BHPL: ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 10,116 విలువైన బీరువాను ఇవాళ బొల్లం అరుణ-భాస్కర్ దంపతులు బహుకరించారు. ఈ సందర్భంగా అర్చకులు ఎం. నరేష్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్, ఆలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
JGL: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కోరుట్లలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి కీ.శే.జువ్వాడి రత్నాకర్ రావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న KPL సీజన్ -6 టోర్నమెంట్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) బంజారాల దీక్షభూమి వద్ద ఆదివారం సంత్ ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో గురుకృప దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి లంబాడి-బంజారాలు భారీ ఎత్తున పూజల కోసం వస్తారు. ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భోగ్ భండార్ సమర్పిస్తారు. అఖిల భారత బంజారా సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు.
KNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్ 2025-26’ క్రీడల టార్చ్ రిలే హుజూరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా టౌన్ సీఐ కరుణాకర్, డీవైఎస్వో శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షులు సొల్లు సారయ్య, తదితరులు క్రీడాజ్యోతికి స్వాగతం పలికి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీస్తామన్నారు.
KMM: ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఆకాశాన్ని అంటాయి. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో స్కిన్లెస్ చికెన్ కేజీ రూ.302కి చేరుకోగా, కేజీ స్కిన్ చికెన్ ధర 265గా ఉంది. కాగా ఇప్పుడే ఈ స్థాయిలో చికెన్ ధరలు ఉంటే, సంక్రాంతికి ఇంకెంత పెరుగుతాయోనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MDCL: స్నాచింగ్ కేసును వారం రోజుల్లోనే ఛేదించి మేడిపల్లి పోలీసులు అభినందనలు అందుకున్నారు. ఈనెల 3న నారపల్లిలో రేణుక(60) మెడలోని 3 తులాల పుస్తెలతాడును దోచుకుని దొంగ పరారయ్యాడు. SHO గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బృందాలు 300 CC కెమెరాలను పరిశీలించి నేరస్థుడిని పట్టుకున్నారు.నిందితుడు భర్మావత్ నాగరాజు (38), DJ ఆపరేటర్గా గుర్తించారు.
BDK: చుంచుపల్లి మండలం సీపీఐ భవనంలో ‘మనం’ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను సీపీఐ మండల కార్యదర్శి, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి ముఖ్య అతిథిగా హాజరై శనివారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలు మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత సమస్యలను నిష్పక్షికంగా వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.
NLG: దాబా నిర్వహణ కంటే, డ్రగ్స్ అమ్మకం పైనే లాభాలు గడిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ దందా పోలీసులు చేదించగా పలు విషయాలు తెలుస్తున్నాయి. ‘ఓపీఎం పాపి హస్క్’ కిలో రూ.1800కు కొనుగోలు చేసి ట్రక్కు డ్రైవర్లకు ఆరువేలకు విక్రయిస్తున్నట్లు పట్టుబడ్డ దాబా నిర్వాహకుడు పోలీసులకు తెలిపాడు. నీటిలో కలుపుకుని డ్రైవర్లు దీనిని సేవిస్తారని నిందితుడు వివరించాడు.
MDK: పాపన్నపేట మండలం ఏడుపాయలలో ఆదివారం ప్రధానార్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్య మాసం కృష్ణపక్షం అష్టమి భాను వాసవి పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్, మటన్ ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ. 280కి చేరుకుంది. స్కిన్తో కూడిన చికెన్ కేజీ రూ. 260గా ఉంది. అలాగే కేజీ గొర్రె మాంసం రూ. 700గా ఉండగా, మేక మాంసం ధర రూ. 800 నుంచి రూ. 900 వరకు పలుకుతోందని మాంసం విక్రయదారులు తెలిపారు. ప్రాంతం బట్టి ధరల్లో కొద్దిగా తేడా ఉండవచ్చని వారు పేర్కొన్నారు.
MBNR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోమవారం మహబూబ్నగర్కు రానున్నట్లు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన పార్టీ మద్దతుదారులను కేటీఆర్ సన్మానించనున్నారు. ఈ మేరకు స్థానిక ఎంబీసీ గ్రౌండ్ లో నిర్వహించే సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పరిశీలించారు.
BDK: ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థి విజయం కోసం వార్డు కమిటీలను ప్రచారం చేయవలసిందిగా శనివారం ఆదేశించారు. ఈ సందర్భంగా నేడు 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వారిని గెలిపించుకోవడం కోసం వార్డు కమిటీ సభ్యులు ప్రచారం నిర్వహించడం జరిగింది.
KNR: బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న IELTS ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ చివరి తేదీ అని డైరెక్టర్ డా. రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తి చేసినవారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులన్నారు. ఆన్లైన్లో www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MLG: మేడారం జాతర సందర్భంగా అత్యవసర వైద్య సేవల కోసం 35 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గుండెపోటు, ప్రమాదాల వంటి సందర్భాల్లో గోల్డెన్ అవర్లో చికిత్స అందించి, అవసరమైతే రోగులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రి, ఎంజీఎం ఆసుపత్రికు 108 అంబులెన్సుల ద్వారా తరలిస్తామని, ఆసుపత్రుల్లో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు.