• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అగ్నిమాపక వాహనాలతో నగరంలో ర్యాలీ

KNR: ఈనెల 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా అగ్నిమాపక శాఖ సిబ్బంది నగరంలో అగ్నిమాపక శకటాల ర్యాలీని నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 40 మంది సిబ్బంది, 11 వాహనాలు పది కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు.

April 19, 2026 / 10:30 PM IST

రేపు యాసంగి రెండో విడత నిధుల విడుదల..

SRPT: యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను సీఎం రేపు ప్రారంభించనున్న నేపథ్యంలో మునగాల మండలంలోని, రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసార ఏర్పాటు చేయనున్నారు. మండలంలో మునగాల, ఆకుపాముల, రేపాల గ్రామాల్లోని రైతు వేదికల్లో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని, మునగాల మండల ఏవో బి.రాజు ఇవాళ రాత్రి ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.

April 19, 2026 / 10:24 PM IST

రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి

KMR: యాసంగి సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు రెండు రోజుల్లో ప్రారంభించాలని ఎల్లారెడ్డి తహశీల్దార్ ప్రేమ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ మండలంలోని మత్తమాల సొసైటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ.. వారికి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నమన్నారు.

April 19, 2026 / 10:14 PM IST

నార్త్ అల్వాల్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం

MDCL: అల్వాల్ పట్టణంలోని పంచశీల్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నార్త్ అల్వాల్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధార్మిక, సామాజిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీల ప్రతినిధులు, ఇందు బంధువులు, సంఘ సభ్యులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

April 19, 2026 / 10:03 PM IST

లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆదాయం రూ.3.25 లక్షలు

JGL: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయానికి వచ్చిన ఆదాయం వివరాలను ఈఓ శ్రీనివాస్ వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.1,73,922, ప్రసాదాల ద్వారా రూ.97,000, అన్నదానం ద్వారా రూ.54,640 ఆదాయం లభించింది. మొత్తం రోజువారీ ఆదాయం రూ.3,25,562గా నమోదు అయింది. భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

April 19, 2026 / 10:00 PM IST

కేబుల్ బ్రిడ్జిపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి.!

HYD: మాదాపూర్‌లో కేబుల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ఆగిన గోస శ్యామ్‌రాజ్‌అనే వ్యక్తిని బెంజ్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

April 19, 2026 / 09:57 PM IST

విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ ఛైర్మన్

RR: శంకర్‌పల్లి అరుణోదయ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ కాసెట్టి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇవాళ యూత్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి జ్ఞాపకార్థం బ్యాట్‌మెంటన్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. విజేతలకు మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, ప్రకాష్ గుప్తా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

April 19, 2026 / 09:56 PM IST

చదువులో వెనుకబడుతున్న వికారాబాద్!

VKB: చదువులో వికారాబాద్ జిల్లా వెనుక పడుతుంది. గత నాలుగు సంవత్సరాల విద్యా రికార్డులను పరిశీలిస్తే అనేకసార్లు 30 ర్యాంక్, 33 ర్యాంక్ సాధించింది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, కనీసం విద్యా వాసతులు కల్పించడం లేదని ప్రజలు చెబుతున్నారు. వికారాబాద్ డిగ్రీ కాలేజీలో కనీసం ఫ్లోరింగ్ లేదని తెలిపారు.

April 19, 2026 / 09:40 PM IST

హెల్మెట్ ఉంటేనే గ్రామంలోకి అనుమతి

SRPT: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టింది. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ నినాదంతో గ్రామంలోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పాలకవర్గం గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రయాణికుల ప్రాణ రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.

April 19, 2026 / 09:38 PM IST

అకాల వర్షం.. ఆందోళనలో అన్నదాతలు

MDK: నిజాంపేట మండలంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారింది. పగలు 45 డిగ్రీల ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనం, సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో ఉపశమనం పొందారు. అయితే, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట పాడవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

April 19, 2026 / 09:27 PM IST

నూతన ఐకేపీ సెంటర్ ప్రారంభం

NLG: నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని అనుముల మండలం కుపాష్పల్లి గ్రామపంచాయతీలో ఇవాళ నూతన ఐకేపీ సెంటర్ ను సర్పంచ్ పెరమళ్ళ వేణుగోపాల్ ప్రారంభించారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా ఐకేపీ కేంద్రంలోనే ధాన్యం అమ్ముకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఏపీఎం, వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, రైతులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

April 19, 2026 / 09:23 PM IST

గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడి ఎన్నిక

NZB: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో నూతన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మల్యాల సుభాష్ గౌడ్‌ను ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా సింగిరెడ్డి భరత్, క్యాషియర్‌గా పన్నుల రవి, కార్యదర్శిగా పెంట కిషన్, సలహాదారులు ఈర్గల్ల మహేష్, కౌడ రాము, సిలివేరి భూమేశ్వర్, పసుపుల రమేష్, బైండ్ల సాయిలును నియమించారు. గ్రామాభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామన్నారు.

April 19, 2026 / 09:22 PM IST

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానం

WNP: ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్కాలర్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి విద్యార్థులకు శాలువతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. స్కాలర్స్ కళాశాలకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 1991 ఇప్పించానని అన్నారు.

April 19, 2026 / 09:17 PM IST

పలుస శంకర్ గౌడ్ కు ‘దక్షిణ భారతదేశ స్ఫూర్తి అవార్డు’

WNP: విద్యా మరియు సాహిత్య రంగాల్లో చేసిన విశేష కృషికి గాను వనపర్తికి చెందిన పలుస శంకర్ గౌడ్ కు శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘దక్షిణ భారతదేశ స్ఫూర్తి అవార్డు’ లభించింది. హైదరాబాద్ బిర్లా ప్లానెటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఎటికాల పురుషోత్తం, సీనీ నటుడు పృథ్వీరాజ్ తదితరుల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

April 19, 2026 / 09:14 PM IST

90 వేల మార్క్ దాటిన డ్రంక్ & డ్రైవ్ కేసులు

HYD: నగరం పరిధిలోని ట్రై కమిషనరేట్ల ప్రాంతాల్లో ఈ ఏడాది డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో 90,000 కేసుల మార్కు దాటింది. దీంట్లో గరిష్టంగా 58% పైగా ద్విచక్ర వాహనదారులు ఉన్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపద్దని, మత్తులో మరణం దగ్గరవుతుందని సూచించారు. 500 BAL పైగా 3% కేసులు నమోదు అయినట్లు వివరించారు.

April 19, 2026 / 09:08 PM IST