NGKL: ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 30 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 8 న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
VKB: మోమిన్పేట మండల పరిధిలోని కేసారం గ్రామంలో కేపీఎల్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్ను అత్యంత ఘనంగా నిర్వహించారు. టోర్నమెంట్లో గెలుపొందిన జట్టులకు గ్రామ సర్పంచ్ గుజ్జరి కిష్టయ్య బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యం అన్నారు.
KMR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గురు ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల అభ్యున్నతి కోసమే పాటుపడుతుందన్నారు.
MLG: మేడారం జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అన్ని శాఖల మంత్రులు ఉదయం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా CM, కుటుంబ సభ్యులు, మంత్రులు పైన కూర్చుండగా..మంత్రి సీతక్క కింద కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై మంత్రి సీతక్క ఏ విధంగా స్పందిస్తారని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NZB: కమ్మర్ పల్లి మండలంలోని నాగపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూలు యూనిఫామ్లను సర్పంచ్ కంపదండి అశోక్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లను కుట్టించారు. కాగా వాటిని పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు సరఫరా చేశారు.
JGL: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల రూరల్ పోలీసులు హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బ్రీత్ అనలైజర్లతో వాహనదారులను పరీక్షించారు. మద్యం తాగి రోడ్లపైకి ఎక్కితే కేసులు తప్పవన్నారు.
BDK: అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఎదో ఒక రోజు ఒక్క చోటకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు నేడు పిలుపునిచ్చారు. ముందు సీపీఐ, సీపీఐ(ఎం) కలవాల్సిన అవసరం ఉందని, ఈ రెండు పార్టీలు కలిసిన తర్వాత మిగిలిన అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట పైన ఎర్రజెండ ఎగిరేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
SRCL: వేములవాడలోని రాజరాజేశ్వరి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. రాత్రి 8 గంటల వరకు మొత్తం 99,689 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. పవిత్ర సోమవారం, సమ్మక్క సారలమ్మ జాతర కారణంగా భక్తులు భారీగా తరలివచ్చినట్లు వెల్లడించారు. వారికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు.
KMR: ఈనెల 29న జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులు ఇస్రో సందర్శనకు వెళ్లనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇందులో పల్వంచ ZPHS పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎ. విద్యాశ్రీ ఎంపిక కావడం గర్వకారణమన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులతో పాటు 30 మంది ఉపాధ్యాయులకు కూడా ఈ అరుదైన అవకాశం లభించిందని పేర్కొన్నారు.
WGL: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం అధికారుల ప్రధాన బాధ్యత అని జిల్లా కలెక్టర్ సత్య శారద పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘పోష్’ యాక్ట్-2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కార్యాలయంలో చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి, మహిళలకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ASF: జిల్లా పర్యటనకు వచ్చిన ఉమ్మడి ADB జిల్లా ఇంఛార్జ్, మంత్రి జూపల్లి కృష్ణారావుకు డీసీసీ సుగుణక్క స్వాగతం పలికారు. కార్యక్రమంలో మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాల రూ. 2,03,66,311 విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విటల్, అజ్మీర్ శ్యామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ప్రముఖ డాక్టర్ భీ. శంకర్ కు జాతీయ ఫిజీషియన్ల సదస్సులో పాల్గొనే ఆహ్వానం లభించింది. ఆయన రచించిన “శ్వాసకోశ ఉబ్బసం వ్యాధులు- ఆధునిక చికిత్సా పద్ధతులు” వ్యాసం “మెడిసిన్ అప్డేట్-2026” లో ప్రచురితమై ఉంది. డాక్టర్ శంకర్ ఈ నెల 29న పాట్నాలో పుస్తక ఆవిష్కరణలో పాల్గొని, 30న జాతీయ వేదికపై ప్రసంగం చేస్తారు.
WGL: హై రిస్క్ గర్భిణులను సమయానికి గుర్తించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO డా. సాంబశివరావు సూచించారు. వరంగల్ DMHO కార్యాలయంలో అర్బన్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రమాదకర లక్షణాలను ముందుగా గుర్తించి నిపుణుల సలహాతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాతా-శిశు మరణాలను తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
PDPL: తెలంగాణ ప్రజలకు BRS పార్టీ అధినేత కెసిఆర్ శ్రీరామ రక్ష అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కార్పొరేషన్ 13వ డివిజన్లో సామాజిక కార్యకర్త కటుకు స్వాతి- ప్రవీణ్ తో పాటు 100 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.
KNR: ఐదు రోజుల విరామం అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ఇవాళ ప్రారంభమైంది. పత్తి ధరలు ఆశాజనకంగా నమోదై గరిష్ఠంగా క్వింటాల్కు రూ.8 వేల వరకు పలికాయని పలువురు రైతులు తెలిపారు. మార్కెట్లో 14 వాహనాల ద్వారా మొత్తం 102 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. గత కొన్ని రోజులతో పోల్చితే ధరలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.