గర్భిణీలు ఖర్జూరాలు తినడం వల్ల తల్లి, బిడ్డలకు ఎంతో ఆరోగ్యం. వీటిలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తే, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాన్పు సులభం అయ్యే అవకాశాలు పెరుగుతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, మధుమేహం ఉన్నవారు వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
ఆ రోజుల్లో గుమ్మం ముందు ఉన్న అరుగు మీద ఊరి కబుర్లన్నీ పూసేవి. ఉదయం పేపర్ చదివే పెద్దాయన నుంచి, సాయంత్రం మంచి చెడు చెప్పుకునే అమ్మలక్కల దాకా.. ఆ అరుగు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించేది. అయితే ఇప్పటి పిల్లలకు అరుగు అంటే కేవలం ఒక పాతకాలపు పదం కావొచ్చు. కానీ, మనకు మాత్రం అది మన బాల్యాన్ని గుర్తు చేసే ఒక మధురమైన అనుభూతి. మరీ మీకూ అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.
మీరు ఒత్తిడిలో ఉన్నారో? లేదో? కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా అనిపించడం, తరచుగా తలనొప్పి, పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలతో తెలుసుకోవచ్చు. ఒత్తిడిని పూర్తిగా ఆపలేకపోయినా, అది పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. పని మధ్యలో చిన్న విరామాలు, పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టడం వంటి మార్పులు గొప్ప ఫలితాలనిస్తాయి.
పొగతాగడం వల్ల కేవలం ఊపిరితిత్తులకే కాదు, కంటిచూపుకు కూడా తీవ్ర ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం చేసేవారిలో కంటిలోని ముఖ్యమైన కణాలు దెబ్బతిని, 50 ఏళ్లు దాటాక చూపు మందగించే అవకాశం నాలుగు రెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా, కంటి శుక్లాలు వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డుపెట్టుకోవడం సామాజిక బాధ్యత. ఇది ఇతరులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ముఖం తుడుచుకోవడానికే కాక, అలంకారానికి కూడా ఇది కీలకం. వ్యక్తిగత పరిశుభ్రత కోసం కర్చీఫ్ తప్పనిసరిగా వాడాలి. తరచుగా ఉతకాలి. ఒకరి కర్చీఫ్ వేరొకరు వాడకపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మౌస్, కీబోర్డ్ ఎక్కువగా వాడేవారికి మణికట్టు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మధ్య మధ్యలో చేతులను సాగదీయడం, మణికట్టును గుండ్రంగా తిప్పడం వంటివి చేయాలి. ఒక చేతిని చాచి, అరచేతిని పైకి ఉంచి వేళ్లను వెనక్కి లాగాలి. ఇలాగే అరచేతిని కిందికి ఉంచి చేయాలి. పిడికిలిని 5 సెకన్లు బిగించి, ఆపై వేళ్లను వెడల్పుగా తెరవాలి. ఇలా చేయడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
వేసవిలో ఎండ నుంచి రాగానే అతిగా చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత మారడం వల్ల తలనొప్పి కలగవచ్చు. ఇది రక్త ప్రసరణ, గుండె లయపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఎండలో తగినంత జాగ్రత్తగా ఉంటూ, సాధారణ ఉష్ణోగ్రత గల నీటిని తాగడమే శ్రేయస్కరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బత్తాయి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. ఇది చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ తాగితే బెటర్.
పిల్లలతో ఉండటానికి, వారితో సమయం గడపడానికి మధ్య చాలా తేడా ఉంది. వారు ఆడుకుంటున్నప్పుడు పక్కనే కూర్చుని ఫోన్ చూడటం నిజమైన తోడు అనిపించుకోదు. మీరూ ఒక చిన్నపిల్లవాడిలా మారి వారితో కలిసి ఆడటం, వారిని నవ్వించడం అసలైన సమయం. ఎందుకంటే వారు కోరుకునేది మీ సమయాన్ని మాత్రమే, కేవలం మీ ఉనికిని కాదు. పిల్లలతో మనస్ఫూర్తిగా గడపండి.
ఆరోగ్యవంతమైన జీవనానికి గాఢ నిద్ర ఎంతో అవసరం. పక్కపై చేరగానే నిద్ర పట్టక ఇబ్బంది పడేవారికి ‘మిలిటరీ మెథడ్’ అద్భుత పరిష్కారం. మొదట ముఖ కండరాలను సడలించి, భుజాలను కిందికి వదిలేస్తూ శ్వాసను నెమ్మదిగా వదలాలి. కాళ్లు, చేతులను భారరహితంగా ఉంచి మనసును ప్రశాంతమైన స్థితిలోకి తీసుకురావాలి. 6 వారాల నిరంతర సాధనతో ఈ పద్ధతి ద్వారా బెడ్ ఎక్కిన నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకోవచ్చు.
కొందరు రాత్రి వేళల్లో జీన్స్ ప్యాంట్ ధరించే నిద్రపోతారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట వీటిని ధరిస్తే కంఫర్ట్ లేక సరిగ్గా నిద్రపట్టదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రాభంగం కలుగుతుంది. జీన్స్ బిగుతుగా ఉండటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలర్జీ, దద్దుర్లు, నడుం నొప్పి, ఉబ్బరం, లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది.
గ్రీన్ యాపిల్స్లో అనేక పోషకాలు ఉంటాయని, రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్న వారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది. డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది.
మండే ఎండల వేళ ‘చల్లని బీరు’ దాహాన్ని తీరుస్తుందని చాలామంది భావిస్తారు. కానీ బీరు తాగినప్పుడు తాత్కాలికంగా హాయిగా అనిపించినా.. బీరులోని ఆల్కహాల్ శరీరాన్ని త్వరగా డీహైడ్రేషన్కు గురిచేస్తుంది. దీనివల్ల శరీరం మరింత వేడెక్కి నీరసించిపోయి మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి, ఎండదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అందుకే బీరు కంటే కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తాగడం మంచిది.
మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతిగా దాహం వేయదు. ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. డిహైడ్రేట్కు గురికారు. జీర్ణసంబంధిత సమస్యలు దూరమవుతాయి. జలుబు, దగ్గు తగ్గుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది.
వేసవిలో అధికంగా కూల్ డ్రింక్స్ తాగితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్కు ముందస్తు సంకేతంగా పరిగణించబడుతుంది. అధిక చక్కెర లివర్లో కొవ్వుగా మారి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తుంది. దంతాల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. సోడాలో ఉండే ఫాస్పారిక్, కార్భోనిక్ యాసిడ్లు దంతాల పైపొరను దెబ్బతీసి దంతాలు పుచ్చిపోవడానికి కారణమవుతాయి.