KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించినట్లు కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందించి, ముసాయిదా జాబితాను సిద్ధం చేసి ప్రదర్శించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
HNK: ఉదయం 10 దాటినా కూడా హన్మకొండ పట్టణ వ్యాప్తంగా పొగ మంచు వీడడం లేదు. పొగ మంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి పంజాకు తోడు మంచు మేఘాలతో జనజీవనం మందగించింది. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ఫాగ్ లైట్లు ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
WGL: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు SE జగదీష్ తెలిపారు. యాసంగి పంటలకు 57.68 TMCల నీటిని కేటాయించగా,ప్రాజెక్టు దిగువన 7.56 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందనుంది. కాకతీయ కాలువ ద్వారా వారబంది ప్రకారం 8 రోజుల పాటు 5500 క్యూసెక్కుల నీటిని,7 రోజుల పాటు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగనుంది.
MDK: ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవను నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని పల్లకీలో ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఊరేగించనున్నారు. పల్లకి సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలన్నారు.
MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం అమ్మకాల్లో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నెలలో రూ.459.97 కోట్ల మద్యం అమ్మకాలు జరుగాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలో రూ.224.06 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.144.76 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.90.24 కోట్ల మద్యం అమ్మకాలు జరుగాయి.
MBNR: నవాబ్పేట మండల పరిధిలోని పర్వతాపూర్ శ్రీ మైసమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు కాకర్లపహాడ్ గ్రామం నుంచి భక్తులు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, బోనాలు, విద్యార్థుల కోలాటాల మధ్య ఊరేగింపుగా తరలివచ్చారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఆలయ ఛైర్మన్, ఈఓ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BDK: ఉపాధి హామీ చట్టానికి నిలువునా తూట్లు పొడిచి ‘వీబీ జీ-ఆర్ఎం జీ’ పేరుతో తీసుకొచ్చిన కొత్త పథకం పేదల పాలిట శాపంగా మారిందని సీఐటీయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్సేన్ విమర్శించారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసి పేదలపైన, లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులపైన దాడి చేస్తూ మోడీ ప్రభుత్వం తన ప్రజావ్యతిరేక ముఖాన్ని నగంగా బయటపెట్టుకుందని దుయ్యబట్టారు.
KMR: నూతన సంవత్సరం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. గత ఏడాది జిల్లా పోలీసులు చూపిన తెగువను, సమన్వయాన్ని అభినందించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాలను అరికట్టి, 64 మరణాలను తగ్గించగలిగామని తెలిపారు. నూతన సంవత్సరంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.
MDK: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కౌడిపల్లి గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ అన్నారు. గ్రామంలో శుక్రవారం ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించారు. గతంలో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. వేగంగా బిల్లును చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని కొమురంభీం భవనంలో ఈ నెల 4వ తేదీన ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘం మండల స్థాయి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇవాళ ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అర్క గోవింద్ గెలిపారు. ఇందులో భాగంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఉదయం 11.15 గంటలకు జరిగే ఎన్నికలకు ఆదివాసీలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని ముచింపుల గ్రామంలో ఇవాళ దట్టమైన పొగ మంచు కురుస్తున్న తరుణంలో పాఠశాలకు వెళ్తున్నారని విద్యార్థిని శ్రేష్ట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 2 రోజులుగా విపరీతమైన పొగ మంచు కారణంగా పాఠశాల విద్యార్థులు, వృద్ధులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ఎలిమెంట్ షెటర్లు ధరించి కోరారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తీవ్ర చలిలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందించాలని కోరారు.
NGKL: కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన వెలుగుచూసింది. HYDకు చెందిన అశోక్(35) నలుగురు స్నేహితులతోకలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నదితీరానికి వచ్చారు. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడిన అశోక్ కనిపించకుండాపోయినట్లు స్నేహితులు తెలిపారు. అశోక్ ఆచూకీకోసం స్థానికులతో కలిసి స్నేహితులు విస్తృతంగా గాలింపుచర్యలు చేపట్టారు.
SRPT: హూజూర్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం 28 వార్డుల్లో మహిళా ఓటర్లు 15,731 మంది, పురుష ఓటర్లు 14,257 మంది, ఇతరులు 8 మంది ఉండగా మొత్తం 29,996 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,474 మంది అధికంగా ఉన్నారు. ఈనెల 5 న రాజకీయ పార్టీలతో సమావేశం 10న తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నారు.
BDK: రానున్న కార్పొరేషన్ ఎన్నికల దృశ్య ఇవాళ పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్లు డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు హాజరుకావాలని కోరారు. ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుళ్లూరు బ్రహ్మయ్య, తోట దేవి ప్రసన్న హాజరుకానున్నట్లు తెలిపారు.