KNR: మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు మంగళవారం 4గం. తరువాత గుర్తులు కేటాయించనున్నట్లు హుజురాబాద్ MPDO రాజేశ్వరరావు తెలిపారు. తెలుగు పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు కేటాయించనున్నారు. దీంతో నచ్చిన గుర్తులు రావాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు.
MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఎఫ్ఎస్టీ బృందం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 24 బీర్ బాటిల్స్, 48 క్వార్టర్ సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్ఎస్టీ బృందం తెలిపారు.
WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కోసం ర్యాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, సత్య శారదల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
NZB: మోస్రా మండలం గోవూర్లో ఎన్నికల నేపథ్యంలో నవీన్ రెడ్డి అనే వ్యక్తి వినూత్న రీతిలో ప్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులను ఉద్దేశించి, “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు” అని ఇంటి వద్ద ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓటుకు నోటు తీసుకోకుండా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
NLG: దామరచర్లలో BRS బలపరిచిన గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సోము నరసమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గ్రామస్తులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే సర్పంచ్ అభ్యర్థి సోము నరసమ్మతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించి, ఓటర్లను అభ్యర్థించారు. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు.
ADB: కంప్యూటర్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో తిరిగి ప్రారంభిస్తున్నందున గతంలో పని చేసిన కంప్యూటర్ టీచర్స్ను తిరిగి కొనసాగించాలని జిల్లా కంప్యూటర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని డీసీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
NRPT: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట మక్తల్ నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మాగనూరు మండలం పెద్దవాగు నుంచి అనుమతుల పేరుతో అక్రమ రవాణా చేస్తున్న వారిని పోలీసులు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పట్టుకున్నట్టే పట్టుకుని వదిలేశారని ఆరోపించారు.
WGL: నల్లబెల్లిలో గ్రోమోర్ సెంటర్ వద్ద ఇవాళ యూరియా బస్తాల కోసం మహిళా రైతులు వేచి చూస్తున్నారు. యాసంగి పంటల సాగుబడి కోసం విక్రయించేందుకు వచ్చి ఉదయం నుంచి ఎదురుచూస్తున్నమని తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి రైతులకు సకాలంలో యూరియా అందించి పంటల దిగుబడికి సహకరించాల్సిందిగా కోరారు. కాగా, రాష్ట్రంలో యూరియా కోరత వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
MHBD: గంగారం మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీల ఎన్నికల నేపథ్యంలో ఎస్సై రవికుమార్ పలు సూచన చేశారు. మండల వ్యాప్తంగా 12 గ్రామపంచాయతీల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. అభ్యర్థులు, ప్రత్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఓటు కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా ఇటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.
MDK: గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలకు తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ పురుషుల వాలీబాల్ జట్టు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొనడానికి సోమవారం కాకినాడకు బయలుదేరింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు జేఎన్టీయూ కాకినాడలో ఈ పోటీలు జరగనున్నాయి. ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి, క్రీడా దుస్తులు అందజేశారు. శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్ పాల్గొన్నారు.
MDK: ఓటు చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఓటు చోరీ పై మెదక్లో సంతకాల సేకరణ సమీక్షా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ పాల్గొన్నారు.
NRML: నిర్మల్ నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. నిర్మల్ నుంచి కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, శబరిమల వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మధురై నుంచి నిర్మల్కు వస్తుందన్నారు. 6 రోజుల ప్రయాణంలో ఒకరికి టికెట్ ధర రూ.7,650 ఉంటుందని స్పష్టం చేశారు.
NGKL: జిల్లాలో పంచాయతీ ఎన్నికల భద్రతా చర్యలను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సమీక్షించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియా అపోహలపై కఠిన చర్యలు, సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు.
వరంగల్ MGM ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది వేతనాలు, PF చెల్లింపుల్లో కోతలు పెడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 675 మందికి రూ.12వేలు PF చెల్లించాల్సి ఉండగా 500 మందికి రూ. 8600 చెల్లించి నెలకు రూ.40 లక్షలు వెనకేసుకుంటున్నట్లు సమాచారం. శానిటేషన్ బిల్లుల్లో పరిపాలన ఉద్యోగి, RMO చక్రం తిప్పి రూ.4 లక్షలు జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.