ఆహారపు అలవాట్లు, జీవితంపై అతిగా నియంత్రణలు విధించుకోవడం అనవసరపు ఒత్తిడికి దారితీస్తుంది. ఏది మంచిది, ఏది కాదు అనే అవగాహన కలిగి ఉంటే సరిపోతుంది కానీ, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఆందోళన చెందకూడదు. క్రమశిక్షణ అవసరమే అయినా, అది మనల్ని భయపెట్టేలా ఉండకూడదు. సహజమైన పద్ధతులతో, ప్రశాంతమైన మనసుతో సాగిపోతేనే సంపూర్ణ ఆరోగ్యం. మనసు బాగుంటేనే మనిషి బాగుంటాడు.
మజ్జిగ ప్రతి ఒక్కరికి మేలు చేయదు. లాక్టోజ్ ఇన్టోలరెన్స్ ఉన్నవారు మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. జలుబు, దగ్గు, అలర్జీ ఉన్నవారు మజ్జిగను తగ్గించాలి. ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు మజ్జిగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపులో అల్సర్, అసిడిటీ ఉన్నవారు మజ్జిగను జాగ్రత్తగా తీసుకోవాలి.
ఎండ వల్ల చర్మం కందిపోకుండా దానిమ్మ, స్ట్రాబెర్రీ, జామ వంటి పండ్లు మేలు చేస్తాయి. దానిమ్మలోని ‘ఎల్లాజిక్ ఆమ్లం’ యూవీ కిరణాల నుంచి రక్షణనిచ్చి, కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. గ్రీన్ టీలోని సమ్మేళనాలు చర్మాన్ని కాపాడతాయి. బంగాళాదుంపలోని పిండి పదార్థాలు చర్మం కందిపోకుండా అడ్డుకోవడమే కాకుండా, చర్మ మెరుపును పెంచి ఆరోగ్యంగా ఉంచుతాయి.
వివాహం చేసుకున్న వారిలో క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. పెళ్లికాని పురుషుల్లో 68%, మహిళల్లో 83% అధిక ప్రమాదం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. భాగస్వామి మద్దతు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు విశ్లేషించారు. ఒంటరితనం కంటే బలమైన సామాజిక బంధాలు ఉండటం క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
వేసవిలో సొరకాయ, కాకరకాయ, టిండా వంటి కూరగాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో 90-92% నీరు ఉండటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇవి తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, సులభంగా జీర్ణమవుతాయి. మెటబాలిజం మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా కాకరకాయ డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలోనూ, శరీర వాపులను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
మానసిక ప్రశాంతత కోసం రోజుకు 15 నిమిషాల ధ్యానం, 8 గంటల నిద్ర తప్పనిసరి. ప్రకృతిలో గడపడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనల్ని మనం ప్రేమించుకుంటూ, బలాబలాలను అంగీకరించాలి. పౌష్టికాహారం, వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్నేహితులతో పంచుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ మంచి ఆహారం. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ మాత్రం తగినంతగా ఉంటుంది. అందుకే దీన్ని తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. మధ్యలో తినే అలవాటు తగ్గుతుంది. ఇలా శరీరంలో అదనంగా పేరుకుపోయే కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. ఆరోగ్యంగా బరువు నియంత్రణలో ఉండేందుకు ఇది సహజమైన మార్గంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది.
పిల్లల్లో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో రాగి జావ, కిస్మిస్లు, హలీమ్ గింజలు(అలివ్ సీడ్స్) ఎంతగానో సహాయపడుతాయి. వీటిని రోజూ ఏదో ఒక రూపంలో అందించడం మంచిది. అలాగే, ఐరన్ పుష్కలంగా ఉండే అటుకులను ఇవ్వడం వల్ల శరీరానికి ఐరన్తో పాటు తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు కూడా అందుతాయి. రక్త కణాల తయారీకి ఆకుకూరలు, నువ్వులు, వివిధ రకాలు పప్పులు, గుడ్లు చాలా ఉపయోగపడుతాయి.
మ్యూజిక్ థెరపీ ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు మెలోడీలు లేదా ఇన్స్ట్రుమెంటల్ వింటే బ్రెయిన్ వేవ్స్ శాంతించి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. ఇది రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిద్రపోయే ముందు సంగీతం వింటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. చదువులో, పనిలో ఏకాగ్రత పెంచేందుకు మృదువైన సంగీతం అద్భుతంగా పనిచేస్తుంది.
వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా యవ్వనంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. ఎండలో వెళ్లేటప్పుడు సన్స్క్రీన్ వాడాలి. ఒత్తిడి తగ్గించుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగి చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి.
ఏప్రిల్ వచ్చేసింది. వస్తూ వస్తూ ఎప్పటిలాగే భయంకరమైన ఎండలను తీసుకొచ్చింది. అయితే ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతోందని.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఉప్పు వేసిన నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్ వంటివి తాగాలి. దాహం కావట్లేదని నీళ్లు తాగకుండా ఉండొద్దు. ఫ్రై చేసిన ఫుడ్ తినొద్దు. డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకొవద్దు.
వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. నూనె, మసాలాలు తగ్గించి.. పండ్లు, మజ్జిగ వంటి చలవ చేసేవి తీసుకొవాలి. వదులైన కాటన్ బట్టలు ధరించాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎండలో వెళ్లకపోవడమే మంచిది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, సన్ గ్లాసెస్ వాడాలి.
కాకరకాయ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, డయాబెటిస్ బాధితులకు సహజ ఇన్సులిన్లా పనిచేస్తుంది. ఉదయం పరగడుపున దీనిని తాగడం వల్ల బరువు తగ్గడం, కాలేయ శుద్ధి, మెరుగైన జీర్ణక్రియ వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. 10 నిమిషాల యోగా లేదా స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేస్తే శరీరానికి శక్తినిస్తాయి. నిద్రలేచిన తర్వాత గంట సేపు మొబైల్ చూడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ రోజు చేయాల్సిన పనులను ఒకసారి గుర్తుచేసుకోవాలి.
స్వస్తికాసనం (శుభ భంగిమ) ధ్యానం, ప్రాణాయామం కోసం కూర్చుని చేసే యోగాసనం. ఇది వెన్నెముకను నిటారుగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. తుంటి, మోకాళ్లు, చీలమండల వశ్యతను మెరుగుపరుస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు, లోపలి పేగులపై ఒత్తిడి వల్ల జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.