• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మృతి

RR: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ కృష్ణ(60) మృతి చెందారు. ఆరాంఘర్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా, TG 5T 5229 నంబర్ గల ఇటుక లారీ వేగంగా వచ్చి కృష్ణను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

December 13, 2025 / 09:27 PM IST

NH44 పెబ్బేరు బైపాస్ ఘోర రోడ్డు ప్రమాదం

WNP: పెబ్బేరు మండలం NH44 హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బులోరా బండి గంగాపూర్ గ్రామానికి చెందిన బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వ్యక్తికి తలపైన తీవ్రంగా గాయంకావడంతో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థాలానికి చేరుకున్న ఎస్ఐ యుగేందర్ రెడ్డి కేసు నమోదు చేశారు.

December 13, 2025 / 09:15 PM IST

రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి

JN: స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఐనవోలు మండలం నందనానికి చెందిన బుర్ర కళ్యాణ్ (27), ఐటీ ఉద్యోగి నవీన్ (27) బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకున్నది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

December 13, 2025 / 09:14 PM IST

ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ.. కేసు నమోదు

KNR: గంగాధర మండలం వెంకంపల్లి గ్రామంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అభ్యర్థి సహా ముగ్గురిపై గంగాధర పీఎస్‌లో కేసు నమోదయింది. ఈ నెల 10న ఓటర్లకు డబ్బులు పంచుతున్న గుండవేని నర్సయ్యను ఎఫ్ఎసీ అధికారులు పట్టుకున్నారు. నగదును, ఎలక్ట్రిక్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి గుండవేని లావణ్యతో పాటు ఆమె సోదరుడి ఆదేశాల మేరకు ఈ పని చేసినట్లు తెలిపారు.

December 13, 2025 / 09:14 PM IST

పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

SRPT: కోదాడ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 14 గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాటు చేశామని, కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌కు అడ్డంకులు కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

December 13, 2025 / 09:04 PM IST

60 కుటుంబాలకు రగ్గుల పంపిణీ

కామారెడ్డి పట్టణ కేంద్రంలోని దేవునిపల్లి గ్రామంలో 35 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మునీర్ ఆధ్వర్యంలో పోచమ్మ కాలనీలో శనివారం 60 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో చలితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకొని నీరు పేదలకు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పోచమ్మ కాలనీ వాసులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

December 13, 2025 / 09:03 PM IST

ఈనెల 18న ఆత్మకూరులో కబడ్డీ జిల్లా సెలక్షన్స్

యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ డిసెంబర్ 18న ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్లో జరుగుతాయని జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచందర్ రాజ్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డుతో పీఈటీ ఇందిరకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన జట్టు డిసెంబర్ 25న ఖమ్మంలో ఆడునుందని పేర్కొన్నారు.

December 13, 2025 / 09:03 PM IST

మలక్‌పేటలో డివిజన్ పునర్విభజనపై ఎనిమిది అభ్యంతరాలు

HYD: మలక్‌పేట నియోజకవర్గంలో ఏర్పాటైన 9 డివిజన్లపై 8 అభ్యంతరాలు అందాయని జీహెచ్ఎంసీ సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ ఎంకే ఇంకేషాఫ్ అలీ తెలిపారు. సరిహద్దులు, పేర్లు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు. అభ్యంతరాలను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పంపించినట్లు పేర్కన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 150 డివిజన్ ఉండగా ప్రభుత్వం 300 డివిజన్లను ఏర్పాటు చేశారు.

December 13, 2025 / 09:02 PM IST

సీజ్ చేసిన ఇసుకకు వేలంపాట

PDPL: సుల్తానాబాద్ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో సీజ్ చేసిన 54 క్యూబిక్ మీటర్లు, గర్రెపల్లి గ్రామంలో సీజ్ చేసిన 39 క్యూబిక్ మీటర్ల ఇసుకను కలిపి మొత్తం 93 క్యూబిక్ మీటర్ల సీజ్ ఇసుకను సోమవారం ఉదయం 11.00 గంటలకు తహసీల్దార్ కార్యాలయం, సుల్తానాబాద్ నందు బహిరంగ వేలం వేయుటకు నిర్ణయించినట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలన్నారు.

December 13, 2025 / 09:00 PM IST

ఎన్నికల విధులలో నిర్లక్ష్యం.. 181 మందికి షోకాజ్ నోటీసులు

PDPL: జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 181 మంది ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ కోయ శ్రీ హర్ష షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకపోవడం, నిర్లక్ష్యంగా పనిచేయడంపై ఈ చర్యలు తీసుకున్నారు. నోటీసులు అందుకున్న వారిలో 53 మంది పోలింగ్ అధికారులు, 128 మంది ఓపీవోలు ఉన్నారు.

December 13, 2025 / 08:58 PM IST

1150 మంది పోలీసులతో భారీ బందోబస్తు: జిల్లా ఎస్పీ

WNP: రెండవ విడత స్థానిక సర్పంచ్ ఎన్నికలు గురువారం వనపర్తి జిల్లాలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, మదనపూర్, అమరచింత మండలాలలో మొత్తం 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు.1150 మంది పోలీస అధికారులు సిబ్బందిచే ఎన్నికలను ప్రశాంత వాతారణంలో అన్నిరకాల పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.

December 13, 2025 / 08:57 PM IST

గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైద్యులు

BHPL: గణపురం మండల కేంద్రంలోని శ్రీ గణపేశ్వరాలయంలో ఇవాళ కాళేశ్వరం ప్రభుత్వ వైద్యురాలు డా. సుస్మిత, మహాముత్తారం ప్రభుత్వ వైద్యులు డా. సందీప్ స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు వారిచేత ప్రత్యేక పూజలు చేయించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వైద్యులు తదితరులు ఉన్నారు.

December 13, 2025 / 08:57 PM IST

జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన విశ్వదీప్

KNR: హుజురాబాద్ మండలానికి చెందిన బత్తుల విశ్వదీప్ జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. వనపర్తి జిల్లాలో జరిగిన జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ ఎంపిక జరిగింది. ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు.

December 13, 2025 / 08:54 PM IST

ఎంపీడీవోకు ఓడిన అభ్యర్థి జయమ్మ ఫిర్యాదు

GDWL: గట్టు మండల పరిధిలోని గంగిమాన్ దొడ్డి గ్రామంలో ఈనెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దొంగ ఓటు వేయించుకుని కావాలి పద్మ సర్పంచ్‌గా గెలిచారని, ఓడిపోయిన అభ్యర్థి జయమ్మ గట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఫిర్యాదు చేశారు. దొంగ ఓటు వేసిన ఓటరు మండల కేంద్రానికి చెందిన వ్యక్తి అని, అతను గట్టు మండల కేంద్రంలో 7వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్నాడన్నారు.

December 13, 2025 / 08:53 PM IST

‘ఉంగరం గుర్తుకు ఓటేసి BJP అభ్యర్థిని గెలిపించాలి’

HNK: శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొంగర సుధాకర్‌ను గెలిపించాలని కోరుతూ.. ఇవాళ సాయంత్రం BJP నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి సుధాకర్‌ను గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

December 13, 2025 / 08:49 PM IST