• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

రాత్రిపూట విపరీతంగా దాహం వేస్తోందా?

వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. పగలు తగినంత నీరు తాగకపోవడం, రాత్రిపూట ఉప్పుగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అర్ధరాత్రి విపరీతంగా దాహం వేస్తుంది. దీనివల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీనిని నివారించడానికి పగలు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. రాత్రి పడుకునే ముందు మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లగా ఉండి హాయిగా నిద్రపడుతుంది.

March 15, 2026 / 11:29 PM IST

ఇలా చేస్తే గాఢ నిద్ర పడుతుంది

ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. గాఢ నిద్ర రావాలంటే రాత్రి 7 గంటలలోగా భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం త్వరగా జీర్ణమై హాయిగా నిద్ర పడుతుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర పడుతుంది. ఏదైనా బుక్స్ చదివినా నిద్రలోకి జారుకుంటారు. పడుకునే ముందు గ్లాసు పాలు తాగినా గాఢ నిద్ర పడుతుంది.

March 15, 2026 / 09:54 PM IST

రోజులో ఏ సమయంలో నీళ్లు తాగాలంటే?

ఉదయం పరగడుపునే 1 లీటర్ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగాలి. గోరు వెచ్చటి నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. పేగులు శుభ్రంగా మారతాయి. అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలి. వ్యాయామానికి ముందు గ్లాసు నీరు తీసుకోవాలి. నిద్ర పోయేముందు ఓ గ్లాసు నీరు తాగాలి.

March 15, 2026 / 08:37 PM IST

చేపలతో పెరుగు కలిపి తింటున్నారా..?

చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చేపలతో పాటు పెరుగు కలిపి తినడం ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చేపల్లో ఉండే ప్రోటీన్, పెరుగులోని కాల్షియం.. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అధిక భారం పడుతుంది. జీర్ణ సమస్యలతో పాటు అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో బరువు కూడా అధికంగా పెరిగే ఛాన్స్ ఉంది.

March 15, 2026 / 07:15 PM IST

క్యాల్షియం ఎందులో ఎక్కువగా ఉంటుందంటే?

ఎముకలు, దంతాల ఆరోగ్యానికి క్యాల్షియం ఎంతో అవసరం. పాలు, పెరుగు, పనీర్ వంటి డైరీ ఉత్పత్తులే కాకుండా.. రాగులు, సజ్జలు, నువ్వుల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకు మించిన క్యాల్షియం రాగుల్లో లభిస్తుంది. మునగాకు, పాలకూర వంటి ఆకుకూరలు, బాదం, అంజీర్, సోయాబీన్స్, శనగల్లో కూడా క్యాల్షియం అధికంగానే ఉంటుంది. ఎముకల బలహీనతను అడ్డుకోవడానికి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

March 15, 2026 / 06:05 PM IST

కాల్షియం ఎందులో ఎక్కువగా ఉంటుందంటే?

ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం ఎంతో అవసరం. పాలు, పెరుగు, పనీర్ వంటి డైరీ ఉత్పత్తులే కాకుండా.. రాగులు, సజ్జలు, నువ్వుల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకు మించిన కాల్షియం రాగుల్లో లభిస్తుంది. మునగాకు, పాలకూర వంటి ఆకుకూరలు, బాదం, అంజీర్, సోయాబీన్స్, శనగల్లో కూడా క్యాల్షియం అధికంగానే ఉంటుంది. ఎముకల బలహీనతను అడ్డుకోవడానికి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

March 15, 2026 / 06:05 PM IST

పచ్చటి గడ్డిపై చెప్పుల్లేకుండా నడిస్తే..?

చెప్పులు లేకుండా పచ్చటి గడ్డిపై లేదా నేలపై నడవడం వల్ల భూమిలోని సహజ శక్తి శరీరానికి అందుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శరీరంలో మంట తగ్గడంతో పాటు నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి, దీర్ఘకాలిక నొప్పుల ఉపశమనానికి ఈ అలవాటు ఎంతో మేలు చేస్తుంది.

March 15, 2026 / 04:12 PM IST

ఈ చిట్కాలతో బ్లాక్ హెడ్స్‌కు చెక్!

