ADB: భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో పంట చేలలోని బోరు బావుల వద్ద నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం తాంసి మండలంలోని గిరిగామ గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. NREGS ద్వారా నీటి ఎద్దడి నివారణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మాలే బోరిగావ్ గ్రామపంచాయతీ కేబీ కాలనీలో రూ. 8లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ కమిటీ ఎస్టీ సెల్ చైర్మన్ సేద్మాకి ఆనందరావు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కట్టబడి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.
SRD: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎంశ్రీ పథకంలో జిల్లాకు చెందిన 40పాఠశాలలు ఎంపికైనట్లు డీఈఓ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 25లోపు http:///pmshree. education.cgg.gov.in వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన జూనియర్ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల కొరకు, అదేవిధంగా నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే సామేలు కోరారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
SDPT: జిల్లాలోని మహిళా రైతులందరికీ 50% రాయతీపై వ్యవసాయ పనిముట్లు ఇవ్వనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా స్మామ్(SMAM) పథకం ద్వారా 50% రాయతీపై మహిళా రైతులకు మాత్రమే అందుబాటులో ఉండే వ్యవసాయ పనిముట్లు అందించబడుతున్నాయని పేర్కొన్నారు.
SDPT: జగదేవ్పూర్ మండల కేంద్రంలో పశువుల సంత, తై బజార్ బహిరంగ వేలం పాట స్పెషల్ ఆఫీసర్ డీఎల్పీఓ లత ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ వేలం పాటలో పశువుల సంతను గజ్వేల్కి చెందిన రాజేశం రూ.52లక్షలకు దక్కించుకున్నారు. అలాగే తై బజార్ను జగదేవ్పూర్కు చెందిన కనకయ్య రూ.8లక్షల70 వేలకు దక్కించుకున్నారు.
NLG: ధాన్యం సేకరణ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ జై.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. PACS CEOలు, చైర్మన్లకు రబీ ధాన్యం సేకరణ, మద్దతుధరపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం రబీ ధాన్యం సేకరించాలని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు 48గంటల్లో డబ్బులు జమ చేయాలని సూచించారు.
SRD: అంగన్వాడీలలో చిన్నారులకు నూతన బోధనా పద్ధతులు అమలు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో పూర్వ ప్రాథమిక విద్య సదస్సు శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు బొమ్మలతో అర్థమయ్యేలా బోధించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.
MNCL: జిల్లాలోని జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పరిధిలో అదనంగా మంజూరైన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సంబంధిత శిలాఫలకం, హెలీప్యాడ్, బహిరంగ సభ ఏర్పాటు చేసే స్థలం, సమావేశ మందిరంలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. ప్లాంట్ పనులను రాష్ట్ర ప్రముఖులచే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.
SRD: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. వెయింటింగ్లో ఉన్న డీఏలను కూడా విడుదల చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన మంజరి పాల్గొన్నారు.
HNK: సమాజంలో మార్పు కోసం బాలిక సంరక్షణకు బైక్ ర్యాలీ నిర్వహించామని, బాలికా సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా పోలీసులు, మహిళా ఉద్యోగులతో బైక్ ర్యాలీని నిర్వహించారు.
ASF: జిల్లా జైనూర్ మండలంలో సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు 8 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించబడిందని. అర్హులైన కాంట్రాక్టర్లు 3 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించారు.
WGL: వరంగల్ రైల్వే స్టేషన్ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్లో భాగంగా రూ. 25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.
WGL: రుణ మార్పిడిపై అవగాహన సదస్సును వరంగల్, హనుమకొండ న్యాయ సేవా సంస్థలు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ కార్యదర్శులు క్షేమదేశ్ పాండే, సాయికుమార్ పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యక్తులు సంస్థల నుంచి తీసుకున్న రుణభారం తగ్గాలంటే బ్యాంకులు నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని లబ్ధి పొందాలని సూచించారు.
GDWL: మహిళలకు ఎలాంటి వేదింపులకు గురైన వెంటనే షి టీమ్ సమచారం అందిస్తే షి టీమ్ బృందాలు భరతం పడతాయాని డీఎస్పీ మోగిలయ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గోనుపాడులో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షి టీమ్ ఆద్వర్యంలో అవగాహాన నిర్వహించారు. ఆయన మాట్లడుతూ.. విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని అన్నారు.