కొందరు బరువు తగ్గడానికి మధ్యాహ్న భోజనం లేదా డిన్నర్ మానేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గకపోగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ సేపు ఆకలితో ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. శరీరం కొవ్వును బర్న్ చేయడానికి బదులుగా నిల్వ చేస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా బరువు తగ్గిన మళ్లీ వేగంగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు.
మౌస్, కీబోర్డ్ నిరంతరం వాడేవారికి మణికట్టు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి గంటకోసారి చేతులను నిటారుగా సాగదీయాలి. మణికట్టును నెమ్మదిగా గుండ్రంగా తిప్పితే బెటర్. పని మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. అరచేతిని గట్టిగా మూసి మళ్లీ పూర్తిగా తెరవాలి. ఇది వేళ్లు, మణికట్టు కండరాలకు బలాన్నిస్తుంది. ఇలా చేయడం వల్ల నరాలు ఒత్తిడికి గురవ్వకుండా మణికట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
నువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, గుండె జబ్బులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఖర్జూర పండ్లలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక. ఎముకలు, దంతాల ధృఢత్వానికి, తక్షణ శక్తికి ఇవి తోడ్పడతాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి.
అరటిపండు ఆరోగ్యానికే కాదు, సహజ సౌందర్యానికి అద్భుత ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం చర్మాన్ని మృదువుగా మార్చి మెరుపును ఇస్తాయి. బాగా పండిన అరటి గుజ్జును ఫేస్ ప్యాక్గా వాడితే ముడతలు, మృతకణాలు తొలగిపోతాయి. ఇది సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తూ మొటిమల మచ్చలను తగ్గించి, ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.
భోజనం చేసిన వెంటనే మనం చేసే కొన్ని తప్పులు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. తిన్న వెంటనే స్నానం చేస్తే రక్తప్రసరణ మారి అజీర్తి కలుగుతుంది. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. టీ, కాఫీలు తాగితే పోషకాలు అందవు. అతిగా నీళ్లు తాగడం వల్ల జీర్ణరసాలు పలచబడతాయి. పండ్లు తింటే కడుపు ఉబ్బరం కలుగుతుంది. ధూమపానం చేస్తే తీవ్ర అనారోగ్యం కలుగుతాయి.
చిన్నారుల్లో ఎనిమిది ఏళ్లలోపే శీఘ్ర రజస్వల లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రొమ్ముల పెరుగుదల, అకస్మాత్తుగా ఎత్తు పెరగడం, ముఖంపై మొటిమలు, శరీర వాసన మారడం వంటివి దీనికి ముఖ్య సంకేతాలు. జంక్ ఫుడ్, జీవనశైలి మార్పులే ఇందుకు ప్రధాన కారణం. పౌష్టికాహారం అందిస్తూ, ఇలాంటి మార్పులు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్నప్పటి నుంచే పిల్లలను చెప్పులు లేకుండా నేలపై, పచ్చగడ్డిపై నడిపించడం కంటి ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. ఇలా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి కలిగి కళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది. పచ్చదనాన్ని చూడటం వల్ల కంటి కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ అలవాటు వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత, మంచి నిద్ర కూడా లభిస్తాయి.
చర్మ సౌందర్యం కోసం 4-2-4 రూల్ ఒక అద్భుతమైన క్లెన్సింగ్ పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. 4 నిమిషాల పాటు ఆయిల్ క్లెన్సర్తో ముఖాన్ని మర్దన చేయాలి. ఇది తేమను అందిస్తుంది. ఆ తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్తో 2 నిమిషాలు మర్దన చేసి జిడ్డు, మలినాలను తొలగించాలి. అనంతరం ముందుగా 2 నిమిషాలు గోరువెచ్చని నీటితో, తర్వాత 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీరా వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గుతారు. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, మెటబాలిజాన్ని పెంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించడమే కాకుండా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి తోడ్పడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
‘ఓ రాజా!.. క్షమ ఒక్కటే పరమ ధర్మం, శాంతికి మించిన సుఖం లేదు, విద్యే నిజమైన తృప్తి, అహింస ఒక్కటే ఆనందం. ఈ నాలుగింటిని కలిగిన వాడు ఇహపరలోకాల్లో శాంతిని పొందుతాడు. తనని తాను నిగ్రహించుకునేవాడు మాత్రమే ఇతరులను నడిపించగలడు. కోపాన్ని, అహంకారాన్ని వదిలి ధర్మ మార్గంలో నడవడమే మనిషికి అసలైన రక్షణ’ అని ధృతరాష్ట్రునికి విదురుడు బోధించారు.
పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్పై ఉన్నప్పటికీ ఎవరూ దానిని పట్టించుకోరు. అయితే, ఇది ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. పగుళ్లకు గురిచేస్తుంది. దీంతోపాటు ఎముకల నిర్మాణానికి కీలకమైన హార్మోన్లను దెబ్బతీస్తుంది. ధూమపానం ఎముకలను దృఢంగా ఉంచే పోషకాలను కోల్పోయేలా చేస్తుంది’ అని చెప్పారు.
తమలపాకు కేవలం పూజలకే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా నిలయం. భోజనం తర్వాత తమలపాకును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. తద్వారా గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది సహజసిద్ధమైన మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తూ నోటి దుర్వాసనను అరికడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల వ్యాధులను నివారిస్తాయి.
షుగర్, ఊబకాయం వంటి రోగాలు దరిచేరవద్దంటే కొన్ని అన్హెల్తీ ఫుడ్స్కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ‘వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటి పండి పదార్థాల వాడకం తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. స్వీట్లు, కేక్, చాక్లెట్లతో పాటు మద్యానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లు, చిప్స్ తినొద్దు’ అని చెప్పారు.
మనం ఆహారంలో రుచి కోసం వాడే ఉప్పును పరిమితం చేయాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు రావడం, ఎముకలు బలహీనపడటం జరుగుతుంది. ప్యాక్ చేసిన చిప్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్స్లో ఉప్పు మోతాదు అధికంగా ఉంటుంది. కాబట్టి, వాటికి దూరంగా ఉండాలి.