• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

HNK: కాజీపేట మండలం కడిపికొండ బ్రిడ్జిపై ఇవాళ సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతిపై యాసిడ్ దాడి చేశారు. ఈ యాసిడ్ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా.. గమనించిన స్థానికులు యువతిని MGM ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు జనగాం జిల్లా జఫర్‌ఘడ్‌కు చెందినవారీగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 1, 2025 / 09:14 PM IST

‘సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సాధించాలి’

PDPL: గ్రామపంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు, రచ్చపల్లి గ్రామాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం సిపి సందర్శించి శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు సూచనలను సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

December 1, 2025 / 09:00 PM IST

‘మద్యం స్టాక్, విక్రయాల వివరాలు నమోదు చేయాలి’

NZB: బోధన్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ భాస్కరరావు పరిశీలించారు. సోమవారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రావడంతో పట్టణంలోని స్టోర్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణదారులకు కీలక సూచనలు చేశారు. స్టాక్ వివరాలు, రోజువారీ విక్రయాల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

December 1, 2025 / 08:57 PM IST

‘సీఐటీయు మహాసభలను విజయవంతం చేయాలి’

PDPL: ఈనెల 7 నుంచి 9 వరకు మెదక్ పట్టణంలో జరిగే CITU రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరిఖని CITU కార్యాలయంలో ఇవాళ జరిగిన ప్లంబర్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. మహాసభలకు నేతలు బివి రాఘవులు, హేమలత, సాయిబాబు,పాల్గొన్నారు.

December 1, 2025 / 08:54 PM IST

అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ

JGL:  ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేస్తూ, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేట్లు చూడాలన్నారు.

December 1, 2025 / 08:54 PM IST

మనోరాబాద్ మండలంలో 294 నామినేషన్లు

MDK: మనోహరాబాద్ మండలంలో రెండవ రోజు 294 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో రవీందర్ తెలిపారు. సర్పంచ్ పదవికి 53 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 241 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో 393 నామినేషన్లు దాఖలు కాగా, సర్పంచ్ పదవికి 76, వార్డు పదవులకు 317 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు.

December 1, 2025 / 08:53 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS నేతలు

MHBD: కొత్తగూడ మండల పరిధిలోని పెగడపల్లి గ్రామంలో ఇవాళ BRS నాయకులు నోముల సాంబరాజు, గాడుదుల సమ్మయ్య, బొల్లు రాజేందర్ కాంగ్రెస్‌లో చేరారు. మండల అధ్యక్షులు సారయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్సింగ్ పార్టీలో చేరిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని వజ్జ సారయ్య పిలుపునిచ్చారు.

December 1, 2025 / 08:51 PM IST

కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు

SRCL: వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు గుడ్ల మైసయ్య, సుమారు 20 మందితో కలిసి సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వాకులభరణం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సొయినేని కర్ణాకర్ పాల్గొన్నారు.

December 1, 2025 / 08:49 PM IST

జిల్లాలో పోలీస్ యాక్ట్- 1861 అమలు

BHPL: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో BHPL జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్-1861 అమలు చేస్తున్నట్లు SP సంకీర్త్ గౌడ్ తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నా, రాస్తారోకో, పబ్లిక్ మీటింగ్స్, సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే వాడకం, ప్రభుత్వ ఆస్తులకు నష్టంకలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 1, 2025 / 08:48 PM IST

అన్ని గ్రామాల్లో BJP జెండా ఎగురవేయాలి: బలరాం

MHBD: కొత్తగూడ మండలంలో BJP మండల అధ్యక్షుడు యాదగిరి మురళి ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, రాష్ట్ర నాయకుడు సీతయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. DEC 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బీజేపీ జిల్లా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.

December 1, 2025 / 08:46 PM IST

బాలికని అత్యాచారం చేసి చంపారు: DCP

MNCL: దండేపల్లి మండలంలోని నంబాలకు చెందిన ఏడేళ్ల బాలికపై శనిగారపు బాపు, ఉపారపు సతీష్ అత్యాచారం చేసి హత్య చేశారని డీసీపీ భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 27న బాలికను ఎత్తుకు వెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారన్నారు. అనంతరం బాలికను హత్య చేసి గ్రామంలోని ఒక బావిలో పడేశారన్నారు. వారిద్దరూ పారిపోయే ప్రయత్నం చేయగా రిమాండ్ లోకి తీసుకున్నామన్నారు.

December 1, 2025 / 08:45 PM IST

సాయిరాం కాలనీలో సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే

JGL: మెట్ పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో హోలియా దాసరి సంఘ సభ్యులను ఇవాళ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కలుసుకొని వారి సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘం అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, కాలనీలో మౌలిక వసతుల మెరుగుదల గురించి చర్చించారు. వారు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

December 1, 2025 / 08:44 PM IST

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

KNR: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్సై పూదరి తిరుపతి గౌడ్ హెచ్చరించారు. ఇవాళ సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో అనవసరంగా గొడవలు పెట్టుకుని కేసులపాలు కావద్దని ఓటర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ బొజ్జరాజు పాల్గొన్నారు.

December 1, 2025 / 08:43 PM IST

స్థానిక ఎన్నికల వేళ… కాంగ్రెస్ పార్టీ ఖాళీ

MHBD: స్థానిక ఎన్నికల వేళ పెద్దవంగర మండలంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. బొమ్మకల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుర్ర జంపయ్య ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పెద్దవంగర మండల సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

December 1, 2025 / 08:41 PM IST

DCCB డైరెక్టర్ కు కార్మికులు వినతిపత్రం అందజేత

BDK: మణుగూరు ఆర్టీసీ డిపో కార్మికులు వారి సమస్యలపై ఇవాళ దీక్ష నిర్వహించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా DCCB డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికులు మాట్లాడుతూ.. డిపోలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

December 1, 2025 / 08:39 PM IST