పెరుగు, చక్కెర కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు కలిపి తింటే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాదు ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ రెండు కలిపి తింటే ఆ పని విజయవంతం అవుతుందని పెద్దలు చెబుతుంటారు.
అకస్మాత్తుగా బరువు తగ్గటం, ఉన్నట్టుండి జుట్టు ఎక్కువగా రాలడం, మూత్రం, మలంలో రక్తం పడటం, తరుచూ కడుపుబ్బరం, పొట్ట నొప్పి రావడం వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. అలాగే మహిళల్లో వెజైనల్ డిశ్చార్ తెలుపు రంగు కాకుండా వేరే రంగులో దుర్వాసనతో రావడం, నెలసరి సమయంలో రక్తం గడ్డలాగా పడితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పైనాపిల్ జ్యూస్లో విటమిన్ సి, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు, బ్రోమెలైన్ వంటి ఎంజైమ్లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులను దూరం చేస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. కంటి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలను బలంగా మారుస్తుంది.
వేరుశనగల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎముకలు బలంగా మారుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి అందుతుంది.
చలికాలంలో రోజూ మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే నీరసం, అలసట, బద్ధకం తగ్గి యాక్టీవ్గా ఉండేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది.
చలికాలంలో చాలామంది తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతారు. అయితే కొన్ని సూప్లతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మొక్కజొన్న సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని పోషకాలు వ్యాధులతో పోరాడేలా చేస్తాయి. ఏవైనా మూడు రకాల పప్పు ధాన్యాలతో చేసిన సూప్ తాగితే జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ కలుగుతుంది. అలాగే అల్లం సూప్, చికెన్, మటన్ సూప్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతిరోజు గుప్పెడు నట్స్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండె జబ్బులు దరిచేరవు. క్యాన్సర్ వంటి వ్యాధులు తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
డైనింగ్ టేబుల్ మీద కంటే నేలపై కూర్చొని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేలపై కూర్చొని తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. కండరాలు దృఢంగా మారుతాయి. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి నేలపై కూర్చొని తింటే వారి మధ్య బంధం మరింత బలపడుతుంది.
ఉదయం లేవగానే పిల్లలతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగించాలి. కావాలంటే అందులో టీస్పూన్ తేనె, నిమ్మరసం యాడ్ చేయొచ్చు. రాత్రి నీటిలో నానబెట్టిన 4-5 ఎండుద్రాక్షలను పరగడుపున తినిపించాలి. రోజూ వ్యాయామాలు చేయించాలి. గోరువెచ్చని పాలలో అరటీస్పూన్ ఆవు నెయ్యి కల్పి రాత్రి పడుకునే ముందు వారితో తాగించాలి. స్ట్రాబెర్రీ, అవకాడో, ఓట్స్, యాపిల్స్ వంటి పండ్లను తినిపించాలి.
రోజుకు ఒకటి లేదా రెండు సార్లు సబ్జా గింజలను తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. శరీర వేడిని తగ్గిస్తాయి. బరువును, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతాయి. అయితే సబ్జా గింజలను అధికంగా తీసుకుంటే విరేచనాలు, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
కుడి చేతితో చేసే పనులను ఎడమ చేతితో చేయడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని కాలిఫోర్నియా వర్సిటీ అధ్యయనం చెబుతోంది. దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇలాంటి చిన్న సవాళ్లు మెదడులో కొత్త నాడీ సంబంధాలను ఏర్పరుస్తాయి. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజూ చేసే బ్రషింగ్ను ఎడమ చేతితో చేయడం వల్ల మొదడుకు కొత్త సవాళ్లు ఎదురై యాక్టివ్గా మారుతుంది.
ప్రతి రోజూ 5 నిమిషాలు నవ్వితే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా నవ్వడం వల్ల మన శరీరంలో ‘ఎండార్ఫిన్స్’ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజంగా నొప్పి నివారిణిగా పనిచేస్తాయి.
వెల్లుల్లిలో ఉండే సల్పర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం 3, 4 వెల్లుల్లి రెబ్బలను ఖాళీ కడుపుతో తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి వైరస్ వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. దగ్గు, జ్వరం, జలుబును అరికడుతుంది.
క్యారెట్లు కంటి చూపునకు మంచివని నిపుణులు చెబుతున్నా.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యారెట్లు తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు క్యారెట్లు తినకుండా ఉంటే మంచిది. క్యారెట్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కడుపుకు మంచిదే. అయితే, ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం ఏర్పడుతుంది.
చాలామంది వయసుకు, ఎత్తుకు సంబంధం లేకుండా బరువు పెరుగుతుంటారు. అయితే, అధిక బరువు వల్ల ఐదు రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 ఏళ్లు పైబడిన వారిలో థైరాయిడ్, గర్భాశయం, రొమ్ము, లుకేమియా, మూత్రపిండాల క్యాన్సర్లు పెరిగినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. యువతలో ఈ తరహా క్యాన్సర్లు పెరుగుతున్నట్లు తెలిసింది.