MBNR: హన్వాడ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ప్యాట అనంతరెడ్డికి మద్దతు ప్రచారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామాలలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు.
నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సత్తవరం లక్ష్మీ కరుణాకర్ రెడ్డిని, వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఇంటింటికి తిరుగుతూ కోరారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలన్నారు.
వరంగల్ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో భారతీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆవును జాతీయ జంతువుగా, భారతదేశాన్ని హిందూ దేశంగా, చేరితంను జాతీయ పుస్తకంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మొత్తం ఐదు కోట్ల మంది సంతకాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 90 కేసుల్లో 1337 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు.
RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి సర్పంచ్ నరేందర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారికి అభినందనలు తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గెలుపుకు కష్టపడ్డ బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
MDK: ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మనోహరాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడ్ల కొనుగోలు నెమ్మదించడంతో పండిన పంట గిట్టుబాటు కాక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి ఎప్పుడు కొంటారో అని ఎదురుచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
HNK: కాజీపేట పట్టణంలోని చిట్టి వద్ద శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ బైకుకు 103 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ బైకుకు మొత్తం రూ. 25,105 ఫైన్ ఉన్నట్లు ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపారు. వెహికల్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు.
MDK: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ నగర్ కు చెందిన కోహెడ పర్శరాములుగౌడ్, మద్యానికి బానిసై పని చేయకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం భార్యతో గొడవ జరిగిన తర్వాత, గురువారం భార్య కుమార్తెను కళాశాలకు వదిలి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ వివరాలు సేకరించారు.
RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం మక్తగూడ గ్రామ సర్పంచ్గా గెలిచిన శ్రీరాములు మొదళ్లగూడలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సన్మానించిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తూ బీఆర్ఎస్ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలన్నారు.
ASF: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆమె శుక్రవారం జైనూర్ మండలంలో పర్యటించారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉందన్నారు.
RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం ఉప్పరగడ్డ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధించిన చందునాయక్ను పలువురు ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి పట్ల చందు నాయక్ చూపిస్తున్న కృషి, ప్రజలపై ఆయనకు ఉన్న అనుబంధం ఈ విజయానికి కారణమన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా మరింత సేవ చేయాలన్నారు.
ADB: ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్త తొడసం లక్ష్మీబాయి కోడలు తొడసం మహేశ్వరి మధ్య జరిగిన రసవత్తర పోరులో కోడలుపై అత్త విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన తొడసం లక్ష్మీబాయి తన కోడలు తొడసం మహేశ్వరిపై 140 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల ఫలితాల్లో గ్రామ రాజకీయ ఆసక్తిని రేకెత్తించాయి.
VKB: పరిగి నియోజకవర్గంలో గడిసింగాపూర్ నుంచి రంగారెడ్డి పల్లి వరకు జరుగుతున్న డబల్ రోడ్డు పనులను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లాల్ పహాడ్ నుంచి చిట్టెంపల్లి వరకు కూడా డబల్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. లక్నోలో ఈనెల 13 నుంచి జరిగే జాతీయస్థాయి SGF అథ్లెటిక్స్ పోటీల్లో చిన్నుబాయి, శాంతి, శరణ్య, అఖిల పాల్గొంటారని తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ లింబరావు, వ్యాయమ ఉపాధ్యాయులు మీనారెడ్డి పేర్కొన్నారు.