నల్గొండ మండలం అక్కలాయగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ నిర్వాకం కలకలం రేపుతుంది. పాఠశాల ఆవరణలోని సుమారు 40 ఏళ్ల నాటి 15 భారీ వృక్షాలను నరికి అమ్ముకున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాగి, మర్రి, వేప, మేడి చెట్లు నరికివేయబడినట్టు సమాచారం. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన గ్రామస్థులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని తెలిపారు.
BHPL: విధి నిర్వహణలో మరణించిన మున్సిపల్ వర్కర్ రాజయ్య కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రెండో రోజు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ ఆందోళనకు మాజీ MLA GVR మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
★ మద్యం షాపు గ్రామంలోకి రావాలంటూ జఫర్గడ్లో వినూత్న నిరసన★ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి: కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్★ పాలకుర్తిలో ఇందిరా మహిళా శక్తి టీ పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని★ కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: రాజయ్య
SRPT: అగర్తలలో జరగనున్న జాతీయ స్థాయి చెస్ పోటీలకు సూర్యాపేట రాడికల్ చెస్ అకాడమీ విద్యార్థిని మాస్టర్ ఇందిర ఎంపికైంది. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకుడు అనిల్ కుమార్ విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. 17 ఏళ్ల విభాగంలో ఎంపికైన ఇందిరను ఎస్పీ అభినందిస్తూ, జాతీయ స్థాయిలో విజయం సాధించి జిల్లాకు పేరు తేవాలని ఆశించారు.
JGL: గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామంలో విద్యుత్ వైర్లు, స్థంభాల పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బీ.సత్య ప్రసాద్తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ధర్మపురి నియోజకవర్గంలోని 140 గ్రామాలకు 4.03 కోట్ల నిధులు మంజూరు కాగా, శ్రీరాములపల్లె ఎస్సీ కాలనీలో ఈ పనులు మొదటగా ప్రారంభమయ్యాయి.
SDPT: బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. కోహెడ మండలానికి చెందిన మైల శంకర్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని కారు అతివేగంగా వచ్చి వెనుక నుండి కొట్టింది.
JGL: జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో మంగళవారం ఎస్సై ఉమా సాగర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అపరిచిత కాల్స్, డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేవారిని నమ్మవద్దని, మోసపోవద్దని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల కేంద్రంలో మంగళవారం అడ్డాకుల మండలం రాచాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
NZB: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, అన్ని రంగాల్లో వారు పురోగతి సాధిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలో 24, మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో 39 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
PDPL: పెద్దపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. సీఎస్సీ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, జీవో 12 సవరించి సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కాకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు నిధులను అక్రమంగా బీమా కంపెనీలకు బదిలీ చేశారంటూ నేతలు తీవ్రంగా ఖండించారు.
ASF: హైదరాబాద్-నాగపూర్ హై స్పీడ్ కారిడార్లో ఆప్షన్-5 ఖరారు చేయాలని NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఆప్షన్-1 వల్ల అత్యవసర పరిస్థితుల్లో 80-120KM అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్షన్-5 అమలు చేస్తే ప్రయాణ సమయం 2-3 గంటలు తగ్గి గిరిజన ప్రాంతం అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు.
PDPL: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి డా. పీఎం షేక్ ప్రారంభించారు. పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో క్రియాత్మక బోధన ఇవ్వాలని, ప్రేమపూర్వక పలకరింపుతో నేర్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోల్డ్ బల్బీర్ కౌర్లు పాల్గొన్నారు.
NLG: మహిళలు చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మహిళల కోసం మహిళలే అండగా నిలబడాలని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని ఇస్తుందన్నారు. మహిళలు శక్తివంతంగా ఎదగాలన్నారు.
BDK: జిల్లాలో జాతీయ స్థాయి కోర్సులతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని, సీఎం సభ స్థలాన్ని వారు పరిశీలించారు. అలాగే అధికారులకు పలు సూచనలు చేశారు.
MDK: అభివృద్ధి పనులను నాణ్యవంతంగా చేపట్టాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. పెద్ద శంకరంపేటలో ఇటీవల కాలంలో సిసి రోడ్డు నాణ్యత లేకుండా నిర్మించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అదే రహదారిపై రూ. 15 లక్షలతో మళ్లీ సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇలాంటి దుస్థితి మరోసారి రాకుండా చూడాలన్నారు.