MBNR: వయోవృద్ధుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వృద్ధులు తాము జీవించినన్ని సంవత్సరాలు ఆస్తులను తమ పేరిటే ఉంచుకోవాలని సూచించారు.
ASF: చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున పాఠశాలల సమయాన్ని తగ్గించాలని DYFI జిల్లా నాయకులు పురుషోత్తం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం రెబ్బెన MEO కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వటు మాట్లాడుతూ.. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుండడంతో పాఠశాల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగించాలని కోరారు.
MNCL: చెన్నూరు MPDO కార్యాలయంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృధి పనులపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృధి పనులపై పురోగతి, ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అభివృధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
NRML: సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు, మహిళలు, చిన్నారులు, వర్గాలు, ధార్మిక భావాలు, ప్రభుత్వ అధికారులు మొదలైన వారిపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు, అపోహలు పుట్టించే పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం ప్రకటనలో హెచ్చరించారు.
WNP: విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు పరుచుకోవాలి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. పెద్దగూడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. విద్యార్థులకు ఆర్టికల్ (14), ఆర్టికల్ (19), (21) ప్రాముఖ్యతను వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100 సంప్రదించాలన్నారు.
NRPT: దామరగిద్ద మండలంలో వానాకాలం వరి సాగు సుమారు 1,600 ఎకరాల్లో జరిగింది. అయితే వరికోత యంత్రాలు నామమాత్రంగా పనిచేయడంతో కోతకు వచ్చిన వరి పంటలు అలాగే ఉండిపోయాయి. దీంతో వరి కోతలు మరికొద్ది రోజులు ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
GDWL: విద్యార్థులు చదువుతోపాటు కళా నైపుణ్యం కలిగి ఉండాలని గద్వాల డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు .58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం లైబ్రరీ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు ఆదేశంతో స్థానిక సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో విద్యార్థినిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిచ్ఛధారి ఖానాపూర్ సబ్ సెంటర్ పరిధిలోని కోలాంగూడ గ్రామంలో పీ.ఎం. జన్మన్ ఆధ్వర్యంలో బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సర్ఫరాజ్ గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు పవర్ ప్రేమసింగ్, సత్యవతి, శైలజ, MLHP ఆకాంక్ష, చంగున ఉన్నారు.
MDK: చేపల పెంపకంతో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కాట్రియల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడిల నాగేష్ అన్నారు. రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మత్స్యశాఖ అందించిన స్థానిక చిన్న చెరువులో 2లక్షల 30 వేల చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బైగారి కుమార్, మద్ది నర్సింలు, రాజు, మహేందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
GDWL: వృద్ధుల జీవిత అనుభవాలను మనం గౌరవించి పాటిస్తే ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలను సాధించగలరని గద్వాల అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం గద్వాల ఐడీవోసీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులను ఇంటిపట్టున పెట్టుకుని వారి సలహాలు సూచనలు పాటించాలన్నారు.
MDK: జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
KMM: తిరుమలాయపాలెం మండలంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పార్టీ కార్యకర్తలతో సమావేశమై, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. అలాగే ఇటీవల మృతిచెందిన కిలారి నరసయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించి వారిని ఓదార్చారు.
హైదరాబాద్ మెట్రో ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం, L&T సంయుక్తంగా నిర్వహించింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 50:50 వాటాలతో జాయింట్ వెంచర్ రూపంలో మెట్రో నిర్వహణను చేపడతాయని, బలపరచిన PPP మోడల్లో ఇరు ప్రభుత్వాలు కలిసి మెట్రో కార్యకలాపాలు, నిధుల సమీకరణ, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను పర్యవేక్షించనున్నాయి.
KMMl: ఇందిరా గాంధీ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
KNR: గన్నేరువరం మండలం హనుమాజ్ పల్లి గ్రామానికి చెందిన పారునంది వీరయ్య(44) సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందారు. జీవనోపాధి కోసం సౌదీలోని సకాకలో కార్ డ్రైవర్గా పనిచేస్తున్న వీరయ్య అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వీరయ్య మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.