ఉల్లికాడలలో విటమిన్ C, B2 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు ఉల్లికాడలతో కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరవు. ఎముకలు దృఢంగా మారుతాయి. అంటువ్యాధులు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.
అవకాడో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు అవకాడోలో విటమిన్ K, రాగి, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
మీ చుట్టూ మీకన్నా ఉన్నత లక్ష్యాలున్నవారే ఉండేలా చూసుకోండి. ఆశయాన్ని సాధించాలన్న తపన ఓ మంచి వైరస్ లాంటిది. అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ, కొండను సైతం ఢీకొట్టగలమన్న ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. ఏ ఆశయమూ లేనివారితో, పెద్ద లక్ష్యాలపై గురిపెట్టడానికి భయపడేవారితో గడుపుతుంటే మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వసం సన్నగిల్లుతుంది. దీనివల్ల సవాళ్లను స్వీకరించడానికి సిద్ధపడరు.
నల్ల టమాటాల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు కంటి చూపు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది.
మనం సంపూర్ణ మానవుడిగా ఉండాల్సిన పనిలేదు. అయితే ఎటువంటి పరిస్థితులెదురైనా స్థిరంగా, ఓపిగ్గా ఉండడం అవసరం. ఈ క్రమంలో కొన్ని రోజులు మనకు ప్రతికూలంగా సాగొచ్చు. జీవితం అంటే ఇదే. అభివృద్ధి అనేది సాఫీగా ఉండదు. ప్రతికూలతల్లోనూ నువ్వు ముందుకుసాగుతుంటే అభ్యున్నతి దానంతట అదే వస్తుంది.
వాటర్ యాపిల్స్ పండ్లలో అధిక నీటి శాతం, విటమిన్ C వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు వీటిని తింటే మంచిది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
అధిక రక్తపోటు, ఒత్తిడి అనేవి అతిపెద్ద ఆరోగ్య సమస్యలుగా పరిణమించాయి. అయితే, వాటిని నియంత్రించడానికి రెండు రకాల పండ్లు తినాలి. అవేంటంటే, అవకాడో, అరటి.. వాటిలో పొటాషియం, బి6 విటమిన్, ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటాయి. అవి సెరొటొనిన్ రసాయనాన్ని విడుదల చేసి మెదడును స్థిమితపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వ్యాయామాలు చేయడం కష్టం కాదు.. డుమ్మా కొట్టకుండా జిమ్కు వెళ్లడమే కష్టమైన పని. పరీక్షలంటే భయమనేది నిజం కాదు.. ఫోన్ పక్కన పెట్టి పుస్తకం తెరవడానికి ఇష్టం లేదన్నదే వాస్తవం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం లేకపోవడం కారణం కాదు.. అవసరమైన వ్యాపకాలను త్వజించాలన్న సంకల్పం లేకపోవడమే అసలు సమస్య. ఈ ప్రపంచంలో ఏ పనీ కష్టమైనది కాదు.. పనిని మొదలుపెట్టగలగడమే చాలా మందికి కష్టం.
నిరాడంబరత అనేది జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం. ఈ లక్షణం అలవరచుకున్నవారికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎవరితోనూ పోట్లాడాల్సిన పనిలేదు. అలాగే.. అసూయ, వేధింపులు, దొంగతనాలు వంటి నేరాలకు దూరంగా ఉండవచ్చు. సంపదను, అధికారాన్ని, పేరు ప్రతిష్ఠలను కోరుకోకపోవడం వల్ల సమాజంలో చాలా నేరాలను అరికట్టవచ్చు. నిరాడంబరత మనిషిని శాంతియుతంగా, సంతోషంగా జీవించేలా చేస్తుంది.
క్యారెట్ జ్యూస్తో బోలెడు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ A, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ జ్యూస్ శరీరానికి మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త హీనత సమస్య తగ్గుతుంది.
పొదుపును అలవాటుగా చేసుకుంటే, మదుపు చేయడానికి అదే ఇంధనంగా మారుతుంది. క్రమం తప్పకుండా చేసే మదుపు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. అయితే ఎక్కువ డబ్బును కూడబెట్టడమే ఆర్థిక స్వేచ్ఛ అని ఆలోచించేవారు దాని కోసమే ఆరాటపడుతూ ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. డబ్బును అవసరాల కోసమే చూసేవారికే ఆర్థిక స్వేచ్ఛ సొంతమవుతుంది.
ఎండు చేపలను తరుచూ తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం. అలసట ఉండవు. మెదడులో వాపు తగ్గుతుందట. అంతేకాదు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు ఎండు చేపలను తింటే మంచిది. అయితే హైబీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు వీటిని తినాలని నిపుణులు చెబుతున్నారు.
క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణుడు డాక్టర్ సలీం జైదీ తెలిపారు. ఈ బిస్కెట్లలో పాలు లేదా క్రీమ్ ఉండవని.. వాటికి బదులుగా హైడ్రోజనేటెడ్ ఆయిల్, కృత్రిమ రుచులు, అధిక చక్కెర, సింథటిక్ రంగులను వాడతారని చెప్పారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, ఇన్సులిన్ నిరోధకత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్ జైదీ పేర్కొన్నారు.
పియర్ పండ్లను తరుచూ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాదు రక్తపోటు అదుపులో ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గుతాయి.
ఉదయం లేవగానే పురుషులకు అంగస్తంభన అనేది సాధారణం. ఇది మంచి ఆరోగ్యానికి సంకేతం. లైంగిక ప్రేరేపణ వల్ల కాకుండా.. పురుష పునరుత్పత్తి వ్యవస్థ సాధారణ విధుల వల్ల సంభవిస్తుంది. ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉదయాన్నే గరిష్టానికి చేరుకుంటాయి. దీంతో శారీరక ప్రేరణ లేకుండా అంగం గట్టిపడుతుంది. అయితే అంగస్తంభన గంటల తరబడి ఉన్నా.. అసలు లేకున్నా వైద్య నిపుణులను సంప్రదించండి.