TG: తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. యాపిల్, అరటిపండు, చిలకడదుంపలు, క్యారెట్లు, ఆవకాడల్లో ఫైబర్, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
భారత్ లో చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో గ్రహణం ప్రారంభమైంది. ఈ గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చు. 6.46 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. మరి మీరూ చూసేయండి.
కొన్నిసార్లు నెగెటివ్ ఆలోచనలు మనల్ని తీవ్రంగా వేధిస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి మనసును ఇతర మంచి విషయాలపై మళ్లించడం చాలా ముఖ్యం. నచ్చిన సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, ఇష్టమైన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కుదరకపోతే ధ్యానం చేయండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే తృప్తి, సానుకూల దృక్పథాన్ని నింపి, మిమ్మల్ని మళ్లీ కొత్త ఉత్సాహంతో నింపుతుంది.
కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచనలు మనల్ని తీవ్రంగా వేధిస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి మనసును ఇతర మంచి విషయాలపై మళ్లించడం చాలా ముఖ్యం. నచ్చిన సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, ఇష్టమైన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కుదరకపోతే ధ్యానం చేయండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే తృప్తి, సానుకూల దృక్పథాన్ని నింపి, మిమ్మల్ని మళ్లీ కొత్త ఉత్సాహంతో నింపుతుంది.
హోలీ పండుగలో మోదుగు(గోగు) పువ్వులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేసి హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ రంగులు చర్మానికి సురక్షితమైనవి, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ పువ్వులను దేవుడి పూజలోనూ వినియోగిస్తారు. ఈ పువ్వులోని తీయని రసాయనం తేనె వంటి అనుభూతిని ఇస్తుంది. మీరూ ఇలా చేశారా? కామెంట్ చేయండి.
వాతావరణంతో సంబంధం లేకుండా కాళ్లు, చేతులు పొడిబారుతున్నాయా? రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్తో మర్దన చేయండి. గోరువెచ్చని నీటిలో వంటసోడా, ఎప్సమ్ సాల్ట్, రోజ్ వాటర్ కలిపి పది నిమిషాలు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి, మీ చర్మం తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వినికిడి దినోత్సవం నేడు. ‘అందరికీ వినికిడి సంరక్షణ’ అనే లక్ష్యంతో అవగాహన కల్పించాల్సిన సమయం ఇది. నేటి యాంత్రిక జీవనంలో ఇయర్ఫోన్ల మితిమీరిన వాడకం, శబ్ద కాలుష్యం వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చిన్నప్పుడే వినికిడి పరీక్షలు చేయించుకోవడం, అధిక శబ్దాలకు దూరంగా ఉండటం ద్వారా 60% లోపాలను నివారించవచ్చు. వినికిడి కోల్పోతే తిరిగి రాదు.. జాగ్రత్తే అసలైన రక్షణ.
నిరంతరం కళ్లజోడు ధరించడం వల్ల ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చలను సహజ చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. కలబంద రసం లేదా కలబంద జెల్ను మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. కీరా, బంగాళాదుంప, టమాటా రసాలను కలిపి రాసి, ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నారింజ తొక్కల పొడిలో పాలు లేదా పెరుగు కలిపి ప్యాక్లా వేసుకుని కొంతసేపటికి క్లీన్ చేస్తే బెటర్.
బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. కానీ, ఉదయం అల్పాహారం మానేయడం వల్ల శరీరానికి అందాల్సిన శక్తి అందక నీరసం వస్తుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గడమే కాకుండా, మధ్యాహ్నం అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది బరువు పెరగడానికి, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి మెదడు చురుకుదనం తగ్గుతుంది. అలాగే మెటబాలిజం మందగిస్తుంది.
ముఖ్యమైన పనులు చేసేటప్పుడు నలుగురి సలహాలు తీసుకోకూడదని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పారు. వివేకం లేని అల్పబుద్ధి కలవాడు, బాధ్యత లేని సోమరి, పనులను సాగదీసే దీర్ఘసూత్రుడు, కేవలం సంతోషపెట్టడానికే అబద్ధాలు చెప్పే ముఖస్తుతి పరుడు.. వీరి వల్ల పనులు పూర్తికాకపోగా అనర్థాలు జరుగుతాయని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఇలాంటి వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అని విదుర నీతి సారాంశం.
నానబెట్టిన గుప్పెడు పల్లీలు, ఒక అరటిపండు, కప్పు పాలు, తేనే కలిపి జ్యూస్లా తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పల్లీలను నానబెట్టడం వల్ల అవి సులభంగా జీర్ణమై, శరీరానికి ప్రోటీన్ను అందిస్తాయి. అరటిపండులోని పొటాషియం, పాలలోని కాల్షియం కండరాలు, ఎముకలను దృఢంగా మారుస్తాయి. డైరీ పాలకు బదులు కొబ్బరిపాలు వాడటం వల్ల శరీరం చలువ చేయడంతో పాటు మరింత పోషకాలు అందుతాయి.
కొందరికి అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర పట్టదు. కానీ అంతసేపు నిద్రపోకుండా ఉండడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటలు ఫోన్ చూసేవారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. రాత్రి తక్కువగా తినాలి. నిద్రకు 2 గంటల ముందే భోజనం తీసుకోవాలి. గది ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంచుకోవాలి. మ్యూజిక్ వినడం, బుక్స్ చదవాలి. నిద్రకు గంట ముందే ఫోన్ను దూరంగా పెట్టాలి.
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలు అలవరుచుకోవడం, అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మనశ్శాంతి అనేది కేవలం మెదడుకే కాదు, శరీరంలోని ప్రతి కణానికి శక్తినిస్తుంది.
స్నానం చేసేటప్పుడు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముందుగా తలపై నీరు పోసుకోవడం ప్రమాదకరమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తలపై నీరు పోయగానే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి, రక్త ప్రసరణ తలవైపు పెరిగి ఆర్టరీలు పగిలే ప్రమాదం ఉంది. తద్వారా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.