రేపటి నుంచి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 6.53 గంటల నుంచి ఉదయం 9.30 గంటల వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు.
పిల్లలు మొబైల్ చూడటాన్ని తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నారు. ఎలా అంటే.. తాత్కాలికంగా పిల్లల నుంచి విరామం పొందడానికి, అన్నం తినిపించడానికి మొబైల్ను వారికి ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలు తెలియకుండానే స్క్రీనింగ్కు అలవాటు పడతారు. అలా కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేయండి. కథలు చెప్తూ అన్నం తినిపించండి. అంతేకానీ వారిని ఫోన్లకు అలవాటు చేయకండి. SHARE IT
సబ్జా గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటిలో నానితే మెత్తని జెల్ లాంటి పదార్థంలా మారుతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సబ్జా గింజలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ గింజలు సహాయ పడుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోజుకో ఆరెంజ్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బరువు తగ్గాలంటే జీవనశైలిలో చిన్న మార్పులు తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా నడక అలవాటు చేసుకోండి. జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. రాత్రి భోజనం నిద్రకు రెండు గంటల ముందే ముగించాలి. క్రమశిక్షణతో కూడిన ఆహారం, తగినంత నిద్ర ముఖ్యం.
శరీరంలోని అధిక వేడిని తగ్గించడానికి బార్లీ ఒక అద్భుతమైన సహజ పానీయం. ఇది శరీరాన్ని చల్లబరిచి, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. డీహైడ్రేషన్, అజీర్తి, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. బార్లీ నీరు కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడమే కాకుండా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయాన్నే అల్పాహారం మానేయడం వల్ల శరీరానికి అందాల్సిన శక్తి తగ్గి, రోజంతా అలసటగా అనిపిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి, ఏకాగ్రత దెబ్బతింటుంది. మెటబాలిజం మందగించి, మధ్యాహ్నం అతిగా తినే అవకాశం ఉంటుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి.
క్షమాగుణం ఉన్నవారిని చూసి ఈ సమాజం ‘బలహీనులు’, ‘చేతకానివారు’ అని తప్పుగా అర్థం చేసుకుంటుందని విదురుడు చెప్పాడు. కానీ క్షమించడం అనేది చేతకానితనం కాదు, అది బలవంతుడి అతిపెద్ద ఆభరణం. ఎదుటివారిని ఎదిరించే శక్తి ఉండి కూడా, కోపాన్ని అదుపు చేసుకుని క్షమించగలిగిన వాడే నిజమైన ధీరుడు. ఇతరులు ఏమనుకున్నా ఓర్పును వదులుకోకూడదని దీని సారాంశం.
సూర్య నమస్కారం కృతజ్ఞతతో కూడిన 12 ఆసనాల సమాహారం. ఉదయం ఖాళీ కడుపుతో తూర్పు ముఖంగా చేస్తే రక్త ప్రసరణ, జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గుతారు. దీనితో పాటు 15 నిమిషాల ఉదయపు ఎండ వల్ల ఎముకలకు మేలు చేసే విటమిన్-డి అందుతుంది. ఇది రాత్రి పూట హాయిగా నిద్ర పట్టడానికి సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
పళ్లు తోముకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గట్టిగా, ఎక్కువ సేపు బ్రష్ చేస్తే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. కేవలం 2 నిమిషాలు, మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్తో సున్నితంగా తోముకోవాలి. నాలుకను శుభ్రం చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) బ్రష్ చేయాలి. ప్రతి 3 నెలలకోసారి బ్రష్ మార్చాలి. వాడిన తర్వాత బ్రష్ను శుభ్రంగా ఆరబెట్టాలి.
నిద్రలేవగానే అలారం ఆపి వెంటనే మంచం దిగకండి. కనీసం రెండు నిమిషాలు మంచంపైనే కూర్చోండి. అరచేతులను రుద్దుకుని కళ్లకు అద్దుకోండి. శరీరాన్ని నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి. వెంటనే లేవడం వల్ల రక్తపోటులో మార్పులు వచ్చి కళ్లు తిరిగే ప్రమాదం ఉంది. ఇలా నెమ్మదిగా మేల్కొనడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
దానిమ్మ పండును ‘పోషకాల గని’ అని పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, కె, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు దీనిని తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి ముఖం మెరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ, చెడు కొలెస్ట్రాల్ను ఇది తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.
వేసవికాలంలో పుచ్చకాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ వాటిని కట్ చేసి ఫ్రిజ్లో పెట్టి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్లో పెట్టడం వల్ల తేమ, బ్యాక్టీరియా పెరుగుతాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలడం, అలర్జీలు వంటి సమస్యలు వస్తాయి.
కొన్ని రకాల కూరగాయలతో బెండకాయను కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే.. బంగాళదుంప, వంకాయ, ముల్లంగి, కాకరకాయ వీటితో పాటు పాలు, పెరుగు, టీ లేదా ఎర్ర మాంసం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచించారు.
గంటల తరబడి ఇయర్ఫోన్స్ వాడటం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది క్రమంగా వినికిడి శక్తిని తగ్గిస్తుంది. హెడ్ ఫోన్స్ వాడేటప్పుడు వాల్యూమ్ ఎప్పుడూ 60% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి గంటకోసారి ఇయర్ఫోన్స్ తీసేసి, చెవులకు గాలి తగిలేలా 5-10 నిమిషాలు విరామం ఇవ్వాలి. ముఖ్యంగా ఇయర్ఫోన్స్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.