• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

“సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆలోచనలు పెంపొందిస్తాయి”

HNK: పట్టణంలోని సెయింట్ పీటర్ పాఠశాలలోఇవాళ జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన-2025 ముగింపు కార్యక్రమంలో MLAలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, KR నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA రేవూరి మాట్లాడుతూ.. సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనలు పెంపొందిస్తాయని, సైన్స్ పట్ల ఆసక్తి పెంచి భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు.

December 20, 2025 / 08:57 PM IST

ప్రభుత్వ సలహాదారులతో డీసీసీ అధ్యక్షుడి భేటీ..!

ADB: కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలతో భేటి అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో వారిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.

December 20, 2025 / 08:56 PM IST

సర్పంచ్‌కు ఉపాధ్యాయుల ఘన సన్మానం

MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఝాన్సీ లింగాపూర్ గ్రామ నూతన సర్పంచ్ మానెగల రామకృష్ణయ్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి, విద్యారంగ ప్రగతికి సర్పంచ్ సహకారం అవసరమని వారు పేర్కొన్నారు. సర్పంచ్ రామకృష్ణయ్య మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు. 

December 20, 2025 / 08:55 PM IST

HYDలో సదా లక్ష్మీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: MLA

MBNR: తెలంగాణ తొలి తరం ఉద్యమకారిణి స్వర్గీయ టీఎస్ సదాలక్ష్మి విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల దళిత ఫోరం సభ్యులు శనివారం ఎమ్మెల్యేని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో తొలి తరపు ఉద్యమకారుల త్యాగాలు పోరాటాలు రాష్ట్ర సాధనకు పునాదిగా నిలిచాయన్నారు.

December 20, 2025 / 08:55 PM IST

ములుగులో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

ములుగు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ యూనియన్ భవనంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, కార్యదర్శి మేడి చైతన్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. యూనియన్ నాయకులు తదితరులున్నారు.

December 20, 2025 / 08:55 PM IST

ఈనెల 22న విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్: కలెక్టర్

BDK: ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందనతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు అప్రమత్తత అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 22న విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించాలని శనివారం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

December 20, 2025 / 08:54 PM IST

నల్లగొండ పట్టణంలో నీటి సరఫరాలో అంతరాయం

నల్లగొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేసే నీటి శుద్ధి కేంద్రానికి సంబంధించిన వాటర్ పంప్ హౌస్ వద్ద మరమ్మతుల పనులు చేపడుతున్నట్లు నల్లగొండ పురపాలక సంఘం ప్రకటించింది. ఈ పనుల కారణంగా 21, 22 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో పట్టణంలోని కొన్ని వార్డులకు మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని, 23 నుంచి యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు.

December 20, 2025 / 08:53 PM IST

ఎమ్మెల్యేను కలిసిన మోపాల్ సర్పంచ్, వార్డ్ మెంబర్లు

NZB: మోపాల్ మండల గ్రామపంచాయతీ పాలకవర్గం శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సర్పంచులు, వార్డ్ మెంబర్లను ఆయన అభినందించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుందని వెల్లడించారు. రాబోయే 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

December 20, 2025 / 08:52 PM IST

రేపు BJP కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన

MHBD: MGNREGA పథకం నుంచి గాంధీ పేరు తొలగించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు ఉ.10 గం MHBD జిల్లా BJP కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధ్యక్షురాలు డా. భూక్య ఉమా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

December 20, 2025 / 08:52 PM IST

వీబీజీ రామ్ బిల్లు పత్రుల దహనం

PDPL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీ రామ్ జీ పేరుతో తీసుకొచ్చిన బిల్లు ప్రతులను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో సీపీఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఏక పక్షంగా ఆమోదించుకుందని నాయకులు ఆరోపించారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు.

December 20, 2025 / 08:51 PM IST

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన MLA దొంతి

WGL: హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయమని CMను కోరారు. దీంతో CM, NSPT మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.30 కోట్లు మంజూరు చేశారని MLA దొంతి వెల్లడించారు.

December 20, 2025 / 08:46 PM IST

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత: మంత్రి

MDK: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు- 2026పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రమాదాల్లో ప్రతిరోజూ 18 -20 మంది మృతి చెందుతున్నారని అధికారులు వెల్లడించారు.

December 20, 2025 / 08:45 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమడుగు బీఆర్ఎస్ అధ్యక్షుడు

KMR: నల్లమడుగు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రజాక్ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రజాక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని, ప్రజలందరూ ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు.

December 20, 2025 / 08:44 PM IST

‘విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలి’

GDL: విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థి లోకం ఐక్యంగా ముందుకు సాగాలని పీడీఎస్యూ గద్వాల జిల్లా అధ్యక్షుడు హలీం పాషా పిలుపునిచ్చారు. వరంగల్‌లో జనవరి 5 నుంచి 7 వరకు నిర్వహించనున్న 23 వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను అయిజలో శనివారం ఆవిష్కరించారు. ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.

December 20, 2025 / 08:43 PM IST

‘క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలి’

WGL: క్రిస్మస్ వేడుకలను వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. మూడు నియోజకవర్గాలకు రూ.2 లక్షల చొప్పున నిధులతో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

December 20, 2025 / 08:38 PM IST