• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్ద శంకరంపేట మండలంలో 5, టేక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. హవేలి ఘన్పూర్ మండలంలోనీ గాజిరెడ్డి పల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.

December 4, 2025 / 07:56 AM IST

‘ఇందూరు అభివృద్ధికి రెండేళ్లలో రూ.130 కోట్ల నిధులు’

NZB: ఇందూరు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలో దాదాపు రూ.130 కోట్ల నిధులు తీసుకురావడంలో విజయం సాధించామని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త వెల్లడించారు. రూ.37 కోట్ల ప్రభుత్వ నిధులు, TUFIDC, NUDA నిధులతో పాటు ఎనిమిదేళ్లుగా నిలిచిపోయిన ఎల్లమ్మ గుట్ట బ్రిడ్జి వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయన్నారు.

December 4, 2025 / 07:47 AM IST

కన్నాల గ్రామాన్ని సందర్శించిన DCP

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామాన్ని DCP ఎగ్గడి భాస్కర్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో ఉన్న రౌడీ షీటర్స్ ఇళ్లను తనిఖీ చేసి వారికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. రానున్న గ్రామపంచాయతీ ఎలక్షన్స్‌లో ఎటువంటి గొడవలు చేయవద్దని సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా గొడవలు చేసినట్లయితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

December 4, 2025 / 07:47 AM IST

సొంతింటి కల నిజం చేస్తామంటూ.. మోసం జాగ్రత.!

MDCL: సొంతింటి కలపై కొంత మంది ఫోకస్ చేసి, మీకోసం సొంతింటి కల నిజం చేస్తామని సాకులు చెప్పి మోసం చేస్తున్న పరిస్థితి గ్రేటర్ HYD నగరంలో చోటు చేసుకుంటుంది. అలాంటి వారు మాయమాటలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. చెంగిచెర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కాల్ చేసి, సొంతింటి కల నిజం చేస్తామని నమ్మించి నేరగాళ్లు రూ. 23,400 కొట్టేసారు.

December 4, 2025 / 07:34 AM IST

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: కోదండరాం

HYD: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. కాసోజు శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకుని LB నగర్‌లోని ఆయన విగ్రహానికి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలకు కీలకమలుపు LB నగర్ ఉద్యమమని తెలిపారు.

December 4, 2025 / 07:28 AM IST

జింకను చంపిన నలుగురి అరెస్ట్

నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం శివారులో జింకను చంపిన నలుగురిని బుధవారం పట్టుకున్ననట్లు NZB రూరల్ PS SHO శ్రీనివాస్ తెలిపారు. బోర్గాం గ్రామానికి చెందిన గంధం విజయ్, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్ వారం రోజుల కిందట వల వేసి జింకను పట్టుకుని చంపినట్లు సమాచారం వచ్చిందని SHO తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

December 4, 2025 / 07:25 AM IST

నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. గతంలో ఎంపికైన విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాలని, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు scholarships.gov.in వెబ్సైట్లో ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

December 4, 2025 / 07:23 AM IST

వారంలో రెండు రోజులు ప్రజావాణి: ఎస్పీ

VKB: వారంలో రెండు రోజులు ప్రజావాణి నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజలకు న్యాయం చేస్తామని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ప్రతి మంగళవారం, గురువారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపుతామన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 4, 2025 / 07:14 AM IST

సర్పంచ్‌గా గెలిస్తే గుడి నిర్మాణానికి రూ.3 లక్షల విరాళం

KMR: తాడ్వాయి మండలం కరుకుపల్లిలో సర్పంచి అభ్యర్థి భారతి గెలుపు కోసం అభ్యర్థి సోదరుడు హామీ ఇచ్చారు. కాంబ్లీ అశోక్ తన చెల్లిని సర్పంచిగా గెలిపిస్తే ఆగిపోయిన శివాలయం నిర్మాణం కోసం రూ.3 లక్షల విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఊరి పెద్దల సమక్షంలో హామీ ఇవ్వడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. తన చెల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించాడు.

December 4, 2025 / 07:08 AM IST

ఆ గ్రామంలో నో ఎలక్షన్‌.. ఎందుకంటే!

NLG: అనుముల మండలం పేరూరులో సర్పంచ్‌ ఎన్నికలు లేనట్లేనని స్పష్టమవుతుంది. సర్పంచ్‌, వార్డు మెంబర్లకు గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్‌ వేయకపోవడంతో ప్రభుత్వం ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్‌ సక్రమంగా లేదని పేర్కొంటూ పేరూరు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.

December 4, 2025 / 07:06 AM IST

మున్సిపాలిటీ పనులపై త్రిసభ్య కమిటీతో సమీక్ష

KNR: హుస్నాబాద్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, కమ్యూనిటీ హాల్లు, ఎల్లమ్మ చెరువు నాళాల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు, పూర్తయిన పనులు, ప్రతిపాదనలు చేసే పనులపై అధ్యయనం చేయడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.

December 4, 2025 / 07:02 AM IST

చెస్ ఆడతారా.. రూ. 22 లక్షలు గెలుచుకోవచ్చు

HYD: తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్‌లో జరుగుతోంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో గెలుపొందితే రూ. 22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు.

December 4, 2025 / 06:59 AM IST

మూడో విడత మొదటి రోజు 38 నామినేషన్లు

గద్వాల: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లోని 75 గ్రామ పంచాయతీలకు, 700 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 38 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి.

December 4, 2025 / 06:57 AM IST

సిద్దిపేట పేరు ప్రస్థావించని సీఎం

SDPT: హుస్నాబాద్‌లో బుధవారం జరిగిన ప్రజా పాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మాట్లాడినంత సేపు కరీంనగర్, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మాత్రమే ప్రస్థావించారు. వాస్తవానికి హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలోనే ఉండడం సీఎం స్థాయి వ్యక్తి సిద్దిపేట పేరు ప్రస్తావించక పోవడంతో ఎదో మతలబు ఉందని ప్రజలు చర్చించికుంటున్నారు.

December 4, 2025 / 06:50 AM IST

పొట్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా సుజాత రాజు నామినేషన్

సంగారెడ్డి: సిర్గాపూర్ మండలంలోని పొట్పల్లి గ్రామపంచాయతీ ఎస్సీ మహిళ రిజర్వు స్థానానికి BRS మద్దతుదారు సుజాత-రాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి మంజుల కులకర్ణికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతంలో ఉన్న తమ గ్రామ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

December 4, 2025 / 06:50 AM IST