• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హుజూర్‌నగర్‌కు మంద కృష్ణ మాదిగ రాక

SRPT: MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ జనవరి 3న హుజూర్‌నగర్‌కు రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దళితుల హక్కులు, సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు భారీగా హాజరుకావాలని HNR నియోజకవర్గ ఇంఛార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ పిలుపునిచ్చారు.

December 31, 2025 / 09:03 PM IST

జాగిలాలతో తనిఖీలు చేసిన పోలీసులు

NRPT: డిసెంబర్ 31 పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో బాంబు డిస్పోజల్ బృందాలు, జాగిలాలతో తనిఖీలు చేసినట్లు SI వెంకటేశ్వర్లు తెలిపారు. బస్టాండ్, ప్రధాన కూడళ్లు, కొరియర్ దుకాణాలు, లాడ్జి, పాన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో తనిఖీలు చేశారని చెప్పారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

December 31, 2025 / 08:59 PM IST

న్యూ ఇయర్.. 108 సిబ్బంది అప్రమత్తం

MBNR: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో 108 అంబులెన్స్ మెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్ తెలిపారు. DEC 31ST రాత్రి యువత ఉత్సాహంతో వాహనాలను వేగంగా నడిపే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలని అన్నారు.

December 31, 2025 / 08:57 PM IST

‘మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసు నమోదు చేస్తాం’

ADB: మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసు నమోదు చేస్తామని నార్నూర్ సీఐ అంజమ్మ హెచ్చరించారు. ఆమె బుధవారం మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా, రాష్ డ్రైవింగ్, రేసింగ్, మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనం సీజ్ చేసి జరిమానా విధిస్తామన్నారు.

December 31, 2025 / 08:49 PM IST

రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు అల్లిపూర్ విద్యార్థిని

JGL: రాయికల్ మండలం అల్లిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శశి ప్రియ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు ఎంపికైంది. కథలాపూర్ మండలం ఊట్పల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో ఈ బాలిక పాల్గొని 2 కి.మీ.ల విభాగంలో ప్రతిభ కనబరిచింది. జనవరి 2న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు హెచ్ఎం కిరణ్, తెలిపారు.

December 31, 2025 / 08:46 PM IST

వివాహాలకు రూ.1 లక్ష ప్రోత్సాహకం: కలెక్టర్

GDWL: దివ్యాంగుల వివాహాల కోసం ప్రభుత్వం రూ.1 లక్ష ప్రోత్సాహక బహుమతి అందిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ బుధవారం వెల్లడించారు. ఇప్పటివరకు సకలాంగుల వివాహాలకు ఈ ప్రోత్సాహకం అందించగా, తాజాగా దివ్యాంగుల వివాహాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారు www.epass.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

December 31, 2025 / 08:45 PM IST

రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీ.. పలువురికి గాయాలు

MLG: రెండు ఆటోలు ఎదురుగా ఢీకొని పలువురికి గాయాలైన ఘటన మంగపేట మండలంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళ్తే.. మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ పెరకలకుంట సమీపంలో 2 ఆటలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడ్డవారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

December 31, 2025 / 08:38 PM IST

సంగారెడ్డి ఆర్డీవోగా పాండు

SRD: సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారిగా పాండు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఆర్డీవోకు కార్యాలయ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తారని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.

December 31, 2025 / 08:38 PM IST

హైవేపై యాక్సిడెంట్.. ఒకరు స్పాట్ డెడ్

KMR: భిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన స్వామి (56) మృతి చెందినట్లు సర్పంచ్ పద్మ, స్వామి తెలిపారు. జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందించినట్లు సర్పంచ్ చెప్పారు.

December 31, 2025 / 08:38 PM IST

పంచాయతీ కార్యదర్శిపై డీపీవోకు ఫిర్యాదు

PDPL: రామగిరి మండలం రాజపూర్ గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా డీపీవో వీరబుచ్చయ్యకు సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ కలవేణ శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను, ఇతరితర పన్నుల రూపంలో వచ్చిన నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకుని దుర్వినియోగం చేశారని తెలిపారు. విచారణ జరిపి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

December 31, 2025 / 08:38 PM IST

‘ గ్రామంలో సెల్‌టవర్ అవసరం’

NGKL: బాల్మూరు మండలం మహాదేవ్‌పూర్ గ్రామంలో సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో టవర్ లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ సహా ఇతర సేవలకు సమాచారం అందించడం తీవ్రంగా ఇబ్బందిగా మారిందని వారు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

December 31, 2025 / 08:34 PM IST

KCRను కలిసిన ఎమ్మెల్సీ పోచంపల్లి

MHBD: MLC పోచంపల్లి శ్రీనివాస్ బుధవారం మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించినందుకు KCRకు పోచంపల్లి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేలా శాసనమండలిలో గట్టిగా పోరాడాలని కేసీఆర్ ఆయనకు సూచించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

December 31, 2025 / 08:33 PM IST

ప్రెస్​క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు

NZB: నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెలవడడంతో.. నూతన కార్యవర్గానికి బుధవారం ఎన్నికల అధికారి భాను నియామక పత్రాలు అందజేశారు. ప్రెస్​క్లబ్ అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా వాగ్మారే సుభాష్, నిర్వహణ కార్యదర్శిగా రాజు, ఉపాధ్యక్షులుగా బైస సంగీత, సతీష్ గౌడ్, గోవిందరాజు ఎన్నికయ్యారు.

December 31, 2025 / 08:32 PM IST

ఫుడ్ సేఫ్టీలో నో కాంప్రమైజ్..!

MDCL: హోటల్ తిండి మీద GHMC గట్టి నిఘా పెట్టింది. 2025లో 9,656 సార్లు తనిఖీలు చేసి, క్వాలిటీ లేని వాళ్లకు రూ.14.84 లక్షల పెనాల్టీ వేశారు. KPHBలో కొత్తగా అదిరిపోయే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వస్తోంది. ఇక హెల్త్ విషయానికొస్తే, గతేడాదితో పోలిస్తే డెంగ్యూ కేసులు 30% తగ్గాయట. ఇంటింటికీ తిరిగి దోమల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.

December 31, 2025 / 08:32 PM IST

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

HYD: ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారాలకు అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

December 31, 2025 / 08:30 PM IST