తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులగా ఉన్న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు షాక్ తగిలినట్లైయ్యింది.
మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరు జారారు. రైతులు ఆత్మహత్య చేసుకోవాలని మాట్లాడి.. నాలిక కరుచుకున్నారు. రైతులు ఆకలితో, ఆత్మహత్య చేసుకుని చావకూడదని చెప్పాల్సింది పోయి.. రైతులు ఆత్మహత్య చేసుకోవాలని కామెంట్ చేశారు.
తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది యువకులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వారి జీవితాలతో ఆడుకుంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని, వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు ఈ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని అన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా మరో 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తోన్నాయి. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్, విజయవాడ నుంచి చెన్నై వరకు వందేభారత్ రైళ్లను రేపు (ఆదివారం) ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తెలంగాణలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుందని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలకు కార్పొరేషన్ చైర్మన్ పదవీ ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం కష్టపడాలని కోరగా.. ఇద్దరు నేతలు అంగీకరించారని తెలిసింది.
తెలంగాణలో ఇటివల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలిపింది. జూన్ 11న రెండో సారి నిర్వహించిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ తీరు సరిగా లేదని, బయోమెట్రిక్ వివరాలు కూడా తీసుకోలేదని పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు హాల్ టిక్కెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీ...
నార్సింగిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు భూ వివాదంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కేసు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 60 మందితో వచ్చి తమ స్థలంలో దౌర్జన్యం చేశారని కంప్లైంట్ కోకాపేట్ రెండున్నర ఎకరాల స్థలం వివాదంలో కేసు నమోదు అధికార పార్టీ నేతల కార్యకర్తలు వచ్చి బెదిరిస్తున్నారని తెలిపిన సంస్థ ప్రతినిధులు దీన...
బీఆర్ఎస్ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే(malkajgiri mla) మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేస్తు ప్రకటించారు. అయితే త్వరలో ఓ రాజకీయ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వస్తానని అన్నారు.