MDK: పాపన్నపేట మండల పరిధిలోని కొడపాక రిజర్వ్ ఫారెస్ట్ అక్రమంగా సాగుచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి భూమిని ఫారెస్ట్ ఆధీనంలోకి తీసుకున్నట్లు మెదక్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుతుబుద్దీన్ తెలిపారు. అన్నారం గ్రామానికి చెందిన కుర్తివాడ రాజు ఫారెస్ట్ ఒక ఎకరా భూమిని సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి గుడిసెను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు.
NZB: హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(టీ) బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు.
WGL: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేటలో 2025-26 విద్యా సం.కి జువాలజీలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మల్లం నవీన్ తెలిపారు. జువాలజీ సబ్జెక్ట్లో ఒక్క గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీ ఉందన్నారు. పీజీలో OC, BCలకు 55%, SC,STలకు 50% మార్కులు ఉండాలని, PHD, నెట్, సెట్, స్లెట్ వంటి అదనపు అర్హతలు,బోధన అనుభవం కల వారికి ప్రాధాన్యత అన్నారు.
BDK: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన జోనల్ స్థాయి క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తితో ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థి దశలోనే క్రీడలు కూడా చాలా అవసరమని అన్నారు. రాబోయే రోజుల్లో విద్య క్రీడల్లో పథకాలు సాధించాలని సూచించారు.
KMM: చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో సీనియర్ నాయకులు సామినేని రామారావు మాట్లాడారు. ఈ నెల 17న జరిగే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సభకు సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంఎ. బేబీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
BHNG: పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ పాడి రైతులు మంగళవారం రాజాపేట మండల కేంద్రంలోని పాల శీతలీకరణ కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల పాల బిల్లు చెల్లించడం లేదన్నారు. దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
MBNR: జడ్చర్ల పట్టణంలో గురుపూజోత్సవం సందర్భంగా చంద్ర గార్డెన్లో JRMSA అవార్డు ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందచేసారు. MLA మాట్లాడుతూ.. అన్నిటిలోకెళ్ల ఉపాధ్యాయ వృత్తి అత్యంత బాధ్యత గల వృత్తి అని కొనియాడారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మిషన్ భగీరథ పనులను జడ్పీ సీఈవో స్వయంగా పర్యవేక్షించారు. ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్, ఈవో రమేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా గౌడ్, డైరెక్టర్ తోట రమేష్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీళ్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నీటి సమస్య ఉందని తెలిపారు.
MBNR: బల్మూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. రాత్రి వేళల్లో పట్టా భూముల్లో JCBలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. తర్వాత పెద్ద వాహనాలతో జడ్చర్లకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొత్తపల్లికి చెందిన కొందరు వ్యక్తులు, జడ్చర్ల మాఫియాతో కుమ్మక్కయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
KMR: కల్కినగర్లో దుర్గమాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మండపం భూమిపూజ కమిటీ సభ్యులు చేశారు. శ్రీ దుర్గామాత సేవా కమిటీ అధ్యక్షుడు అంబీర్ రాజేందర్ రావు, ఉత్సవాలు, కుంకుమ పూజలు, అన్నదానం ఘనంగా జరుపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ జనరల్ సెక్రటరీ, కోశాధికారి, సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు.
MNCL: బెల్లంపల్లి అటవీ రేంజ్ పరిధిలోని కాసిపేట, దేవాపూర్, బెల్లంపల్లి బుగ్గ, మాదారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉందని బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్ మంగళవారం ప్రకటనలో వెల్లడించారు. గత కొంతకాలంగా అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి కదలికలు కనిపిస్తున్నాయన్నారు. మాదారం అటవీ ప్రాంతంలో 3 నుండి 4 వరకు చిరుతపులులు సంచరిస్తున్నట్లు తెలిసిందన్నారు.
NLG: నకిరేకల్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కాగా, ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆయనతోపాటు పార్టీ నాయకులు చామల శ్రీనివాస్, మాద యాదగిరి, పన్నాల రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.
KMR: చొప్పదండి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఆర్నకొండ నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు డబుల్ రోడ్డుగా మార్చేందుకు కేంద్రం రూ. 50 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజల ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని, కొండగట్టు, వేములవాడ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని బీజేపీ నాయకులు తెలిపారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
MDK: రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న మురళీ కౌడిపల్లికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం కౌడిపల్లిలో ఎస్సైగా ఉన్న రంజిత్ కుమార్ను వీఆర్కు బదిలీ చేస్తూ ఎస్పీ డి. వి శ్రీనివాస్ రావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మురళీ గతంలో హవేలి ఘనపూర్ ఎస్సైగా పనిచేశారు. మెదక్ రూరల్ ఎస్సైగా వచ్చి ఏడాది కూడా పూర్తికాక ముందే ఆయన బదిలీ అయ్యారు. మెదక్ రూరల్కు కొత్తగా ఎవరు వస్తారనే దానిపై ఇంకా తెలిపారు.
MDK: జిల్లాలో అత్యధికంగా రేగోడ్లో 12.5 సెంమీల వర్షం కురిసింది. సోమవారం రాత్రి కుండపోత మాదిరిగా వర్షం కురవడంతో మెదక్ పట్టణం చెరువును తలపించింది. కాగా, జిల్లాలో పలు చోట్ల ఉదయం 8 గంటల వరకు వర్షపాత వివరాలు.. మినుపూర్ 108 మిమీ, కొల్చారంలో 102 మిమీ, మెదక్ పట్టణంలో 71 మిమీ, లింగాయిపల్లిలో 71 మిమీ, టేక్మాల్ 59.5 మిమీ వర్షం కురిసింది.