• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మేడారం జాతరకు WGL బల్దియా నుంచి 550 మంది కార్మికులు

MLG: ఈనెల 28వ తేదీ నుండి మేడారం మహాజాతర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ బల్దియా నుంచి 550 మంది పారిశుద్ధ కార్మికులను మేడారంకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత జాతరలో మాదిరిగా ఈసారి కూడా మేడారం జాతరలోని అన్ని సెక్టార్లలో ప్రభుత్వ ఆదేశాలమేరకు పారిశుద్ధ్య నిర్వహణకు సిబ్బంది తరలి వెళ్తారన్నారు.

January 5, 2026 / 11:53 AM IST

రాష్ట్ర క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

NZB: HYD గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ క్రీడా పోటీల్లో పోచంపాడు బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు ఆదివారం సత్తా చాటారు. 6 కి.మీ, 8 కి.మీ విభాగాల్లో పాల్గొన్న భూమేష్, హర్షవర్ధన్, రామ్ చరణ్, నవదీప్ పతకాలతో పాటు ప్రశంసా పత్రాలను కైవసం చేసుకున్నారు. పీఈటీ సంజీవ్లు వారిని ప్రత్యేకంగా సత్కరించారు.

January 5, 2026 / 11:49 AM IST

నేటి నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KMM: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు కారేపల్లి గురుకుల ప్రిన్సిపల్ హరికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందని మరిన్ని వివరాలకు సమీప పాఠశాలను సంప్రదించాలని ఆయన కోరారు.

January 5, 2026 / 11:41 AM IST

అనారోగ్యానికి గురై.. యువకుడు ఆత్మహత్య

BHPL: మొగుల్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన యువకుడు మూత రాకేష్ (25) అనారోగ్యంతో మనస్థాపానికి గురై నిన్న రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పెఱిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరం రవీందర్ మృతుడి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత వ్యసనాలకు బానిస కాకూడదని, అనారోగ్యాలకు గురవుతున్నారని సూచించారు.

January 5, 2026 / 11:39 AM IST

చైనా మాంజా.. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష: సీఐ

MDK: అల్లాదుర్గ్ పోలీస్ సర్కిల్ పరిధిలో చైనా మాంజా (సింథటిక్/నైలాన్ దారం) విక్రయాలు, వినియోగం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గ్ సీఐ రేణుక హెచ్చరించారు. చైనా మాంజా పర్యావరణానికి, మానవ ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

January 5, 2026 / 11:36 AM IST

PRTUTS క్యాలెండర్ ఆవిష్కరణ

MDK: PRTUTS హవేలీ ఘనపూర్ మండల శాఖ 2026 నూతన క్యాలెండర్‌ను సోమవారం మండల వనరుల కేంద్రం, కూచన్ పల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించి మంచి ఫలితాలను సాధించేలా కృషి చేయాలన్నారు.

January 5, 2026 / 11:33 AM IST

బోనకల్ చేరుకున్న సీపీఐ వందేళ్ల ప్రచార జాత

KMM: సీపీఐ 100 సంవత్సరాల ప్రచార జాత బోనకల్ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి జమున జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 18న ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న సీపీఐ వందేళ్ల భారీ ప్రజా ప్రదర్శనను బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు సోమవారం పిలుపునిచ్చారు.

January 5, 2026 / 11:32 AM IST

‘విద్యుత్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి’

ASF: విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆ శాఖ జిల్లా SE ఉత్తమ్ జాడే సోమవారం తెలిపారు. విద్యుత్ పొదుపు కోసం LED బల్బులు వాడాలని నాసిరకం తీగలు, స్విచ్‌లు వాడకూడదని సూచించారు. రైతులు వ్యవసాయ బోర్లకు కెపాసిటర్లను తప్పనిసరిగా అమర్చుకోవాలని, ఎలాంటి మరమ్మతులకైనా సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

January 5, 2026 / 11:32 AM IST

మదురో దంపతుల అరెస్ట్ గర్హనీయం: ఏఐవైఎఫ్

WNP: వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతుల అరెస్ట్‌ను ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం అమరచింతలో ఆందోళన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద ధోరణి ఇతర దేశాల సార్వభౌమత్వానికి ముప్పుగా మారిందని ఆయన విమర్శించారు. ఈ చర్య నిరంకుశత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

January 5, 2026 / 11:31 AM IST

‘గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా’

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ మడవి కిషన్, ఉపసర్పంచ్ దండ్ల దత్తు లను సోమవారం గ్రామ మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.

January 5, 2026 / 11:31 AM IST

ఇంటికి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వండి: CP

WGL: సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, హన్మకొండ నగరాల్లో నివసించే ప్రజలు ఇంటికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ కోరారు. ఇవాళ CP మాట్లాడుతూ.. అధిక దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సమాచారం అందిన ఇళ్ల చుట్టుపక్కల ఎల్లవేళలా గస్తీ ఉంటుందని హామీ ఇచ్చారు.

January 5, 2026 / 11:28 AM IST

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: స్థానిక ప్రజలు

MLG: మంగపేట మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లు నుండి వెలువడుతున్న దుమ్ము, ధూళి, పొట్టు వ్యర్థాలు, దుర్వాసన వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అనుమతులు లేకుండానే మిల్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.

January 5, 2026 / 11:27 AM IST

మహిళా సంఘాలకు HYDలో 10 రోజుల శిక్షణ: మంత్రి

HYD: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో మహిళా సంఘాలపై మాట్లాడారు. ఇప్పటికే వారికి బస్సులు కేటాయించి ఆదాయం వచ్చేలా చూస్తున్నామన్నారు. వచ్చిన ఆదాయంతో మరిన్ని వ్యాపారాలు ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ కాంటీన్లను మహిళలకే ఇచ్చామని చెప్పారు. 20 రకాల వ్యాపారాలపై హైదరాబాద్‌లో 10 రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు.

January 5, 2026 / 11:21 AM IST

ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మువ్వ విజయబాబు

KMM: సత్తుపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. దుర్గాప్రసాద్ ఆహ్వానం మేరకు TGIDC ఛైర్మన్ మువ్వ విజయబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి మాలధారులు శబరిమలై యాత్రకు తగు జాగ్రత్తలు వహించి భద్రంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

January 5, 2026 / 11:16 AM IST

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం వేకువజామునే ఆలయ అర్చకులు కాందాలై వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 21వ పాశురాన్ని వినిపించారు.

January 5, 2026 / 11:10 AM IST