• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ సూచనలు

MBNR: జిల్లాలో మొదటి విడతలో గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్‌లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 8న తమ ఫారం-14 తీసుకొని నేరుగా తమ ఓటు హక్కు ఉన్న మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో వినియోగించుకోవాలన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తమ ఓటును వేయొచ్చని కలెక్టర్ విజయేంది బోయి అన్నారు.

December 6, 2025 / 06:08 AM IST

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.!

MDK: సదాశివపేట మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన మార్గం నర్సమ్మ (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆమె భర్త మార్గం సత్తయ్య పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద విగత జీవిగా కనిపించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

December 6, 2025 / 06:03 AM IST

నామినేషన్ వేసిన బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి

WNP: చిన్నంబావి మండల కేంద్రంలోని బెక్కెం గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి బొందిలి కమలాబాయి నామినేషన్ వేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులు లేనందున బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

December 5, 2025 / 09:18 PM IST

పెంబాట్లలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

JGL: సారంగాపూర్ మండలంలోని పెంబట్లశ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం డిస్కవర్, స్కూటీలు రెండు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. దీంతో బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామానికి చెందిన మంజుల తలకు గాయాలయ్యయి. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సై గీత ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 5, 2025 / 09:10 PM IST

డీసీసీ అధ్యక్షుడిగా మేడిపల్లి బాధ్యతల స్వీకరణ

KNR: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఈ సందర్భంగా అలుగునూర్ చౌరస్తా నుంచి డీసీసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి నారాయణ సహా పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

December 5, 2025 / 09:08 PM IST

టాలీ దరఖాస్తుల గడువు 12కు పొడిగింపు

KNR: జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్2లో TALLY ERP 92 GST రిజిస్ట్రేషన్ల గడువును ఈనెల 12 వరకు పొడిగించినట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కరీంనగర్ IT టవర్ మొదటి అంతస్తులోని TASK కార్యాలయంలో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. TALLY నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఇది సువర్ణవకాశమని పేర్కొన్నారు.

December 5, 2025 / 09:03 PM IST

హోంగార్డులకు క్రీడ పోటిలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ

NGKL: 63వ హోంగార్డు దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్. సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఆదేశాల మేరకు ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా హోంగార్డు ఆఫీసర్స్ అందరికీ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు మానసిక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపడం కోసం క్రీడా పోటీలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు కబడ్డీ, వాలీబాల్, వంటివి నిర్వహించారు.

December 5, 2025 / 08:55 PM IST

కాలుష్యాన్ని విడుదల చేసిన పరిశ్రమపై చర్యలకు వినతి

SRD: గుమ్మడిదల మండలం గ్రామ శివారులో పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని వేదజల్లుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

December 5, 2025 / 08:54 PM IST

ఏపీ సీఎంను కలిసిన మంత్రి కోమటిరెడ్డి

NLG: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి, డిసెంబర్ 8,9 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 కు విచ్చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వానం అందజేశారు. దావోస్ ఆర్థిక ఫోరం తరహాలో జరిపే గ్లోబల్ సమ్మిట్ గురించి మంత్రి, చంద్రబాబు నాయుడుకు వివరించారు.

December 5, 2025 / 08:51 PM IST

ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి: ఏసీపీ

NZB: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు బోధన్​ రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని సాలూరలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్​మార్చ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

December 5, 2025 / 08:49 PM IST

పీజీ చదువుతున్న వారికి హాస్టల్ వసతి కల్పించాలని వినతి

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండవ సారి పీజీ చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు కోరారు. వర్సిటీ చీఫ్ వార్డెన్‌కు శుక్రవారం విద్యార్థులు కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీగేట్లో మెరిట్ ఆధారంగా రెండవ సారి సీటు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

December 5, 2025 / 08:47 PM IST

రాజకీయ ప్రజా ప్రతినిధులతో అవగాహన సదస్సు

BDK: కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్ ఆధ్వర్యంలో శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సును కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ శుక్రవారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారని అన్నారు. ఎన్నికల నియమావళి, శాంతిభద్రతల ఏర్పాట్లు అవగాహన కల్పించారు.

December 5, 2025 / 08:46 PM IST

రూ. 57.50 విలువైన విత్తనాలు చోరీ

SDPT: ములుగు మండలం కొత్తూరు నూజివీడు సీడ్ కంపెనీలో రూ. 57.50 లక్షల విలువైన 9968 కిలోల విత్తనాల చోరీకి పాల్పడిన పలువురిని అరెస్టు చేసినట్లు గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై రఘుపతి తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి చోరీలకు పాల్పడినట్లు వివరించారు. సెక్యూరిటీ పందిరి రమేష్, మరో 9 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.

December 5, 2025 / 08:45 PM IST

ప్రచార వాహనం వాడినందుకు సర్పంచ్ అభ్యర్థిపై కేసు నమోదు

SDPT: ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రచారానికి వాహనాన్ని ఉపయోగించినందుకు హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ సర్పంచ్ అభ్యర్థి రవీందర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని హెచ్చరించారు.అనుమతులు లేకుండా ప్రచార వాహనాలు, మైకులు వాడ రాదన్నారు.

December 5, 2025 / 08:44 PM IST

బూరుగడ్డ బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి‌గా నామినేషన్

SRPT: హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామపంచాయతీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి మాడుగుల లక్ష్మీనారాయణ ఉపేంద్ర రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్ చింతలపూడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరిగినది. రానున్న రోజుల్లో కాషాయ జెండా అన్ని గ్రామాలలో ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రబారీగా నియమించబడ్డ రామరాజు, జిల్లా నాయకులు కంటు నాగరాజు తదితరులు ఉన్నారు.

December 5, 2025 / 08:41 PM IST