నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన మెదడు సహజంగానే మనల్ని ఏ పనీ చేయనివ్వకుండా కట్టడి చేస్తుంది. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవడం, మానసిక కుంగుబాటుకు లోనవ్వడం వంటివి అప్రయత్నంగానే అలవాటుగా మారిపోతాయి. అందుకే మనసు ఎంత భారంగా ఉన్నా, మెదడుకు ఆ నిస్సహాయతను అలవాటు చేసుకోనివ్వకూడదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక చిన్న పని చేస్తూనే ఉండాలి
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే శరీరంలో అనేక సానుకూల మార్పులకు కారణమవుతుంది. బొప్పాయిలో సహజంగా ఉండే ఎంజైములు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. పేగులలో పేరుకుపోయిన మలాన్ని మృదువుగా చేసి బయటకు పంపేందుకు సహాయపడుతుంది. తరచుగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి సహజ పరిష్కారంగా చెప్పవచ్చు. ఉదయం తినే బొప్పాయి పేగుల పనితీరును క్రమంగా సరిచేస్తుంది.
చతురంగ దండాసనం వల్ల చేతులు, భుజాలు, వెన్ను, మణికట్టు, కోర్ కండరాలను బలపరుస్తుంది. శరీర స్థిరత్వాన్ని, ఓర్పును పెంచుతుంది. మానసిక ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. బహుళ కండరాల సమూహాలను నిమగ్నం చేయడం ద్వారా శరీరానికి టోనింగ్ ఇస్తుంది. జీర్ణవ్యవస్థను, మణిపుర చక్రాన్ని ప్రేరేపిస్తుంది. దీన్ని సరైన విధానంలో చేయడం ద్వారా గాయాలను నివారించవచ్చు. ఇది మొత్తం శరీరానికి సమతుల్య వ్యాయామం.
ప్రతి ఒక్కరికీ ఇష్టమైన స్నాక్ పాప్కార్న్. ఇవాళ అంతర్జాతీయ పాప్కార్న్ దినోత్సవం. సినిమా థియేటర్ల నుంచి ఇంట్లోని సోఫా వరకు పాప్కార్న్ లేని వినోదం అసంపూర్ణం. ఇది కేవలం రుచికరమే కాదు.. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ కలిగిన ఆరోగ్యకరమైన చిరుతిండి. వెన్న, ఉప్పు, కారం లేదా తీపి ఇలా ఏ రూపంలో ఉన్నా మనసుకు సంతోషాన్ని కలిగించే పదార్థం.
హ్యాంగోవర్ తగ్గాలంటే శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. మద్యం వల్ల కలిగే డీహైడ్రేషన్ను తగ్గించాలంటే.. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు ఎక్కువగా తీసుకోవాలి. అల్లం టీ తీసుకోవడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. అరటిపండు తినడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం అందుతుంది. తేలికపాటి ఆహారం తీసుకుంటూ.. తగినంత విశ్రాంతి తీసుకుంటే బాడీ యాక్టివ్ అవుతుంది.
ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కండరాలు, చర్మం, అవయవాల నిర్మాణానికి ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. మినపప్పు, ఇడ్లీ రవ్వ, బియ్యం రవ్వతో చేసే ఇడ్లీలు తేలికగా జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటాయి. చట్నీ, సాంబర్తో కలిపి రెండు ఇడ్లీలను తింటే 300 కేలరీలతోపాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది.
చలికాలంలో పాదాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కొద్దిగా ఓట్స్ తీసుకుని అందులో రోజ్ వాటర్ కలిపి మిశ్రమంలా చేసుకుని కాళ్లు, పాదాలపై అప్లై చేసి మర్దన చేయాలి. 30 నిమిషాల తర్వాత నీళ్లతో కడగాలి. పాదాలకు ఆరాకా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా వారానికి 3-5 సార్లు చేస్తే పాదాలు పొడిబారవు.
ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణసమస్యలు తలెత్తుతాయి. వీటిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి.. గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ రావొచ్చు. మెదడు పనితీరు దెబ్బతింటుంది.
ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణసమస్యలు తలెత్తుతాయి. వీటిలో కేలరీలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి.. గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ రావొచ్చు. మెదడు పనితీరు దెబ్బతింటుంది.
పక్కవారిని చూసి అసూయపడేవాడు, అందరినీ అసహ్యించుకునేవాడు, ఉన్నదానితో సంతృప్తి చెందనివాడు, చిన్నదానికి కోప్పడేవాడు, ప్రతిదానిని అనుమానించేవాడు, ఇతరుల సంపాదనపై ఆధారపడి బతికేవాడు.. ఈ ఆరుగురు జీవితంలో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. వీరికి మనశ్శాంతి అస్సలు ఉండదు. అందుకే ఆనందంగా జీవించాలంటే ఈ ఆరు దుర్గుణాలకు దూరంగా ఉండాలని విదురుడు స్పష్టం చేశాడు.
చలికాలంలో వాతావరణ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ సమయంలో చల్లటి నీరు తాగితే శరీరం లోపల ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావచ్చు. దీంతో జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం లోపలి ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉంటుంది. గోరువెచ్చని నీరు శరీరాన్ని చలికి అలవాటు పడేలా చేస్తుంది. జలుబు, గొంతు సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
పాదహస్తాసనం వేయడం వల్ల వెన్నెముక, హామ్ స్ట్రింగ్స్, పిక్కలు సాగదీసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మెదడును ప్రశాంతపరుస్తుంది. జీర్ణ అవయవాలను మసాజ్ చేసి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపడటం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా మారతాయి.
మాఘ మాసంలో వచ్చే మౌని అమావాస్య అత్యంత పవిత్రమైనది. ఈ రోజున సూర్యోదయానికి ముందే పుణ్యనదులలో స్నానమాచరించి, రోజంతా మౌన వ్రతం పాటించడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. పితృ దేవతలకు తర్పణాలు వదిలి, నువ్వులు, వస్త్రాలు దానం చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. విష్ణువు ఆరాధన చేయడం వల్ల దోషాలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.
మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్య అత్యంత పవిత్రమైనది. ఇవాళ సూర్యోదయానికి ముందే పుణ్యనదులలో స్నానమాచరించి మౌన వ్రతం పాటించడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది. పితృ దేవతలకు తర్పణాలు వదిలి, నువ్వులు, వస్త్రాలు దానం చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. విష్ణువు ఆరాధన చేయడం వల్ల దోషాలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది.
దానిమ్మ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. శరీరంలోని దీర్ఘకాలిక వాపులను తగ్గిస్తాయి. క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతాయి. కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

