KMM: విద్యుత్ ఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
NLG: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని శాలిగౌరారం ఎస్సై సైదులు అన్నారు. మండల పరిధిలోని పలు సమస్యాత్మక గ్రామాలను పోలీస్ విభాగం గుర్తించింది. గురువారం మండలంలోని భైరవునిబండ, ఎన్జీ కొత్తపల్లి తదితర గ్రామాల్లో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్సైలు సైదులు, రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
SRD: సీగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం వెంటనే ఇవ్వాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ జిల్లా ఛైర్మన్ వై అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. పటాన్చెరు మండలం పాశమైలారం సమీపంలోని సిగాచీ పరిశ్రమ కార్యాలయంలో గురువారం వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనిమిది మందికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆరోపించారు.
KMR: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లకు అధికారులు నియామకపత్రాలు అందజేస్తున్నారు. వర్ని మండలంలోని సైదాపూర్ తండా గ్రామానికి చెందిన బానోత్ శ్రీరామ్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు గురువారం అధికారులు సర్పంచ్గా నియామక పత్రం అందజేశారు. బానోత్ శ్రీరామ్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.
GDL: గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్ సమీపంలోని ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇటీవల వడ్ల లారీలు ఇరుక్కుపోయి, అతికష్టం మీద వాటిని బయటికి తీశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు ప్రమాదకరంగా మారడం పట్ల వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు దుప్పట్లను అందజేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి కోరారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు దుప్పట్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరగతిన దుప్పట్లను అందించాలని డిమాండ్ చేశారు.
KMR: సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో జోనల్-2 పరిధిని జోనల్-3కి మార్చిన సందర్భంగా జోనల్-8 ఆఫీసర్ ప్రత్యూష గురువారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్కు పూల మొక్కను అందించారు. పాఠశాలల్లో నూతనంగా జరిగిన జోన్ల మార్పిడికి సంబంధించిన వివరాలను ప్రత్యూష కలెక్టర్కు వివరించారు.
SRD: మునిపల్లి మండలం గార్లపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈశ్వరప్ప, మాజీ సర్పంచ్ నాగేందర్ పటేల్ తమ అనుచరులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ పాల్గొన్నారు.
NLG: ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభల పోస్టర్ను యూనియన్ నాయకులు నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం మాట్లాడుతూ.. రాష్ట్ర ఐదవ మహాసభలు మెదక్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయని తెలిపారు. 7న జరిగే బహిరంగ సభకు సంఘాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
MBNR: జడ్చర్ల మండలం గంగాపూర్లో నామినేషన్ పరిశీలన కేంద్రాలను సాధారణ ఎన్నికల అధికారి కాత్యాయని దేవి గురువారం పరిశీలించారు. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు.
PDPL: సంకల్ప ముందు అంగవైకల్యం అడ్డు రాదని, జీఎం నరేంద్ర నరేంద్ర సుధాకర్ రావు అన్నారు. రామగుండం –3, అడ్రియాల ఏరియాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు గురువారం నిర్వహించారు. దివ్యాంగుల కోసం మ్యూజికల్ చైర్, త్రో బాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, అందరికీ జ్ఞాపికలు, భోజన వితరణ చేశారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.
JGL: కోరుట్ల మండలం మాదాపూర్, పైడిమడుగు, కల్లూర్, యూసఫ్ నగర్, నాగులపేట గ్రామాలలో గురువారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పి రాములు పర్యవేక్షణలో నిర్వహించారు. సీఐ సురేష్ బాబు, ఎస్సైలు చిరంజీవి. రామచంద్రం, నవీన్ కుమార్, పాల్గొన్నారు.
MBNR: దత్తాత్రేయస్వామి జయంతి సందర్భంగా గురువారం పాలమూరులోని తూర్పు కమాన్ దగ్గర దత్తాత్రేయ ఆలయంలో జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆలయాన్ని దర్శించుకోని, ప్రత్యేక పూజలు చేశారు. దత్తాత్రేయస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అంతకుముందు అర్చక బృందం ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పెద్దపల్లి విద్యార్థి బెజ్జంకి భృవిక్ చంద్రన్ చారి రాష్ట్ర స్థాయి అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలకు అర్హత సాధించాడు. జిల్లా స్థాయి ఎంపికల్లో భృవిక్ అద్భుత ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల ప్రశంసలు పొందాడు. బ్యాట్స్ మెన్గా వరుస పరుగులు చేసి మెరిశాడు. భద్రాచలంలో జరగనున్న రాష్ట్రస్థాయి సెలక్షన్స్కు భృవిక్ హాజరుకానున్నాడు.