WGL: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు టిఫిన్, భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉప్మాలో పురుగులు కనిపించడంతో.. మెస్ సిబ్బందిని ప్రశ్నించగా, పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదని సమాధానమిచ్చారు. ఈ సంఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
WNP: పెబ్బేరు మండలం రామమ్మపేట గ్రామానికి చెందిన పద్మమ్మ చిన్న రాయుడు గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఏకగ్రీవ సర్పంచి పద్మమ్మను శాలువాలతో సన్మానించి అభినందించారు. రామమ్మ పేట గ్రామం ఏకగ్రీవమైనందున తన SDF నిధుల నుంచి రూ.20 లక్షలను ఇస్తానని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
MDCL: మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే మరో నెలలో ఫ్రంట్ ఎలివేషన్ పూర్తవుతోందని జూనియర్ ఇంజనీర్ ప్రభాకర్ తెలిపారు. న్యూ డిజైన్ ఎలివేషన్ ప్రస్తుతం రైల్వేలో కొనసాగుతుందని, దీనిని అమలు చేసేందుకు నూతన విధానాలను అవలంబిస్తున్నట్లుగా తెలిపారు. దీనికోసం ప్రత్యేక ఆర్కిటెక్ ఇంజనీర్లు సైతం కృషి చేసినట్లు ఆయన వివరించారు.
SDPT: దుబ్బాక పట్టణంలోని బాలాజీ దేవాలయంలో రామకోటి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామరక్ష స్తోత్ర పుస్తకాలను గజ్వేల్కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పంపిణీ చేశారు. లోక కళ్యాణార్థం శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలన్నారు. శాశ్వతమైన రామనామం ప్రతి ఒక్కరూ లిఖించి ధరించాలన్నారు. ఇందులో ఆలయ కమిటీ నిర్వాహకులు ఉన్నారు.
MDCL: తెలంగాణ ఉద్యమకారుల న్యాయం కోసం పోరాడే పోరాటంలో తాను ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆల్వాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఛీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి దీక్షలో ఆయన పాల్గొన్నారు.
ASF: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ASF కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి తొలి విడత పోలింగ్ నిర్వహించే 5 మండలాల అధికారులు, మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
JGL: కరాటే వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పొన్నాల గార్డెన్లో పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రెండవ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2025 పోటీలను ప్రారంభించారు. అనంతరం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించిన కరాటే మాస్టర్ రచ్చ శ్రీనివాసను సన్మానించారు.
NZB: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ జాక్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో,విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.
SRD: కాంగ్రెస్ ప్రజా పాలనతోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా అన్నారు.గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి ఇప్ప పెంటారెడ్డికి మద్దతుగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
GDWL: అలంపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం అయిజ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికలు జరిగే అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో మొత్తం 14 జీపీలు ఏకగ్రీవం అయ్యిందన్నారు.
SRPT: బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడానికి పోరాటాలు చేయాలని, ఆత్మహత్యలు వద్దని బీసీ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం హుజూర్నగర్లో 42 శాతం రిజర్వేషన్ల అన్యాయానికి వ్యతిరేకంగా అగ్నికి ఆహుతి అయిన ఈశ్వర చారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మధు, నరసింహ చారి, అజయ్ కుమార్ పాల్గొన్నారు.
MDCL: మచ్చ బొల్లారం డివిజన్లోని లక్ష్మీ ఎన్క్లేవ్ ఫేజ్-2లో రూ.25 లక్షల వ్యయంతో చేపడుతున్న CC రోడ్ పనులకు నేడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్ పూర్తయిన తర్వాత స్థానికుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ప్రజలు కోరిన అభివృద్ధి పనులను దశల వారీగా అమలు చేస్తున్నామని, డివిజన్లో మిగతా పనులను కూడా పూర్తి చేస్తామన్నారు.
HYD: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. తిరుమలగిరిలోని బంజారానగర్ పార్కులో ఏర్పాటు చేసిన ఉమెన్స్ మేళాను ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళా సోదరీమణులు తమ ఇంటి వద్ద ఉత్పత్తి చేసిన వస్తువులు, వంటలు, గృహోపకరణాలను వారే మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ మేళా ఏర్పాటు చేశారు.
MDCL: కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. శివాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు మంత్రికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. దేవాలయ అభివృద్ధి పనులు, యాత్రికుల సౌకర్యాలపై వివరాలు తెలుసుకొని అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.
KNR: భారత రాజ్యాంగ పక్షోత్సవాల సందర్భంగా సామాజిక సమరసత వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో ‘మనము–మన భారత రాజ్యాంగం ప్రత్యేకతలు’ సహా మూడు పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచంలోకెల్లా భారత రాజ్యాంగం గొప్పదని, ఇది ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక సమానత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు.