వేసవిలో అధికంగా కూల్ డ్రింక్స్ తాగితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్కు ముందస్తు సంకేతంగా పరిగణించబడుతుంది. అధిక చక్కెర లివర్లో కొవ్వుగా మారి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను కలిగిస్తుంది. దంతాల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. సోడాలో ఉండే ఫాస్పారిక్, కార్భోనిక్ యాసిడ్లు దంతాల పైపొరను దెబ్బతీసి దంతాలు పుచ్చిపోవడానికి కారణమవుతాయి.
లంచ్ బాక్స్లో కూరగాయలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్లేట్లో సగం భాగం వండిన కూరగాయలు లేదా పచ్చని ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. పావు భాగం పప్పు, పనీర్ లేదా గుడ్డు వంటి ప్రోటీన్ ఆహారానికి కేటాయించాలి. మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ క్యారీలకే కడుపు నిండుతుంది. పోషకాలు సమృద్ధిగా అందుతాయి
సన్ఫ్లవర్ గింజలు కేవలం చిరుతిండి మాత్రమే కాదు, ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి అద్భుతమైన వరం. ప్రతిరోజూ గుప్పెడు గింజలను ఆహారంలో చేర్చుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే విటమిన్-E, సెలీనియం చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి సహజమైన మెరుపును ఇస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
రొమ్ము క్యాన్సర్ మహిళలకే వస్తుందనుకుంటే పొరపాటే. పురుషులు కూడా వస్తుందని HYDలోని ESIC మెడికల్ కాలేజీ విశ్లేషణలో వెలుగులోకి వచ్చింది. పురుషుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ల స్థాయిలు పెరగడం, కాలేయ సంబంధిత సమస్యలు, అధిక బరువు, జన్యుపరమైన కారణాలతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రొమ్ము భాగంలో గడ్డలు, చనుమొనలు లోపలికి వెళ్లడం, చర్మం రంగులో మార్పులు లక్షణాలు కనిపిస్తాయి.
చాలామంది ఉదయం బ్రేక్ ఫస్ట్ స్కిప్ చేస్తుంటారు. అలా చేయకుండా ఒక అరటిపండు, గ్లాస్ పాలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు అరటిపండు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
తమలపాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తమలపాకులను నీటిలో మరిగించి తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు దృఢపడతాయి. వీటిలోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మ అలర్జీలను, దురదలను నయం చేస్తాయి. గాయాలపై వీటి రసం రాసి కట్టుకడితే త్వరగా మానుతాయి. భోజనం తర్వాత వీటిని నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఖాళీ కడుపుతో గ్లాసు నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుంచి కోలుకుని జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కనీసం 10 నిమిషాలు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాసేపు ఎండలో గడపడం వల్ల విటమిన్-డి అందుతుంది. నానబెట్టిన బాదం లేదా పండ్లతో కూడిన ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఆ రోజంతా చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకుంటే బెటర్.
ఆంజనేయాసనం(లో లంజ్ పోజ్) తుంటి కీళ్లను సాగదీయడం, కాళ్ల కండరాలను బలపరచడంలో పనిచేస్తుంది. సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల బిగుసుకుపోయిన తుంటి కీళ్లను లోతుగా సాగదీసి, వాటి కదలికను మెరుగుపరుస్తుంది. వెన్నెముకను సాగదీసి, బలోపేతం చేయడం ద్వారా వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీని, భుజాలను వెడల్పు చేసి, మంచి శ్వాస సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం సులభమవుతుంది.
అడవికి రాజైన సింహం నిద్రిస్తుండగా ఒక ఎలుక దానిపై ఆడుకుంటూ నిద్రలేపింది. కోపంతో సింహం ఆ ఎలుకను చంపబోతుంటే.. ‘నన్ను వదిలేయండి, ఏదో ఒకరోజు మీకు సహాయం చేస్తాను’ అని ఎలుక వేడుకుంది. సింహం నవ్వి దానిని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. ఆ ఎలుక వచ్చి తన పదునైన పళ్లతో వలను కొరికి సింహాన్ని కాపాడింది. నీతి: మనం చేసే చిన్న మేలు వృధా పోదు.
మనం ఎంత ఎదిగినా చిన్ననాటి జ్ఞాపకాలు మరువలేనివి. అప్పట్లో లేత జామ ఆకులను తెంచి దాంట్లో చింతపండు, ఉప్పు కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. తెలిసి తెలియని వయసులో తిన్న ఆ పదార్థం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసేది. స్నేహితులతో 90’S కిడ్స్ చేసిన ఆ అల్లరిని, ఆ రుచిని ఆస్వాదించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరూ ఇలా చేశారా? కామెంట్ చేయండి.
మాయిశ్చరైజర్స్ మాదిరిగానే ఐస్ క్యూబ్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మచ్చలు, పొడిబారడం వంటి చర్మ సమస్యలను నివారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇందుకోసం పడుకునే ముందు ఐస్ క్యూబ్స్తో చర్మంపై స్క్రబ్ చేస్తే చాలు.. చర్మం ఉపశమనం పొందడంతో పాటు హైడ్రేటెడ్ అవుతుంది. అలాగే రక్తప్రసరణ పెరిగి మెరవడమే కాక టాన్ దూరమవుతుంది.
ప్రస్తుత తరం యువతలో చిన్న పనికే అలసిపోవడం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం చూస్తున్నాం. అయితే డిప్రెషన్తో ఉన్నవారిలో కణాలు అవసరానికి మించి శక్తిని ఉత్పత్తి చేస్తాయట. ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు అదనపు శక్తిని ఉత్పత్తి చేయడంలో ఈ కణాలు విఫలమవుతున్నాయట. ఈ వైరుధ్యం వల్లే యువతలో నిరంతర అలసట కనిపిస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చెప్పారు.
ముఖ్యంగా నిద్ర లేమితో మగవాళ్లకు.. ఆడవాళ్ల లక్షణాలు వస్తాయని వైద్యులు అంటున్నారు. మగవాళ్లలో రాత్రి పూట టెస్టోస్టెరాన్ లాంటి ‘లైంగిక’ హార్మోన్లు విడుదలవుతాయి. ఒకవేళ రాత్రి నిద్రలేకపోతే మగవాళ్ల శరీరంలో ఆడవాళ్లకు సంబంధించిన ఈస్ట్రడయాల్ (ఈ2) హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో తెలియకుండానే మగవాళ్లలో అడవాళ్ల లక్షణాలు వస్తాయి. ఆలోచనల తీరు మారుతుంది. ప్రవర్తనలో తేడా వస్తుంది.
ఫ్రిడ్జ్ ఒక విద్యుత్ పరికరం కాబట్టి, అగ్ని మూల అయిన ఆగ్నేయ దిశ దీనికి అత్యంత ఉత్తమమైన స్థానం. ఒక వేళ వంటగదిలో స్థలం తక్కువగా ఉంటే, నైరుతి మూలలో కూడా ఉంచుకోవచ్చు. ఈ దిశలో బరువైన ఉపకరణాలు ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈశాన్యం, ఉత్తర, లేదా తూర్పు దిశల్లో ఫ్రిడ్జ్ అస్సలు ఉంచరాదని హెచ్చరిస్తున్నారు.
ముక్కులో వేలు పెట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటుగా అనిపించినా.. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు నేరుగా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయట. ముక్కు లోపలి భాగం దెబ్బతినడంతోపాటు.. గాయాలు ఏర్పడుతాయని సూచించారు. మెదడుపై కూడా ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.