• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిన్న కాంగ్రెస్ లో చేరిక.. నేడు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

NLG: నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి గ్రామ సర్పంచ్ స్థానం బీసీ (మహిళ) కు రిజర్వు కావడంతో ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు నిన్న ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మచ్చ జయసుధ ముత్యాలు గోపలాయపల్లి సర్పంచు స్థానానికి నామినేషన్ ను దాఖలు చేశారు.

November 27, 2025 / 09:13 PM IST

ఎన్నికల వేళ.. చెక్ పోస్ట్ ఏర్పాటు

MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అధికారులు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. పలు వాహనాలను తనిఖీ చేసి, రూ.50 వేలు మించి నగదు తీసుకెళ్లవద్దని, తీసుకెళ్తే కచ్చితమైన వివరాలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, ఎస్సై లెనిన్ పాల్గొన్నారు.

November 27, 2025 / 08:56 PM IST

నిజామాబాద్ జిల్లాలో తొలి రోజు వచ్చిన నామినేషన్లు

NZB: జిల్లాలో GP ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడతలో భాగంగా మొదటి రోజు బోధన్ డివిజన్‌లో నేడు నామినేషన్లను స్వీకరించారు. మొత్తం 11 మండలాల్లో 140 నామినేషన్లను దాఖలు చేశారు. బోధన్ మండలంలో 17, చందూర్ 6, కోటగిరి 13, మోస్రా 6, పోతంగల్ 14, రెంజల్ 12, రుద్రూర్ 10, సాలూర 17, వర్ని 19, ఎడపల్లి 9, నవీపేట్ 17 నామినేషన్లు దాఖలయ్యాయి.

November 27, 2025 / 08:55 PM IST

తొలి రోజు 68 సర్పంచ్ నామినేషన్లు: కలెక్టర్

GDWL: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. గద్వాల, ధరూరు, గట్టు, కేటీ దొడ్డి మండలాల్లోని 106 జీపీలకు గాను, గురువారం 68 మంది సర్పంచ్ అభ్యర్థులు, 13 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన వివరించారు.

November 27, 2025 / 08:55 PM IST

రవీంద్రభారతి వద్ద SPB విగ్రహం

HYD: రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పక్కన ఎస్పీ బాలు కాంస్య విగ్రహం పెట్టనుంది. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి జూపల్లి, నటుడు శుభలేఖ సుధాకర్ పరిశీలించారు.

November 27, 2025 / 08:50 PM IST

‘నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి’

HNK: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. దామెర క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.

November 27, 2025 / 08:47 PM IST

పేకాడుతున్న నలుగురి అరెస్ట్​

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఆర్మూర్ ఎస్​హెచ్​వో సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ.11,500 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా పేకాట ఆడితే తమకు సమాచారం అందించాలన్నారు.

November 27, 2025 / 08:46 PM IST

సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

VKB: సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం న్యాయవేదికను కదిలించింది. 54 ప్రాణాలు బలిగొన్న ఘోర విషాదం ఇంకా స్పష్టమైన నిజానిజాలు లేకుండానే సాగిపోతుందని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీ నివేదికలు, సాక్షాలు, చట్టపరమైన లోపాలన్నీ ముందుంచినా దర్యాప్తు పురోగతి శూన్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వచ్చేనెల 9కి వాయిదా వేసింది.

November 27, 2025 / 08:46 PM IST

‘నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత’

NRPT: ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ చెప్పారు.

November 27, 2025 / 08:46 PM IST

ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

MBNR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

November 27, 2025 / 08:45 PM IST

సమన్వయంతో పని చేస్తే విజయం ఖాయం: ఎమ్మెల్యే

MDK: సమన్వయంతో పని చేస్తే అభ్యర్థుల విజయం ఖాయమని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్‌లో నియోజకవర్గంలోని వివిధ మండలాల విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

November 27, 2025 / 08:41 PM IST

ఎన్నికల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

MNCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలను ప్రలోభ పెట్టే నగదు, మద్యం, కానుకల పంపిణీ, ప్రచారం, అక్రమ నగదు రవాణా, ఇతర ప్రభావిత అంశాలపై నిఘా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అంశాలు ఎవరి దృష్టిలోకైనా వస్తే కంట్రోల్ రూమ్ నం.08736- 250501లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

November 27, 2025 / 08:40 PM IST

గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

WGL: నర్సంపేట మండలం ముత్తోజిపేట శివారులో గంజాయిని విక్రయించడానికి తరలిస్తున్న ఇద్దరిని ఇవాళ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో రూ. 75 వేల విలువైన కేజిన్నర గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. నిందితులు బొమ్మెర రమేష్, పాడ్య రాజులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

November 27, 2025 / 08:37 PM IST

అఖండ-2 ఈవెంట్.. కూకట్ పల్లిలో ట్రాఫిక్ కాంక్షలు

MDCL: కూకట్ పల్లి కైతలాపూర్ గ్రౌండ్‌లో అఖండ-2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సా.4 గం. నుంచి రాత్రి 11 గం. వరకు ఆంక్షలు విధించారు. IDL లేక్ నుంచి వచ్చే వారిని JNTU వైపు, మాదాపూర్ నుంచి కైతలాపూర్ వచ్చేవారు. JNTU మీదుగా వెళ్లాలని సూచించారు. ఎర్రగడ్డ నుంచి కైతలాపూర్ వెళ్లే వాహనాలను సైతం Y జంక్షన్ నుంచి వెళ్లాలని సూచించారు.

November 27, 2025 / 08:36 PM IST

మొదటిరోజు 27 నామినేషన్లు

VKB: పెద్దేముల్ మండలంలో మొదటి రోజు 38 సర్పంచ్ స్థానాలకు 27 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని ఎంపీడీవో రతన్ సింగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా తొమ్మిది క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 308 స్థానాలకు గాను 25 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. మొదటి రోజు నామినేషన్ల సందడి నెలకొంది.

November 27, 2025 / 08:36 PM IST