• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి

SRCL: వేములవాడ రూరల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో కరెంటు షాక్‌తో శనివారం ఎద్దు మృతి చెందింది. దుమాల దేవయ్య అనే రైతు ఎద్దులతో వ్యవసాయ పనులు ముగించుకొని, తిరిగి తన దొడ్డిలోకి ఎద్దులని తీసుకొస్తుండగా, రోడ్డుకు ఆనుకుని ఉన్న, కరెంటు స్తంభానికి వేలాడుతున్న కరెంటు తీగలు ఎద్దుకు తగిలడంతో, షాక్‌కు గురైన ఎద్దు మృతి చెందింది. దీంతో రైతు శోకసంద్రంలో మునిగపోయాడు.

January 17, 2026 / 09:35 PM IST

ముదిరాజ్ బాదును జిల్లాగా ప్రకటించాలని నిరాహార దీక్ష

KNR: హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు, తాజాగా నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పేరుతో నూతన జిల్లాను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అన్ని అర్హతలున్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆరోపించారు.

January 17, 2026 / 09:35 PM IST

వీధిదీపాలకు మరమ్మతులు

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ప్రధాన రహదారి వీధిదీపాలు 5 నెలల నుంచి వెలగడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం సర్పంచ్ బానోత్ కావేరి వీధిదీపాలు మరమ్మతులు చేపట్టారు. రాత్రి సమయాల్లో అంధకారంలో ఉన్న రాకపోకలకు వెలుగు చూపడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరలో పారిశుధ్య పనులు చేపట్టి అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు.

January 17, 2026 / 09:31 PM IST

గ్రామంలో మద్య నిషేధం

VKB: నవాబుపేట మండలం మినేపల్లి కలాన్ గ్రామంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. మద్యం అమ్మితే లక్ష జరిమానా విధించారు. అమ్మిన వారిని పట్టిస్తే పదివేల బహుమతిగా ప్రకటించారు. ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామస్తులు ఏకమై తీర్మానించారు. ఇవాళ నుంచే అమలు చేస్తున్నామని ప్రకటించారు.

January 17, 2026 / 09:18 PM IST

పులుల గణనకు యువత కావాలి: ఇంఛార్జ్ FRO

ASF: జాతీయ పులుల గణన సర్వే జనవరి 19 నుంచి 25 వరకు సిర్పూర్ పరిధిలో జరుగనుంది. ఇందులో పాల్గొనాలనుకునే యువకులు జనవరి 18 ఉదయం 9 గంటల లోపు సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఇంఛార్జ్ FRO ప్రవీణ్ కుమార్ శనివారం తెలిపారు. ఎంపికైన వారికి జనవరి 18న శిక్షణ ఉంటుందన్నారు. మొబైల్ వినియోగం, అడవిలో 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం ఉండాలన్నారు.

January 17, 2026 / 09:04 PM IST

భద్రేశ్వర స్వామి దుకాణ సముదాయం పై కోర్టు స్టే

VKB: నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవస్థాన దుకాణాల సముదాయం నిర్మాణాలపై కోర్టు స్టే విధించినట్లు వీరసేవ యువదళ్ మాజీ నాయకులు పటేల్ ప్రవీణ్ పేర్కొన్నారు. దీంతో దేవస్థాన ఈవో కోర్టు ఆదేశాల మేరకు దుకాణాలన్నింటినీ సీజ్ చేశారు. అభివృద్ధి పేరుతో పటేల్ కిరణ్ కోట్లాదిరూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడని పటేల్ ప్రవీణ్ ఆరోపించారు.

