NLG: ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖలో బీసీ ఉద్యోగుల సంఘం సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.
MBNR: తెలంగాణ భవన్లో అఖిల భారత అవయవ దాతల సంఘం-సావిత్రిబాయి పూలే ట్రస్ట్ నిర్వహించిన అవయవ దానం అవగాహన పోస్టర్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఛైర్పర్సన్ డా. గూడూరు సీతామహాలక్ష్మిని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జోగు రామన్న, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
NGKL: మునిసిపాలిటీకి సంబంధించి విద్యుత్ బకాయిలు రూ. కోటి మూఫై లక్షలు ఉన్నాయని మంగళవారం మున్సిపల్ కమిషనర్ మురళి వెల్లడించారు. బోరు మోటర్లు, వీధి దీపాలు, కార్యాలయాలతో సహా మున్సిపాలిటీ పరిధిలో 126 విద్యుత్ మీటర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ బకాయి బిల్లులను విడుతల వారీగా చెల్లిస్తామని కమిషనర్ వివరించారు.
NZB: సాలూర మండల కేంద్రంలోని శివారులో ఆటో టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. సాలూర నుంచి బోధన్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MNCL: పంచాయతీ ఎన్నికలలో భాగంగా 3వ విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూర్ మండలంలోని కిష్టంపేటలో ఈ నెల 3 నుంచి జరిగే 3వ విడత నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.
KNR: స్థానిక సంస్థల కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, బాలికలు చదువుతోపాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అన్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే కేజీబీవీ తిమ్మాపూర్, కేజీబీవీ గన్నేరువరం పాఠశాలలను సందర్శించి, స్నేహిత 2 అవగాహన కార్యక్రమంలో భాగంగా బాలికలకు గ్రీవెన్స్ బాక్స్ గురించి అవగాహన కల్పించారు.
ADB: గర్భిణులు, బాలింతలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండల వైద్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. గాదిగూడ మండలంలో అడిషనల్ DMHO మనోహర్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. రక్తహీనత గల మహిళలు రోజువారి ఆహారంలో ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయ్యేలా చూడాలని సూచించారు.
GDWL: పంచాయతీ ఎన్నికలను పూర్తిగా నిష్పాక్షికంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ మంగళవారం గద్వాల కలెక్టరేట్లో ఫేజ్-2 రిటర్నింగ్ అధికారులకు శిక్షణ సందర్భంగా ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను (ప్రవర్తనా నియమావళిని) పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు నియమ నిబంధనలతో ఉండాలన్నారు.
NRML: మామడ మండలంలోని నల్దుర్తి తూర్కం చెరువు, వెంగన్న చెరువులను 40 మంది శిక్షణలో ఉన్న FBOలు సందర్శించారు. చెరువుల్లో ఉన్న వివిధ రకాల చెట్ల గుర్తింపు లక్షణాలు, శాస్త్రీయ నామాలు తెలుసుకున్నారు. అలాగే చెరువులకు వచ్చే 88 పక్షుల జాతులపై అవగాహన పొంది, ఎకో టూరిజం అవసరాన్ని అధ్యయనం చేశారు
NGKL: పెద్దకొత్తపల్లి మండలంలో నూతనంగా ఏర్పడిన కొత్తపేట గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కల్పన అర్జున్, మాజీ సింగల్ విండో ఛైర్మన్ గోపాల్ రావుతో కలిసి మంగళవారం నామినేషన్ వేశారు. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ కావడంతో గ్రామ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
KMM: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, పథకాల ద్వారానే జరుగుతోందని బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఇవాళ మాట్లాడారు. మోదీ సంక్షేమ పథకాలను చూసే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని, సుమారు 75% గ్రామాలు కేంద్రం సహాయంతోనే అభివృద్ధి చెందాయని అన్నారు.
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలను పద్యంలో ఎస్పీ జానకి మంగళవారం మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఎన్నికల నియమాలని ఎవరు అతిక్రమించకూడదన్నారు. ఎస్పీతో పాటు రూరల్ సీఐ గాంధీ నాయక్, హన్వాడ ఎస్ఐ వెంకటేష్ పాల్గొన్నారు.
NRML: మామడ మండలంలోని ఆరెపల్లి, వస్తాపూర్- రాంపూర్, బూరుగుపల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయి. ఆరెపల్లి జంగిలి రాజవ్వ సర్పంచ్గా, మొత్తం పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవం. వస్తాపూర్- రాంపూర్ భూమాభాయి సర్పంచ్, సంతోష్ ఉపసర్పంచ్గా గ్రామస్తులు ఏకగ్రీవం చేశారు. బూరుగుపల్లిలో నాగుల భూమన్న సర్పంచ్గా ఎన్నికయ్యారు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
MDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా విత్తన బిల్లు- 2025పై క్షేత్రస్థాయిలో మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన అభిప్రాయ సేకరణ నిర్వహించారు. వ్యవసాయ శాఖ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు విత్తన ఉత్పత్తిదారులు, డీలర్లు, రైతులకు అవగాహన కల్పించారు.