VKB: పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.
RR: షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొమ్ము కృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. కాంగ్రెస్ సీనియర్ నేత బాల్ రెడ్డి సారథ్యంలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అండదండలతో నందిగామ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్ బాల్ స్టేడియాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. రెడ్ హిల్స్, కాప్రా, మల్లేపల్లిలో ఈ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికోసం రూ. 15 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది.
MBNR: ఉమ్మడి జిల్లా పరిధిలోని డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫీజును డిసెంబర్ 27లోగా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు జరుగుతాయని మహబూబ్ నగర్ వర్సిటీ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
HYD: రీజినల్ రింగ్ రోడ్ పనులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 6 లేన్ రోడ్ నిర్మాణంలో భాగంగా దాదాపు 161 కిలోమీటర్ల పనులకు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్ణయించారు. గతంలో నాలుగు లైన్లను నిర్మించాలని నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా 6 లైన్స్ నిర్మించాలని కోరింది.
PDPL: ప్రతి ఉద్యోగి జీవితంలో, ఉద్యోగ విరమణ తప్పని ఘట్టమని, పలువురు వక్తలు పేర్కొన్నారు. గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కండక్టర్ మణికుమారి శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా డిపోలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె సేవలను అధికారులు, నాయకులు, తోటి ఉద్యోగులు కొనియాడారు. మణికుమారిని ఘనంగా సన్మానించి, భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.
HYD: నగరంలో ఓవర్హెడ్ విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ కేబుల్స్గా మార్చేందుకు ప్రభుత్వం రూ. 4,051 కోట్లకు ఆమోదం తెలిపింది. మొత్తం 3,899 కిమీ పొడవున 33KV, 11KV, LT లైన్లను భూగర్భీకరణ చేయనున్నారు. ప్రారంభ దశలో బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాదు సెంట్రల్, హైదరాబాదు సౌత్ అనే నాలుగు సర్కిళ్లలో పనులు చేపట్టనున్నారు.
మెదక్ మండలం మల్కాపూర్ తండాలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2019లో జరిగిన ఎన్నికల్లో సైతం ఏకగ్రీవం చేశారు. మొదటి సర్పంచ్గా సరోజను ఎన్నుకున్నారు. ఈసారి దారావత్ బన్సీని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. మల్కాపూర్ తండా నుంచి బన్సీ సర్పంచ్ కానున్నట్లు సమాచారం.
SRCL: చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామంలో కొలువైన శ్రీ మోహిని కుంట మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ను సన్మానించారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్లే భక్తులు ముందుగా శ్రీ రాజరాజేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సోమవారం ఏకాదశి కావడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోడె మొక్కలు చెల్లించుకున్నారు.
ADB: దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, వంజరిగూడ, గూడెం గ్రామాలకు చెందిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు. ఈ మూడు గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని మండల అధికారులు తెలిపారు. నెల్కి వెంకటాపూర్ను జనరల్ గామార్చాలని, వంజరిగూడను వెంకటాపూర్లో కలపాలని, గూడెంలో ఎస్టీలు లేకున్నా రిజర్వ్ చేయడాన్ని నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరించారు.
WGL: రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఇవాళ పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెట్కు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
NLG: వేములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రామస్తులు తమ గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లడానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
SDPT: జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు కలెక్టర్ హైమావతి నోటీసులు ఇచ్చారు. బెజ్జంకి మండల రిటర్నింగ్ అధికారి బాలకిషన్, సహాయ రిటర్నింగ్ అధికారి పరమేశ్వర్కు నోటీసులు జారీ చేశారు. వీరికి సరైన రిపోర్ట్ ఇవ్వని మండల పంచాయతీ అధికారులు ఖాజా మొయినొద్దీన్, కలింలకు కూడా నోటీసులు పంపినట్టు తెలిపారు.
RR: జిల్లా బీజేపీ ఇంఛార్జ్గా బొక్క నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ తనను ఎన్నుకొని ప్రకటించిందని, తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.