NLG: రామన్నపేట కోర్టు పరిధిలో మొత్తం 481 కేసులకు పరిష్కారం లభించింది. ఆదివారం రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జ్ జీ.సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి డీ. సత్తయ్యలు కలిసి కోర్టు హల్లో జాతీయ ‘లోక్ అధాలత్’ను నిర్వహించారు.
NZB:రెంజల్ మండల పరిధిలోని బోరిగాంలో దారుణం జరిగింది.ఆదివారం ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగి పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బస్వారెడ్డి, అతని భార్య మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బస్వారెడ్డి తన భార్య రుక్మిణి (54)ని ఇంటి ఆవరణలో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.
MHBD: గూడూరు (M)దామరవంచ GPలో సర్పంచ్ ప్రమాణ స్వీకార వేళ విచిత్రం చోటుచేసుకుంది. BRS మద్దతుదారు స్వాతి, కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఇద్దరూ తామే సర్పంచ్గా గెలిచినట్టు ధ్రువపత్రాలు చూపిస్తూ ఆహ్వానాలు పంపుతున్నారు. మొదట 3 ఓట్లతో స్వాతి గెలిచినట్టు ప్రకటన జరిగినా రీకౌంటింగ్లో సుజాత 1 ఓటుతో గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి నిర్ధారించారు. దీంతో ప్రమాణ స్వీకరంపై ఆసక్తి నెలకొంది.
KNR: నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా డీజేలు, అధిక శబ్ద వ్యవస్థలు వినియోగించరాదన్నారు. ర్యాలీలు నిర్వహించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించే చర్యలు చేపట్టవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, జి.వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం అప్పనపల్లిలో గొర్రెలు, మేకలకు నత్తల నివారణ మందుల పంపిణీని ప్రారంభించనున్నారు.
BHNG: కొత్తగా కొలువుదీరనున్న గ్రామపంచాయతీలలో కో ఆప్షన్ మెంబర్లుగా దివ్యాంగులకు అవకాశం కల్పించాలని, వికలాంగుల హక్కుల నాయకులు బండ జహంగీర్ అన్నారు. ఆలేర్ పట్టణంలో ఆదివారం పాలసీతలీకరణ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. గ్రామపంచాయతీలో 5 శాతం రిజర్వేషన్ పాటిస్తూ కో ఆప్షన్ నెంబర్లుగా ఒక వికలాంగులను నియమించాలని కోరారు.
WGL: HYDలోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఇవాళ మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మేడారం మహా జాతరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. సమ్మక్క చీర, కంకణం, కండువా బంగారం సమర్పించారు. మంత్రి సీతక్క జాతర ఘనత, ఆదివాసీ సంస్కృతి, అభివృద్ధి వివరించారు. రాష్ట్రపతి జాతరకు రావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ.. నీటి తోట్టిలో పడి రేండేళ్ల ఫైజల్ అనే చిన్నారి మృతి చెందాడు. నిన్న మధ్యాహ్న సమయంలో బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టపక్కల వెతికారు. దాదాపు రెండు గంటల తరువాత ఫైజల్ నీటి తోట్టిలో పడిఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
NRML: ఈ నెల 22న జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వాయిదా వేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ నెల 29 నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. గ్రామపంచాయతీ నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ప్రజావాణి వాయిదా వేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
PDPL: ప్రజావాణి రెండో వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రశంసా పత్రాన్ని అందుకున్న కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వర రావును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా అభినందించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో తహసీల్దార్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవను కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు.
NRPT: ధన్వాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2011-13 విద్యా సంవత్సరానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. సుమారు 12 ఏళ్ల తర్వాత 40 మంది మిత్రులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రిన్సిపల్ ముజీబ్, బాలన్న మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడే గురువులకు నిజమైన గౌరవమని పేర్కొన్నారు.
KNR: రైతులు యూరియాను ఇంటి నుంచే బుక్ చేసుకునేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రారంభించినట్లు ఇల్లందకుంట ఏవో సూర్యనారాయణ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు నచ్చిన ఏ డీలర్ నుంచైనా యూరియాను బుక్ చేసి కొనుగోలు చేయవచ్చన్నారు. బుకింగ్ సమయంలో పాస్బుక్ నంబర్తో పాటు తాము వేసిన పంటల వివరాలను నమోదు చేయాలని సూచించారు.
NLG: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాను నల్గొండలోని ఐటీఐ క్యాంపస్లో ఉదయం జరుగుతుందని, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి 10th, డిగ్రీ అర్హత గలవారు విచ్చేయాలని కోరారు.
KNR: ఈనెల 24 నుంచి 26 వరకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించనున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ “కిసాన్ గ్రామీణ మేళా” నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు హత్యకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద పార్టీలకు అతీతంగా బంగ్లాదేశ్ చిత్రపటాన్ని దహనం చేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిముషాలు పాటు మౌనం పాటించారు. ఈ కార్య క్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.