WGL: దుగ్గొండి మండల కేంద్రంలో ముద్దనూరు, మైసంపల్లి, దుగ్గొండి, మల్లంపల్లి, తిమ్మంపేట, చాపలబండ, మధిర ఇవాళ రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. MLA దొంతి మాధవరెడ్డి విస్తృతంగా పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం MLA దొంతి ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
HYD: ఫూట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఈనెల 13న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఫలక్ నుమా ప్యాలెస్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయనతో ఫొటో తీసుకునేందుకు ఒక్కొక్కరు రూ. 9.95 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని ‘ది గోట్ టూర్’ నిర్వాహకులు తెలిపారు. కేవలం 100 మంది అభిమానులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
HYD: ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ ఫూట్ బాల్ మ్యాచ్ కోసం భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర క్రీడాకారులు పాల్గొననున్నారు. మెస్సీ సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ చేరుకుని, ఫలక్ నుమా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం కార్యక్రమాలలో పాల్గొంటారు. రాచకొండ పోలీసులు 2 వేల మందితో భద్రత కల్పిస్తున్నారు.
NRPT: జిల్లాలోని మద్దూరు, కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాలలో గురువారం మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. 67 గ్రామ పంచాయతీలు, 572 వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఎన్నికలలో ఎలాంటి ఘటనలను జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉ. 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి నుండి ఫలితాలు వెల్లడికానున్నాయి.
HYD: జీహెచ్ఎంసీ ప్రస్తుత, మాజీ కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, కె. ఇలంబర్తిలకు హైకోర్టు నోటీసులిచ్చింది. శేరిలింగంపల్లి సిటీప్లానర్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల రికార్డులను సమాచార హక్కు చట్టం కింద పరిశీలనకు అనుమతించకపోవడంతో వారికి కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. జనవరి 9లోగా కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.
KMM: రాజ్యసభలో బుధవారం జరిగిన వందేమాతర గీతంపై చర్చలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రసంగించారు. వందేమాతర గీతం భారతీయుల ఐక్యతను, గౌరవాన్ని పెంపొందిస్తుందని వారు అన్నారు. బంకించంద్ర ఛటర్జీ 1875లో రాసిన ఆనంద్ మఠ్ పుస్తకంలోని ఈ గీతం.. బ్రిటిష్ వలస పాలకులపై పోరాడడానికి మన పూర్వీకులకు ఆత్మగౌరవంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని తెలిపారు.
NGKL: వంగూర్ మండలంలో 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 218 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదుగురు జోనల్ ఆఫీసర్లు, 9మంది ఆర్వోలు, 218 మంది పీవోలు, ఓపివోలు, రిజర్వ్ పోలింగ్ సిబ్బందితో కలిపి 492 మంది సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పోలీసులతో కలిపి 550 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని ఎంపీడీవో బ్రహ్మచారి బుధవారం తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. వివిధ ప్రాంతాలలో ఉన్న ఓటరు మహాశయులు సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధం అయ్యారు. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 506 పంచాయతీలు, 4,222 వార్డు స్థానాలు ఉండగా ఇప్పటికే కొన్ని ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి ఎన్నిక జరగనుంది.
NZB: వేల్పూర్ మండలం అంక్సాపూర్లో సంతమన్న జాతర సందర్భంగా మల్లన్న దేవాలయాన్ని బుధవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అయన మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. అలాగే విశిష్ట పాదరసలింగాన్ని కూడా సందర్శించారు.
WGL: సంగెం మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురుగుమందుల వివరాలు నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి, యూరియా రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
కామారెడ్డి జిల్లాలో జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధులకు కేటాయించిన 53 మంది అధికారులు బుధవారం డ్యూటీలో రిపోర్టు చేయలేదు. దీంతో ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసినందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు DEO రాజు పేర్కొన్నారు.
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. సొంతూరులో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు తప్పక వచ్చి ఓటేయాలి. 3 జిల్లాల్లోని 630 పంచాయతీల్లో 45 ఏకగ్రీవం కాగా, 585 స్థానాలకు 858 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 4,776 వార్డు స్థానాలకు 11,367 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. 3 జిల్లాల్లోని 630 పంచాయతీల్లో 45 ఏకగ్రీవం కాగా, 585 స్థానాలకు 858 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 4,776 వార్డు స్థానాలకు 11,367 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. స్వగ్రామంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు తప్పక వచ్చి ఓటేయ్యాలని హిట్ టీవీ తరుఫున కోరుతున్నాం.
MHBD: స్థానిక సంస్థల ఎన్నికల సందడి గ్రామీణ ప్రాంతాల్లో ఊపందుకుంది. తోర్రూర్ మండలం కంఠాయపాలెంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బరిలో 4 ఉండగా.. స్వతంత్ర అభ్యర్థి ఆవుల శ్యామలత- ఉపేందర్ ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. గ్రామ సమస్యలు పరిష్కారిస్తామంటూ మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. దీంతో యువత శ్యామలత వైపు మెగ్గు చూపుతూ.. ఆమెను గెలిపించాలని విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు.
HNK: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో కలిపి 266, సర్పంచి అభ్యర్థులు ఉండగా.. 1,117 వార్డు మెంబర్స్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉ. 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.