• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు’

SRPT: ఆడపిల్లలను చదివించే దిశగా ప్రోత్సహించాలని, బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు హెచ్చరించారు. మున్యానాయక్ తండాలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే తల్లిదండ్రులతోపాటు ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

November 22, 2025 / 09:13 PM IST

‘ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌ను వేగవంతం చేయాలి’

SRPT: 5-15 సంవత్సరాల పాఠశాల విద్యార్థులందరికీ ఆధార్ మెండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ సీతారామ రావు ఆపరేటర్లకు సూచించారు. జిల్లాలో 24,532 మంది విద్యార్థులకు ఈ అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆధార్ సవరణలు (పేరు, పుట్టిన తేదీ) కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

November 22, 2025 / 09:10 PM IST

కోళ్ల పందాలపై పోలీసుల దాడులు

RR: మొయినాబాద్ PS పరిధిలోని బాకారం గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోళ్ల పందెంపై రాజేంద్రనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు కృష్ణంరాజుతో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60,950 నగదు,4 కార్లు,13 ఫోన్లు, 18 కోడి కత్తిలు, మొత్తం 22 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

November 22, 2025 / 08:57 PM IST

డీసీసీ అధ్యక్షురాలుగా ఆంక్షా రెడ్డి

SDPT: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గజ్వేల్ (వర్గల్) చెందిన తూముకుంట ఆంక్షారెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నియామకపు ఆదేశాలు జారీ చేశారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి కూతురైన ఆంక్షా రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

November 22, 2025 / 08:51 PM IST

సమిష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యం: కలెక్టర్

ADB: జిల్లాలోని ప్రజలందరి సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము అవార్డు పొందిన కలెక్టర్ రాజర్షి షాను కాంగ్రెస్ నాయకులు పట్టణంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కలిసిన వారిలో నాయకులు సంతోష్, సతీష్, నర్సింగ్ తదితరులున్నారు.

November 22, 2025 / 08:49 PM IST

ఏ రంగమైనా.. హైదరాబాద్ టాప్

HYD: ఐటీ, ఫార్మా, హెల్త్కేర్, బ్యాంకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్.. రంగమేదైనా సరే.. హైదరాబాదే టాప్ లీడర్. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబైని దాటేసి బహుళ జాతి సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీల ఏర్పాటుకు జైకొడుతున్నాయి.

November 22, 2025 / 08:46 PM IST

‘ఇళ్లను పంపించి చేయకపోతే ఉద్యమ ఉద్ధృతం చేస్తాం’

MHBD: తొర్రూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఈ మేరకు ఇవాళ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు అశోక్ మాట్లాడుతూ.. MLA స్పందించి తక్షిణమే ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని చేస్తామని పేర్కొన్నారు.

November 22, 2025 / 08:35 PM IST

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా సంగీతం శ్రీనివాస్

కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్‌ను నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలువురు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

November 22, 2025 / 08:34 PM IST

కన్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడి

ASF: డబ్బుల కోసం కన్న కొడుకుపై తండ్రి గొడ్డలితో దాడి చేసిన ఘటన రెబ్బెన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కిషన్‌పై తండ్రి శంకర్ నాయక్ డబ్బులు ఇవ్వడం లేదని గొడ్డలితో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శంకర్ నాయక్‌పై శనివారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

November 22, 2025 / 08:30 PM IST

డీసీసీ అధ్యక్షులుగా గుడిపాటి నరసయ్య

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గుడిపాటి నరసయ్యను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. గుడిపాటి నరసయ్యకు తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పేరుంది. 2009లో తుంగతుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో మోత్కుపల్లి నరసింహులు చేతిలో ఓటమి పాలయ్యారు. 

November 22, 2025 / 08:26 PM IST

క్రీడాకారులను అభినందించిన పటాన్చెరు ఎమ్మెల్యే

SRD: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన పటాన్చెరు విద్యార్థులను గూడెం మహిపాల్ రెడ్డి ఇవాళ అభినందించారు. పటాన్ చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన వీరారెడ్డి కుమారుడు పట్లోళ్ల ఆర్యన్ రెడ్డి, తీర్థ అనే విద్యార్థులు ఇటీవల వికారాబాద్‌లో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ సెలక్షన్స్‌లో పాల్గొని ఎంపికయ్యారు.

November 22, 2025 / 08:25 PM IST

ఆన్లైన్ OTP విధానంతో పంట విక్రయం: కలెక్టర్

ADB: కౌలు రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌలు రైతులు పత్తితో పాటు సోయాబీన్, మొక్కజొన్న పంటలను కూడా OTP విధానంతో విక్రయించుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

November 22, 2025 / 08:23 PM IST

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

HYD: మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు చేశారు.

November 22, 2025 / 08:17 PM IST

ఈ 28 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్

WNP: జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను నవంబర్ 28- 30 వరకు నిర్వహించనున్నట్లు DEO అబ్దుల్ గని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది చిట్యాల మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనే విద్యార్థులను కమ్యూనిటీ చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశించారు.

November 22, 2025 / 08:16 PM IST

రేపు భూపాలపల్లికి రానున్నమంత్రి

BHPL: జిల్లా కేంద్రంలోని ASR గార్డెన్‌లో రేపు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరగనుంది. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చీరలు అందజేస్తారని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

November 22, 2025 / 08:15 PM IST