ప్రస్తుతం మారిన జీవన విధానంలో కళ్లు జీవం కోల్పోయినట్లు అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజులో కనీసం నాలుగైదు సార్లైనా కళ్లను చన్నీటితో కడగాలని నిపుణులు చెబుుతన్నారు. కళ్లకు తరచూ విశ్రాంతినివ్వాలి. సరిపడా నిద్ర లేకపోయినా కంటి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. నిద్రలేమి వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, గీతలు, ముడతలు ఏర్పడతాయి. నాణ్యమైన ఐ మేకప్ ఉత్పత్తులు వాడాలి.
వాము నీళ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాము నీళ్లు తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలో ఈ నీళ్లు సహాయపడుతాయి. జీర్ణక్రియ మెరుగుపడి.. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పంటి నొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన మాయమవుతుంది.
కలబంద చర్మానికి చలువ చేయడమే కాకుండా మొటిమల్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఒక స్పూన్ కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మొటిమల మచ్చలు తగ్గుతాయి. అలాగే కలబందలో చిటికెడు పసుపు కలిపి వాడితే బ్యాక్టీరియా నశించి చర్మం కాంతివంతంగా మారుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది సహజమైన ఔషధంలా పనిచేస్తుంది.
వేసవిలో రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు వంటివి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మజ్జిగ తీసుకుంటే శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. కందగడ్డ, చిలగడదుంప, చేమదుంప రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిమ్మరసం, సబ్జా నీళ్లు, గంజి, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు శరీరానికి చలవ చేస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా నడక తప్పనిసరి. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. రాత్రిపూట 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.
పైనాపిల్ పోషకాల నిధి. విటమిన్-C, యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ పండును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, గుండె ఆరోగ్యం మెరుగవుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే షుగర్ ఉన్నవారికి ఇది ప్రయోజనం కలిగించకపోగా హానీ చేస్తుందట. ఇందుకు పైనాపిల్లో సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటమే కారణంగా నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం మీద ధ్యాసతో నిద్రలేమితో బాధపడుతున్న ధృతరాష్ట్రుడికి విదురుడు ఇలా చెప్పాడు. ‘1. బలవంతుడితో శత్రుత్వం పెట్టుకున్నవాడు, సర్వస్వం కోల్పోయి ఆపదలో ఉన్నవాడు, ఇతరుల ఆస్తిని దొంగిలించాలనే బుద్ధి ఉన్నవాడు, మనసులో తీవ్ర కోరికలతో రగిలిపోయేవాడు.. ఈ నాలుగు పరిస్థితుల్లో ఉన్నవారికి మనశ్శాంతి ఉండదు, ఎప్పటికీ ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది’ అని విదుర నీతి సారాంశం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాల కారణంగా తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడతాయి. ముఖ్యంగా మహిళలకు రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి అంతా నీటిలో నానబెట్టి లేదా పాలతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
వడదెబ్బ నుంచి రక్షణనిచ్చే అమృతం గంజి. అన్నం ఉడికిన తర్వాత వార్చిన ఈ నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్ బారినుంచి కాపాడతాయి. వేసవిలో పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాదు ఇది అలసటను పోగొట్టి శరీరాన్ని చల్లబరుస్తుంది.
శరీరంలో తగినంత జిడ్డు ఉత్పత్తి కానప్పుడు చర్మం నిర్జీవంగా మారి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. దీనినే ‘డ్రై స్కిన్’ అంటారు. ఈ సమస్య పోవాలంటే సున్నితమైన క్లెన్సర్, తేమను నిలిపి ఉంచే మాయిశ్చరైజర్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల మీ చర్మం తాజాగా, తేమగా ఉంటుంది.
చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వండిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచితే లేదా ఫ్రిజ్లో పెట్టి మళ్లీ వేడి చేసినా, బ్యాక్టీరియా పెరుగుతుంది. సాల్మొనెల్లా, ఇ కోలై.. బ్యాక్టీరియా చికెన్లో త్వరగా వ్యాపిస్తాయి. శరీరంలోకి చేరినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కలిగిస్తాయి. ఫ్రిజ్లో బ్యాక్టీరియా పూర్తిగా చనిపోదు.. ఇవే ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతాయి.
బెల్లం నీటిని రోజూ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
నూనెలో కరివేపాకు వేసి మరిగించి, చల్లారాక క్రమం తప్పకుండా పిల్లల తలకు పట్టించాలి. ఐరన్, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారంతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. గాఢత గల షాంపూలు, అతిగా తలస్నానం చేయించడం తగ్గించాలి. బాదం నూనె, ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకుని రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లకు బాగా మర్దన చేసి ఉదయం తలస్నానం చేయించాలి.
ఎండల తీవ్రత పెరగడంతో శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం, జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలు తగ్గాలంటే నిత్యం పరగడుపున గ్లాసు కలబంద రసం తాగాలి. శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణక్రీయ మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. జట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలంగా మారుతాయి.
మనిషి ఆయుష్షు దేవుడి చేతిలో కాదు, అతని ప్రవర్తనపైనే ఉంటుందని విదురుడు చెప్పాడు. గర్వం(అహంకారం), అతిగా మాట్లాడటం, కోపం, స్వార్థం, మిత్రద్రోహం, లోభత్వం(పిసినారితనం). ఈ ఆరు లక్షణాలు కత్తుల వలె మనిషి ఆయుష్షును దారుణంగా కోసేస్తాయని విదురుడు హెచ్చరించాడు. వీటిని విడిచిపెడితేనే మనిషి పూర్ణాయుష్షుతో, ప్రశాంతంగా జీవిస్తాడని విదుర నీతి సారాంశం.