• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేడ్కర్’

SRD: దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్విరామంగా పోరాడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ చరిత్రను రచించి, ప్రపంచం గర్వించదగిన మేధావి ఆయన అని పేర్కొంటూ కొనియాడారు.

April 14, 2025 / 11:03 AM IST

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

MHBD: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

April 14, 2025 / 10:59 AM IST

సమ సమాజ స్థాపన స్నాపికుడు అంబేద్కర్

KMM: భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్భంగా.. సోమవారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని, కస్నాతండాలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రామస్తులు పూలమాలలేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామమూర్తి మాట్లాడుతూ.. అంబేద్కర్ సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన స్నాపికుడని అన్నారు.

April 14, 2025 / 09:45 AM IST

కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడికి సన్మానం

PDPL: కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాడూరి వినోద్ కుమార్ ఎన్నికైన విషయం విధితమే. ఈ క్రమంలో రామగిరి మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నాయకులు వినోద్ కుమార్‌ను శాలువతో ఘనంగా సత్కరించి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మండల అధ్యక్షులు ఇల్లందుల బాపు తదితరులు ఉన్నారు.

April 14, 2025 / 09:41 AM IST

పోస్టల్ ఎంప్లాయిస్ కరీంనగర్ డివిజన్ కార్యదర్శిగా విష్ణువర్ధన్

KNR: భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పోస్టుమాన్ & ఎంటిఎస్ కరీంనగర్ డివిజన్ కార్యదర్శిగా ఓరుగంటి విష్ణువర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ ప్రధాన పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికైన కార్యవర్గాన్ని బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రావణ్ ప్రకటించారు.

April 14, 2025 / 09:41 AM IST

మాజీ సింగిల్ విండో ఛైర్మన్ లక్ష్మారెడ్డి మృతి

SRCL: కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి లక్ష్మీరెడ్డి సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి కోనరావుపేట మాజీ సింగిల్ విండో ఛైర్మన్‌గా పని చేశారు. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

April 14, 2025 / 09:39 AM IST

ఒంటికి నిప్పంటించుకుని వృద్ధురాలి మృతి

KNR: చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో లక్ష్మీ అనే వృద్ధురాలు తన శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. రేగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.

April 14, 2025 / 09:32 AM IST

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం

KMM: ఖమ్మం గొల్లగూడెం మసీదు సెంటర్‌లో సోమవారం ముస్లింలు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా ఉందని ముస్లిం మత పెద్దలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ముస్లింలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. తక్షణమే వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

April 14, 2025 / 09:31 AM IST

రాజీవ్ యువ వికాస్ గడువు పెంచాలి: ఆటో వర్కర్స్

BDK: కొత్తగూడెం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తు గడువును మరో 10 రోజులు పొడిగించాలని ఆటో వర్కర్స్ యూనియన్ రామవరం అధ్యక్షుడు SK జలీల్ సోమవారం కోరారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సమయమివ్వాలని, ఆటో సోదరుల కోసం ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని కోరారు.

April 14, 2025 / 09:13 AM IST

మహిళా కానిస్టేబుల్ సూసైడ్

JN: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెంది ఏఆర్ కానిస్టేబుల్ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన గుగులోతు నీల (26) వరంగల్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్ పని చేస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

April 14, 2025 / 07:53 AM IST

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం

 HYD: అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఫైర్ సిబ్బంది అందించే సేవలు అభినందనీయమని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఆదివారం తార్నాకలోని తన నివాసంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాన్ని పోస్టర్‌ను ఆవిష్కరించారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

April 14, 2025 / 05:24 AM IST

200 మంది బీఆర్ఎస్‌లో చేరిక

NLG: ఇవాళ నల్గొండ పురపాలికలోని 19వ వార్డు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నల్గొండలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిల సమక్షంలో సుమారు 200 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. 

April 13, 2025 / 07:05 PM IST

24 నుంచి పాఠశాలలకు సెలవులు : డీఈవో

MDK: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. 22వ తేదీన విద్యార్థులకు వార్షిక పరీక్ష ఫలితాలు ఇవ్వాలని పేర్కొన్నారు. జూన్ 12వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్పారు.

April 13, 2025 / 11:21 AM IST

అత్తాపూర్‌లో వ్యక్తిపై కత్తులతో దాడి

 HYD: ఓ వ్యక్తి పై కొంతమంది కత్తులతో దాడికి దిగిన ఘటన అత్తాపూర్ PS పరిధిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. అత్తాపూర్ పరిధిలోని ఖాజానగర్‌కు చెందిన సయ్యద్ బాబాపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏంబీటీ స్పోక్స్ పర్సన్ బాధితుడిని పరామర్శించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

April 13, 2025 / 11:20 AM IST

కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల రద్దీ

JGL: జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన ఆదివారంపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కల్యాణకట్టలో దీక్షాపరులు మాలవిరమణ చేసి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు.

April 13, 2025 / 11:18 AM IST