BHNG: రామన్నపేట మండలం బోగారం గ్రామంలో, ఎన్నికల హామీ మేరకు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్టేజి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ‘మన ఊరు మనబడి’ స్పూర్తితో పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని, భవిష్యత్తులో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు.
SRPT: గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమలచెరువు రోడ్డుపై జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనదారులకు హెల్మెట్, సీటుబల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
NZB: ఆర్మూర్ పట్టణ SHOపై మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన పచ్చుక రాజేశ్వర్ ఫిర్యాదు చేశారు. MRPS జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో HYD లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. తన వ్యవసాయ భూమి విషయంలో కొందరు తనపై దాడి చేసిన విషయాన్ని ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
KMR: గ్రామ అభివృద్ధిలో సర్పంచులదే కీలక బాధ్యత అని ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎల్పీవో సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. గ్రామాల వారిగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచులు చూసుకోవాలని అధికారులు సూచించారు.`
సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో కొత్తగా 17 మందికి కుష్టు వ్యాధి సోకినట్లు గుర్తించామని ఈరోజు డీఎంహెచ్వో డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపారు. బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. చర్మంపై తిమ్మిరి, మచ్చలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ముత్తారం మండలం పోతారం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న కుల్ల రాజేందరన్ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునగాల మహిపాల్ రెడ్డి, పొలంపల్లి ఆదర్శన్ రెడ్డి ప్రకటించారు. కుల్ల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
ADB: సమిష్టి నిర్ణయాలతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండలాధ్యక్షుడు అంకుష్ అన్నారు. బేల మండల నూతన సర్పంచ్ భాగ్యలక్ష్మిని సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లలిత, మాయ, అనిల్, అశోక్, విలాస్, జితేందర్, తదితరులు పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ పట్టణానికి చెందిన దేవి ఉపాసకులు సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో 1310వ చండీ మహాయాగం నిర్వహించారు. కాశి మహాక్షేత్రంలో నవాహ్నిక దీక్షతో ద్వాదశ పర్యాయ మహా చండీయాగాన్ని చేపట్టారు. ఈ యాగం శుక్రవారం ప్రారంభమై 10వ తేదీ శనివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తూప్రాన్ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్ఐఆర్ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన, SIR-2002 జాబితాతో SSR-2025 జాబితాను పోల్చి కామన్ పేర్లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, పట్టణ పరిధిలో బూత్ స్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు.
KMR: ఎల్లారెడ్డి పట్టణంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు.
JNG: చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి కుటుంబాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం పరామర్శించారు. హృతిక్ రెడ్డి మృతిపై సంతాపం తెలిపిన ఎంపీ కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జర్మనీ నుంచి మృతదేహాన్ని త్వరగా భారత్కు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
MDK: ప్రజలకు అవసరమైన ధరలకు ఇసుక అందుబాటులో ఉండేలా సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు తెలిపారు. ఇసుక దళారుల దందాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. మెదక్లో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ను కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఆయన ప్రారంభించారు.
GDWL: జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వడ్డేపల్లి మండలం శాంతినగర్లో జిల్లా వైద్యాధికారిణి సంధ్యా కిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేని సాయి హిమాన్ హాస్పిటల్ను సీజ్ చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన మౌనిక, బాలాజీ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘన కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
MDK: రైతులు యూరియా కొనుగోలు కోసం ఎరువుల దుకాణాలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ తీసుకెళ్లాలని పెద్ద శంకరంపేట మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ సూచించారు. పాస్బుక్ ఆధారంగా మాత్రమే అవసరమైన యూరియాను అందజేస్తామని తెలిపారు. పంట విస్తీర్ణం మేరకే యూరియా ఇవ్వాలని దుకాణదారులకు ఆదేశించినట్లు చెప్పారు.
MNCL: వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి వైద్య సేవలు అందుబాటులో ఉంచుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరులోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.