• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ జట్టు ఎంపిక

NZB: క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం NZB, కామారెడ్డి జిల్లా స్థాయి అండర్ 14 క్రికెట్ జట్టు ఎంపికను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని GG కాలేజ్ గ్రౌండ్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

November 22, 2025 / 08:02 AM IST

రోడ్డు వెంట ఎండిన చెట్లు.. పొంచి ఉన్న ప్రమాదం

MHBD: తొర్రూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో రోడ్డు వెంట ఎండిన చెట్లు ఎప్పుడు కూలిపోతాయేనని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వృక్షాలు నేలకూలితే రాకపోకలకు తీవ్ర అంతరాయంతో పాటు స్థానికులు గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని వారు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ చెట్ల తొలగింపునకు చర్యలు చేపట్టి ప్రమాదాల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

November 22, 2025 / 07:45 AM IST

నేడు పామిరెడ్డిపల్లికి రానున్న ఎమ్మెల్యే

WNP: నేడు పామిరెడ్డిపల్లె గ్రామానికి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా‌రెడ్డి హాజరవుతున్నట్లు మధిర శ్రీశైలం తెలిపారు. ఉదయం 10 గంటలకు రైతు వేదికలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 

November 22, 2025 / 07:40 AM IST

అగ్ని ప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

SRD: మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్లారెడ్డి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజన్‌తో మంటలు చల్లార్చిన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు సామాగ్రి అంతా మంటల్లో కలిపోవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. కుటుంబీకులు కట్టుబట్టలతో బయట వచ్చారు. ఆదుకోవాలని బాధితులు కోరారు.

November 22, 2025 / 07:36 AM IST

జిల్లా కేంద్రంలో చీరల పంపిణీ షురూ

NLG: జిల్లా కేంద్రంలో ఇవాళ ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చీరలను పంపిణీ చేస్తారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారంలోగా జిల్లా వ్యాప్తంగా ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

November 22, 2025 / 07:33 AM IST

4 రోజుల్లో నలుగురు చిన్నారులు మృతి

ADB: వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. 4 రోజుల వ్యవధిలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువులు లోకం చూడకుండానే కన్నుమూశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిగా పట్టించుకోరని ఖర్చుకు వెనకాడకుండా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. మంచిర్యాలలో రెండు పసిప్రాణాలు, నిర్మల్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో తల్లీ బిడ్డ చనిపోయారు.

November 22, 2025 / 07:28 AM IST

బాలానగర్‌లో నేడు పవర్ కట్

MBNR: బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి, హేమాజీపూర్, మోతీఘనపూర్, ఉడిత్యాల సబ్ స్టేషన్ల పరిధిలో మరమ్మతుల కారణంగా నేడు  విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

November 22, 2025 / 07:22 AM IST

గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీకి ఆహ్వానం

ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరని పేర్కొన్నారు.

November 22, 2025 / 07:22 AM IST

కమిషనర్‌కు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

హనుమకొండ పర్యటనకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ,అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి గార్లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో సమాచార హక్కు దరఖాస్తులపై సమీక్ష నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

November 22, 2025 / 07:20 AM IST

‘వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచాలి’

GDWL: వినియోగదారుల హక్కులపై ఆశ్రా (ASRA) సభ్యులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధ్యక్షుడు రంగు భరత్, ఉపాధ్యక్షుడు జగదీప్‌తో కలిసి ఆశ్రా 7వ నేషనల్ సమ్మిట్ పోస్టర్లను ఆవిష్కరించారు. భరత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 4న విజయవాడలో జరిగే ఈ సమ్మిట్‌లో వినియోగదారుల సమస్యలు, చట్టపరమైన మార్కాల ద్వారా సాధించవచ్చున్నారు.

November 22, 2025 / 07:19 AM IST

విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీపై అవగాహన

KNR: విద్యార్థులకు చదువుతో పాటు బయట ప్రపంచంపై అవగాహన అవసరమని SBI సైదాపూర్ బ్యాంక్ మేనేజర్ రాకేష్ అన్నారు. సోమారం మోడల్ స్కూల్లో ఫైనాన్షియల్ లిటరసీపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డబ్బును ఎలా పొదుపు చేయాలి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఆదాయ పన్ను జీఎస్టీలపై విద్యార్థులకు విలువైన సూచనలిచ్చారు.

November 22, 2025 / 07:19 AM IST

కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆర్మీ అధికారులు

హన్మకొండలోని జెఎన్ఎస్ స్టేడియంలో గత 10 రోజులుగా నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీ శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. దీంతో ఆర్మీ అధికారులు శుక్రవారం సాయంత్రం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సునీల్ యాధవ్, మేజర్ ప్రకాష్ చంద్ర రాయ్, తదితరులు పాల్గొన్నారు.

November 22, 2025 / 07:19 AM IST

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరం: సీపీ

HYD: వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. నిన్న ఆయన పోలీస్ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న పాతబస్తీ పేట్ల బురుజు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరమన్నారు.

November 22, 2025 / 07:01 AM IST

కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు

JN: IKP సెంటర్లలో కనీస సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని BJP స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు ఆవేదనను వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి జఫర్గడ్ మండలం కునూరు గ్రామంలోని ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని ఆయన కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

November 22, 2025 / 06:59 AM IST

వరంగల్ మార్కెట్‌కు సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు శనివారం (ఇవాళ) వారాంతపు యార్డు బంద్, ఆదివారం (రేపు) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి రైతులు రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావద్దని అధికారులు సూచించారు.

November 22, 2025 / 06:48 AM IST