WNP: కొత్తకోట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణం, కేసుల్లో సీజ్ అయిన పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకు ఉన్న మొదటి నమ్మకం ఇక్కడికి అడుగుపెట్టిన పౌరుడు ముందుగా స్టేషన్ రూపం చూస్తాడని అన్నారు.
NRPT: మాగనూరు మండలంలోని కొల్పూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ ఎన్నికల్లో వేరువేరు పార్టీల నుంచి తండ్రీ కూతుళ్లు ముద్దు రాములు, ముద్దు నవ్యాలు పోటీ చేస్తున్నారు. దీంతో తండ్రి కూతుర్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని కట్టోజు నీరజ జాతీయ కథా రచన పోటీల్లో మొదటి స్థానం సాధించింది. బాలచెలిమి మాసపత్రిక, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో అక్కన్నపేట మండలం, నీరజ రచించిన “చెట్టు ఉపకారం” కథకు ఈ గౌరవం దక్కింది. పర్యావరణ దృక్పథం, మానవీయ విలువలు నేపథ్యంగా సాగిన ఈ కథను అధ్యాపకులు అభినందించారు.
వనపర్తి జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత చేపట్టాల్సిన ఏర్పాట్లులపై అవగాహన కల్పించారు.
KMM: కామేపల్లి మండలం పొన్నెకల్లు గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి. నాగులు సారథ్యంలో మంగళవారం పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు, ఇతర సాధారణ వ్యాధులకు చికిత్సలు అందించారు. చలికాలంలో వచ్చే వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు కూడా అందించారు.
NZB: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార సమయాల్లో నిబంధనలు పాటించాలని ధర్పల్లి తహశీల్దార్ శాంత మంగళవారం సూచించారు. అభ్యర్థులు తమ ప్రచార వాహనాలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మైకును ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మైకు లేకుండా ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు.
NLG: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ నేతృత్వంలో రోడ్లు, రైల్వేలు, విమానయానం, లాజిస్టిక్స్, ఆరోగ్యం, డిజిటల్ ఇన్ఫ్రా ఇతర అన్ని రంగాలను సమన్వయంతో అభివృద్ధి చేయడం ద్వారా ‘కనెక్టెడ్ తెలంగాణ’ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.
MDK: రాబోయే కాలంలో కార్మిక వర్గం అత్యంతభయంకరమైన పరిస్తితులు ఎదుర్కొబోతున్నదనీ, ఆ విధానాలకు ధీటుగా కార్మిక వర్గం అత్యంత సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పిలుపు నిచ్చారు. లేబర్ కోడ్ల ప్రమాదం గురించి ఎక్కడ బడితే అక్కడ, గ్రామాలు, పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లాలో ఈ నెల 11న జరగనున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ హైమావతి సెలవు ప్రకటించారు. గజ్వేల్, మర్కుక్, వర్గల్, జగదేవపూర్, ములుగు, దౌలతాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు. ప్రజలంతా ఓటు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
GDWL: గద్వాల్ జిల్లాలో డిసెంబర్ 11న జరగనున్న మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులలో పాటించాల్సిన అంశాలపై సమగ్ర సమావేశం మంగళవారం నిర్వహించారు. శాంతియుత ఎన్నికలే ధ్యేయం, కట్టుదిట్టమైన భద్రతతో గద్వాల్ పోలీస్ సర్వ సిద్ధం అని ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుతుందని తెలిపారు.
MHBD: జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తిచేశామని ఎస్పీ శభరీష్ తెలిపారు. పోలీసు అధికారులతో ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో ఐదుగురు DSPలు, 16 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 1000మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడులకు వేదికగా మారింది. HYD భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు రూ. 5,39,495 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మొదటి రోజు సుమారు రూ. 2,43,000 కోట్లు, రెండో రోజు ఇప్పటి వరకు రూ. 2,96,495 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఇండస్ట్రీ, ఐటీ, ఫార్మా, ఫారెస్ట్, టూరిజం రంగాలు ఉన్నాయి.
MDK: నార్సింగి మండల కేంద్రంలోని మీర్జాపల్లి చౌరస్తా వద్ద ఎఫ్ఎస్టీ బృందం తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. కారు, ఆటోల్లో తరలిస్తున్న సుమారు 400 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సౌజన్య తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
MBNR: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్సిటీల ఆధ్వర్యంలో నిర్వహించే ఏబీవీపీ సమ్మేళన వాల్ పోస్టర్స్ను పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీనివాస్ మంగళవారం ఆవిష్కరించారు. ఈనెల 22, 23న కాకతీయ వర్సిటీలో ఈ కార్యక్రమం ఉంటుందని ఏబీవీపీ రాష్ట్ర కో కన్వీనర్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ మంగళవారం మొదటి విడత పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు కేటాయించే మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించిన ఈ ప్రక్రియలో గద్వాల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని మొత్తం 974 పోలింగ్ స్టేషన్లు భాగమయ్యాయి. 135 కేంద్రాలు ఏకగ్రీవమైనందునారు.