MHBD: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవనంలో BRS పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ MP మలోత్ కవిత ఆదివారం 2026 బీఆర్ఎస్ వార్షిక క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ స్వప్నంలోని బంగారు తెలంగాణను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేకపోతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.
SRCL: బ్రాహ్మణులపై దాడులు పెరగిపోతున్నాయని ఓ సంస్థ చీఫ్ కో- ఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ అన్నారు. వేములవాడలోని శంకరమఠంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణుల వేషధారణను ఎగతాళి చేయడం, బ్రాహ్మణ రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలని డిమాండ్ చేశారు.
MNCL: మందమర్రి పాత బస్టాండ్ వ్యాపారుల సంఘం అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరిగాయి. ఈ ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. 335 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 126 ఓట్లు సాధించి కనుకయ్య గెలుపును కైవసం చేసుకున్నారు. పాత బస్టాండ్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
PDPL: పేదలకు అండగా ప్రభుత్వం పని చేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నెర వేరుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉగాది నుంచి పేదలకు సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని అన్నారు. రామగుండం ప్రాంతంలో ఉన్న నిరుపేదల కోసం ఎమ్మెల్యే పనిచేస్తున్నాన్నారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, మెట్పల్లి ప్రధాన రహదారిలోని రైల్వేగేట్ వద్ద బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చినట్లు బీజేపీ మండల నాయకులు గంగాధర్ తెలిపారు. రైల్వే ట్రాక్ వద్ద రైళ్ల రాకపోకల సమయాల్లో గేటు వేసిన ప్రతిసారి అరగంటకు పైగానే వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
KNR: బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లాలో తప్పకుండా కలుస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ జిల్లాల సరిహద్దుల మార్పుపై మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జిల్లాల కూర్పు, మండలాల మార్పులు చేపడతామని, త్వరలోనే పునర్విభజన జరుగుతుందని ప్రకటించారు.
SRCL: రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో మహాలక్ష్మీ రైతు సంఘం ఆధ్వర్యంలో కాటిరేవుల కార్యక్రమం నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
KMR: బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన, అల్లం ప్రభులింగం అనే వ్యక్తి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో అంతక్రియల ఖర్చుల నిమిత్తం SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు ఉన్నారు.
WGL: చెన్నారావుపేట మండలం అక్కల్చెడ్ గ్రామానికి చెందిన యువకుడు భూక్య ప్రకాష్ తన అసాధారణ ప్రతిభతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒడిశాలోని కటక్లో జరిగిన 33వ జూనియర్ నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు. మారుమూల గ్రామంలో జన్మించి కష్టాల మధ్య ఎదిగిన ప్రకాష్ జాతీయ స్థాయిలో ఈ విజయం సాధించడం గ్రామస్థులకు తీరని గర్వకారణంగా మారింది.
MHBD: గూడూరు మండల కేంద్రంలో బుధవారం ఒడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, BC, SC, ST JAC రాష్ట్ర కో-అడినేటర్ ముంజాల రాజేందర్ గౌడ్ పాల్గొని ఉద్యమ నివ్వాళులు అర్పించారు. ఒడ్డె ఓబన్న త్యాగం, ఆయన పోరాటం ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు.
MHBD: పెద్దవంగర (M) గంట్లకుంట – రంగాపురం గ్రామాల మధ్య బారి గోతులు ఏర్పడి వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గంటలకు సర్పంచ్ ముత్తినేని యాకలక్ష్మీ సోమన్న తన సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా ప్రజా సమస్యకు తక్షణమే స్పందించిన సర్పంచ్ను గ్రామస్తులు అభినందించారు.
NZB: కోడిపందెలు, పేకాట, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయి చైతన్య ఆదివారం వెల్లడించారు. పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపంలో పేకాట, కోడిపందెలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
KMM: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కల్లూరులోని కాశ్మీర మహాదేవ క్షేత్రంలో జరగనున్న జాతరలో దుకాణాల ఏర్పాటుకు సోమవారం వేలం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ ప్రక్రియ మొదలవుతుందని ఈవో ఎస్వీడీ ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు ఈ వేలం కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు.
PDPL: మంథని మండల ప్రజా పరిషత్తు ఆవరణలో బోరు మోటారు వద్ద పైపు లీకేజీతో నీరు వృథాగా పోతుంది. దీంతో పక్కనే ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. కార్యాలయ అవసరాలకు నీటి సరఫరా చేసే క్రమంలో మోటార్ వద్ద పైపు లీకేజీ కారణంగా నీరు పోతూ.. బురదమయంగా ఉందని స్థాపనికులు తెలిపారు. వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.
KNR: క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. బెజ్జంకి (M) కేంద్రంలో ఇవాళ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. క్రీడల వల్ల దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి అలబడుతుందన్నారు.