MDK: మెదక్ పట్టణ గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈవో విజయ సందర్శించారు. తరగతి గది బోధనా అభ్యసన ప్రక్రియను గమనించారు. మిడ్ లైన్ పరీక్ష నిర్వహణను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలను చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిద్దామని మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ అన్నారు. గురువారం రాత్రి గ్రామంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థుల జాబితాను మాజీ ఎమ్మెల్యే ఆలకు పంపడం జరిగిందన్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని వివరించాలన్నారు.
HYD: సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా. నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.
NLG: నామినేషన్లు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని నల్గొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం నకిరేకల్ మండలం కట్టంగూర్, అయిటిపాముల గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణను ఆయన పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ స్వీకరణకు కేంద్రానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రూమ్ నెంబర్ 120లో మీడియా సెంటర్ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ప్రారంభించారు. అనంతరం మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా మీడియాకు అందిస్తామన్నారు.
MBNR: కులాంతర వివాహాలతో సామాజిక సమానత్వానికి బలమైన సందేశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పాతతోటకు చెందిన ప్రసన్నకుమార్, సుభాష్నగర్కు చెందిన అక్షిత కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా లభించే 2.5 లక్షలు చెక్కును వారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అందజేశారు.
NLG: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి మొదలైనందున, సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్లు మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు నిరంతరం నిఘా విభాగాలు పనిచేస్తుంటాయని తెలిపారు.
NZB: జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంభించకూడదని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. నిన్న ఆయన కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. బలవంతం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహరించాలన్నారు.
NLG: నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి గ్రామ సర్పంచ్ స్థానం బీసీ (మహిళ) కు రిజర్వు కావడంతో ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు నిన్న ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మచ్చ జయసుధ ముత్యాలు గోపలాయపల్లి సర్పంచు స్థానానికి నామినేషన్ ను దాఖలు చేశారు.
MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అధికారులు చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. పలు వాహనాలను తనిఖీ చేసి, రూ.50 వేలు మించి నగదు తీసుకెళ్లవద్దని, తీసుకెళ్తే కచ్చితమైన వివరాలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, ఎస్సై లెనిన్ పాల్గొన్నారు.
NZB: జిల్లాలో GP ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడతలో భాగంగా మొదటి రోజు బోధన్ డివిజన్లో నేడు నామినేషన్లను స్వీకరించారు. మొత్తం 11 మండలాల్లో 140 నామినేషన్లను దాఖలు చేశారు. బోధన్ మండలంలో 17, చందూర్ 6, కోటగిరి 13, మోస్రా 6, పోతంగల్ 14, రెంజల్ 12, రుద్రూర్ 10, సాలూర 17, వర్ని 19, ఎడపల్లి 9, నవీపేట్ 17 నామినేషన్లు దాఖలయ్యాయి.
GDWL: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. గద్వాల, ధరూరు, గట్టు, కేటీ దొడ్డి మండలాల్లోని 106 జీపీలకు గాను, గురువారం 68 మంది సర్పంచ్ అభ్యర్థులు, 13 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన వివరించారు.
HYD: రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పక్కన ఎస్పీ బాలు కాంస్య విగ్రహం పెట్టనుంది. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి జూపల్లి, నటుడు శుభలేఖ సుధాకర్ పరిశీలించారు.
HNK: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. దామెర క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ.11,500 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా పేకాట ఆడితే తమకు సమాచారం అందించాలన్నారు.