NLG: వచ్చే ఏడాది జిల్లాలో రహదారి ప్రమాదాలు పూర్తిగా తగ్గేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు.
SRPT: అనంతారంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరానికి టీఎస్టీడీసీ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మితమైన శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించి , వైద్యులను సిబ్బందిని అభినందించారు.
NGKL: ఈనెల 25 నుంచి 28 వరకు కరీంనగర్లో నిర్వహించనున్న 72వ సీనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు బుధవారం వెళ్లారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికైన ఈ జట్టుకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య ఘనంగా వీడ్కోలు పలికారు.
MNCL: నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నాకాబందీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 31, జనవరి 1 వరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NRPT: 2029లో కూడా రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని ఉందని నారాయణపేట జిల్లా కోస్గి మండలం సజ్జకల్ గ్రామం నూతన సర్పంచ్ మౌనిక అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘గత పదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. సగం మూడోసారి తన కుటుంబం నుంచి సర్పంచిగా గెలుస్తున్నామని చెప్పారు. ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి తోటే సాధ్యమైందన్నారు.
NLG: టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ విభాగం నల్గొండ జిల్లా కన్వీనర్గా న్యాయవాది అఫ్రూజ్ ఖాన్ను నియమించారు. ఈ మేరకు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతం, మానవ హక్కుల పరిరక్షణ, న్యాయ సమస్యలపై ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. తనపై విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి అఫ్రూజ్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.
JGL: రాయికల్ మండలం ఆలూరులో పశు వైద్య శిబిరం కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో జరిగింది. పశువులకు గర్భస్థ పరీక్షలు, పాల దిగుబడి పెరిగేందుకు సూచనలు, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అధ్యక్షులు మెక్కొండ రాంరెడ్డి, సూపర్వైజర్ భారతపు రాజేశ్, డాక్టర్ ప్రేమ్ కుమార్, వెటర్నరీ సూపర్వైజర్ రాములు, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
BHNG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు, ఆలయ అర్చకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
MDK: మెదక్ పట్టణంలోని ప్రసిద్ధ మెదక్ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చర్చి పరిసరాలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు, పార్కింగ్ ప్రాంతాలు, రహదారులపై అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు తగిన సూచనలు చేశారు.
NGKL: ఈనెల 28, 29న జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న టీఎస్ యూటీఎఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం అచ్చంపేట పట్టణంలో సదస్సుకు సంబంధించిన గోడపత్రికలను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలు, ఉపాధ్యాయుల హక్కుల సాధనే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందన్నారు.
MLG: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శాశ్వత అభివృద్ధికి భూములిచ్చిన మేడారం గ్రామస్థులకు ఇవాళ MLG కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులు అందజేశారు. భూములిచ్చిన గ్రామస్థులకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపి, భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
SRCL: రాబోవు వేసవి కాలంలో నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు… వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలో గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ప్రభుత్వ విప్ ప్లాంట్లోని ఫిల్టర్ హౌస్, వాటర్ ప్లాంట్ మోటార్లను పరిశీలించారు..
SRPT: ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చర్చ్లన్నీ ఘన ఏర్పాట్లు చేస్తున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని ప్రతీకగా చర్చ్లను రంగురంగుల కాంతులు, క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, పశువుల పాకలతో సుందరంగా అలంకరించారు. లోకానికి వెలుగైన క్రీస్తును ఆరాధించే ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సన్నదం అయ్యారు.
SDPT: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని దౌల్తాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రీ- క్రిస్మస్ వేడుకల్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కలిసి మతసామరస్యంతో ఉండాలన్నారు.
SRD: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జయంతిని పురస్కరించుకొని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, దీపాలను వెలిగిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. వాజపేయి విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలిచారన్నారు.