కొత్తిమీర జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం లేదా వాటి నీరు తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు రాకుండా పనిచేస్తుంది. కొత్తిమీరలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
‘టీ’ని తిరిగి వేడి చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. అదనంగా యాసిడ్లు పెరుగుతాయి. దీంతో కడుపుబ్బరం, కడపులో మంట వస్తుంది. టీ పెట్టి, కొద్దిసేపు అలా వదిలేశాక తాగితే దానిలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలూ ఎక్కువే. ఇది అజీర్తికే కాదు ఒక్కోసారి జీర్ణ సంబంధ సమస్యలకీ దారితీయొచ్చు. కాబట్టి.. టీ తాగేవారు అప్పటికప్పుడు చేసుకుని తాగండి. మిగిలితే పారబోయండి.
ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మానసిక రుగ్మతలను నయం చేయడంలో ప్రోత్సాహం ఇవ్వడమే దీని ఉద్దేశం. శారీరకంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఈ రోజు గుర్తు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని, ఇతరుల సమస్యలను అర్థం చేసుకుని సహాయం చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల రోజంతా మూడ్ పాడవుతుంది. అంతేకాదు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంటే మంచిది. లేచిన తర్వాత వాటర్ లేదా నిమ్మకాయ నీళ్లు తాగితే శరీరం నుంచి వ్యర్థాలు బయటకిపోతాయి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి.
ఓట్స్లో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరమవుతాయి. బరువు అదుపులో ఉంటుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటాయి.
ఉసిరిలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఉసిరి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం, జుట్టు సమస్యలు దూరమవుతాయి. బరువు అదుపులో ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు ఉసిరి రసంతో కూడా పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
మనకు తెలియకుండా మన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపే కొన్ని అంశాలు..1. ప్లాస్టిక్ పాత్రలు, గ్లాసులు2. రంగురంగుల డిష్వాషర్ పాడ్స్3. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలను తొలగించేందుకు ఉపయోగించే గ్లైడ్ ఫ్లాస్4. టెఫ్లాన్ పూతపూసిన వంటపాత్రలు5. ప్లాస్టిక్తో కూడిన జిగురు ఉత్పత్తులు
సబ్జా గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటిలో నానితే మెత్తని జెల్ లాంటి పదార్థంలా మారుతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సబ్జా గింజలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ గింజలు సహాయ పడుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుమ్మడికాయలో విటమిన్ A,C.. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజలతో ఎముకలు బలంగా మారుతాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో రాగిజావ తాగితే ఆరోగ్యానికి మంచిది. రాగి లోపల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి కూడా రాగిజావ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎముకల బలానికి చాలా అవసరం. ఉదయాన్నే తీసుకుంటే ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎముకలను కూడా బలపరుస్తుంది.
రాత్రి భోజనంలో చపాతీలు తినేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతీలలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట మన జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. చపాతీలు త్వరగా అరగకపోవచ్చు. చాలా మంది చపాతీలు తిన్న తర్వాత జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా ఉబ్బరం వంటి ఇబ్బందులు పడుతుంటారు. కావున నిద్రకు కనీసం రెండు గంటల ముందు చపాతీలు తింటే మంచిది.
ఒత్తిడి పరిష్కార మార్గాలనేకం.. వాటిలో సమయాన్ని, ధనాన్ని తెలివిగా ఉపయోగించడం ఒకటి. ఈ పద్ధతి 90 శాతం ప్రజల ఒత్తిడిని దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. సమయం, ధనం రెండూ చాలా విలువైనవి. వాటి విషయంలో పొదుపుగా ఉండాలి. డబ్బును పెట్టుబడి పెడితే రాబడులొస్తాయి. కాలాన్ని పెట్టుబడిగా పెట్టేవాళ్లు గొప్పవారిగా ఎదుగుతారు.
రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి.
చాలా మంది ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేస్తారు, లేదా అసలికే మానేస్తారు. ఇలా చేయడం ఆరోగ్యంతోపాటు ఆయుష్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. రోజూ ఆలస్యంగా తినడం వల్ల హర్మోన్ల రిథమ్ దెబ్బతింటుందని, అలాగే నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాయి. రోజుకో సమయంలో చేస్తే జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నాయి.
✦ అధిక చెక్కర తీసుకోవడం✦ అస్తవ్యస్త ఆహార వేళలు✦ అతిగా శుద్ధి చేసిన ఆహారం✦ రోజూ ఒకే సమయానికి నిద్రపోకపోవడం✦ మద్య, ధూమపానం✦ ఒత్తిడిఈ అనారోగ్యకర జీవనశైలిని మార్చుకుంటేనే ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలం.