GDWL: ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రేమలత మంగళవారం కీలక తీర్పు ఇచ్చారు. భర్త హత్య కేసులో ఐదుగురికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అలంపూర్కు చెందిన కృష్ణవేణి, తన అక్రమ సంబంధానికి అడొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.
GDWL: గట్టు మండలం చాగదోణ సర్పంచ్ అభ్యర్థి వీర శేఖర్ గౌడ్ ఏకంగా 22 హామీలతో ప్రచారం చేశారు. మంగళవారం ప్రచారంలో నాయకులు ఈ వివరాలు వెల్లడించారు. లైబ్రరీ ఏర్పాటు, నీటి కష్టాల నివారణ, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఇంకుడు గుంతలు, గర్భిణులకు పోషక ఆహారం వంటి హామీలు అందులో ఉన్నాయి. ఒకే అభ్యర్థి ఇన్ని హామీలు ఇవ్వడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,060గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,040గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.20 పెరిగినట్లు వెల్లడించారు.
NLG; దేవరకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మైదానంలో డిసెంబర్ 20న 10 నుంచి 16 ఏళ్ల లోపు బాల బాలికలకు జిల్లాస్థాయి అథ్లెటిక్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 100 మీటర్, 800 మీటర్, షాట్ పుట్ వంటి వివిధ ఈవెంట్లలో పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలకు శిక్షణ ఇస్తారని ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు.
NZB: ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ (ఫొటోతో), రేషన్ కార్డు (ఫొటోతో), పట్టాదారు పాస్ బుక్ ఉపాధి జాబ్ కార్డు, తదితర పత్రాల్లో మొదలగునవి చూపించాలి.
SRPT: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు, ఆ రోజు ముందు స్థానిక సెలవులను ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. మొదటి విడత పోలింగ్ ఉన్న ప్రాంతాల్లో డిసెంబర్ 10,11 రెండో విడతలో 13,14 మూడో విడతలో 16,17 తేదీలను స్థానిక సెలవులుగా గుర్తించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, పబ్లిక్ అండర్టేకింగ్ వారికి వర్తిస్తాయని తెలిపారు.
BHPL: భూపాలపల్లి RTC డిపో నుంచి హన్మకొండ పట్టణానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అంబేద్కర్ చౌక్ వద్ద ఆగిన సమయంలో ప్రయాణికుడు ఉర్సు నరేశ్ డ్యూటీలో ఉన్న కండక్టర్ పై దాడి చేశాడు. “ఎంతసేపు ఆపుతారు” అంటూ బూతులు తిడుతూ దాడి చేయడంతో కండక్టర్కు రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
MNCL: జైపూర్ అటవీ ప్రాంతంలో రెండు పులుల సంచారం కలకలం రేపుతోంది. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక మామిడితోటతో పాటు వేలాల ఇసుక క్వారీ వద్ద పెద్దపులుల పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీ పరిసర ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రైతులు పత్తి చేన్లకు, పశువుల కాపర్లు ఒంటరిగా అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని కోరారు.
HYD: GHMCని పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు. తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ జనాభా ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు,పార్టీల సభ్యులు 7 రోజుల్లోగా తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చన్నారు.
GDWL: జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో 106 గ్రామ పంచాయతీలు ఉండగా 14 ఏకగ్రీవం కాగా 92 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 35 సమస్యాత్మక, 56 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకు 28 రూట్ మొబైల్ పార్టీలు,4 స్ట్రైకింగ్ ఫోర్స్,2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్,4 రూట్ ఇన్చార్జీలుగా 13 మందిని నియమించారు.
KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం మధిరలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మధిర చేరుకోనున్న ఆయన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 3నుంచి 5గంటల వరకు పార్టీ నాయకులు, ప్రజలతో సమావేశం కానున్న భట్టి అనంతరం హైదరాబాద్ బయలుదేరతారు.
BHPL: గణపురం మండలం చెల్పూర్ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో భార్యా భర్తలు వార్డు మెంబర్ పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ సర్పంచ్ అభ్యర్థి శోభారాణి చానల్లో భర్త రామారావు 11వ వార్డు, భార్య కృష్ణవేణి 14వ వార్డులో బరిలో ఉన్నారు. గత వారం రోజులుగా ఈ దంపతులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
KMR: పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. KMR జిల్లాలో తొలి విడతలో 156 గ్రామాల్లో సర్పంచ్ పదవికి 727 మంది, 1084 వార్డులకు 3048 మంది పోటీ పడుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. మూడో విడతలో 168 పంచాయతీలకు గానూ 26 సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి.
SRCL: ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మహేష్ వి గితే తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.
MBNR: బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏడు ఎనిమిది వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు మంగళవారం రాత్రి ప్రకటించారు. 7వ వార్డులో అలివేల, 8 వార్డులో యాదమ్మ ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వార్డు పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.