SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తీసుకుం టామని, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఎన్నికలపై అవగాహన సమావేశ నిర్వహించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, కులసంఘాలకు డబ్బు పంచడం, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేయవద్దన్నారు.
GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో మానవపాడు, అలంపూర్, ఎర్రవల్లి, ఇటిక్యాల, ఉండవెల్లి మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో మొత్తం 700 వార్డులకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి దాని వెనుకాల భారీ టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. చాలా మంది వచ్చే అవకాశం ఉండడంతో ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
HYD: ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ‘ఎంతో మంది ఉద్దండులను అందించిన OUను కేసీఆర్ కాల గర్భంలో కలిపేశారు. యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతైనా ఖర్చు చేస్తా’ అని చెప్పారు. కాగా, ఇప్పటికే ఓయూని సందర్శించిన సీఎం భారీగా నిధులు కేటాయిస్తామన్నారు.
HYD: తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. తిరుమలగిరి మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు కలెక్టరేట్ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులకు కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల ద్వారా జరుగుతున్న పనితీరు, వాటి బాధ్యతలను ఏవో సెక్షన్ అధికారులు వద్యార్థులకు వివరించారు.
NZB: రూరల్ మండలంలోని కొండూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నామపత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
HYD: పోటీ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 1,260 మంది ల్యాబ్ టెక్నీషియన్స్కు త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా వైస్ ఛైర్మన్ జీ.చిన్నారెడ్డి తెలిపారు. సీఎం ప్రజా భవన్కు భారీ ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చి తమకు పోస్టింగ్స్ త్వరగా ఇప్పించాలని కోరారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరలో పోస్టింగ్ ఇస్తారని పేర్కొన్నారు.
SRD: జహీరాబాద్ శివారులోని పస్తాపూర్లో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్మశాన వాటిక చివర్లో కట్టెలతో కొట్టి చంపారు. మృతుడు జరా సంఘం మండలం గంగాపూర్కు చెందిన మహబూబ్(32)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు తెలిపారు.
ADB: తెలంగాణ ప్రజాప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక మంత్రి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి జూప్లలి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం పర్యటన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్...
HYD: శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 710 గ్రాముల గంజాయిని స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. ఎన్టీఎఫ్ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్ ప్రాంతంలో గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై మంజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మంగ్లీ నరేష్ అనే వ్యక్తి నుంచి ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
WNP: సరిహద్దు చెక్ పోస్ట్ల వద్ద అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. మంగళవారం గోపాలపేట మండలంలోనీ బుద్ధారం చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేశాను. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలాంటి అక్రమ కలాపాలు చోటు చేసుకోకుండా కఠినంగా పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
NLG: మాడుగులపల్లి గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ సతీమణి మేడి రవేళ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. మాడుగులపల్లి GP కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రజలు తనకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు.
JN: జనగామ డీసీపీ కార్యాలయంలో మావోయిస్టు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ (34) ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలో పనిచేసిన రమేష్, పునరావాస పథకం కింద లొంగిన వారికి ప్రభుత్వం ప్రకటించిన 8 లక్షల్లో తొలి విడతగా రూ. 25 వేలును డీసీపీ రాజమహేంద్ర నాయక్ అందజేశారు.
ASF: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం అన్నారు. డిసెంబర్ 02వ తేదీ నుంచి 31వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సీపీ గౌష్ ఆలం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండవ విడత నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో భద్రతను తనిఖీ చేశారు. పాత నేరస్తుల బైండోవర్ చర్యలు తీసుకుంటున్నామని, పోలీసులకు సహకరించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.