January 17, 2026 / 09:04 PM IST

ఇంస్టాగ్రామ్‌లో అసభ్యకరమైన మెసేజులు.. బాలుడిపై ఫ్రొక్సో కేసు

SRCL: బాలికను ఇంస్టాగ్రామ్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తూ వేధిస్తున్న బాలుడు‌పై ఫ్రొక్సో కేసు నమోదు చేసి నట్లు ఎస్సై రమేష్ శనివారం తెలిపారు. ఓ గ్రామంకు చెందిన బాలికను ఇంస్టాగ్రామ్ ఐడికి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ, నీ గురించి అసభ్యకరంగా చెప్తానంటూ బెదిరిస్తున్న బాలుడిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

January 17, 2026 / 09:00 PM IST

సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ

JGL: కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం సీఎం కప్ 2025 క్రీడాజ్యోతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సీఎం కప్ సీజన్ 2 టార్చ్ ర్యాలీలో కొడిమ్యాల ఎంపీడీవో, ఎస్సై, ఎంఈవోలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

January 17, 2026 / 09:00 PM IST

భారీగా IPS అధికారుల బదిలీలు

HYD పరిధిలో భారీగా IPS అధికారుల బదిలీలు జరిగాయి. గజరావు భూపాల్‌ను ఐజీ ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్‌గా, అభిషేక్ మొహంతీని విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ DIGగా నియమించారు. జి. చందనా దీప్తిని ఫ్యూచర్ సిటీ అదనపు కమిషనర్‌గా, టి. అన్నపూర్ణను సైబరాబాద్ డీసీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 20 మంది IPS అధికారులకు కొత్త పోస్టింగులు ఇచ్చారు.

January 17, 2026 / 08:58 PM IST

వరంగల్ మున్సిపల్ మేయర్ పదవి పై ఉత్కంఠ

WGL: రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల డివిజన్లతో పాటు మేయర్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని జనరల్ రిజర్వేషన్‌గా నిర్ణయించడంతో బలమైన అభ్యర్థులు ఎవరైనా పోటీ చేసే అవకాశం ఏర్పడింది. గతంలో రిజర్వ్‌డ్ స్థానాలకు పరిమితమైన మేయర్ పోటీ ఈసారి ఓపెన్ అయింది. దీంతో ఆశవాహుల్లో సందడి నెలకొంది.

January 17, 2026 / 08:56 PM IST

‘ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ బదిలీ’

ADB: జిల్లాకు చెందిన ఉట్నూరు అదనపు ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ శనివారం బదిలీ అయ్యారు. గత సంవత్సరం జనవరి 1 తేదీన ఆదిలాబాద్ జిల్లాకు ఉట్నూర్ ఏఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన ఆమె సెప్టెంబర్ 19న అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. సాధారణ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీ 2గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

January 17, 2026 / 08:54 PM IST

రేపు తిరుమలగిరి సాగర్‌కు ఎమ్మెల్యే సామేలు రాక

NLG: ఎమ్మెల్యే మందుల సామేలు ఆదివారం తిరుమలగిరి సాగర్ మున్సిపల్ కేంద్రానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ సకాలంలో విచ్చేసి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

January 17, 2026 / 08:51 PM IST

‘సింగరాయ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి’

SDPT: సింగరాయ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం కోహెడ మండలంలో గల సింగరాయకొండపై గల సింగరాయ ప్రతాపరుద్ర లక్ష్మీనరసింహస్వామి జాతర ఈనెల 18వ తేదీన ఆదివారం వైభవంగా నిర్వహిస్తున్నారు.

January 17, 2026 / 08:51 PM IST

రూ. 22 బాకీ కోసం హత్య

MDK: చేగుంట (మం) అనంతసాగర్‌లో సిరాజ్ (UP)ను కేవలం రూ. 22 బాకీ డబ్బుల కోసం తోటి కార్మికుడు మహేష్ కుమార్ బర్మా హత్య చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన హత్య ఘటనలో మహేష్ కుమార్ బర్మా (యూపీ)ను అరెస్టు చేసినట్లు వివరించారు. 15న మద్యం సేవిస్తున్న సమయంలో పాత బాకీ విషయంలో గొడవ జరిగి హత్య చేసినట్లు తెలిపారు.

January 17, 2026 / 08:50 PM IST

ఆర్మూర్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురేస్తాం: ఎమ్మెల్యే

NZB: మహారాష్ట్ర ఎన్నికల గెలుపు స్ఫూర్తితో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే పార్టీ రాకేష్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో ఆర్మూర్​లో ఆ పార్టీ నేతలు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మున్సిపల్​ ఛైర్మన్​ కంచెట్టి గంగాధర్​కు మిఠాయిలు తినిపించారు.

January 17, 2026 / 08:50 PM IST