మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో హరితహారంపై కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఆధ్వర్యంలో హరితహారంలో డిపార్ట్మెంట్ శాఖల వారిగా నాటాల్సిన మొక్కలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని సూచించారు.
SRD: ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్ మండలం కోనాపూర్లో క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సంగారెడ్డి ‘బీ’ జట్టు 43.3 ఓవర్లలో 220 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సంగారెడ్డి ‘ ఏ’ జట్టు 16 ఓవర్లకు 74 పరుగులు చేసి కుప్పకూలింది.
SDPT: హామాలీల కొరత లేకుండా చూడాలని అధికారులను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం బంకచర్లపల్లిలో గల పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు హమాలీలా కొరత ఉందని కొనుగోలు నిర్వాహకులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
SRD: మద్యం తాగి వాహనాల నడిపితే చర్యలు తప్పవని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కంగ్టిలోని బోర్గి చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనాల తనిఖీతో పాటు, ప్రతి వాహనదారుడికి బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దని సూచించారు.
ADB: ఆదివాసి గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉట్నూర్ ITDA ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఆదివాసి గిరిజన ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించారు. ఆదివాసుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
ADB: నార్నూర్ మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు కొర్రల మహేందర్ సోమవారం హైదరాబాదులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా దళితరత్న అవార్డు అందుకున్నారు. ఆయన చిన్న వయసులోనే అన్ని వర్గాల వారితో కలిసి మెలిసి ఉంటూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే అతని గుణాన్ని గుర్తించి అవార్డు ఇచ్చినట్లు మహేందర్ పేర్కొన్నారు. దీంతో పలువురు ఆయన్ను అభినందించారు.
JN: జనగామ పట్టణంలోని చాకలి ఐలమ్మ నగర్ కాలనీలోని పేదల ఇండ్లకు ఇంటి నెంబర్లు, కరెంటు, మంచినీరు, రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ.. సీపీఎం నాయకులు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్కు సోమవారం మెమోరాండం ఇచ్చారు. నిరుపేదలకు న్యాయం చేయాలన్నారు. నేతలు మోకు కనకా రెడ్డి, బూడిది గోపి, జోగు ప్రకాష్, కళ్యాణం లింగం తదితరులు పాల్గొన్నారు.
WGL: వరంగల్ బల్దియా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే 99 ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి శాఖాధికారులకు అప్పగించారు. ప్రజా సమస్యలపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో సోమవారం వీధి కుక్కలు దాదాపు 6 మంది మీద దాడి చేసి భీభత్సం సృష్టించాయి. గతంలో కూడా గ్రామంలో కుక్కలు పలువురిపై తీవ్రంగా దాడి చేశాయి. మళ్లీ నేడు వీధి కుక్కలు రెచ్చిపోయి ఆరుగురు మీద దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరచడంతో స్థానిక గ్రామ ప్రజలు గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
NGKL: జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాత వివరాలిలా ఉన్నాయి. బిజినేపల్లి మండలం పాలెంలో అత్యధికంగా 26 మి.మీల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ 25.0 మి.మీ, పెద్దకొత్తపల్లి మండలం చిన్నరావుపల్లిలో 21.0 మి.మీ, ఉర్కొండ 9.0 మి.మీ, వెల్దండ 8.3 మి.మీ, కోడేరు 6.5 మి.మీ, తాడూరు 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
SRPT: కోదాడ మండలం రెడ్లకుంట సమీపంలో రూ.38.31కోట్లతో నిర్మాణం చేస్తున్న రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్, రైతులతో సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నాటికి రెడ్ల కుంట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు.
HNK: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్య పరిష్కరించాలన్నారు.
SRD: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజన్న సోమవారం ఆందోల్లో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలకు రంగనాథ స్వామి దేవాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఏడు గంటలకు తిరిగి సంగారెడ్డి నివాసానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అధికారులు మంత్రి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
HNK: ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ సీఎం ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. సోమవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ. 3 లక్షల 94 వేల 500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
SRPT: స్వతంత్ర సమరయోధులు తెలంగాణ రైతాంగ పోరాట యోధులు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శమని సూర్యాపేట సీపీఎం పార్టీ మండల కార్యదర్శి హుస్సేన్ అన్నారు. సోమవారం సూర్యాపేట మండల పరిధిలోని అమరవరం గ్రామంలో షేక్ ఖాసిం అధ్యక్షతన సుందరయ్య 40వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.