HYD: చదువుల ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ HB కాలనీకి చెందిన సిద్ధార్థ(18) ఇంటర్ పూర్తి చేసి, IIT కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘ఈ ఒత్తిడి నావల్ల కాదు, జీవితంపై విరక్తి చెందా’ అంటూ ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లొచ్చిన తల్లిదండ్రులు కొడుకు బలవన్మరణానికి పాల్పడటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలంలోని 9, 10వ వార్డుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓం ప్రకాష్ గడపగడపకు మహా ప్రచారం నిర్వహించారు. రోడ్లు, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తానని, ప్రభుత్వ పథకాలు అందరికీ సకాలంలో అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పుస్తకంలో రాసుకుంటూ “నన్ను గెలిపిస్తే సమస్యలు నాకు వదిలేయండి” అని అన్నారు.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో జరిగిన ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల’ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ASF మాజీ MLA ఆత్రం సక్కు కలిశారు. ఈ సందర్భంగా సక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్చం అందించి ‘ప్రజా పాలన దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ది ఇలానే సహకరించాలని కోరారు.
MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. కౌడిపల్లి ఎంపీపీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నిబంధనలకు లోబడి ఎన్నికలలో ఖర్చులు చేయాలని సూచించారు. రూ.50 వేలకు మించి డబ్బులు వెంట తీసుకు వెళ్లవద్దని, అందుకు సరైన ఆధారాలు ఉండాలన్నారు.
SRD: విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఇంపాక్ట్ సంస్థ నారీసెల్ వ్యవస్థాపకురాలు నళిని సూచించారు. గురువారం కంగ్టిలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ 17 ఆధ్వర్యంలో గురువారం మహిళా వేదిక, బాల సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు ఆలోచనలపై రీజియన్ 17 అధ్యక్షుడు సంతోష్ వివరించారు.
KMM: సింగరేణి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండో రోజు మరింత జోరుగా కొనసాగింది. ఉదయం 10 గంటలు మొదలుకొని అభ్యర్థులు సాయంత్రం 5 గంటలు సమీపిస్తున్న నామినేషన్ సమర్పించేందుకు అభ్యర్థుల రద్దీ తగ్గలేదు. రెండో రోజుకు సర్పంచ్ స్థానానికి 77 నామినేషన్లు, వార్డులకు 215 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు గారు తెలిపారు.
WGL: పంచాయతీ ఎన్నికల 3వ దశకు నేటి సాయంత్రంతో గడువు ముగుస్తోంది. 3వ దశలో ఉమ్మడి WGLలో 564 GPలు, వార్డులకు 4896 ఎన్నికలు జరగనున్నాయి. నేటి సా.5 గం.కు నామినేషన్లు ముగిసిన అనంతరం, 6న స్క్రూటీని పూర్తి చేసి నిర్ధారిత నామినేషన్ల జాబితాను సా.5గం.కు ప్రదర్శిస్తారు. అపీల్స్ 7న, వాటి పరిష్కారానికి 8న, ఉపసంహరణ 9న మ.3 వరకు సమయం ఉంది.
NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం లాంటిదని బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృపానందం గురువారం అన్నారు. ఓట్లు లేకుండా ఏకగ్రీవాలు చేస్తే అప్రజాస్వామికం అవుతుందన్నారు. ఏకగ్రీవం కోసం డబ్బిస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నా, రాష్ట్ర ఎన్నికల సంఘం, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తాండ (W) గ్రామపంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ అభ్యర్థి మోహన్ గురువారం నామినేషన్ వేశారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడంతో తన నామినేషన్ పత్రాలను ఆర్వో శ్రీవర్ధన్ రెడ్డికి సమర్పించారు. గ్రామానికి పెద్ద సమస్య రోడ్డు, వాగుపై వంతెన, ఈ రెండు అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ముస్కుల శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కోతుల సమస్య పరిష్కరిస్తానని, గ్రామం సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేస్తానని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
NLG: నార్కట్పల్లి మేజర్ గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం లోపించడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. నల్గొండ రోడ్డులో రహదారి పక్కన పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి అపరిశుభ్రతను తలపిస్తుంది. దోమలు, కుక్కల స్వైర విహారంతో ఇబ్బంది పడుతున్నామని సమీప నివాసితులు తెలుపుతున్నారు. పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల దుర్వాసన వ్యాపించడంతో ఇబ్బంది పడుతున్నారు.
NGKL: పెబ్బేరు మండలం శాఖాపురం (వై) గ్రామానికి చెందిన పరమేస్ నాయి కూతురు గ్రీష్మ సివిల్స్కు చదువుతూ.. తన గ్రామానికి మంచి సేవ చేయాలని సంకల్పంతో గురువారం సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి పరమేస్ నాయి నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో 25 ఏళ్లు పని చేసి, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.
HYD: దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న నెక్లెస్ రోడ్లో నిర్వహిస్తున్న దివ్యాంగుల వాక్ను విజయవంతం చేయాలని దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు నాగేశ్వరావు కోరారు. నిన్న సీటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో వాక్ లోగోను కమిషనర్ సజ్జనార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
MDK: రామాయంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సీఐటీయీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ.. జిల్లా ఉపాధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.