రోజూ గుప్పెడు పిస్తా పప్పులు తింటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, కణాల నాశనాన్ని అరికడతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
వాట్సాప్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్, ఐఫోన్ల మధ్య చాట్ హిస్టరీ, మీడియాను సులభంగా బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఐఫోన్ వినియోగదారులు కూడా ఒకే ఫోన్లో రెండు అకౌంట్లను వాడుకోవచ్చు. స్టోరేజీని మేనేజ్ చేసేందుకు పెద్ద ఫైళ్లను త్వరగా తొలగించే ఆప్షన్ కూడా ఇచ్చారు.
పులుపు, వగరు రుచులు కలగలిసిన వాక్కాయథ్ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేకులు, ఐస్క్రీమ్లలో వాడే టూటీ ఫ్రూటీలను వీటితోనే తయారు చేస్తారు. విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉండే ఈ కాయలు రోగనిరోధక శక్తిని పెంచి.. రక్తశుద్ధికి, ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. చింతపండుకు ప్రత్యామ్నాయంగా వీటిని పచ్చళ్లు, వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు.
కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్లలో మంట, దురద, నీరు కారడం వంటి లక్షణాలు ఇన్ఫెక్షన్లకు సంకేతాలు. కళ్ల ముందు మెరుపులు కనిపించడం రెటినా సమస్యకు దారితీయవచ్చు. వస్తువులు రెండుగా కనిపించడం, రంగులను గుర్తించలేకపోవడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మేకప్ బ్రష్లు, స్పాంజ్లను ఏడాదికి ఒకసారైనా మార్చడం చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల బ్యాక్టీరియా చేరి మొటిమలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీటిని వేడి నీళ్లు, బేబీ షాంపూ లేదా యాంటీ బ్యాక్టీరియల్ సోప్తో క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి. నాణ్యత తగ్గకముందే కొత్తవి వాడటం ఉత్తమం. ఇలాంటి చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మూత్రవిసర్జన చేయడం సాధారణం కాదు. ఇది UTI, మధుమేహం, అతి చురుకైన మూత్రాశయం (OAB) లేదా ప్రాస్టేట్ సమస్య కావచ్చు. మూత్రంలో మంట, నొప్పి లేదా రక్తం, వెన్నునొప్పి.. జ్వరం లేదా చలి.. మూత్రం ఆపుకోలేకపోవడం, రాత్రిపూట 3 నుంచి 4 సార్ల కంటే ఎక్కువ నిద్రలేవడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరంగా అనిపించడం సాధారణ సమస్య. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, మసాలా ఎక్కువగా తినడం, తగినంత నీరు తాగకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది జరుగుతుంది. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే గ్యాస్ తక్కువ అవుతుంది. కప్పు వేడి నీటిలో సోంపు గింజలు మరిగించి వడకట్టి తాగడం వల్ల కడుపు తేలికగా అనిపిస్తుంది.
కొందరు ప్రతి ఉదయం గుడ్లను తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ఎంతో మంచి ఆహారపు అలవాటు అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్తో నిండిన గుడ్లను ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. జీవక్రియ, రోగనిరోధక శక్తి, మెడదు పనితీరుకు మేలు చేస్తుందట. అయితే ఉదయం వేళ 2 గుడ్లకు మించి తీసుకోవద్దని సూచిస్తున్నారు.
పచ్చి కొబ్బరి నీళ్లలో పోషకాలు అధికమని, ముదిరిన కాయల కంటే ఇవే మేలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తీసిన పదిహేను నిమిషాల్లోపు తాగితేనే విటమిన్-సి అందుతుందని, ఆలస్యమైతే గుణాలు తగ్గుతాయని తెలిపారు. ఇక అసిడిటీ, పేగుల్లో మంట ఉన్నవారు పుల్లని మజ్జిగకు దూరంగా ఉండటం మంచిది. వేసవి ఆరోగ్య రక్షణ కోసం ప్రజలు ఈ కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం పడుకునే ముందు మొబైల్ వాడటం. ప్రశాంతమైన నిద్ర కోసం ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, గదిలో చీకటిగా ఉంచుకోవడం ఉత్తమం. రాత్రి పూట కాఫీ, టీలకు దూరంగా ఉండటం ముఖ్యం. శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతపడి త్వరగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది.
పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా? అనేదానిపై చాలా మందికి సందేహాలుంటాయి. ముడి కూరగాయలలో గట్టి ఫైబర్ ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ, కడుపునొప్పికి దారితీయొచ్చు. అయితే బంగాళాదుంపలు, వంకాయలు, క్యాప్సికం, బ్రకోలి, క్యాలీఫ్లవర్, పాలకూర, కొన్ని చిక్కుడు జాతి కూరగాయలను పచ్చిగా తినడకూడదు.
గర్భిణీలు ఆహారంలో ఉప్పు మోతాదుపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 3.8 నుంచి 5.8 గ్రాముల ఉప్పు తీసుకోవడం ఉత్తమం. అంతకు మించి ఉప్పు తీసుకుంటే శరీరంలో నీరు చేరి కాళ్లు, చేతుల వాపులు, బీపీ వంటి సమస్యలు తలెత్తుతాయి. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సమతుల్యంగా ఉప్పు తీసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
బ్లడ్ షుగర్ కంట్రోల్కు ఆపిల్ పండు బాగా ఉపయోగపడుతుంది. ఒక మీడియం ఆపిల్లో సుమారు 25 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నా.. ఇందులో ఫైబర్ దాదాపు 4 గ్రాములు ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల షుగర్ రక్తంలోకి నెమ్మదిగా వెళ్తుంది. అందుకే ఆపిల్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజుకు 1 మీడియం ఆపిల్ తీసుకోవచ్చు. తొక్కతో పాటు నమిలి తింటే ఇంకా మంచిది.
ఎండ తీవ్రతకు శరీరం డీహైడ్రేట్ కాకుండా క్యారెట్, దోస, టొమాటో, క్యాప్సికం వంటి కూరగాయల సలాడ్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే రుచితో పాటు రక్తహీనత తగ్గి శరీరం రిఫ్రెష్ అవుతుంది.