WGL: పర్వతగిరి మండల కేంద్రంలో కల్లెడ, కొంకపాక, గోరుగుట్ట తండా సర్పంచ్ ఎన్నికల ఇన్చార్జులతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్రావు మంగళవారం సన్నాహాక సమావేశం నిర్వహించి ఆశావాహుల వివరాలు సేకరించారు. రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని, పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రతి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
SRPT: కోదాడ నియోజకవర్గంలో ఉన్న స్వయం సహాయక మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నేడు 12 గంటలకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పంపిణీ చేస్తారని మంగళవారం కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు సకాలంలో అందుబాటులో ఉండాలని సూచించారు.
HYD: హబ్సిగూడలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని శ్రీ వైష్ణవి మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణం చెందగా, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఓయూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
BHPL: త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో BCలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ ఇవాళ అన్నారు. BCలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలు అగ్రకులాలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో CSను కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో మంగళవారం ఎమ్మెల్యే సామల పర్యటించనున్నారు. తిరుమలగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మహిళలకు ఇందిర మహిళా శక్తి చీరలను పంపిణీ చేయనున్నారు. నాగారం, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
KMM: ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందించడమే మంత్రి ధ్యేయమని కార్పొరేటర్ కన్నం వైష్ణవి తెలిపారు. మంత్రి తుమ్మల సిఫార్సు మేరకు ఖమ్మం 46వ డివిజన్కు చెందిన నిరంజన్కు రూ. 60 వేలు, రుద్ర సదానందంకు రూ. 32 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అవ్వగా సోమవారం ఆమె నగర కాంగ్రెస్ ఓబీసీ ఛైర్మన్ బాణాల లక్ష్మణ్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాటిని అందజేశారు.
BHPL: మొగుళ్ళపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన వెలమ సంఘం భవనం, రూ.25 లక్షలతో కొత్తగా నిర్మించిన లక్కమారి కాపు సంఘం భవనాలను సోమవారం రాత్రి MLA గండ్ర సత్యనారాయణ రావు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ.. సంఘాల అభివృద్ధికి ఈ భవనాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
BDK: ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందేలా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ. రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ అధికారుల సమక్షంలో మారుమూల ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు.
JGL: ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందజేయడం జరుగుతుందని, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళ తల్లులకు పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.
ADB: తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామస్తులు MLA అనిల్ జాదవ్ను నేరడిగొండలోని ఆయన క్యాంపు కార్యాలయం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో నిర్వహించనున్న శ్రీ విఠల రుక్మిణి తృతీయ వార్షికోత్సవానికి కార్యక్రమానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులున్నారు.
NZB: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ మధ్యాహ్నం నాటికి పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఐకేపీ అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు వారి ఇంటి వద్దకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు అందించాలని సూచించారు.
NLG: జిల్లా వ్యాప్తంగా ప్రవేట్ ఆసుపత్రులు దోపిడీకి నిలయాలుగా మారాయి. రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. పెద్దపూర మండలం లింగాపల్లి గ్రామానికి చెందిన జ్యోతి ఇటీవల నల్లగొండలోని ఓ ఆసుపత్రిలో హెర్నియా ఆపరేషన్ చేయించుకుంది. వారి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారని బాధితురాలు ఆరోపించింది.
KMR: రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన కౌశిక బంగారు పతకం సాధించినట్లు కరాటే మాస్టర్ సాయినాథ్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా మేక వనంపల్లిలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు పోటీలలో పాల్గొనగా కౌశిక రాష్ట్రస్థాయిలో ప్రతిభా కనపరిచి బంగారు పతకం సాధించింది.
RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని జడ్జెస్ కాలనీ కమ్యూనిటీ హాల్, గణేష్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను ఇవాళ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
HYD: శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే అగ్నిప్రమాద ఘటనలో CNG కారు పూర్తిగా దగ్ధం కాగా.. రాత్రి 10 గంటల వరకు కారు అక్కడ ఎందుకు ఉందనే దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ను సేకరించే పనిలో పడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలైన విషయం తెలిసిందే.