• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాలికని అత్యాచారం చేసి చంపారు: DCP

MNCL: దండేపల్లి మండలంలోని నంబాలకు చెందిన ఏడేళ్ల బాలికపై శనిగారపు బాపు, ఉపారపు సతీష్ అత్యాచారం చేసి హత్య చేశారని డీసీపీ భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 27న బాలికను ఎత్తుకు వెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారన్నారు. అనంతరం బాలికను హత్య చేసి గ్రామంలోని ఒక బావిలో పడేశారన్నారు. వారిద్దరూ పారిపోయే ప్రయత్నం చేయగా రిమాండ్ లోకి తీసుకున్నామన్నారు.

December 1, 2025 / 08:45 PM IST

సాయిరాం కాలనీలో సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే

JGL: మెట్ పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో హోలియా దాసరి సంఘ సభ్యులను ఇవాళ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కలుసుకొని వారి సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘం అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, కాలనీలో మౌలిక వసతుల మెరుగుదల గురించి చర్చించారు. వారు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

December 1, 2025 / 08:44 PM IST

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

KNR: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్సై పూదరి తిరుపతి గౌడ్ హెచ్చరించారు. ఇవాళ సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో అనవసరంగా గొడవలు పెట్టుకుని కేసులపాలు కావద్దని ఓటర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ బొజ్జరాజు పాల్గొన్నారు.

December 1, 2025 / 08:43 PM IST

స్థానిక ఎన్నికల వేళ… కాంగ్రెస్ పార్టీ ఖాళీ

MHBD: స్థానిక ఎన్నికల వేళ పెద్దవంగర మండలంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. బొమ్మకల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుర్ర జంపయ్య ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పెద్దవంగర మండల సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

December 1, 2025 / 08:41 PM IST

మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

KNR: రెండు రోజుల విరామం అనంతరం ఇవాళ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్కు రైతులు 76 వాహనాల్లో 542 క్వింటాళ్ల విడి పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,250 కనిష్టంగా రూ. 6,200 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ. 50 పెరిగింది.

December 1, 2025 / 08:37 PM IST

ఎల్లారెడ్డిలో రెండో రోజు 148 నామినేషన్లు

KMR: ఎల్లారెడ్డిలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ పోటాపోటీగా కొనసాగుతోంది. అయితే రేపటితో నామినేషన్ల ప్రకియ ముగియనుంది. ఈ మేరకు ఇవాళ రెండో రోజు ఏకాదశి కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకొచ్చారు. మొత్తంగా ఎల్లారెడ్డిలో రెండో రోజు 148 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్లు వేసినట్లు అధికారులు తెలిపారు.

December 1, 2025 / 08:35 PM IST

మాజీ ఎమ్మెల్యే సమక్షం లో బీఆర్ఎస్‌లో చేరికలు

SRPT: రామన్నపేట మండలంలోని బాచుప్పల, తుర్కపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సూరారం సర్పంచ్‌గా బందెల జయశీల , తుర్కపల్లి సర్పంచ్‌గా జూలకంటి ధనమ్మ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

December 1, 2025 / 08:32 PM IST

ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారు: మంత్రి

SDPT: బుధవారం హుస్నాబాద్‌లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉన్నందున వారిని తాము తీసుకొని రావట్లేదని స్పష్టం చేశారు. హుస్నాబాద్ అభివృద్ధికి తోడ్పడే అనేక పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.

December 1, 2025 / 08:31 PM IST

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి: డీఎస్పీ

SRPT: ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ పోనుగోడులో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఓటర్లు ప్రలోభాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

December 1, 2025 / 08:29 PM IST

10 మందికి రూ. 1,0,6000 జరిమానా

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందికి రూ.1,06,000 జరిమానా విధించినట్టు సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేటలో నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాల తనిఖీ చేయగా పదిమంది మద్యం తాగి వాహనాలు నడపడంతో వారికి కోర్టు జరిమానా విధించిందన్నారు.

December 1, 2025 / 08:28 PM IST

వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

MNCL: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. సోమవారం మంచిర్యాల ఎస్సీ బాలుర కళాశాల, వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలని సూచించారు.

December 1, 2025 / 08:26 PM IST

మంత్రులను కలిసిన మామిడ్యాల యువకులు

SDPT: రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మామిడాల యువకులు అశోక్, ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, అమృతరెడ్డి కలిసి గ్రామంలో ఉన్న సమస్యలను గురించి వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ.. కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హమీ ఇచ్చారన్నారు.

December 1, 2025 / 08:25 PM IST

ఆలేరులో వెంకటేశ్వర వైన్స్ ప్రారంభం

BHNG: ప్రభుత్వం ఇటీవల లక్కీ డ్రా ద్వారా చేసిన వైన్స్ లు ఆలేరులో సోమవారం ఉ.10 గ.కు ప్రారంభమయ్యాయి. ఆలేరు రైల్వే గేట్ వద్ద వెంకటేశ్వర వైన్స్ మొరిగాడి మహావీర్ పేరున లక్కీ డ్రాలో వచ్చిన వైన్స్ ఇవాళ ఆలేరు గౌడ సంఘం నేతల సమక్షంలో ప్రారంభమైంది. వైన్స్ నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాల మద్యం బ్రాండ్లు వినియోగదారులకు అందించడమే లక్ష్యమన్నారు.

December 1, 2025 / 08:25 PM IST

‘100% పన్నులు వసూలు చేయాలి’

PDPL: 100% పనులను వసూలు చేయాలని, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి పట్టణంలో అభివృద్ధి పనులను కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టీ.యూ.ఎఫ్.ఐ.డీ.సీ కింద పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పాత వాటర్ ట్యాంకర్ కూల్చాలని, కొత్త ట్యాంకర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

December 1, 2025 / 08:24 PM IST

ఎన్నికల ఖర్చుకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్

SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ముందుగానే అకౌంట్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

December 1, 2025 / 08:23 PM IST