• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బక్రీద్ సందర్భంగా చెక్ పోస్టులు ఏర్పాటు: ఎస్పీ

NGKL: ఈనెల 28న నిర్వహించబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో మంగనూరు, మరికల్, కొట్ర జంక్షన్, మున్ననూర్, చారకొండలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా ఆవులను, దూడలను తరలించరాదని, ఎవరైనా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

May 5, 2026 / 10:13 PM IST

మదన్ లాల్ మరణం పార్టీకి తీరని లోటు: BRS

KMM: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం ఈర్లపూడిలో నిర్వహించిన మదన్ లాల్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మదన్ లాల్ నిబద్ధత గల నాయకుడని, ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు.

May 5, 2026 / 10:08 PM IST

‘ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సాధించాలి’

KNR: ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని అన్నారు. హుజురాబాద్‌లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సుహాసిని మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.

May 5, 2026 / 10:00 PM IST

రేపే రైతు సదస్సు.. హాజరుకానున్న KTR

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డులో రేపు నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. సదస్సుకు విచ్చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా స్థానిక బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు హాజరయ్యేందుకు కేటీఆర్ వరంగల్‌ జిల్లాకు విచ్చేశారు.

May 5, 2026 / 09:53 PM IST

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ప్రదీప్ రావు

WGL:  నగరంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా? అనే వ్యాఖ్యలు హిందూ భావాలను అవమానించేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు.

May 5, 2026 / 09:47 PM IST

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: తహసీల్దార్

MDK: నార్సింగిలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ గ్రేసీ బాయి, ఈవో నాగభూషణం సూచించారు. 2002లో ఓటు నమోదు చేసుకున్న వివరాలను (నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం సంఖ్య) సేకరించి, ప్రస్తుత నివాస ప్రాంత వివరాలతో సరిచూసుకోవాలని తెలిపారు. ఓటర్లు తమ బూత్ స్థాయి అధికారిని (BLO) సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

May 5, 2026 / 09:38 PM IST

ఆసుపత్రిని తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్

MLG: ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రేగా కళ్యాణి సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రి సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

May 5, 2026 / 09:35 PM IST

చెత్త చెదారం లేకుండా చూడాలి: కమిషనర్

BDK: అశ్వరావుపేట మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి పట్టణ దుకాణదారులతో మంగళవారం సమావేశమయ్యారు. ప్రతి షాప్ వారు పరిశుభ్రత పాటించాలని, షాపులోని వ్యర్థాలు డస్ట్ బిన్‌లో వేయాలని సూచించారు. వాటిని స్వచ్ఛ ట్రాలీ వచ్చినప్పుడు అందులో వేయాలని తెలిపారు. దుకాణం ఎదుట చెత్తాచెదారం కనిపిస్తే జరిమానా విధిస్తామని అన్నారు.

May 5, 2026 / 09:24 PM IST

సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి: MLA

MHBD: డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి పారుదల శాఖ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని MLA రామచంద్రు నాయక్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో సాగుతున్న నీటి పారుదల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

May 5, 2026 / 09:22 PM IST

‘ఈనెల 23 లోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

NGKL: జిల్లాలోని మత్స్య సహకార సంఘాల సభ్యులందరూ వెంటనే NFDP (నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి నరసింహరావు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బీమా సౌకర్యం పొందాలంటే నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. ఈనెల 23 వ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయని వారు ప్రభుత్వ ప్రయోజనాలకు అనర్హులయ్యే అవకాశం ఉందని తెలిపారు.

May 5, 2026 / 09:14 PM IST

మొరం అక్రమ తరలింపుపై పోలీసుల ఉక్కుపాదం

JN: బచ్చన్నపేట(M) కొడవటూరు గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. మోరం తరలింపునకు ఉపయోగిస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ట్రాక్టర్లతో పాటు JCB యజమానులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు.

May 5, 2026 / 09:12 PM IST

మార్కెట్‌లో నిలిచిపోయిన కొనుగోళ్లు

SDPT: బెజ్జంకి మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెలరోజులుగా మార్కెట్‌లో పంటకు కొనుగోలు లేక గూడెల్లి కొమురయ్య తన ఏడెకరాల పంటను ఇంటికి తీసుకెళ్లాడు. కేంద్రం కోటా ముగిసిందనే కారణంతో రాష్ట్రం కూడా కొనకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

May 5, 2026 / 09:11 PM IST

‘రైతు సభను విజయవంతం చేయాలి’

MHBD: వరంగల్‌లో రేపు (బుధవారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు సంగ్రామ సభను విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నవీన్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై గళమెత్తేందుకు ఈ సభను ఏర్పాటు చేశామని, మండలంలోని రైతులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు.

May 5, 2026 / 09:10 PM IST

‘పారితోషికం వెంటనే చెల్లించాలి’

NRPT: ఆశాల రెండు నెలల పారితోషికాలు చెల్లించాలని మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో నారాయణపేట, కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ.. మార్చీ, ఏప్రిల్ పారితోషికాలు ఇంతవరకు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని కోరారు.

May 5, 2026 / 09:01 PM IST

రేపు పోనకల్‌లో రైతు వారోత్సవాలకు ఆహ్వానం

MNCL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం కవ్వాల్ క్లస్టర్ పరిధిలోని పోనకల్‌లో రైతు వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి బ్యాంక్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ అక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

May 5, 2026 / 09:00 PM IST