KMM: అటవీ వనరుల పరిరక్షణ ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు. జిల్లాలో చేపడుతున్న అటవీ అభివృద్ధి పనులపై జల సాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణతో చర్చించారు. పర్యావరణ పరిరక్షణకు శాఖ తీసుకుంటున్న చర్యలను సత్యనారాయణ అభినందించారు. అనంతరం జిల్లాలోని అటవీ కార్యక్రమాల పురోగతిపై ఇరువురు పలు అంశాలను పంచుకున్నారు.
MBNR: ఆదాయానికి మించి ఆస్తుల ఫిర్యాదుతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, మహబూబ్నగర్ సహా 12 ప్రాంతాల్లో ఏకకాల సోదాలు నిర్వహించగా, సుమారు రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
NRPT: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్రామీణ పేదల జీవనాధారమైన ఈ పథకాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
JGL: మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ను జిల్లా నూతన డీఎంహెచ్ ఆకుల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ జిల్లా ప్రజల ఆరోగ్య సేవల అభివృద్ధిపై వారితో చర్చించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ అమూల్యమైన సేవలు అందించాలన్నారు.
SRD: సిర్గాపూర్ మండలంలోని ముబారక్ పూర్ గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఖేడ్ ADA నూతన కుమార్ హాజరయ్యారు. యూరియా కొనుగోలు చేసే విధానంపై తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ స్లాట్ బుకింగ్ పట్ల అవగాహన కల్పించారు. ఇందులో ఏఈఓ శివకుమార్ రైతులు ఉన్నారు.
SDPT: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళశాలలో మెరుగైన ఫలితాలు సాధించాలని, ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పనిచేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్, సిబ్బందితో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
నల్గొండ జిల్లా చందంపేట మండలం గాగిల్లాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందగా, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. బుడ్డనితండాకు చెందిన లింగాల లక్ష్మయ్య కూతురితో కలిసి వెళ్తుండగా, వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన కూతురిని 108 అంబులెన్స్లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
KMM: ఖమ్మం రైల్వే పోలీసుల ఆపరేషన్ యాత్ర సురక్షలో భాగంగా చోరీ కేసును ఛేదించారు. రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను చాకచక్యంగా మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 22 లక్షల విలువైన 373 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 4.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
MDK: ఆయిల్ పామ్ సాగుతూ దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిని ఏం దీపిక సూచించారు. మండల పరిధిలోని మాల్పర్తి గ్రామంలోని శంకరయ్య వ్యవసాయ క్షేత్రంలో మొక్కల నాటి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు పంపిణీ చేస్తుందని తెలిపారు.
ADB: నేరడిగొండ మండలం లక్కంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన సుజాత, ఉప సర్పంచ్ పూజ, వార్డు సభ్యులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్తోనే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కుతాయని గజేందర్ అన్నారు.
NZB: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలోని ఓ హై స్కూల్ విద్యార్థులు రైతుల పొలాల్లో పాల్గొని వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వన్ డే కిసాన్ కార్యక్రమంలో భాగంగా 9,10వ తరగతి విద్యార్థులు మట్టయ్య ఫారం గ్రామానికి చెందిన రైతు దనరాజ్ పొలంలోనారు మోసి వరినాట్లు వేశారు. మండల వ్యవసాయ అధికారి నవీన్ సాగు పద్ధతులు, వరి రకాలు, రైతుల కష్టాలను వివరించారు.
NLG: ఆశా వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ. 18,000గా నిర్ణయించి అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం కట్టంగూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆసంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
HYD: మీర్పేటలో బీటెక్ విద్యార్థిని విహారిక (20) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ‘మనం ఒకరినొకరం సరిగ్గా అర్థం చేసుకోలేదు. భవిష్యత్తు ఫెయిల్ అయ్యింది. నేను వెళ్లిపోతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మనం ఒక దగ్గర ఉండలేం. ఇదే నా చివరి సంక్షిప్త సమాచారం, సారీ మైబాయ్..’ అంటూ చనిపోయే ముందు వాట్సప్ స్టేటస్ పెట్టి ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.
SRD: పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ శివరాం, ఉప సర్పంచ్ శ్రీను అన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండలంలోని రూప్లా తండా ప్రాథమిక పాఠశాలలో దాతలు అందజేసిన కంప్యూటర్ను స్థానిక హెచ్ఎం కు అందించారు.. పాఠశాల విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని గ్రామ విద్యావంతులు రవి తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కు హెచ్ఎం ధన్యవాదాలు తెలిపారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో చేపడుతున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గ్రామ సర్పంచ్ ద్యావన పెల్లి రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీమతి వనపర్తి సౌమ్య, గ్రామ సెక్రటరీ పాతర్ల నవీన్, వార్డు సభ్యులు మంగళవారం సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.