NRML: జిల్లా పాఠశాల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ 8 సోమవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో U-14,U-17 బాల, బాలికల బేస్బాల్ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. పాల్గొనే విద్యార్థులు బోనఫైడ్, జనన సర్టిఫికేట్, గత సంవత్సరం ప్రోగ్రెస్ కార్డ్, ఆధార్ జిరాక్స్ కాపీలతో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని డిఇఓ భోజన్న శనివారం ప్రకటనలో తెలిపారు.
SDPT: భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆవాలతో అంబేద్కర్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంటరానితనం, వివక్షలపై పోరాటం చేశారాని అన్నారు.
NRML: డిసెంబర్ 21న నిర్మల్ జిల్లాలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులను వేగవంతంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఈరోజు నిర్మల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
BHPL: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సమయంలో బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. DEC 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలవుతున్నప్పటికీ అధికారులు బెల్టు షాపులను అదుపు చేయడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గుడుంబా కేంద్రాలపై కఠినంగా వ్యవహరిస్తున్న ఆబ్కారీ శాఖ బెల్టు షాపులను పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
GDWL: అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కొనియాడారు. శనివారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా గద్వాలలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపిన మార్గంలో ప్రతీఒక్కరు నడుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గోన్నారు.
WGL: కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీగా రమేశ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శనివారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
NZB: నగరంలోని అహ్మదీబజార్లో మున్సిపల్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. కాలనీలోని బేకరీలను అధికారులు ఉదయాన్నే పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న పలు బేకరీలకు జరిమానాలు విధించారు.పదార్థాలు తయారు చేసే ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులకు నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రత పాటించని పలు బేకరీలకు రూ.5వేలు వరకు విధించారు.
KNR: అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. MP కార్యాలయంలో శనివారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే బహుజనులకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తమ పార్టీ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.
GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం గట్టు మండలం పరిధిలోని చమన్ ఖాన్దొడ్డి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రచారానికి భారీగా జనాలు తరలివచ్చారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థికి గ్రామస్తులు మద్దతు తెలపాలని పేర్కొన్నారు. గ్రామా అభివృద్ధికి నీరతరం కృసీ చేస్తామన్నారు.
JN: పాలకుర్తి మండలం గుడికుంట్ల తండా సర్పంచ్ గా తండాకు చెందిన జ్యోతి మహేందర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎవరు నామినేషన్ వేయకపోవడంతో జ్యోతి సర్పంచ్గా ఏకగ్రీవం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తోడ్పడుతాయి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని తెలిపారు. సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
MDK: నిజాంపేట మండలంలో సర్పంచ్, వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థులు మైకు ద్వారా ప్రచారం చేయాలనుకుంటే తప్పకుండా అనుమతి తీసుకోవాలని ఎస్సై రాజేష్ తెలిపారు. అభ్యర్థులు మీ సేవలో చలాన్ కట్టి, తూప్రాన్ డీఎస్పీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే స్థానిక ఎస్సై/సీఐ సంతకాలు తీసుకుని, డీఎస్పీ నుంచి ఎన్ఓసీ పొంది, తహసీల్దార్ ద్వారా అనుమతి పొందాలన్నారు.
KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి బండి సంజయ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నాయకులంతా ప్రత్యేక పూజలు చేశారు.
NRML: సోన్ మండలం వెల్మల్ గ్రామంలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ చాత్రి గంగాధర్, ఉప సర్పంచ్ ప్రశాంత్ సహా వార్డు సభ్యులు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SDPT: మద్దూరు మండలం గాగిళ్లపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.