GDWL: పోలీసు శాఖలో పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం కాదు, సమాజం పట్ల బాధ్యత రెట్టింపు అవ్వడం అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గద్వాల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ ఎస్సై విధులు నిర్వహిస్తూ… రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన విజయభాస్కర్ మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
KNR: ఇల్లందకుంట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఇల్లందకుంట సర్పంచ్ ధార సురేష్ను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో 18 మంది సర్పంచ్లు ఉండగా 10 మంది సురేష్కు మద్దతు తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా మర్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తోడేటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బుస అశోక్, రేనుకుంట్ల శ్యామల, కోశాధికారిగా చింతం శ్రీలతలను ఎన్నుకున్నారు.
KMM: వైరా మున్సిపాలిటీ 14వ వార్డు బాలాజీ నగర్లో నూతన సంవత్సర కానుకగా కార్యకర్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు గోడ గడియారాలను కాంగ్రెస్ నాయకులు అశోక్ ఆధ్వర్యంలో ఇవాళ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
HYD నగర పరిధిలో ఇప్పటివరకు సుమారు 1100 ఎకరాల భూమిని అక్రమ ఆక్రమణల నుంచి కాపాడినట్లు హైడ్రా వెల్లడించింది. ఈ భూముల మార్కెట్ విలువ రూ.60 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, ఓపెన్ ల్యాండ్స్పై దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని హైడ్రా స్పష్టం చేసింది.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం కోయిల్ సాగర్ గ్రామ సర్పంచ్ సందప్ప ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం సందప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నానన్నారు.
MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి క్షేత్రంలో ఇవాళ ఉదయం 10:30 నిమిషాలకు గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు.
ADB: జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడంపై సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ఆహార భద్రతపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. గత త్రైమాసికంలో ఆహార భద్రతా శాఖ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు, తనిఖీలపై సమీక్షించినట్లు తెలిపారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి మంగళవారం రూ.26,27,261 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఇందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.11,12,890, కార్ పార్కింగ్ నుంచి రూ.3,35,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ.3,30,000, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.2,70,600, వ్రతాల ద్వారా రూ.92,000తో పాటు ఇతర విభాగాల నుంచి ఆదాయం వచ్చినట్లు వివరించారు.
NZB: సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎడపల్లి ఆధ్వర్యంలో మంగళవారం జైతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వయోవృద్దుల పోషణ, రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వయోవృద్ధుల సమస్యలు, మన బాధ్యతపై అవగాహన కల్పించడం జరిగిందని బోధన్ డివిజన్ అధ్యక్షుడు మురహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
KNR: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో వెలసిన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయ రాజగోపుర నిర్మాణానికి భక్తులు భారీ విరాళం ప్రకటించారు. కందుల విజయ-లింగయ్య దంపతులు రూ. 1,01,116 విరాళాన్ని మంగళవారం అందజేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దాతలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
BDK: అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇవాళ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా జరుపుకోవాలని కోరారు. అదే సమయంలో డిసెంబర్ 31 రాత్రి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న షెల్టర్ హోం పనులను మంగళవారం GWMC కమిషనర్ చాహత్ భాజ్ పాయ్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. షెల్టర్ హోం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు.
KMR: బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు స్వర్ణలత సూచించారు. మంగళవారం సదాశివనగర్ మండలం కుప్రియాల్లోని మహాత్మాగాంధీ జ్యోతి బాఫూలె బాలికల విద్యాలయంలో బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థినులకు వివరించారు.
NZB: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాం ప్రసాద్కు జిల్లా విద్యాధికారి అశోక్ మంగళవారం గణిత రత్న అవార్డు ప్రదానం చేశారు. గణిత బోధనలో విశేష కృషికి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ, పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో గణిత రత్న అవార్డు ప్రదానం చేశారు.
NRML: న్యూ ఇయర్ వేడుకల పేరుతో యువత తప్పుదోవ పడవద్దని జిల్లా తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. పట్టణంలోని గాంధీ పార్క్లో మాట్లాడిన ఆయన.. మద్యం సేవించడం, రోడ్లపై కేకులు వేయడం మన సంస్కృతికి విరుద్ధమన్నారు. కొత్త సంవత్సరాన్ని శాంతియుతంగా, బాధ్యతతో స్వాగతించాలని సూచించారు.