NZB: ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1988-89 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 37 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు.
SRD: మహాత్మా గాంధీ ఉపాధి హామీ (MGNREGS) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిందని, దీంట్లో గాంధీ పేరును తొలగించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు కృష్ణ, కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం సిర్గాపూర్లో స్థానిక ప్రధాన కూడలిలో కాంగ్రెస్ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. EGSలో మహాత్మ గాంధీ పేరు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని శ్రీవాణి హై స్కూల్లో నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల ఆదర్శ రైతులను పాఠశాల యాజమాన్యం, ప్రొఫెసర్ హరగోపాల్ సన్మానించారు. రైతులను సన్మానించడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ పూర్ణిమ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ వినీతమ్మ పాల్గొన్నారు.
KNR: చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
WGL: ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ 129వ ఎపిసోడ్ ఈరోజు ప్రసారమైంది. నగరంలోని కాశిబుగ్గ సొసైటీకాలనీలో స్థానిక బీజేపీ నాయకులు ఈ ప్రసారాన్ని వీక్షించారు. దేశంలోని ప్రతిఒక్కరూ ఈ ‘మన్ కి బాత్’ వీక్షించాలని వారు కోరారు. రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మండల ఇంఛార్జ్ గుర్రపు సత్యనారాయణ, సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, పలువురు నేతలున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రాజు – శ్రీలత దంపతుల ఒక్క కుమారుడు సిద్ధు (9), రెండో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు పతంగి కొనివ్వక పోవడంతో మనస్తాపానికి గురై భయపెట్టాలని ఇంటి స్లాబ్కు చీరతో ఉరేసుకున్నారు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
MDCL: GHMC మేడ్చల్ సర్కిల్కు నూతన డిప్యూటీ కమిషనర్గా సుధాంశు బాధ్యతలు చేపట్టారు. సర్కిల్ పరిధిలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు చేపడతానని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సర్కిల్ పరిధిలోని సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మునుపు మేడ్చల్ సర్కిల్ DCగా పనిచేసిన చంద్రప్రకాష్ బదిలీ అయ్యారు.
BDK: దేశ స్వాతంత్య్ర పోరాటానికి దిశానిర్దేశం చేసిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ బొగ్గు బుటా కార్మిక సంఘం, లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సింగారం గ్రామపంచాయతీ పరిధిలలో ఆదివారం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై జెండా ఆవిష్కరించారు.
BDK: జూలూరుపాడు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాన్కి బాత్ లైవ్ కార్యక్రమాన్ని నేడు రైతులు వీక్షించారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తున్నారని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఉపాధి హామీ పథకాన్ని పేరు మాత్రమే మార్చారని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో వందరోజులకి బదులుగా 125 రోజులు పెంచారని నాయకులు తెలిపారు.
KMM: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో పలు విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత సరఫరాను కొనసాగిస్తామని పేర్కొంటూ, ఏప్రిల్ నుంచి కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
VKB: జిల్లాలో వరి కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గి పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. దీంతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. వాటిని కాల్చకుండా పొలంలోనే దున్నడం వల్ల సేంద్రియ ఎరువుగా మారి పంట దిగుబడి పెరుగుతుందని సూచించారు. పంటలకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా, ఇతర జీవులు చనిపోవడంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందన్నారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని డఫ్ డీల్స్ పాఠశాలలో ఆదివారం వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు పాఠశాల ఛైర్మన్ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు తెలిపారు.
HYD: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను 12 జోన్లుగా విభజిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోకి శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజేంద్రనగర్ జోన్లు రానున్నాయి. సైబరాబాద్లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, జోన్లు ఉండగా, రాచకొండలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లు ఏర్పాటవుతాయి.
RR: ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట్లోని చెరువు కట్టపై ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ పేదల చెమటతో నడిచే చారిత్రాత్మక ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు.