రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవడం, పరుగెత్తడం లేదా యోగా చేయడం లాంటివి చేయాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలి. ప్రతిరోజు 7-8 గంటలు నిద్రపోవాలి. రాత్రి పడుకునే ముందు ఫోన్ లేదా TV చూడటం మానేయాలి. ధ్యానం, ధీర్ఘ శ్వాస వ్యాయామాలు చేయాలి. మ్యూజిక్ వినోదం, పుస్తకాలు చదవడం, నచ్చిన పనులు చేయాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కాస్త సమయం గడపాలి.
రోజూ ఉదయం కేవలం 5 నిమిషాలు జంపింగ్ జాక్స్ వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఇలా చేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. గుండె సంబంధింత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. ఒత్తిడి తగ్గి మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఎవరితోనైనా వాదించడానికి ముందు మీకు మీరు ఓ ప్రశ్న వేసుకోండి. ప్రతి విషయంలోనూ విభిన్న కోణాలుంటాయనే భావనను అర్థం చేసుకునేంత పరిపక్వత ఈ వ్యక్తికి ఉందా? అని ప్రశ్నించుకోండి. అది లేనివారితో జరిపే వాదనలు ఘర్షణకు దారితీయడమే తప్ప అక్కడ ఎలాంటి అర్థవంతమైన చర్చకు ఆస్కారం ఉండదని తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడం వల్ల మీ సమయం, శక్తి వృథా కావు.
బెల్లం టీని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్ధకం తగ్గుతుంది. తిన్న ఆహారం సుభంగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. దగ్గు, జలుబు తగ్గుతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వర్షాకాలం సీజన్ కావడంతో జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ప్రగతి ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు డాక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు రక్త పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
నల్ల జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు C, A, B, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. జుట్టు, చర్మ సమస్యలను నివారిస్తాయి.
ఉల్లికాడలలో విటమిన్ C, B2 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు ఉల్లికాడలతో కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరవు. ఎముకలు దృఢంగా మారుతాయి. అంటువ్యాధులు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.
అవకాడో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు అవకాడోలో విటమిన్ K, రాగి, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
మీ చుట్టూ మీకన్నా ఉన్నత లక్ష్యాలున్నవారే ఉండేలా చూసుకోండి. ఆశయాన్ని సాధించాలన్న తపన ఓ మంచి వైరస్ లాంటిది. అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ, కొండను సైతం ఢీకొట్టగలమన్న ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. ఏ ఆశయమూ లేనివారితో, పెద్ద లక్ష్యాలపై గురిపెట్టడానికి భయపడేవారితో గడుపుతుంటే మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వసం సన్నగిల్లుతుంది. దీనివల్ల సవాళ్లను స్వీకరించడానికి సిద్ధపడరు.
నల్ల టమాటాల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు కంటి చూపు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది.
మనం సంపూర్ణ మానవుడిగా ఉండాల్సిన పనిలేదు. అయితే ఎటువంటి పరిస్థితులెదురైనా స్థిరంగా, ఓపిగ్గా ఉండడం అవసరం. ఈ క్రమంలో కొన్ని రోజులు మనకు ప్రతికూలంగా సాగొచ్చు. జీవితం అంటే ఇదే. అభివృద్ధి అనేది సాఫీగా ఉండదు. ప్రతికూలతల్లోనూ నువ్వు ముందుకుసాగుతుంటే అభ్యున్నతి దానంతట అదే వస్తుంది.
వాటర్ యాపిల్స్ పండ్లలో అధిక నీటి శాతం, విటమిన్ C వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు వీటిని తింటే మంచిది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
అధిక రక్తపోటు, ఒత్తిడి అనేవి అతిపెద్ద ఆరోగ్య సమస్యలుగా పరిణమించాయి. అయితే, వాటిని నియంత్రించడానికి రెండు రకాల పండ్లు తినాలి. అవేంటంటే, అవకాడో, అరటి.. వాటిలో పొటాషియం, బి6 విటమిన్, ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటాయి. అవి సెరొటొనిన్ రసాయనాన్ని విడుదల చేసి మెదడును స్థిమితపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వ్యాయామాలు చేయడం కష్టం కాదు.. డుమ్మా కొట్టకుండా జిమ్కు వెళ్లడమే కష్టమైన పని. పరీక్షలంటే భయమనేది నిజం కాదు.. ఫోన్ పక్కన పెట్టి పుస్తకం తెరవడానికి ఇష్టం లేదన్నదే వాస్తవం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం లేకపోవడం కారణం కాదు.. అవసరమైన వ్యాపకాలను త్వజించాలన్న సంకల్పం లేకపోవడమే అసలు సమస్య. ఈ ప్రపంచంలో ఏ పనీ కష్టమైనది కాదు.. పనిని మొదలుపెట్టగలగడమే చాలా మందికి కష్టం.
నిరాడంబరత అనేది జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం. ఈ లక్షణం అలవరచుకున్నవారికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎవరితోనూ పోట్లాడాల్సిన పనిలేదు. అలాగే.. అసూయ, వేధింపులు, దొంగతనాలు వంటి నేరాలకు దూరంగా ఉండవచ్చు. సంపదను, అధికారాన్ని, పేరు ప్రతిష్ఠలను కోరుకోకపోవడం వల్ల సమాజంలో చాలా నేరాలను అరికట్టవచ్చు. నిరాడంబరత మనిషిని శాంతియుతంగా, సంతోషంగా జీవించేలా చేస్తుంది.