SRPT: గ్రామాల్లో యువత కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, NSUI మునగాల మండల అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మునగాల మండల కేంద్రంలో గురువారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో యువత కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.
VKB: విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు నిరాకరించవద్దని వికారాబాద్ డీఈవో రేణుకాదేవి పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, పీఈఎన్ నంబర్ వంటి పత్రాలు లేవనే కారణంగా అడ్మిషన్లను నిలిపివేయడం సరికాదన్నారు. ఇతర పాఠశాలలో ప్రవేశం పొందడానికి విద్యార్థులు కోరిన వెంటనే TC ఇవ్వాలని ఆదేశించారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, లాలాగూడ ఎలక్ట్రికల్ లోకో షెడ్ పరిసర ప్రాంతాలను డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ విస్తృతంగా పరిశీలించారు. మెకానికల్ సంబంధించిన అంశాలను పూర్తిగా పరిశీలించిన ఆయన, ఎప్పటి కప్పుడు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని, ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
SRPT: నూతనకల్ మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు ధాన్యం లారీ బోల్తాపడి సంఘటన గురువారం ఉదయం జరిగింది. వివరాల్లో వెళ్తే.. మద్దిరాల నుంచి దాన్యం లోడుతో సూర్యపేట వైపు వెళ్తున్న లారీ నూతనకల్ మండల కేంద్రాల్లోకి రాగానే కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయి అధిక లోడుతో ఉన్న ధాన్యం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.
MDK : నర్సాపూర్ పట్టణంలోని ఆదిపరాశక్తి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన పరివార దేవత నూతన ఆలయ యంత్ర విగ్రహ శికర ప్రతిష్ఠ మహోత్సవం భక్తి పూర్వకంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దేవాలయ పండితుల ఆధ్వర్యంలో వైదిక మంత్రోచ్ఛారణలతో శికర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7 మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7 మండలాల్లోని 191 గ్రామాలు,1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.
MDK: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేటకు చెందిన నవ వరుడు నాందేడ్ నరేష్, తన వివాహ సందర్భంగా భార్యకు వినూత్న కానుక ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన సంప్రదాయ బహుమతులకు బదులుగా ఒక సంస్థలో తన పేరు మీద సేవింగ్స్ ప్లాన్(బీమా) తీసుకుని, తన భార్య కావేరిని నామినీగా చేర్చారు. భవిష్యత్ అవసరాల కోసం ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవ దంపతులు తెలిపారు.
MNCL: దండేపల్లి మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహాన్విత(7) మృతదేహం లభ్యమైనది. రెండు రోజుల క్రితం మహాన్విత అదృశ్యం కాగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గురువారం ఇంటి సమీపంలోని బావిలో మహాన్విత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె మృతిపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. మహాన్విత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
KNR: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో బుధవారం గ్రామ ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. ఘర్షణలను ఎవరు ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు.
MDCL: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్నగర్లో నివాసం ఉండే బాలుడు (11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.
MNCL: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 29న మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ నందు దివ్యాంగులకు ఆటల పోటీలు జరగాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల కోడ్ ప్రభావంతో అంతర్జాతీయ దివ్యాంగుల ఆటల పోటీలు వాయిదా పడినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్ తర్వాత మళ్లీ ఈ పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
KMM: నగరంలో ప్రధాన రవాణా కేంద్రమైన రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. రహదారిని వెడల్పు చేసే క్రమంలో బుధవారం షాపింగ్ కాంప్లెక్స్లను తొలగించి, పక్కనే డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు జేసీబీలతో ముమ్మరం చేశారు. పాత మున్సిపాలిటీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
BHPL: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 గ్రామ పంచాయతీలు, 712 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుని గ్రామాల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు.
HYD: నాగోల్ వసంత హిల్స్ అనిసెంట్ స్కూల్ నుంచి డిసెంబర్ 28వ తేదీన మెగా మారథాన్ జరగనుంది. దీనికి సంబంధించి నాగోల్ పోలీసులు పోస్టర్ ఆవిష్కరించారు. 5K,10K, 16K, 20K రన్ ఉండనుంది. QR కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. శారీరక శ్రమపై అవగాహన కల్పించడం కోసం అభివృద్ధి చెందిన నగరాల్లో మారథాన్లు నిర్వహిస్తున్నారు.
SDPT: ప్రేమించిన యువతి దక్కడం లేదని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాలిలా.. వర్గల్ మండలం అంబర్పేట వాసి పవన్ కళ్యాణ్ (21), ఓ యువతి ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఇంటికి వెళ్లిన పవన్పై యువతి తండ్రి శ్రీనివాస్ బంధువులు మహేష్, తిరుపతి కలిసి దాడి చేశారు. దీంతో గడ్డి మందు తాగిన పవన్ చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందాడు