• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉప సర్పంచ్ తత్తరి గిరి ప్రసాద్‌ను సన్మానించిన ప్రభుత్వ విప్

BHNG: మొదటి విడత ఎన్నికల్లో భాగంగా బొమ్మలరామారం మండలం మైలారం నూతన ఉప సర్పంచ్ తత్తరి గిరి ప్రసాద్‌ను నిన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గ్రామాలలోని పేద ప్రజల అభివృద్ధిని విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించింది అని చెప్పారు.

December 14, 2025 / 06:58 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లా.. 542 జీపీలకు నేడు పోలింగ్

ఉమ్మడి జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్‌ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 613 గ్రామ పంచాయతీల గానూ, 71 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 542 జీపీలకు నేడు పోలింగ్‌ జరగనుంది. నల్గొండ- 10 మండలాల్లోని 244, సూర్యాపేట- 8 మండలాల్లోని 158, యాదాద్రి- 5 మండలాల్లోని 140 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

December 14, 2025 / 06:35 AM IST

పంట ధ్వంసంపై కేసు నమోదు: సీఐ

KMM: రఘునాథపాలెం మండలం వీ.వీ. పాలెంకు చెందిన చండ్ర రమేష్‌కు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంటను ధ్వంసం చేసినట్లు అందిన ఫిర్యాదుపై సీఐ ఉస్మాన్ షరీఫ్ కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన కుతుంబాకు రాంప్రసాద్ తన పంటను దున్నించి ధ్వంసం చేశాడని రమేష్ నిన్న ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

December 14, 2025 / 06:34 AM IST

‘అభ్యర్థులను ప్రచారం కూడా చేయనివ్వడం లేదు’

NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిరేకల్‌ నియోజక వర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నా కలెక్టర్‌, ఎస్పీలు నోరు మొదపడటంలేదని నకిరేకల్‌ మాజీ శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఆయన స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ జడ్పీ ఛైర్మన్‌ బండ నరేందర్‌ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

December 14, 2025 / 06:28 AM IST

నగరంలో ఈ నెల 19 నుంచి బుక్ ఫెయిర్

HYD: 38వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ తెలిపింది. పుస్తక స్ఫూర్తి, బాలోత్సవం, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్ గౌడ్ పేర్లు నిర్ణయించారు.

December 14, 2025 / 06:24 AM IST

గుబ్బడిలో అన్ని వార్డులు ఏకగ్రీవం

SDPT: అక్కన్నపేట మండలం గుబ్బడి 397 ఓటర్లు, ఆరు వార్డులు కలిగి ఉండగా అన్నీ వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుబ్బడి సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పిట్టల శిరీష – శ్రీకాంత్, కాంగ్రెస్ అభ్యర్థిగా మెడబోయిన సంతోష – శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాశబోయిన శ్యామల – సంపత్ బరిలో నిలిచి త్రిముఖ పోరు జరగనుంది.

December 14, 2025 / 06:17 AM IST

కామేపల్లి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు: సీఐ

KMM: కామేపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కామేపల్లి సీఐ ఎన్. సాగర్, కామేపల్లి ఎస్సై పి. శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని 18 పంచాయతీల్లో ఇవాళ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు వారు తెలిపారు.

December 14, 2025 / 06:14 AM IST

‘ప్రశాంత ఎన్నికకు ప్రతి ఒక్కరు సహకరించాలి’

SRPT: మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు, ఆంక్షలు అమలు చేయాలని కోరారు. లెక్కింపు ప్రక్రియ సమయంలో తప్పుడు సమాచారం వెళ్లకుండా అభ్యర్థులను లెక్కింపు ప్రారంభంలోనే కూర్చోబెట్టుకోవాలని సూచించారు.

December 14, 2025 / 06:14 AM IST

వామ్మో చలి.. మూడు రోజులుగా వణుకు పుట్టిస్తోంది

NZB: గత మూడు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలా మంది సర్ది, దగ్గు, జ్వరాల బారిన పడి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

December 14, 2025 / 06:12 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం ఇదే..!

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి శనివారం భక్తుల నుంచి ఆదాయం సమకూరింది. టికెట్ల విక్రయాలు, ప్రసాదాల విక్రయాలు, అన్నదానం సేవ ద్వారా ఆలయానికి మొత్తం రూ. 4,27,073 ఆదాయం నమోదైంది. టికెట్ల ద్వారా 2,30,514, ప్రసాదాల ద్వారా రూ.1,52,140, అన్నదానం సేవ ద్వారా రూ.44,419 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారి తెలిపారు.

December 14, 2025 / 06:10 AM IST

‘పోలింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి’

MHBD: తొర్రూరు మండలంలో నేడు జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తొర్రూరు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. తొర్రూరు మండల వ్యాప్తంగా ముగ్గురు జోనల్ అధికారుల పర్యవేక్షణలో 236 మంది POలు, 31 మంది ROలు, 450 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. సిబ్బంది తరలింపు కోసం 8 బస్సులు, ఇతర వాహనాలను సిద్ధం చేశామన్నారు.

December 14, 2025 / 06:08 AM IST

నేడు జిల్లాలో 565 పంచాయతీలకు ఎన్నికలు

MBNR: ఉమ్మడి జిల్లాలోని 26 మండలాల్లోని జీపీలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 44 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 565 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 5,212 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జీపీ ఎలక్షన్ ఫలితాల కోసం HIT TVని సందర్శించండి.

December 14, 2025 / 06:08 AM IST

మెస్సీ మీద ఉన్న ప్రేమ BCలపై లేదు: మాజీ మంత్రి

MBNR: రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీపై ఉన్నంత ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నా, రేవంత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. నల్గొండ జిల్లాలో బీసీ వ్యక్తికి జరిగిన అవమానంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

December 14, 2025 / 06:06 AM IST

కాంగ్రెస్‌వన్నీ హత్యా రాజకీయాలే..

NLG: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవన్నీ హత్యా రాజకీయాలేనని ఎమ్మెల్యే జగదీశ్‌ ఆరోపించారు. నిన్న నల్గొండ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని, అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు మరో వైపు ఉన్నట్టు పరిస్థితి తయారైందన్నార

December 14, 2025 / 06:03 AM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి

KNR: మూడో విడత ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. హుజురాబాద్ మండల పరిధిలోని ధర్మరాజ్‌పల్లి బీజేపీ సర్పంచ్ అభ్యర్థి చిదురాల జ్యోతి-మహేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

December 14, 2025 / 06:02 AM IST