కొన్ని చిట్కాలతో బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. నిమ్మరసం, తేనె మిశ్రమాన్ని ముక్కుపై రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి. బేకింగ్ సోడాను కొద్దిగా నీటిలో కలిపి స్క్రబ్ చేస్తే రంధ్రాల్లో మురికిని తొలగిస్తుంది. వారానికి 2 సార్లు ఆవిరి పడితే మంచిది. మట్టి లేదా చార్కోల్ మాస్క్‌లు వాడితే నూనె, మురికి పోతాయి. రోజూ పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి.

March 15, 2026 / 03:34 PM IST

చెరకు రసంతో మెరిసే చర్మం

చర్మ సౌందర్యానికి చెరకు రసం అద్భుతంగా పనిచేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ముల్తానీ మట్టి కలిపి రాస్తే ముఖంపై ఉన్న నల్లమచ్చలు సులభంగా తొలగిపోతాయి. కొద్దిగా తేనె కలిపి మసాజ్ చేస్తే చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. అలాగే, కాఫీ పొడితో కలిపి స్క్రబ్ చేస్తే ముఖం సహజ సిద్ధమైన కాంతితో మెరుస్తుంది. ఈ సహజ చిట్కాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

March 15, 2026 / 01:53 PM IST

జ్ఞాపకశక్తిని పెంచుకోండిలా..!

జ్ఞాపకశక్తి పెరగడానికి పోషకాహారం, మెదడుకు వ్యాయామం ముఖ్యం. రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఆకుకూరలు, బాదం వంటి గింజలు తీసుకోవాలి. తగినంత నిద్ర, తక్కువ ఒత్తిడి మెదడుకు మేలు చేస్తాయి. పజిల్స్ పూరించడం, కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం ద్వారా మెదడును చురుగ్గా ఉంచుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది.

March 15, 2026 / 01:22 PM IST

నేలపై కూర్చొని భోజనం చేస్తున్నారా?

నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సుఖాసనంలో కూర్చోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉండి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తింటున్నప్పుడు ముందుకు వంగడం వల్ల మెదడుకు త్వరగా సంకేతాలు వెళ్లి, అతిగా తినకుండా ఆపుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ అలవాటు కీళ్ల నొప్పులను తగ్గించి, శరీరాన్ని ఫ్లెక్సిబుల్ ఉంచుతుంది.

March 15, 2026 / 01:14 PM IST

బియ్యం నీళ్లతో జుట్టు సమస్యలకు చెక్

బియ్యం నీరుతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బియ్యం నీటిలోని ఇనోసిటాల్, విటమిన్లు దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేసి కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇది చుండ్రును తగ్గించి, జుట్టును సిల్కీగా, ఒత్తుగా మారుస్తుంది. అరకప్పు బియ్యాన్ని 2 కప్పుల నీటిలో 30 నిమిషాల నుంచి 24 గంటలు నానబెట్టి, ఆ నీటిని వారానికి 1-2 సార్లు వాడాలి. అతిగా వాడితే జుట్టు పొడిబారుతుంది.

March 15, 2026 / 11:51 AM IST

వాము వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

వాము నీరు గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో మెటబాలిజం పెంచి, కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించి జలుబు, దగ్గు ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.  పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

March 15, 2026 / 10:05 AM IST

ఉదయం అల్పాహారం చేస్తే కలిగే లాభాలు

ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా అవసరమైన శక్తి లభిస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇది నిద్రలో ఉన్న శరీరానికి పోషకాలను అందించి, అలసటను తగ్గించి, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. రాత్రంతా ఉపవాసం తర్వాత బ్రేక్‌ఫాస్ట్ మీ శరీరానికి గ్లూకోజ్ సరఫరాను పునరుద్ధరిస్తుంది.

March 15, 2026 / 07:55 AM IST

ధనురాసనం వల్ల కలిగే ఉపయోగాలు

ధనురాసనం వెన్నెముకను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి అద్భుతమైన యోగాసనం. పొట్ట భాగంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఇది ఛాతీని తెరిచి, లోతైన శ్వాసను ప్రోత్సహించడం ద్వారా ఆందోళన, అలసటను తగ్గిస్తుంది. భుజాలు, ఛాతీని సాగదీయడం ద్వారా, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చునే వారిలో వచ్చే భుజాల వంపులను తగ్గిస్తుంది.

March 15, 2026 / 06:32 AM IST