NLG: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని శాలిగౌరారం ఎస్సై సైదులు అన్నారు. మండల పరిధిలోని పలు సమస్యాత్మక గ్రామాలను పోలీస్ విభాగం గుర్తించింది. గురువారం మండలంలోని భైరవునిబండ, ఎన్జీ కొత్తపల్లి తదితర గ్రామాల్లో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్సైలు సైదులు, రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
KMR: సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో జోనల్-2 పరిధిని జోనల్-3కి మార్చిన సందర్భంగా జోనల్-8 ఆఫీసర్ ప్రత్యూష గురువారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్కు పూల మొక్కను అందించారు. పాఠశాలల్లో నూతనంగా జరిగిన జోన్ల మార్పిడికి సంబంధించిన వివరాలను ప్రత్యూష కలెక్టర్కు వివరించారు.
NLG: ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభల పోస్టర్ను యూనియన్ నాయకులు నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం మాట్లాడుతూ.. రాష్ట్ర ఐదవ మహాసభలు మెదక్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయని తెలిపారు. 7న జరిగే బహిరంగ సభకు సంఘాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
PDPL: సంకల్ప ముందు అంగవైకల్యం అడ్డు రాదని, జీఎం నరేంద్ర నరేంద్ర సుధాకర్ రావు అన్నారు. రామగుండం –3, అడ్రియాల ఏరియాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు గురువారం నిర్వహించారు. దివ్యాంగుల కోసం మ్యూజికల్ చైర్, త్రో బాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, అందరికీ జ్ఞాపికలు, భోజన వితరణ చేశారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి విద్యార్థి బెజ్జంకి భృవిక్ చంద్రన్ చారి రాష్ట్ర స్థాయి అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలకు అర్హత సాధించాడు. జిల్లా స్థాయి ఎంపికల్లో భృవిక్ అద్భుత ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల ప్రశంసలు పొందాడు. బ్యాట్స్ మెన్గా వరుస పరుగులు చేసి మెరిశాడు. భద్రాచలంలో జరగనున్న రాష్ట్రస్థాయి సెలక్షన్స్కు భృవిక్ హాజరుకానున్నాడు.
SDPT: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పట్ల పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. గజ్వేల్ అంబేద్కర్ భవన్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితుల, సాక్షుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు.
NZB: జింకను వేటాడిన కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిరోజుల కిందట మల్లారం శివారులోని గుట్టల్లో జింకను హతమర్చారు. అటవీశాఖాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
SRPT: మద్దిరాల మండల కేంద్రంలో అక్రమ మద్యం రవాణా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కుంటపల్లి ఎక్స్-రోడ్ వద్ద ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కార్టన్ల క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16.20 లీటర్ల మద్యం విలువ సుమారు రూ. 8,100 ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
SRD: పంచాయతీ ఎన్నికల దృశ్య అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని DSP వెంకట్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చెక్ పోస్టును గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా అనుమానస్పదంగా డబ్బులు మందు తరలిస్తే స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
PDPL: ఈనెల 11న KNRడిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో జరిగే సమావేశంలో హమాలీ కార్మికులు పాల్గొనాలని వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు MA గౌస్ పేర్కొన్నారు. గోదావరిఖని భాస్కర రావు భవన్లో గురువారం కూరగాయల మార్కెట్ హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ…కూలీ రేట్లు పెంపుదల విషయంలో జరిగే సమావేశానికి నాయకులు పాల్గొంటారు అన్నారు.
KNR: గంగాధర మండలంలో బ్లాక్ ఏరియా ప్రాంతంలోని రైతు వేదికలో గురువారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డ్ మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేసే వారికి ఎంపీడీవో ధమ్మని రాము అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ, ఎన్నికల నియమావళిపై, అభ్యర్థులకు వివరించారు. ఈ కార్య క్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
BHNG: గ్రామాల అభివృద్ధికి పాటుపడే అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని టీడీపీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి బడుగు లక్ష్మయ్య అన్నారు. చౌటుప్పల మండల గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశము చౌటుప్పల పార్టీ కార్యాలయంలో ఇవాళ జరిగింది. పార్టీ తరపున అభ్యర్థులు లేని చోట్ల సమిష్టి నిర్ణయంతో మద్దతు తెలిపాలన్నారు.
MDK: జిల్లాలో మొదటి విడత 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 144 సర్పంచ్ స్థానాలకు 411 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.1,402 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 332 వార్డు మెంబర్ స్థానాలు ఏక్రగీవం అయ్యాయి. అవి పోను 1,068 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 2,426 మంది బరిలోనిలిచారు.
SRD: ఇటీవల కురిసిన వర్షాల వల్ల హాద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై గుంతలు ఏర్పడిన గుంతలను ఎస్సై సుజిత్ ఆధ్వర్యంలో గురువారం కాంక్రీట్ తో పూడ్చివేయించారు. ఎస్సై మాట్లాడుతూ.. గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో రోడ్డుకు మరమ్మత్తులు చేయించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.