WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం రిజర్వేషన్ల వివరాలను కమిషనర్ విడుదల చేశారు. మొత్తం 12 వార్డులు ఉండగా, వాటి వివరాలు. STకు 3 వార్డులు, SCకు 2 వార్డులు, BCకు 1 వార్డు కేటాయించారు. మిగిలిన వార్డులను జనరల్ కేటగిరీ కింద ఖరారు చేశారు. వీటిలో మహిళలకు 2 స్థానాలు, జనరల్కు 2 స్థానాలు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు.
HYD: మనం రోజూ తాగే కాఫీ వెనుక ఓ అద్భుతమైన కథ దాగింది. 11వ శతాబ్దంలో ఇథియోపియాలో కఫా కొండల్లో మేకల కాపరి మేకలు చెర్రీలాంటి పండ్లు తిని ఉల్లాసంగా నడుస్తున్నాయని గమనించాడు. వాటి గింజలను మరిగించి తాగగా అపూర్వ ఉత్సాహం కలిగింది. అదే కాఫీగా ప్రపంచానికి పరిచయమైంది. మన దేశానికి అరబ్బులు తీసుకువచ్చిన ఈ కాఫీ, HYD పరేడ్ గ్రౌండ్ స్వీట్ ఫెస్టివల్లో స్పెషల్గా నిలిచింది.
SRCL: పాడి పంటలతో పల్లె సీమలు కలకలలాడాలని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇవాళ అన్నారు. వేములవాడలో సంక్రాంతి వేడుకల్లో ఆయన గంగిరెద్దుల విన్యాసాలను తిలకించి, అరటిపండు తినిపించారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలు ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
HYD: నగర శోభకు ప్రతీక అయిన ట్యాంక్బండ్ను చెత్తరహితంగా మార్చేందుకు HMDA కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితం ఇవ్వని తాత్కాలిక క్లీనింగ్కు ముగింపు పలుకుతూ మూడేళ్లపాటు వ్యర్థాల తొలగింపును 2 సంస్థలకు అప్పగించనుంది. సాగరాన్ని రెండు సెక్టార్లుగా విభజించి కార్మికులు, బోట్లు వినియోగించి లోపల, బయట చెత్త తొలగించనున్నారు. ఇందుకు రూ. 7.11 కోట్లు వెచ్చించనున్నారు.
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఇవాళ టీఎస్ జేయూ, ఐజేయూ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస విచారణ లేకుండా జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. సమాచార ఆధారంగానే వార్తలు ప్రచురిస్తారని పేర్కొన్నారు.
MDCL: HYD శివారులో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దుండిగల్ విల్లాల హబ్గా అవతరించింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్న దుండిగల్, ఏడేళ్లలో పురపాలికగా ఎదిగి గ్రేటర్లో విలీనమైంది. అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. ORR అనుసంధానంతో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుని, ఎకరం ధర రూ.10–15 కోట్లకు చేరింది.
VKB: తాండూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి, కనుమ పండుగలు ప్రతి ఇంట ఆనందం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు. రైతులకు సమృద్ధిగా దిగుబడులు రావాలని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలని కోరారు. మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని తెలిపారు. ఐక్యతతో పండుగలను జరుపుకోవాలన్నారు.
PDPL: సోషల్ మీడియాలో సమస్యలు వైరల్ కాగా, సత్వర పరిష్కారం అయ్యాయి. రామగుండం కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆయా డివిజన్లలో ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో డ్రైనేజీ కుండీల మూతలు అధికారులు పరిశీలించి, సమస్యలు పరిష్కరించారు.
JGL: యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి అన్నారు. గొల్లపల్లి మండలం చందోలి గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న బచ్చల రామ్ చరణ్ పట్టుబడగా కేసు నమోదు చేసినట్లు గొల్లపల్లి ఎస్సై తెలిపారు. అతని నుంచి 89 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
JGL: భోగి పండగ సందర్భంగా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని భూలక్ష్మి చౌరస్తా వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో సర్పంచ్ గునుకొండ శైలజ పాల్గొని మాట్లాడారు. పూర్వకాలం నుంచి వస్తున్న సాంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సంక్రాంతి పండుగ రైతుల కష్టానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
HYD: చిన్నాపెద్దా పతంగులు ఎగురేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని TGSPDCL ఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సూపరింటెండింగ్, చీఫ్ ఇంజినీర్లతో టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. పండుగ రోజుల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. HYDలో పిల్లలు కరెంట్ వైర్లకు దూరంగా ఆడుకోవాలని సూచించారు.
MHBD: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆయన సోదరుడు వద్దిరాజు కిషన్ ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు వద్దిరాజు నారాయణ- వెంకట నర్సమ్మల జ్ఞాపకార్థం రూ.12 లక్షలు విలువ చేసే వైకుంఠ రథాన్ని ఇనుగుర్తి గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ రథాన్ని బుధవారం సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి, ఎస్సై కరుణాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మంత్రి జూపల్లి కృష్ణారావుని కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లపై సమీక్ష చేశారు. నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామంలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సభ ప్రాంగణం, సదర్ మార్ట్ బ్యారేజ్ ఏర్పాట్లను మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
ASF: సంక్రాంతి పండుగ సందర్భంగా సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ CI బాలాజీ వరప్రసాద్ సూచించారు. పండుగ శభాకాంక్షలు అంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని కోరారు. ఆకర్షణీయమైన గ్రీటింగ్స్ లింక్ల ద్వారా ఫోన్లను హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము దోచేసే ప్రమాదం ఉందని సీఐ హెచ్చరించారు.