BHNG: భువనగిరి పట్టణం సింగన్నగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
BDK: ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మరణించిన మృతుల కుటుంబాలను కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఈరోజు పరామర్శించారు. చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్ పంచాయతీకి చెందిన ఓ ప్రముఖ రిపోర్టర్ సురేష్ తండ్రి కోడూరి బాబురావు ఇటీవల మృతి చెందడు. దీందో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బాబురావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
KNR: శంకరపట్నంలోని ఓ స్కూల్లో “సైబర్ జాగృతి దివస్” సందర్భంగా సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ఫేక్ ట్రేడింగ్, నకిలీ IPOలు, పార్ట్ టైం ఉద్యోగ మోసాలు వంటి ఆన్లైన్ మోసాలపై సూచనలు ఇచ్చారు. గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతతోపాటు 1930 హెల్ప్ లైన్, సైబర్ క్రైమ్ పోర్టల్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై శేఖర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు.
JGL: కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామ శివారులోని వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకున్నట్టు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశామన్నారు. ఇసుకను తరలిస్తున్న లారీ కనిపించడంతో పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, కేసు నమోదు చేశామన్నారు.
HYD: పాతబస్తీలో మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ దాఖలైన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. పురావస్తు శాఖ అనుమతి లేకుండా పనులు జరుగుతున్నాయన్న పిటిషనర్ వాదనను ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. నిర్మాణం వివరాలు, మెట్రో మ్యాప్ను సమర్పించాలని కోర్టు ఆదేశిచింది. తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.
ASF: ఫ్రీ ప్రైమరీ స్కూల్సు ఎంపిక చేసిన టీచర్లు చిత్తశుద్ధితో పని చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ప్రీ ప్రైమరి టీచర్లకు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 41 ప్రీ ప్రైమరి పాఠశాలలు ఉన్నాయని, వీటిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తులలో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేశామన్నారు.
ADB: గాదిగూడ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర నీటి కష్టాలు నెలకొన్నాయి. పిల్లలు మంచి నీటి కోసం ఖాళీ సమయాల్లో సమీప వాగులకు వెళ్తున్నారు. గమనించిన ఆదివాసీ గిరిజన సంఘం సభ్యుడు సక్కు గురువారం పాఠశాలను సందర్శించారు. సమస్యను మండల విద్యాధికారితో పాటు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లేదని వాపోయారు.
WGL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి నవంబర్ 8 సాయంత్రం 6 గంటలకు 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సు పంచారామ క్షేత్రాల దర్శనార్థం బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మీ ఇవాళ తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శివాలయాలను ఒకే రోజులో దర్శించుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
NRML: జిల్లాలో చిన్న నీటిపారుదల గణాంక సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం సమావేశంలో బోర్లు, బావులు, చెరువులు, కాలువలు వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో జీపీవవోలు, పంచాయతీ కార్యదర్శులను ఎన్యుమరేటర్లుగా నియమించాలని తెలిపారు. ఈ సర్వే ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
NGKL: ఆకుతోటపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్ పర్సన్ యాట గీత గురువారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పత్తి కొనుగోళ్ళు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, తదితరులున్నారు.
MDK: మెదక్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో రాజన్న సిరిసిల్ల జోన్ బాలికల అండర్ 14, 17, 19 విభాగం 11వ జోనల్ మీట్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్, జోనల్ ఆఫీసర్ ప్రత్యూష, ప్రిన్సిపాల్ పద్మావతి, రఘునందన్, శ్రీనివాస్, సత్యవతి పాల్గొన్నారు.
KNR: వీణవంక మండలం హిమ్మత్నగర్ గ్రామంలో గురువారం వీణవంక పశువైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి పశువులకు గాలి కుంట టీకాలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పశువులుకు రోగ నిరోధక టీకాలు వేస్తోందని, దీంతో ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ టీకాలను వేయించాలని కోరారు. వైద సిబ్బంది, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
NLG: దేవరకొండ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని గురువారం కళ్లకు నల్ల రిబ్బన్స్ కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉపకులపతి ప్రొ. జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రో. పి రమేష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం పద్మశ్రీ అవార్డు పొందిన అనంతరం మొదటిసారిగా విశ్వవిద్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఉపకులపతి, రిజిస్ట్రార్ మందకృష్ణ మాదిగను సన్మానించారు.
MHBD: నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి, పకీర తండా, జయపురం గ్రామ శివారు ఆకేరు వాగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పట్టపగలే వందల ట్రిప్పులు ఇసుక అక్రమంగా తరలివెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అధికారులు ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.