KNR: క్యాన్సర్కు భయపడాల్సిన అవసరం లేదని, ముందస్తు పరీక్షల ద్వారా దీన్ని అధిగమించవచ్చని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలోని ఆల్ఫ్రెడ్ నోబెల్ పాఠశాలలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ‘మహిళ ఆరోగ్యం- క్యాన్సర్ స్క్రీనింగ్’ పేరిట నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
KMR: బిచ్కుంద మండలంలోని పెద్ద తక్కడ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మి, కృష్ణ పోటీ చేస్తున్నారు. వారు మాట్లాడుతూ.. మన ఊరి అభివృద్ధి కోసం పని చేస్తామని, కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి తమను గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు. నేను కేవలం పదవి కోసం రాలేదు మన ఊరి ప్రగతి కోసం పోటీ చేస్తున్న అని పేర్కొన్నారు.
క్రైస్తవులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని TPCC ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని న్యూ మోతి నగర్ బెతెస్తా హోలీ చర్చ్ ఏడవ వార్షికోత్సవ వేడుకలకు మిథున్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ శామ్యూల్, ప్రధాన కార్యదర్శి థామస్, ఫౌండర్ పృథ్వీరాజ్, పాస్టర్ తిమోతిరాజ్ పాల్గొన్నారు.
VKB: పరిగి నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 20 మంది గ్రామపంచాయతీ సర్పంచ్లుగా ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి అని ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పరిగిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి, ప్రజలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకున్నారనీ పేర్కొన్నారు.
MHBD: తోర్రూర్ (M) కంఠాయపాలెం గ్రామంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గ్రామంలో మునుపెన్నడు లేని విధంగా ఈసారి సర్పంచ్ బరిలో 4 అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే గ్రామంలో మంచి ఆదరణ కలిగిన బాల్నే సునీత- అంజయ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో బాల్నే సునీతకు గ్రామంలో విశేష ప్రజాధరణ లభిస్తోంది.
ASF: రేపు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. ఈ క్రమంలో సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
WGL: బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాటోత్ అనిల్ నాయక్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ లో చేరారు. తండా గ్రామ సమగ్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానుమన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గూగులోత్ స్వప్న విజయ్కి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.
MDK: తూప్రాన్ మండలంలో బుధవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అనుమతించిన ఇసుకను అక్రమంగా సేకరించి, రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. తూప్రాన్ వద్ద ఎస్సై శివానందం ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా.. మెదక్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.
KNR: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025లో భాగంగా జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరగనున్న చొప్పదండి మండలం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.
NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం పండగ సాయన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడలోని బీసీ భవనంలో ఆయన చిత్రపటానికి బీసీ జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో-కన్వీనర్ దాసరాజు జయరాజు, చేగొండి మురళి యాదవ్, కొండ రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
WNP: హైదరాబాద్లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘనపూర్ PACSలో విధులు నిర్వహిస్తున్న అల్లమయిపల్లికి చెందిన యుగంధర్ గౌడ్ (28) మృతి చెందారు. ఆయన అకాల మరణంపట్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. యుగంధర్ గౌడ్ మృతిపట్ల మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్, కార్యాలయ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
SRD: న్యాయవాద రక్షణ చట్టం కోసం కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి నెమలికొండ హరీష్ అన్నారు. సంగారెడ్డిలో హైకోర్టు న్యాయవాద ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. జూనియర్ న్యాయవాదులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
JGL: జిల్లాలో జరిగే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP అశోక్ కుమార్ తెలిపారు. బీమారం, కోరుట్ల, మెట్పల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి పోలింగ్ సామగ్రిని ఎస్కార్ట్ కేంద్రాలకు పంపించారు. 1,172 పోలింగ్ కేంద్రాలకు 843 మంది పోలీసులను నియమించామని, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.
KMR: మద్నూర్ మండలంలోని పెద్ద షాక్కర్గ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విశాలాక్షి గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. విశాలాక్షి కుటుంబం రాజకీయంగా పెట్టిన పేరుగా, ఈ కుటుంబంలో సర్పంచిగా ఎంపీటీసీగా, ఎంపీపీగా జెడ్పీటీసీగా పదవులు చేపట్టారు. గ్రామ ప్రజలకు ఎన్నో ఏండ్లుగా సేవలు అందిస్తూ వస్తున్నారు.
KNR: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ. 7,450 పలకగా బుధవారం రూ.50 తగ్గి రూ.7,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం మార్కెట్కు రైతులు 62 వాహనాల్లో 446 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్లో కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.