• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇక్కడ ఖైదీలే వ్యవసాయం చేస్తారు..!

హైదరాబాద్ శివారు చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రం 128 ఎకరాలలో విస్తరించి ఉంటుందని అధికారులు తెలిపారు. వ్యవసాయంతో పాటు, కూరగాయలు, పండ్ల తోటలు, నర్సరీ, తేనెటీగలు, చేపలు పెంపకం, అడ్వెంచర్ పార్క్, యోగ కేంద్రం వంటివి అందుబాటులో తెచ్చారు. రోజుకు 30 నుంచి 40 మంది ఖైదీలు ఇందులో పనిచేస్తున్నట్టుగా పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా జైలు సిబ్బంది వ్యవసాయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

November 18, 2025 / 08:56 PM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం

SRD: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులు హరించేందుకు నాలుగు లేబర్ చట్టాలను అమలు చేస్తుందని విమర్శించారు. వాటిని రద్దు చేసే వరకు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

November 18, 2025 / 08:52 PM IST

అంగన్వాడీ రికార్డులు తగలబెట్టిన దుండగులు.!

MDK: చిలిపిచేడ్ మండలం జగ్గంపేటలో అంగన్వాడీలో భద్రపరిచిన అంగన్వాడీ రికార్డులను గుర్తుతెలియని వ్యక్తులు తగల బెట్టారని అంగన్వాడీ టీచర్ షహనాజ్ భేగం తెలిపారు. టీచర్ వివరాల ప్రకారం.. 1987 నుంచి ఉన్న రికార్డులను రూమ్‌లో భద్రపరచగా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అన్ని కాలిపోయాయని చెప్పారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

November 18, 2025 / 08:49 PM IST

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన స్వాములు

HYD: సికింద్రాబాద్ MRO కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం నిర్వహించిన సోదాల్లో, సర్వేయర్ కిరణ్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంఆర్‌‌వో కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. స్వాములుగా ఉండి ఇలా చేయడంతో స్థానికులు ఆగ్రహిస్తున్నారు.

November 18, 2025 / 08:47 PM IST

అభివృద్ధి పనులకు ప్రారంభించిన మంత్రి

KMM: ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామ అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.8 కోట్ల 50 లక్షలు విడుదల చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం గూడూరుపాడులో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. గూడూరుపాడు ఆకేరు మార్గానికి రూ.1.10 కోట్లు వ్యేయంతో ప్రారంభించారు.

November 18, 2025 / 08:46 PM IST

డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన

NZB: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు, వాటికి బానిస కావడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు.

November 18, 2025 / 08:45 PM IST

డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థుల సామూహిక ప్రతిజ్ఞ

WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ అభియాన్‌లో భాగంగా విద్యార్థులచే డ్రగ్స్ నిర్మూలనపై సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు.

November 18, 2025 / 08:43 PM IST

‘నిర్వాసితులకు వెంటనే ప్లాట్లను కేటాయించండి’

MBNR: జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు వెంటనే ప్లాట్లను కేటాయించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించే ప్రాంతంలో రహదారులు మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నవీన్ కుమార్ పాల్గొన్నారు.

November 18, 2025 / 08:42 PM IST

‘ఐకేపీ మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి’

KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని శాబ్దిపూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు వీలుగా జిల్లాలో పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతను వారికి అప్పగించినట్లు తెలిపారు.

November 18, 2025 / 08:42 PM IST

అలర్ట్.. మంచినీటి సరఫరా బంద్

MBNR: జిల్లా నగరపాలక పరిధిలో మూడు రోజులపాటు తాగునీరు సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఊటుకుంట రైల్వే ట్రాక్ సమీపంలో పైప్ లైన్ లీకేజీ కారణంగా అంతరాయం ఉంటుందన్నారు. ఈనెల 19 నుంచి 21 వరకు అంతరాయం ఏర్పడనెంది. తిరిగి 22న సరఫరా చేస్తామని చెప్పారు.

November 18, 2025 / 08:40 PM IST

‘ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి’

WNP: జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు చలి కాలంలో ఇబ్బందులు లేకుండా కిటికీలు మరమ్మతులు చేయించుకోవాలన్నారు.

November 18, 2025 / 08:40 PM IST

‘వేములవాడ వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలి’

SRCL: వేములవాడకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. భక్తులకు కల్పించాల్సిన వసతులపై ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

November 18, 2025 / 08:38 PM IST

‘చలి నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి’

MDK: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల శీతాకాల చలి నుంచి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సరఫరా చేశామని, చలి తీవ్రంగా ఉన్నందున రక్షణగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని సూచించారు. జిల్లా అధికారులు విజయలక్ష్మి, నీలిమ పాల్గొన్నారు.

November 18, 2025 / 08:36 PM IST

‘ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి’

KMR: తాడ్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. మండలంలో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగాలని ఆయన ఆదేశించారు. అధికారులు లబ్ధిదారులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సకాలంలో బిల్లులను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

November 18, 2025 / 08:34 PM IST

సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన రాయల

KMM: హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను మంగళవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన రాయలను సీఎం, డిప్యూటీ సీఎం అభినందించారు.

November 18, 2025 / 08:33 PM IST