WGL: నల్లబెల్లి మండల పరిధిలోని గత మూడు రోజుల నుంచి కురుస్తున్న దట్టమైన పొగ మంచుకు జాగ్రత్తలు పాటించాలని గురువారం ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఉదయం పూట ప్రయాణాలు చేసే ప్రయాణికులు తప్పనిసరి హెల్మెట్, షెటర్స్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. పొగ మంచు దృష్ట్యా ఉదయం వేళలో ప్రయాణం చేయవద్దని ప్రజలను కోరారు.
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని జయగిరిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని పేర్కొన్నారు.
JGL: మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన పున్న లచ్చవ్వ (59) ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతిచెందినట్లు SI నరేష్ తెలిపారు. కాగా మృతురాలు తన సోదరుడి ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఇంటిబయట గడ్డికి నిప్పుపెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకుని గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
నల్లగొండలో భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ నరసింహారాజు నేతృత్వంలో గురువారం మిల్లింగ్ రైస్ మరియు వానాకాలం ధాన్య సేకరణ పై సమావేశం జరిగింది. పట్టణంలోని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో సీఎంఆర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
JGL: మెట్ పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ PACS ఛైర్మన్గా కేసిరెడ్డి నవీన్, 12 మంది డైరెక్టర్లు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు సొసైటీకి సంబంధించిన అకౌంట్ను పరిశీలించగా గత సంవత్సర వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన లెక్కల్లో పొరపాట్లు ఉన్నట్లు గుర్తించి అధికారులకు తెలిపారు. రెండు రోజుల్లో సొసైటీకి సంబంధించిన బాకీ జమచేస్తామన్నారు.
HYD: ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన పురాతన ప్రతిష్టాత్మక స్వయం ప్రతిపత్తి ఉన్న కళాశాలలలో ఒకటైన నిజాం కాలేజ్లో నాయకత్వ మార్పు జరిగింది. భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొ. శ్రీనివాస్ నూతన ప్రిన్సిపల్గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో కొనసాగిన ప్రొ. రాజశేఖర్ కాలేజీకి అంకితభావంతో సేవలు అందించారు.
MDK: వీధి వ్యాపారులను వారంలోగా గుర్తించి బ్యాంకులకు సమర్పించాలని మెప్మా పిడి హనుమంత రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పీఎం సేవా నిధి ఆత్మ నిర్బార్ నిధి పథకం కింద 50 మంది వంతున ఎంపిక చేయాలని ఆర్పీలకు సూచించారు. ఈ పథకం మరో ఐదేళ్లు కొనసాగుతుందన్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఈ నెల 22వ తేదీ శనివారం హైదరాబాద్లో జరిగే సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ పోస్టర్ను ఎస్సై ఆవుల తిరుపతి గురువారం ఆవిష్కరించారు. మండలంలోని యువ రచయితలు, కవులు, కళాకారులు ఈ సాహిత్యోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
WNP: పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం పొలంలో మేతకు వెళ్లిన కొత్తగోళ్ళ రాముల యాదవ్కి చెందిన ఎద్దు ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఉన్న 11 కెవి విద్యుత్ తీగ తగిలి మృతి చెందింది. ఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే పరిశీలించారు. రైతుకు తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
MBNR: అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామ చెరువులో గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలు చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ద్వేయగా ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు.
GDWL: కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆన్లైన్ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన నేరాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
GDWL: హెల్మెట్లు వాడండి ప్రాణాలు కాపాడుకోండి అని కళాకారుల బృందం పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం పోలీస్ కళాబృందం కె.టి.దొడ్డి మండలం ఉమిత్యాలతండాలో ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా వారికి ఎన్నో కార్యక్రమాలను పాటలు రూపంలో వర్ణించి ప్రజలు వివరించారు. అలాగే యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు.
NGKL: జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు జిల్లెల్ల రాములు గురువారం కలెక్టర్ను కలిశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
BDK: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ రెహమాన్, టీపీసీసీ కార్యదర్శి నాగ సీతారాములు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, గ్రంథాలయ కార్యదర్శి కరుణ కుమారి పాల్గొని వివిధ కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
KNR: రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిల్లర్లు ధాన్యం దింపుకునే విషయంలో క్వింటాల్కు 8 కిలోల తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారన్నారు.