SRPT: ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి శిగ నాగమణి శ్రీనివాస్ గౌడ్ 272 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెలుపుకు కృషి చేసిన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని, గ్రామాభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
SRPT: మంత్రి ఉత్తమ్ సొంతూరు తిరుమలగిరి మండలం తాటిపాముల పంచాయతీ ఎన్నికల ఫలితం వెలువడింది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయినపల్లి కిషన్ 510 ఓట్లతో ఘన విజయం సాధించారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే మందుల సామెలక్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Pdpl: మంథని మండలం విలోచవరం గ్రామ సర్పంచ్గా కొండ ప్రేమలత రవీందర్ విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థిపై 178 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విద్యా వంతురాలు, న్యాయవాది అయిన ప్రేమలతను గ్రామస్తులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం, తుమ్మలపెన్ పహాడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన ఒగ్గు జానకమ్మ ఘన విజయం సాధించారు. ఆమె 1981 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. అనంతరం జానకమ్మ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRPT: ఆత్మకూరు ఎస్ మండల రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారాయి. మిడ్తనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పుల సురేష్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ గెలుపునకు కారణమని సురేష్ ప్రకటించారు. ఈ ఫలితం స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపి, ప్రత్యర్థి వర్గాలకు గట్టి హెచ్చరిక పంపింది.
మహబూబ్నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆయనకు చేరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామస్తులు అభివృద్ధిని కోరుకున్నారని అందువల్లే తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు.
మహబూబ్నగర్ రూరల్ మండలం పెద్దబావి గ్రామ సర్పంచ్గా సీనియర్ నాయకులు పెద్దబావి రంగయ్య గెలుపొందారు. సమీప BRS పార్టీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలు తనను గెలిపించాయని అన్నారు. ప్రజలు ఇలాగే సేకరిస్తే గ్రామాన్ని అద్భుత రీతిలో గెలిపిస్తానని వెల్లడించారు.
మహబూబ్నగర్ రూరల్ మండలం అల్లిపూర్ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గోటూరు విజయలక్ష్మి ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదంతో తాను గెలుపొందనని వెల్లడించారు. తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. తను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.
మహబూబ్నగర్ రూరల్ మండలం రామచంద్రపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాబురావు ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పేదరికం నుంచి వచ్చానని వెల్లడించారు. తనకు ప్రజల కష్టాలు తెలుసు అని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సహకారంతో వాటన్నిటినీ పరిష్కరిస్తానని వెల్లడించారు.
JNG: చిల్పూర్ మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్గా గెలిచిన వారి వివరాలు. ★ కొండాపూర్-గుగులోతు దేవేందర్ నాయక్ (BRS), ★ పల్లగుట్ట-ఎనగందుల నరసింహారెడ్డి (కాంగ్రెస్), ★ నష్కల్- రాజుయాదవ్ (కాంగ్రెస్), ★ కృష్ణాజిగూడెం- మల్లం రవీందర్ (BRS) లు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు దృవీకరించారు.
BDK: పాల్వంచ మండలంలో గురువారం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పాల్వంచ పట్టడానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన చాయ్ తాగుతూ ముచ్చటించారు. జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఎంపీ వారికి దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం వివరాలను జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ 80.41%, సిరికొండ 87.04%, ఇంద్రవెల్లి 76.88%, ఉట్నూర్ 71.34%, నార్నూర్ 80.8%, గాదిగూడలో 82.33% నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సరాసరి ఓటింగ్ 77.52 శాతం నమోదైందని పేర్కొన్నారు.
SDPT: మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామ సర్పంచ్గా గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని, ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు.
మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బి. స్వర్ణలత ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్ సహకారంతో ఈ విజయం సాధించినట్లు వెల్లడించారు. గతంలో గ్రామంలో చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపించాయన్నారు. మాజీ సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.