తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి అత్యవసరం. ఒక వ్యక్తి రోజుకు సగటున 3-4 లీటర్ల నీరు తాగాలి. వేసవీలో శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదముంటుంది. నీరు తక్కువైతే అలసట, తలనొప్పి వస్తాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఉండటానికి వాటర్ బాటిల్ ఎప్పుడూ కంటికి కనిపించేలా ఉంచుకోండి. తాగాలనిపించకపోయినా తరచూ కొన్ని నీళ్లు తాగండి. ఇప్పుడే ఒక చిన్న సిప్ వేయండి.
వేసవికాలంలో తాటిముంజలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఈ ముంజలు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు.. వడదెబ్బ, డీహైడ్రేషన్ నుంచి బయటపడేస్తాయి. ముంజల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, సి, ఇ, కె లతో పాటు ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
వేసవిలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదముంది. చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు తగ్గి అలసట, నీరసం, తలతిరగడం, తీవ్రమైన దాహం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. వీటితో పాటు పుచ్చకాయ జ్యూస్, మామిడి జ్యూస్, నిమ్మరసం, మజ్జిగ, నారింజ జ్యూస్, దానిమ్మ జ్యూస్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
కొందరు మట్టి, కాగితం లేదా సుద్ద వంటివి తింటుంటారు. ఈ వింత కోరికను ‘పికా’ అనే రుగ్మతగా వైద్యులు చెబుతారు. శరీరంలో ఐరన్ లోపం వల్లనే ఇలాంటి అలవాటు ఏర్పడుతుందని, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలని అంటున్నారు. అలాగే, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అక్యూపంక్చర్ ఓ పురాతన చైనీస్ చికిత్సా విధానం. శరీరంలోని నిర్దిష్ట పాయింట్ల వద్ద సన్నని సూదులను ఉంచడం ద్వారా శరీర శక్తిని(Qi) క్రమబద్ధీకరిస్తారు. దీనివల్ల దీర్ఘకాలిక నొప్పులు (కీళ్లు, వెన్ను, మెడ), తీవ్రమైన ఒత్తిడి, మైగ్రేన్ సమస్యలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడి, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఇది ఎటువంటి మందులు లేకుండా సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే సురక్షితమైన పద్ధతి.
టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని చాలా మంది భయపడుతుంటారు. అయితే ఇందులో ఆక్సలేట్ల కారణంగా పరిమితంగా తిన్నంత వరకూ ఎలాంటి ప్రమాదం లేదు. పైగా టమాటాల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా ఆక్సలేట్లు శరీరంలోని క్యాల్షియంతో కలిస్తే క్రిస్టల్స్ ఏర్పడతాయి. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసే క్రమంలో ఈ క్రిస్టల్స్ రాళ్లుగా మారి అక్కడే ఉండిపోతాయి.
కప్పింగ్ థెరపీ అనేది ఒక పురాతన ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఇందులో చర్మంపై ప్రత్యేక కప్పులను ఉంచి ‘సక్షన్’ సృష్టిస్తారు. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. క్రీడాకారులు శారీరక దృఢత్వం కోసం దీనిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది. ఇందులో డ్రై, వెట్ (హిజామా) అనే రెండు పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి.
జీవితంలో అప్పు, అగ్ని, శత్రువు, వ్యాధి.. ఈ నాలుగింటిని సగం వదిలేయకూడదని, పూర్తిగా నిర్మూలించాలని విదురుడు హెచ్చరించాడు. వీటిలో ఏ కొద్ది భాగం మిగిలినా మళ్లీ విజృంభిస్తాయి. అప్పు వడ్డీతో పెరుగుతుంది, నిప్పు రాజుకుంటుంది, శత్రువు పగ తీర్చుకుంటాడు, వ్యాధి ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ఈ నాలుగింటిని ఎప్పుడూ సమూలంగా నాశనం చేయాలని విదుర నీతి సారాంశం.
ఆయుర్వేదంలో ‘అమృతవల్లి’గా పిలిచే తిప్పతీగ కషాయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక జ్వరాలను తగ్గించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ మితంగా తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించడంతో పాటు రక్తం కూడా శుద్ధి అవుతుంది.
ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తి, మెరుగైన జ్ఞాపకశక్తి, స్థిరమైన జీవక్రియ లభిస్తాయి. ఇది బరువు నియంత్రణలో ఉంచడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. 8 నుంచి 10 గంటలలోపు ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని (ఇడ్లీ, మొలకలు, గుడ్లు, ఓట్స్) తీసుకోవడం చాలా ఉత్తమం.
కటిచక్రాసనం (నడుము తిప్పే ఆసనం) వెన్నెముక వశ్యతను పెంచడం, నడుమునొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉదర అవయవాలను మసాజ్ చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నడుము చుట్టూ ఉన్న కండరాలను టోన్ చేయడం, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.
ఫ్యాటీ లివర్ ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఉత్పన్నమవుతుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శరీరంలో విషపదార్థాల స్థాయిలు పెరుగుతాయి. నారింజ, నిమ్మకాయ, బత్తాయి, కమలాఫలం వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాలేయాన్ని విష పదార్థాల నుంచి రక్షిస్తాయి.
రోజువారీ ఆహారంలో అల్లం చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరంలోని మంటను తగ్గించే ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే, వికారం, అజీర్ణం వంటి సమస్యలను నిమిషాల్లో తగ్గిస్తుంది. ముఖ్యంగా అల్లం టీ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, జలుబు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
కరివేపాకు కేవలం పోపులో వేసే ఆకు మాత్రమే కాదు, ఇది పోషకాల గని. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, రేచీకటి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇందులోని ఐరన్, ఫోలిక్ యాసిడ్ అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే, కరివేపాకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు తగ్గడానికి సహకరిస్తుంది.