NZB: ఈత వనాలు పెంచి గౌడన్నల ఆదాయాన్ని పెంచుతామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మంగళవారం అన్నారు. మోపాల్ మండలం తానకుర్ధులో వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈత మొక్కలను నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం గౌడ కులస్థుల ఆదాయాన్ని పెంచేలా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
SRCL: అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య లక్ష్మి ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడి టీచర్ బుర్ర రేణుక అన్నారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామం రెండవ అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా అందిస్తున్న పథకాలను గర్భిణీలు, బాలింతలకు వివరించారు.
MBNR: కోటకదిర గ్రామంలో మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్టు జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముదిరాజులందరూ జాతి ఐక్యత కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనకు రావాల్సిన న్యాయమైన సబ్సిడి ఋణాలపై అవగహన కలిగి ఉండి ఆర్థికంగా ఎదగాలన్నారు.
NGKL: కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో మంగళవారం జనసేన కార్యకర్తలకు సభ్యత్వ ఇన్సూరెన్స్ కిట్లను నాయకులు పంపిణీ చేశారు. పార్టీ సభ్యత్వం చేసుకున్న ప్రతి జనసేన కార్యకర్తకు ఈ ఇన్సూరెన్స్ కిట్లు ఆపదలో ఆదుకుంటాయని వారు తెలిపారు. జనసేన అందరికీ అందుబాటులో ఉంటుందని వారన్నారు. కార్యక్రమంలో రవి యాదవ్, సాయి, మున్నా, సాయి తదితరులు పాల్గొన్నారు.
NLG: నల్గొండ సీపీఐ జిల్లా కార్యదర్శిగా నెల్లికంటి సత్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరకొండలో జరిగిన జిల్లా 23వ మహాసభలో ఆయనను మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. సహాయ కార్యదర్శులుగా పల్లా దేవేందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ నియమితులయ్యారని CPI కార్యవర్గాలు తెలిపాయి.
GDWL: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రాజెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలని ఘట్టు మండల రైతువేదికలో మంగళవరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ శ్యామల సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు.
GDWL: మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డి గ్రామంలో నూతన వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకై నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ను మంగళవారం గ్రామస్తులు ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించి ₹10,000 రూపాయలు విరాళం అందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ ఆలయాలకు నిర్మాణానికి నా వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
MBNR: జిల్లాలోని రవీంద్రనగర్లో కొలువైన శీతలాదేవి పోచమ్మ అమ్మ వారికి బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈరోజు కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిండి ప్రాజెక్టుపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ ద్వారా ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించాలని సూచించారు.
KMM: కూసుమంచిలో ఈనెల 17న ఇందిరా శక్తి సంబరాల్లో భాగంగా స్వయం సహాయక బృందాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం మంత్రి పర్యటన ఏర్పాట్లను సీఐ సంజీవ్ పరిశీలించారు.
WGL: రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో మంగళవారం వనమహోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులతో కలిసి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని తెలిపారు.
KMR: రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఆమె పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు,ప్రజల సమస్యలపై అధికారులతో చర్చించారు.
NZB: మోపాల్ మండలంలోని కంజర, బాడ్సి, మంచిప్ప గ్రామాలకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం నిర్మించిన నూతన లైన్ను ఎమ్మెల్యే భూపతి రెడ్డి మంగళవారం బాడ్సి సబ్ స్టేషన్లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
KMM: నగరంలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో టీచర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన నియమించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి పురందర్ మంగళవారం తెలిపారు. జూ.లెక్చరర్-1, బయో సైన్స్-1కు మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. సంబంధిత సబ్జెక్టులో PG, BED 50%తో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టరేట్లో ఈనెల 18 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SRD: ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఎస్సైలు మల్లయ్య, షేక్ షాబుద్దీన్లను ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ.. వీరిద్దరూ పోలీస్ శాఖలో విశేష సేవలు అందించినట్టు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, ఎవో కళ్యాణి పాల్గొన్నారు.