• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రమాద కేసులు స్నేహపూర్వకంగా పరిష్కారం

KNR: కోర్టులో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మోటార్ వాహన ప్రమాదాలకు సంబంధించిన కేసులు స్నేహపూర్వకంగా పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా బాధితులకు రూ. 78 లక్షల క్లైమ్ మొత్తాన్ని జడ్జి శివకుమార్ అందజేశారు. లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని న్యాయమూర్తి సూచించారు.

December 21, 2025 / 06:10 PM IST

‘ఐక్యంగా ఉండి సంఘం పటిష్టతకు కృషి చేయాలి’

ADB: కులస్తులందరూ ఐక్యంగా ఉండి సంఘం పటిష్టత కోసం కృషి చేయాలని అఖిల గాండ్ల తెలికుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బీర్కూర్ వార్ నగేష్, పద్మావతి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లోని బీసీ సంఘ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ ప్రతిష్టత కోసం పలువురి అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, నాయకులు రాజేశ్వర్, చందు పాల్గొన్నారు.

December 21, 2025 / 06:08 PM IST

లోక్ అదాలత్.. 917 కేసులు పరిష్కారం

RR: షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్‌లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ స్వాతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సివిల్, క్రిమినల్, బ్యాంక్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్, పిట్టి కేసుల పరిష్కారం దిశగా సాగిన లోక్ అదాలత్‌లో మొత్తం 917 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు.

December 21, 2025 / 06:03 PM IST

క్రికెట్ టోర్నీని ప్రారంభించిన పోచారం

KMR: క్రీడలు యువతలో మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. చింతకుంటలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. క్రీడాకారులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.

December 21, 2025 / 06:01 PM IST

రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న సర్పంచ్‌లు

WGL: ఖానాపూర్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం జరగనుందని ఎంపీడీవో వనపర్తి అద్వైత తెలిపారు. ఆయా పంచాయతీ కార్యాలయాల్లో స్థానిక కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు. గ్రామ పెద్దలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని MPDO కోరారు.

December 21, 2025 / 06:00 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట వేదికగా జరిగిన 8వ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారులు తమ సత్తా చాటారు. నలుగురు విద్యార్థులు బంగారు పతకాలను కైవసం చేసుకుని రాష్ట్రస్థాయిలో జిల్లా కీర్తిని చాటారు.

December 21, 2025 / 05:57 PM IST

తొలి ప్రయత్నంలోనే గ్రూప్-3 ఉద్యోగం

NRPT: పట్టుదలతో శ్రమిస్తే లక్ష్యం సుసాధ్యమని మక్తల్‌కు చెందిన బోయ రమేష్ నిరూపించారు. ఇటీవల వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో ఆయన ప్రతిభ చాటి సమాచార పౌర సంబంధాల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన రమేష్.. తన చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేసి, మొదటి ప్రయత్నంలోనే ఈ విజయం సాధించారు.

December 21, 2025 / 05:57 PM IST

‘కమ్యూనిటీ హాల్లు ఏర్పాటు చేస్తాం’

RR: షాద్ నగర్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాల్లో అన్ని కులాలకు సంబంధించి కమ్యూనిటీ హాల్‌లు ఏర్పాటు చేస్తామని, గౌడ సోదరుల అభివృద్ధికి తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

December 21, 2025 / 05:55 PM IST

ఎదురెదురుగా రెండు కార్లు ఢీ వ్యక్తికి తీవ్ర గాయాలు

KMM: కూసుమంచి మండలం లింగారం తండా గ్రామ సమీపంలోని, హైదరాబాద్, సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్నీ హాస్పిటల్‌కు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

December 21, 2025 / 05:55 PM IST

ప్రమాణస్వీకారం చేయించే అధికారులు వీరే.!

BHNG: నూతన సర్పంచులను ప్రమాణ స్వీకారం చేయించే అధికారుల జాబితాను ఆదివారం అధికారులు ప్రకటించారు. బసంతాపురం వెంకటరమణ, బేగంపేట పద్మజ, బూరుగుపల్లి ఎన్నారెడ్డి, చల్లూరు వెంకటరమణ, దూది వెంకటాపూర్ భరత్, కాల్వపల్లి కిషన్, కొండేటి నరసింహ, కుర్రారం సాయి చైతన్య, లక్ష్మక్క పల్లి భాస్కర్, మల్లగూడెం ఖలీల్‌లు ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

December 21, 2025 / 05:47 PM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీటీసీ

MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందినj రాగి తిరుమల చారి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ముద్దం విక్రమ్ రెడ్డి ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని తెలిపారు. గ్రామ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు.

December 21, 2025 / 05:46 PM IST

మహా లక్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ

HYD: మహాలక్ష్మి పథకం వల్ల RTC లాభాల్లోకి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత రెండేళ్లలో RTCలో 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయన్నారు. ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్ మెస్ ఛార్జీలను 200% పెంచామన్నారు.

December 21, 2025 / 05:43 PM IST

రోడ్లు, వంతెనల కోసం మంత్రికి వినతి

NZB: ఆర్మూర్ పరిధిలోని ప్రధాన రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనులను తక్షణమే మంజూరు చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి సీతక్కను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. గ్రామాలను అనుసంధానించే రోడ్లు, శిథిలావస్థకు చేరిన వంతెనల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు.

December 21, 2025 / 05:42 PM IST

మల్కాపూర్‌లో స్వచ్ఛభారత్

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మళ్లీ స్వచ్ఛభారత్ కార్యక్రమం మొదలుపెట్టారు. మల్కాపూర్ గ్రామంలో పంచాయతీ నూతన పాలకవర్గం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసే ఘన నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో దుర్గామాత ఆలయం వద్ద స్వచ్ఛభారత్ చేపట్టి చీపుర్లతో శుభ్రం చేశారు.

December 21, 2025 / 05:41 PM IST

బీజేపీ ఆరోపణల్లో నిజం లేదు: సీపీఐ

NRPT: కోటకొండ గ్రామంలోని వ్యాపారస్తులను సీపీఐ మాస్ లైన్ నాయకులు వేధిస్తున్నారంటూ.. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను పార్టీ నేత కాశీనాథ్ తోసిపుచ్చారు. ఆదివారం కోటకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ ఎప్పుడూ ప్రజలు, వ్యాపారస్తుల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందన్నారు.

December 21, 2025 / 05:38 PM IST