WGL: పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ను ఇవాళ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు సందర్శించారు. మహిళలకు ఉచితంగా పరీక్షలు, చికిత్సలు అందుతున్న క్లినిక్ కార్యాచరణను సమీక్షించి, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు.
PDPL: నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, జరుపుకోవాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, డీజేలు, బహిరంగ మద్యపానం నిషేధమని తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.26,27,261 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.11,12,890, కార్ పార్కింగ్లో రూ.3,35,500, VIP దర్శనాలతో రూ.3,30,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,70,600, వ్రతాలతో రూ.92,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి ఆదాయం వచ్చిందన్నారు.
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ ) బడుగు చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియలో భాగంగా నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా నియమించారు.
KNR: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వీణవంక మండల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, చేపట్టినట్లు ఎస్సై ఆవులు తిరుపతి తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. డీజే సౌండ్ సిస్టం, బాణసంచా నిషేధమని వెల్లడించారు. ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు.
NGKL: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని బస్టాండ్లు, దేవాలయాలు, రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీంతో విస్తృత తనిఖీలు చేపట్టామని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. డిసెంబరు 31అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
NGKL : వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ శ్రీనివాస్ అచ్చంపేట మండల పోలీస్ స్టేషన్ రికార్డులను మంగళవారం పరిశీలించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, సంక్రాంతికి చైనా మాంజాపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో మెళకువలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్య క్రమంలో ఎస్సై సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు.
KMM: వ్యవసాయ ఖర్చులు ఏటేటా పెరుగుతున్న క్రమంలో రైతులకు వాస్తవికంగా, న్యాయంగా రుణ పరిమితులు నిర్ణయించాల్సిన అవసరం ఉందని DCCB పర్సన్ ఇంఛార్జ్ చైర్మన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం DCCB బ్యాంక్ పరిధిలో 2026-27 సం.కి సంబంధించి వివిధ పంటలపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయాలపై సమీక్షించారు. రైతుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.
SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు మంగళవారం లెక్కించారు. స్వామివారికి 49 రోజులో రూ.1,15,42,056 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి టి. వెంకటేశ్ తెలిపారు. 60 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 50విదేశీ నోట్లు వచ్చాయన్నారు. ఈకార్యక్రమంలో ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
MDK: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నుంచి క్రిస్మస్ వేడుకలకు ఈనెల 24- 29 వరకు 216 బస్సులను పలు రూట్లలో నిర్వహించగా, 1.75 లక్షల కిలోమీటర్లు నడిచినట్లు డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. పదిమంది సిబ్బంది 24 గంటలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించారని వివరించారు. ఇదే తరహాలో ప్రతి క్రిస్మస్కు ప్రత్యేక బస్సులను తిప్పుతున్నట్లు సురేఖ తెలిపారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ తెలిపారు. 6 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 260 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 120 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.
SDPT: బనకచర్ల ప్రాజెక్టుకు అవసరమైన అత్యంత కీలక అనుమతులు సీడబ్ల్యూసీ నుంచి వచ్చినప్పటికీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీశ్రావు మండిపడ్డారు. అనుమతులు కనిపించినట్లు, ప్రభుత్వం పడుకున్నట్లు నటిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలకే పరిమితమై రాజకీయ ప్రయోజనాలపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు.
KNR: వీణవంక మండల కేంద్రంలో సర్పంచ్ ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా లస్మక్కపల్లి సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా హిమ్మత్నగర్ సర్పంచ్ జడల శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి, పంచాయతీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
NGKL: నాగర్ కర్నూల్ మండలం చందుబట్లలో మంగళవారం రాత్రి ఓ ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పిన ట్రాక్టర్-ట్రాలీ రోడ్డు పక్కన ఉన్న గుంత లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. స్థానికులు స్పందించి డ్రైవర్ను క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
PDPL: గోదావరిఖని పట్టణ శివారులో ఉన్న గోదావరి నదిలో నీటి ప్రవాహం రోజురోజుకు తగ్గిపోతుంది. దీంతో గోదావరి ప్రాంతమంతా ఎడారిలా కనిపిస్తోంది. రానున్న నెల రోజుల్లో సమ్మక్క జాతర ఉన్నందున భక్తుల పుణ్య స్నానాలకు నీటి కరవు ఏర్పడే పరిస్థితి నెలకొంది. మొన్నటిదాకా గలగల పారే గోదావరి ఇప్పుడు పాయలు పాయలుగా విడిపోయింది