VKB: పరిగి(M) మల్లెమోనిగూడెంకి చెందిన శివలింగం, శిరీషలకు వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి భార్య శిరీషను వంట సరిగా చేయడం లేదని, తక్కువ చదువుకుందని తరచూ వేధించేవాడు. దీంతో ఆమెను పుట్టింట్లో వదిలేశాడు. రోజు ఫోన్ చేసి నువ్వు నాకు అక్కర్లేదు, అక్కడే చావు అని దూషించడంతో శిరీష తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
గద్వాల జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు నామినేషన్ రిపోర్ట్ను గురువారం ప్రకటించారు. మొత్తం 28 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా, 28 స్థానాలకు ఒకే రోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడం ఆశ్చర్యకరంగా ఉంది. అత్యల్పంగా కేటీ దొడ్డిలో 23 గ్రామ పంచాయతీ స్థానాలు ఉండగా, కేవలం ఆరు స్థానాలకు మాత్రమే నామినేషన్లు వేశారు.
NLG: టీఎస్ యూటీఎఫ్ చిట్యాల మండల శాఖ అధ్యక్షులుగా ఏశమల్ల నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా గడగోజు సతీష్, ఉపాధ్యక్షులుగా రంగా రామలింగయ్య, మహిళా ఉపాధ్యక్షులుగా ఎం జానకి, కోశాధికారిగా తోట చంద్రశేఖర్ లు ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన సంఘం మండల మహాసభ అనంతరం ఎన్నిక జరిగింది.
RR: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ లక్ష్మీ మెగా టౌన్షిప్లో శ్రీ కోదండరామచంద్ర మౌలీశ్వర స్వామి దేవాలయాల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతకు నిలయాలైన దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ADB: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిగా మరోసారి కే.సునీత, పి.జయలక్ష్మి ఎన్నికయ్యారు. కోశాధికారిగా పి.మంగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీనును ఎన్నుకున్నారు. 50 మంది సభ్యులతో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.
BDK: పార్టీకి, పేదవర్గాల పోటు ప్రసాద్ అందించిన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా అన్నారు. అశ్వారావుపేట పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పోటు ప్రసాద్ ప్రథమ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
HYD: ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి MD అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్పై సమీక్షించారు. ఆ సందర్భంగా ఆయ మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్ మిషన్ లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలన్నారు.
NZB: పట్టణ పరిధిలో నిర్మించిన ఇంటికి నంబర్ కేటాయించడానికి మున్సిపల్ కమిషనర్ రాజు రూ. 20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ తన డ్రైవర్ భూమేశ్ ద్వారా లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
MBNR: మిడ్జిల్ మండలం మంగళిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలతో పాటు మినీ అంబులెన్స్ అందిస్తానని గురువారం చందూలాల్ ప్రకటించారు. అదనంగా ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ బోర్డ్, మినరల్ వాటర్ ప్లాంట్, వివాహమైన ఆడబిడ్డకు రూ.5 వేలు ఇస్తానన్నారు. మంగళిగడ్డను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
NZB: ఆర్మూర్ మున్సిపల్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. మున్సిపల్ కమిషనర్ రాజు ఇంట్లో సోదాలు చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. కమిషనర్ రాజు ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. ఓ బిల్డింగ్ పర్మిషన్ విషయంలో దరఖాస్తుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తాగు లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఘనపూర్ మండలంలోని సోలిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అమలు చేయాలన్నారు.
ADB: జిల్లాలో ఎంపికైన దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు ఆశన్న, జిల్లా కార్యదర్శి అరిఫా బేగం అన్నారు. ఈ విషయమే గురువారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ వారికి ఇప్పటివరకు పరికరాలు అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం ఫార్మసీ ఆడిటోరియంలో గురువారం ఫార్మసీ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో యాంటీ బయోటిక్స్ అధిక వాడకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
HYD: బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సహకరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు విపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు. అనేక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సోనియా గాంధీదన్నారు. బలహీన వర్గాల కోసం బీఆర్ఎస్, బీజేపీ చేసింది ఏందో చెప్పాలన్నారు.
WNP: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఘణపురం మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యాన్ని ఎలాంటి తాళ్లు లేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు.