నేరేడు, రేగు, మామిడి, పిచ్ వంటి ‘స్టోన్ ఫ్రూట్స్’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఎ, పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
మధ్యాహ్నం ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం మానసిక, శారీరక అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇటీవల చాలామంది కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగాలి. పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తీసుకోవాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని పరగడుపున తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి, కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సబ్జా గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటిలో నానితే మెత్తని జెల్ లాంటి పదార్థంలా మారుతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉండట వల్ల వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ గింజలు సహాయ పడటంతో పాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
ప్రస్తుత కాలంలో చాలా మంది టిఫిన్ చేయడం మానేస్తున్నారు. వర్క్ బిజీ, బరువు తగ్గాలని టిఫిన్ మానేస్తారు. కానీ దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదముంది. అలాగే జీర్ణక్రియ మందగించి.. త్వరగా బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. ఇది శారీరక ఆరోగ్యంపైనే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా చాలా చెడు ప్రభావం చూపిస్తుంది.
మనం నేర్చుకున్నవాటిని అన్నిసార్లూ కొలమానాలతో నిర్దిష్టంగా కొలవడం సాధ్యం కాదు. అనుభవం ద్వారా నేర్చుకున్న అంశాలు బయటకు కనిపించకపోవచ్చు. కానీ, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను ఎదుర్కోవడం వంటివాటిలో అవి కూడా మీకు తెలియకుండానే దోహదపడతాయి. నిన్నటితో పోలిస్తే నేడు పరిస్థితులను మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతున్నారంటే.. మీరు క్రమంగా నేర్చుకుంటున్నట్లే.
భుజపీడాసనం అనేది చేతుల బలాన్ని, శరీరం యొక్క సమతుల్యతను పెంచే అధునాతన యోగాసనం. ఈ ఆసనంలో శరీరం మొత్తం బరువును చేతులపైనే మోయాల్సి ఉంటుంది. చేతులు, మణికట్టు, భుజాలు దృఢంగా మారతాయి. పొత్తికడుపు కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు కరిగి ఉదర కండరాలు బలపడతాయి. ఉదర భాగంపై పడే ఒత్తిడి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర లేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల మెదడులో ఒత్తిడిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది దీర్ఘకాలంలో డిప్రెషన్, యాంగ్జైటీకి దారితీస్తుంది. రాత్రి పూట స్క్రీన్ టైమ్ తగ్గించి, సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
రోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) వల్ల గుండె జబ్బుల ముప్పు 30 శాతం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. నడక వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. గుండె కండరాలు బలంగా మారతాయి. ఎటువంటి ఖర్చు లేని ఈ చిన్న అలవాటుతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు. అందుకే వాకింగ్ అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి నేరేడు గింజల పొడి వరప్రసాదం. ఇందులో జాంబోలిన్, జాంబోసిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పిండిపదార్థాలు చక్కెరగా మారే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కడుపులో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
బ్లడ్ క్యాన్సర్లో ఎక్కువగా కనిపించే లక్షణాల్లో నిరంతర అలసట. రెస్ట్ తీసుకున్నా శరీరం బలహీనంగా అనిపించడం. తరచూ జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం, రాత్రి సమయంలో ఎక్కువగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం. తరచూ ఇన్ఫెక్షన్లు రావడం బ్లడ్ క్యాన్సర్కు ముఖ్యమైన సంకేతం. ఈ వ్యాధి వల్ల శరీరంలోని తెల్ల రక్తకణాల పనితీరు దెబ్బతింటుంది.
చాలామంది బరువు తగ్గడానికి, ఫిట్నెస్ కోసం పరగడుపున నిమ్మరసం తాగుతారు. అయితే, ఖాళీ కడుపుతో తాగితే అందరికీ మేలు జరగకపోగా, కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎసిడిటీ సమస్య ఎక్కువ అవుతుంది. కొందరి జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు తాగినప్పుడు పొట్టలో మలిపెట్టినట్లు ఉండటం, తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి వంటి అసౌకర్యాలు ఎదురవుతాయి.
వృశ్చికాసనం (స్కార్పియన్ పోజ్) యోగాలో అధునాతనమైన భంగిమ. శరీరాన్ని తేలు ఆకృతిలో మలిచి చేసే ఈ ఆసనం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంపై పూర్తి నియంత్రణ సాధించడంలో, బ్యాలెన్స్ మెరుగుపర్చడంలో పనిచేస్తుంది. భుజాలు, వెన్నెముక, తుంటి భాగాలను సాగదీస్తుంది. కండరాల దృఢత్వం తగ్గి వశ్యత పెరుగుతుంది. మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది. ఏకాగ్రత, మానసిక స్పష్టత పెరుగుతాయి.
ఎండ వేడిమి వల్ల డీహైడ్రేషన్, కడుపులో మంట వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో చల్లని పానీయం తాగాలి. అలాంటి పానీయాలలో సోంపు-బెల్లం షర్బత్ ఒకటి. ఇందులో సహజంగా శరీరాన్ని చల్లబరిచే గుణాలు అధికంగా ఉంటాయి. వేసవిలో వచ్చే కడుపులో మంట సమస్యలను సోంపుతో చేసిన పానీయాలు తాగితే ఉపశమనం పొందొచ్చు. ఇంకా పుదీనా, పటిక బెల్లం, నిమ్మరసం వంటి వాటిని కూడా ఇందులో వేసుకుంటే మంచిది.
ఈ రోజు ఏం చేయాలి అని కాదు, ఏ సమస్యలు పరిష్కరించాలి అని ఆలోచించండి. మీరు ఎన్ని ఎక్కువ సమస్యలను పరిష్కరిస్తారో, సమాజంలో అంత ఎక్కువ విలువను సృష్టిస్తారు. ఫలితంగా మీ వ్యక్తిగత విలువ, గుర్తింపు కూడా పెరుగుతాయి. సమస్యలను ఎదుర్కొని పరిష్కారం చూపడమే మీ ఎదుగుదలకు అసలైన బాట.