• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

ఎన్నో ప్రాముఖ్యతలు గల ‘సింధూరం’

హిందూ సంప్రదాయంలో వివాహిత స్త్రీలు నుదుటన అలంకరించుకునే సింధూరానికి చారిత్రక, సాంస్కృతిక, వైద్యపరమైన ప్రాముఖ్యతలున్నాయి. దీన్ని అదృష్టం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. సింధూ నాగరికత నుంచే ఈ సంప్రదాయం ఉంది. నుదుటిపై ఆజ్ఞా చక్రం అనే నాడీ మండల కేంద్రంలో దిద్దే ఈ సింధూరం మహిళల్లో ఏకాగ్రతను పెంచి, భావోద్వేగాలను నియంత్రిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

May 8, 2025 / 08:22 AM IST

ఆరోగ్యమే మహాభాగ్యం

VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో శనివారం వీక్లీ మీటింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో స్థానిక బీసెంట్ స్కూల్ గ్రౌండ్‌లో సభ్యులు అందరు ఫీజికల్ ఫిటినెస్‌తో ఉండాలని జాగింగ్, రన్నింగ్ లాంటివి పీటీ మాస్టారు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రెసిడెంట్ నాగేశ్వరావు, సెక్రటరీ శంకర్ రెడ్డి తెలిపారు.

May 3, 2025 / 04:53 PM IST

సగ్గు బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు

సగ్గు బియ్యంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో సగ్గు బియ్యం జావ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. సగ్గు బియ్యం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. మలబద్ధకం, జలుబు, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి.

May 3, 2025 / 11:26 AM IST

వాటర్ యాపిల్స్ తింటే ఇన్ని లాభాలా..?

వాటర్ యాపిల్.. దీన్నే రోజ్ యాపిల్, వ్యాక్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇవి కేవలం విదేశాల నుంచి మాత్రమే దిగుమతి అయ్యేవి కానీ.. ఇప్పుడు మన దగ్గర కూడా పండిస్తున్నారు. దీనిలో 90శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. మల బద్ధకం సమస్యను తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ ప్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తుంది.

May 2, 2025 / 08:27 PM IST

అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారు?

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం హిందూ సంప్రదాయంలో శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించే పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. “అక్షయ” అనే పదం “ఎన్నటికీ క్షీణించని” అని అర్థం, కాబట్టి ఆ రోజు కొన్న బంగారం శాశ్వత లాభాన్ని ఇస్తుందని భావిస్తారు. అంతేకాక, ఆ రోజు ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కూడా చెబుతారు.

April 29, 2025 / 03:24 PM IST

నేరేడు బంధ గిరిజన గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి

Akp: రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ నేరేడుబంద పీవీటీజీ గిరిజన గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. గ్రామంలో 14 కుటుంబాలు జీవిస్తుండగా మూడు రోజుల నుంచి జ్వరాలతో 13 మంది చిన్నారులు బాధపడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.గోవిందరావు తెలిపారు. తక్షణమే గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

April 24, 2025 / 11:00 AM IST

వీటితో ఈ సమస్యలకు చెక్

సమయానికి తినకపోవటం, పోషకాహార లోపం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మనం తీసుకునే కొన్ని ఆహారాలు ఆ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పికి అరటిపండు, మలబద్ధకం-బొప్పాయి, యాపిల్ తీసుకోవాలి. వికారం, వాంతులు- అల్లం, హైబీపీ-బీట్ రూట్, కీళ్లనొప్పి- అనాస, డీహైడ్రేషన్-తర్బూజ, నిద్రలేమి-చెర్రీలు, కండరాల అలసటకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి.

April 15, 2025 / 08:20 AM IST

చిన్న వయస్సులోనే కిడ్నీలు పోవడం బాధాకరం: గోపాల్ ఉర్లాన

SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన ఓ చిన్నారి చిన్నతనంలోనే రెండు కిడ్నీలు పోవడం బాధాకరమని నందన్ కృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు గోపాల్ ఉర్లాన తెలిపారు. ఆయన గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తోటి విద్యార్థులు ఆ పిల్లవాడిని ఆదుకున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.

April 10, 2025 / 10:31 AM IST

నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం

మార్చి 30వ తేదీని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇడ్లీ మొదట ఇండోనేషియాలో పులియబెట్టిన ఆహారంగా ఉద్భవించింది. ఇది క్రీస్తుశకం 800-1200లో భారతదేశానికి వచ్చింది. కాలక్రమేణా ఇడ్లీ దక్షిణ భారతదేశ ప్రధాన వంటకంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇడ్లీలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది.

March 30, 2025 / 02:18 AM IST

ఖర్జూరంతో బోలెడు ప్రయోజనాలు

ఖర్జూరం తినడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, పలు రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

March 19, 2025 / 11:30 AM IST

పెరుగు తింటున్నారా..?

పెరుగు తింటే జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుందని.. ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక.. వారానికి రెండు, అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి కుడివైపున వచ్చే పెద్ద పేగు క్యాన్సర్‌.. ముప్పు తగ్గుతున్నట్టు వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్‌ కన్నా కుడి వైపు క్యాన్సర్‌ తీవ్రమైంది కావటం గమనార్హం.

February 20, 2025 / 08:28 PM IST

టూత్ పేస్టు ఎక్కువగా వాడుతున్నారా..?

ఎక్కువ టూత్ పెస్ట్ పెట్టుకుని పళ్లు తోమితే నోరు, దంతాలు మరింత శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ పేస్టు అధికంగా వాడితే.. రోగాల బారిన పడుతారని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ఉపయోగిస్తే దంతాలపై క్యావిటీస్ ఏర్పడుతాయి. పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చిగుళ్ల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

February 17, 2025 / 08:26 PM IST

నేటి నుంచి పాఠశాల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు

SRD: పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈనెల 17 నుంచి మార్చి 15వ తేదీ వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం తెలిపారు. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్ జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని ఆమె చెప్పారు.

February 17, 2025 / 07:46 AM IST

విభిన్న ప్రతిభావంతులను గుర్తించాలి

SKLM: గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి విభిన్న ప్రతిభా వంతులను గుర్తించాలని నరసన్నపేట జూనియర్ సివిల్‌ న్యాయాధికారి సీహెచ్‌. హరిప్రియ అన్నారు. ఉర్లం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

February 11, 2025 / 06:50 AM IST

గోంగూరతో ఉపయోగాలెన్నో..!

గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ C, A, B6, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంతోపాటు ఎముకలను ధృఢంగా ఉంచుతాయి. హైబీపీ, ఆయాసం, దగ్గు, కళ్ల సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా గోంగూర తినడం వల్ల రక్త హీనత, మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

February 3, 2025 / 11:27 AM IST