• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రాంతీయ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

SRCL: వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో శనివారం ఒక అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. కేవలం పెద్ద ఆసుపత్రులలో మాత్రమే నిర్వహించే ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్‌ను ఆర్థ్రో వైద్యుడు డా.అనిల్ ఆధ్వర్యంలో నరసింహాచారి అనే వ్యక్తి కాలికి ఉన్న గాయానికి చర్మం పూర్తిగా పాడవడం వల్ల తన చర్మాన్నే వేరొకచోటి నుంచి తీసి గాయానికి అతికించారు. 

October 18, 2025 / 05:08 PM IST

కానిస్టేబుల్​ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎంపీ అర్వింద్

NZB: నగరంలో సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎంపీ అర్వింద్​ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. నడిరోడ్డుపై ఓ రౌడీషీటర్ పోలీస్​ కానిస్టేబుల్​ను హత్య చేయడం దారుణమన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్​రెడ్డి పాలనలో శాంతిభద్రతలు అధ్వానస్థితికి చేరాయని ఎంపీ అర్వింద్​ ఆరోపించారు.

October 18, 2025 / 05:07 PM IST

HYDలో భగ్గుమంటున్న ఇంటి అద్దెలు

HYD: నగరంలో ఇంటి అద్దెలు రోజురోజుకూ పెరిగి, తారా స్థాయికి చేరుతున్నాయి. ఐటీ పరిశ్రమ కారణంగా గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో అద్దెలు రూ.40వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు అద్దెలు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఉప్పల్, ఎల్బీనగర్, బోడుప్పల్ వంటి శివారు ప్రాంతాలను ఆశ్రయిస్తున్నారు.

October 18, 2025 / 05:05 PM IST

ముస్తాబైన శ్రీ మహా శక్తి దేవాలయం

KNR: దీపావళి పర్వదిన మహోత్సవానికి కరీంనగర్‌లోని మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయం శరవేగంగా ముస్తాబవుతుంది. శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల కొలువుదీరిన దేవాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయాన్ని రంగు రంగుల పూలు విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.

October 18, 2025 / 05:02 PM IST

గంజాయి రహిత సమాజం సమాజం మనందరి బాధ్యత: SP

SRCL: గంజాయి రహిత సమాజం మనందరి బాధ్యతని SP మహేష్ బిగితే పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలించడంలో ప్రతి పౌరుడూ బాధ్యతగల వారిగా వ్యవహరించి, ఈ మత్తు పదార్థాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు, యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

October 18, 2025 / 05:00 PM IST

మద్యం దుకాణాలకు 250 దరఖాస్తులు రాక

KMM: మధిర ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాలకు శనివారంతో దరఖాస్తులు స్వీకరణ ముగిసింది. కాగా మొత్తం 14 ఏ4 మద్యం దుకాణాలకు గాను 250 టెండర్ అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మద్యం షాపుల కేటాయింపుకు ఈనెల 23న డ్రా తీయనున్నట్లు చెప్పారు. కేటాయించిన నూతన దుకాణాలు డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

October 18, 2025 / 05:00 PM IST

మంచాల మండల కేంద్రంలో గర్భిణి మృతి

RR: గర్భిణి మృతి చెందిన ఘటన మంచాల మండలం లింగంపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. 7 నెలల గర్భవతి అయిన మానస అనే మహిళ మంచాల మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఇంజక్షన్ కోసం వెళ్ళింది.బీపీ చెక్ చేయకుండా ఇంజక్షన్ వేయడంతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

October 18, 2025 / 05:00 PM IST

కానిస్టేబుల్​ హత్య కేసు నిందితుడిని పట్టుకుంటాం: ఐజీ

NZB: నిజామాబాద్ నగరంలో సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ను హత్య చేసిన నిందితుడు రియాజ్​ను త్వరలోనే పట్టుకుంటామని ఐజీ చంద్రశేఖర్​రెడ్డి పేర్కొన్నారు. నగరంలో శనివారం అధికార లాంఛనాలతో నిర్వహించిన ప్రమోద్ అంత్యక్రియలకు ఐజీ హాజరయ్యారు. ప్రమోద్​ పార్థీవదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

October 18, 2025 / 04:51 PM IST

MMTS రైల్వే సేవలు ఇవే…!

HYD: ప్రస్తుతం మేడ్చల్ మార్గంలో 7 MMTS సర్వీసులు, తెల్లాపూర్, లింగంపల్లి నుంచి మేడ్చల్ వైపు రెండు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రామచంద్రపురం నుంచి ఘట్కేసర్ మార్గంలో ఒక సర్వీస్, సనత్ నగర్ ఘట్కేసర్, మేడ్చల్ హైదరాబాద్, మేడ్చల్ ఫలక్ నుమా మధ్య రెండు సర్వీసులు నడుపుతున్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

October 18, 2025 / 04:40 PM IST

‘దశాబ్దాలుగా బీసీలు మోసపోతూనే ఉన్నారు’

MBNR: దశాబ్దాలుగా బీసీలు మోసపోతూనే ఉన్నారని జిల్లా డీసీసీ వైస్ ఛైర్మన్ కోరమూని వెంకటయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో తప్పుడు కేసులు వేయించి బీసీల నోట్లో మట్టి కొట్టారన్నారు.

October 18, 2025 / 04:37 PM IST

‘తమాషా వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి’

MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో ఇవాళ BC JAC రాష్ట్ర బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ BC సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న స్థానిక నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్, జనాభా దామాషా వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

October 18, 2025 / 04:37 PM IST

జూనియర్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన

SRD: జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనందుకు విద్యార్థులు ప్రయోగాలు చేసి సిద్ధం కావాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. నవంబర్ నెలలో జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. సైన్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులతో ప్రాజెక్టులు తయారు చేయించాలని పేర్కొన్నారు.

October 18, 2025 / 04:37 PM IST

‘బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది’

MBNR: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని TPCC ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బందుకు వారు మద్దతు ప్రకటించి దుకాణాలను ముసేశారు. విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు.

October 18, 2025 / 04:36 PM IST

మార్కెట్ కమిటీ చైర్మన్ పాడే మోసిన మంత్రి, ఎమ్మెల్యే

PDPL: జూలపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్ గుండెపోటుతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ఆయన స్వగ్రామమైన కాచాపూరులో శనివారం అంత్యక్రియలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అంత్యక్రియలకు హాజరై పాడే మోశారు.

October 18, 2025 / 04:36 PM IST

‘వ్యాధి నిరోధక టీకాలు షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి’

SRCL: సిరిసిల్లలోని సుందరయ్య నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో DMHO డా. రజిత వ్యాధి నిరోధక టీకా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. 0 నుండి 5 సం.ల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు షెడ్యూల్ ప్రకారంగా ఇవ్వాలన్నారు.

October 18, 2025 / 04:34 PM IST