MDK: హసన్ మీరాపుర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త దామరపల్లి మధుసూదన్ రెడ్డి తమ్ముడు మరణించారు. ఈ విషయం తెలిసి ఎంపీ రఘునందన్ రావు వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం తెలిపారు. దివంగతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీతో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SRD: శబరిమల మహాపాదయాత్ర ముగించుకొని సంగారెడ్డికి వచ్చిన స్వాములకు పోతిరెడ్డిపల్లి హనుమాన్ దేవాలయం వద్ద శుక్రవారం ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప ఆపద్బాంధవ సేవాసమితి ఆధ్వర్యంలో శబరిమలకు మహా పాదయాత్రగా వెళ్లిన 28 మంది స్వాములను శాలువాలతో పూలదండలతో సన్మానించారు. సంగారెడ్డి నుంచి తిరుమల కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమలకు పాదయాత్రగా వెళ్లినట్లు రాము తెలిపారు.
BHNG: రామన్నపేట పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగరాజు ఇవ్వాళ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట గ్రామంలో పేకాటను ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందింది. ఈ మేరకు వారిని పట్టుకొని వారి నుంచి 3 మొబైల్ ఫోన్లను, రూ.1,820 స్వాదినం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
KMM: రఘునాధపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ పర్యటించారు. వీ. వెంకటాయపాలెంలో మంచుకొండ ఎత్తిపోతల పథకంకు అనుసంధానంగా చేపట్టిన 33/11 కెవి సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ చీరలను గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పంపిణీ చేయాలని అన్నారు. ఎన్నికల షేడ్యూల్ లోపు చీరల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
HYD: రవాణా శాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ను మరింత కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్రస్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్ ఫోర్స్ మెంట్ చేయాలన్నారు.
MDCL: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో అప్పుల బాధతో మల్లేశ్, సంతోషి అనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
BDK: అశ్వాపురం మండలంలోని మిట్ట గూడెం గ్రామపంచాయతీ పాయం మంగయ్య గుంపు గ్రామంలో దుప్పి మాంసం విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించి దుప్పి మాంసాన్ని విక్రయిస్తున్న సప్క వీరస్వామిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు శుక్రవారం వెల్లడించారు. అతని వద్ద నుంచి సుమారు 10 కిలోల మాంసం, దుప్పి తల, కాళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
KNR: చిగురుమామిడి మండలం సుందరగిరి జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్లో ఇందుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ పాఠశాల నుంచి సాయి వర్షిత, సుస్మిత, అక్షిత్లు జిల్లా స్థాయికి ఎంపిక కావడం విశేషం. మండలంలోని 12 పాఠశాలల నుంచి మూడు స్థానాలు ఈ పాఠశాలకే దక్కాయి.
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈనెల 22, 23వ తేదీలలో జరుగుతుందని ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ తెలిపారు. 22న బల్మూరు (ఉ.10), లింగాల (మ. 2), అచ్చంపేట (సా.4) మండలాల్లో, 23న చారగొండ (ఉ.10), వంగూరు (మ.2), ఉప్పునుంతల (సా.4) మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద చీరల పంపిణీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు అవంతిపురం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో డీ.టీ.ఆర్.బీ నల్గొండ, మిర్యాలగూడ రూరల్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మిషన్ ట్రిబుల్ ఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
KMM: లక్కీ డ్రా’ పేరుతో వచ్చే మోసాలను నమ్మి ప్రజలు నష్టపోవద్దని ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వెంటనే డయల్- 100కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయాలని, వివరాలు తెలిపిన వారి ఫోన్ నంబర్లు గోప్యంగా ఉంచబడతాయని సీఐ తెలిపారు.
WNP: జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సేవలు చిరస్మరణీయమని చెప్పవచ్చు. ఆయనను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు విభాగానికి కొత్త దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ‘స్నేహపూర్వక పోలీసింగ్’ విధానంతో ప్రజల నుంచి నేర సమాచారం సేకరించడంలో ప్రత్యేక చొరవ చూపారు.
GDWL: పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూభారతి, మీ-సేవ దరఖాస్తులు. ముఖ్యంగా ఆరు నెలలు దాటిన వాటిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు.
MDK: సిద్దిపేట బాలికల హైస్కూల్లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో MP రఘునందన్ రావు శుక్రవారం పాల్గొన్నారు. విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను పరిశీలించరు. విజ్ఞాన-సాంకేతిక రంగంలో ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని MP అభినందించారు.
GDWL: భవిష్యత్తు తరానికి ఆశాకిరణాలు విద్యార్థులే అని DRDA-EGMM ట్రైనర్ మహేష్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు గద్వాలలోని గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్రేరణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమయం విలువైనదని, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, టీవీ వంటి చెడు అలవాట్లకు పోవద్దన్నారు.