మహిళల్లో ఎంత కొలెస్ట్రాల్ ఉన్నా వారిలో పొట్ట వచ్చే వారి సంఖ్య తక్కువ. ఎందుకంటే స్త్రీ పురుష శరీర నిర్మాణంలో కొన్ని తేడాలు ఉంటాయి. మహిళల్లో తొడలు, తుంటి, ఇంకా ఇతర భాగాలలో కొవ్వు చేరిపోయి ఖాళీ లేనప్పుడే పొట్ట దగ్గరకు చేరుతుంది. కానీ, పురుషుల్లో కేవలం పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు నిల్వ ఉండటానికి అవకాశం ఉంది. అందుకే ఎక్కువగా పొట్టవస్తుంది.
కొన్ని చిట్కాలతో చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. వేపాకుల పేస్ట్లో పెరుగు కలిపి తలకు అప్లై చేసుకుని కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. రాత్రి నానబెట్టిన మెంతులను మరుసటి రోజు పేస్ట్లా చేసుకుని.. అందులో పెరుగు, 1 టీస్పూన్ త్రిఫల పొడిని కలిపి తలకు రాసుకోవాలి. గంట తర్వాత షాంపూతో క్లీన్ చేయాలి. వేడి చేసిన కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకోవాలి.
గ్రీన్ టీలో కనిపించే కాటెచిన్లు, కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతాయి. కొవ్వును కరిగించడాన్ని వేగవంతం చేస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా 1 నుంచి 2 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బాదంపప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ బాదం పప్పు తింటే చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఫైబర్ అధికంగా ఉండే బాదం పప్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పేగులను శుభ్రంగా ఉంచుతాయి. ఉదయం నానబెట్టిన బాదం పప్పు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులోని సమస్యలు తొలగిపోతాయి.
గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే.. కానీ అతిగా తాగితే విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదు మించితే మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించకుండా ఇది అడ్డుకుంటుంది, దాంతో రక్తహీనత వస్తుంది. ముఖ్యంగా తిన్న వెంటనే అస్సలు తాగకూడదు, కనీసం 2 గంటల గ్యాప్ ఇవ్వాలి. లేదంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే లిమిట్లో తాగడం బెటర్.
పిస్తాపప్పుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిస్తాపప్పు రోగనిరోధక శక్తిని పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించి గుండె సమస్యలను దూరం చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుంది.
చలికాలంలో చిలగడదుంప తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. చలికాలంలో వచ్చే అలసటను తగ్గించి శక్తిని అందిస్తుంది. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె జబ్బులను దూరం చేస్తుంది.
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో పసుపుతో పాటు తేనె, అల్లం, నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అర్థరైటిస్, మధుమేహం, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతాయి. మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది. పసుపులోని యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి.
చలికాలం ఉదయాన్నే మంచుతో తడిసిన గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా? లేవగానే ఫోన్ చూడటం మానేసి.. ఓ 15 నిమిషాలు ఈ గడ్డిపై నడవండి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. బీపీ, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాదాలు భూమికి తగలడం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. నిద్ర కూడా బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటుతో ఆరోగ్యం మీ సొంతం.
✦ కలబంద: చర్మ-కేశ సంరక్షణ, ఎయిర్ ప్యూరిఫయర్✦ తులసి: ఇమ్యూనిటీ బూస్టర్, దగ్గు, జలుబు నివారిణి✦ అశ్వగంధ: ఒత్తిడి, ఆందోళనల నివారిణి, ఇమ్యూనిటీ & స్మెర్మ్ బూస్టర్✦ స్నేక్ ప్లాంట్: గాలిని శుద్ధి చేస్తుంది, రాత్రిళ్లలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది✦ తిప్పతీగ: ఇమ్యూనిటీ బూస్టర్, శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది.
మెరుగై ఆరోగ్యం కోసం కంటికి సరిపడా నిద్ర ఎంతో అవసరం. అయితే చాలామంది ఉద్యోగ అవసరాలు, వినోదం, ఇతర పనుల్లో పడి సరిగా నిద్రపోవట్లేదు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని, ఫలితంగా స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వీకెండ్స్లో కనీసం ఓ 2 గంటలు అదనంగా పడుకోవాలని, అప్పుడప్పుడు లేటుగా లేవడం మంచిదేనని సూచిస్తున్నారు.
ఆర్థికపరమైన ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే మీ బడ్జెట్ను ఇలా విభజించుకోండి.సంపాదనలో 50 శాతం – అవసరాల కోసం: ఆహారం, ఇంటి రెంట్ లాంటివి30 శాతం – కోరికల కోసం: కొత్త కారు, విహారం లాంటివి20 శాతం – లక్ష్యాల కోసం: పొదుపు, మదుపు, ఆస్తుల కొనుగోలు లాంటివి
వాకింగ్ రకాల్లో బ్రిస్క్ వాకింగ్ ఒకటి. ఇందులో సాధారణం కంటే ఎక్కువ వేగంతో నడుస్తూ చేతులను ఆడించాల్సి ఉంటుంది. నిమిషానికి 100 స్టెప్పులు లేదంటే 7.24 కి.మీ నడవాలి. దీనివల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ కెలోరీలు బర్న్ అయి బరువు తగ్గుతారని, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని చెప్పారు. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయని అన్నారు.
స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లను అతిగా చూడటం వల్ల కంటిచూపుపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ’20-20-20 ఫార్ములా’తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు విరామం తీసుకుని, 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్లపాటు చూడాలి. దీంతో కళ్లపై ఒత్తిడి తగ్గి, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
✦ రోజూ పరగడపు గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి✦ యోగా, సైక్లింగ్, మార్నింగ్ వాక్ చేయాలి✦ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, కాఫీ, టీకి గుడ్ బై చెప్పాలి✦ ఫైబర్ ఎక్కువగా ఉండే నారింజ, అరటి, కర్బూజ పండ్లు తీసుకోవాలి✦ తిన్న తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నడవాలి➤ వారానికి 0.5-1 కిలో చొప్పున తగ్గడమే సురక్షితం.