం వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. అలాగే మహిళల్లో వెజైనల్ డిశ్చార్ తెలుపు రంగు కాకుండా వేరే రంగులో దుర్వాసనతో రావడం, నెలసరి సమయంలో రక్తం గడ్డలాగా పడితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పైనాపిల్ జ్యూస్లో విటమిన్ సి, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు, బ్రోమెలైన్ వంటి ఎంజైమ్లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులను దూరం చేస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. కంటి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలను బలంగా మారుస్తుంది.
వేరుశనగల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎముకలు బలంగా మారుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి అందుతుంది.
చలికాలంలో రోజూ మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే నీరసం, అలసట, బద్ధకం తగ్గి యాక్టీవ్గా ఉండేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది.