HYD నగర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు భారీ ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా HYD పోలీసులు తెలియజేశారు. అత్యవసరమైతే కానీ బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని, ప్రతి ఒక్కరూ తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భారీ వర్షం కురిసే సమయంలో, చాలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
WGL: గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్లోని దేవన్నపేటలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన 15 ఏళ్ల విద్యార్థి జయంత్ కుటుంబసభ్యులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు శుక్రవారం పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కొండ మల్లయ్య, సందేల సుగణ మరణించగా, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
SRCL: కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ ఛైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండ నర్సయ్య, వట్టిమల్ల మాజీ సర్పంచ్ దర్శనాల శంకరయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తాము కాంగ్రెస్లో చేరుతున్నట్లు వారు తెలిపారు.
SRCL: హరితహారం కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోని వాహనాల ఫిట్నెస్ నిర్వహించే స్థలంలో రవాణా అధికారులు శుక్రవారం సుమారు 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ వాహనాల తనిఖీ అధికారి మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
HYD: భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు, రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు GM సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం HYD నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని తెలిపారన్నారు.
KNR: సైదాపూర్ మండలంలో వర్షం దంచికొట్టింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సైదాపూర్ చెరువులో నుంచి నీరు భారీగా నీరు వాగులోకి చేరి ప్రవహిచడంతో సోమారం మోడల్ స్కూల్ జలమయం అయింది. స్కూల్లోని హాస్టల్ విద్యార్థులు అక్కడే ఉండడంతో తల్లితండ్రులు భయందోళనకు గురయ్యారు.
KMR: పెద్దకొడఫ్గల్ మండలం కాటేపల్లి తండాకు చెందిన మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రక్తం తక్కువగా ఉందని బాన్సువాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాన్సువాడకు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో రాంపూర్ వద్ద ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు.
SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద శుక్రవారం యూరియా కోసం మహిళలు బారులు తీరారు. నెల రోజులుగా ఇంటి పనులు మానుకొని, రోజులు తరబడి క్యూ లైన్లో నిలబడే పరిస్థితి ఏర్పడిందని మహిళ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా సప్లై చేయాలన్నారు.
WGL: వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. రూ.10 లక్షలతో దేవాలయ ఆర్చీలు, గర్భాలయం, స్తంభాలు, ప్రాంగణం, రాజగోపురానికి రంగులు వేస్తున్నారు. ఈ మొత్తం ఖర్చు దాతలు ముందుకు వచ్చి చేయిస్తున్నట్లు దేవాలయ అధికారులు స్పష్టం చేశారు. ఇవే కాకుండా ఇతర పనులు కూడా దాతల సహకారంతో చేయనున్నట్లు వివరించారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను ఆయన నివాసంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
NZB: విద్యుత్ శాఖ ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్లో గతంలో జరిగిన పనులపై వరంగల్ నుంచి వచ్చిన సీఈ స్థాయి అధికారి విచారణ చేపట్టారు. గతంలో పని చేసిన డీఈ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై ఈ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కాంట్రాక్టర్లు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బందితో పాటు ఇటీవల పెర్కిట్కు సంబంధించిన ఏఈని కూడా విచారించినట్లు తెలిసింది.
NLG: నకిరేకల్ పట్టణానికి చెందిన మారోజు నరేంద్ర చారి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విగ్నేశ్వర ఆటోమొబైల్స్ షాపును శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నకిరేకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కాంట్రాక్టు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, క్రమబద్ధీకరించాలని కోరుతూ.. వారు విధులను బహిష్కరించారు. అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని, అలాగే 64వ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
BDK: జూలూరుపాడు మండలం చెందిన ఏబీఎన్ రిపోర్టర్ దుద్దుకురి రామారావు తండ్రి దుద్దుకురి గోపయ్య శుక్రవారం మరణించారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వార్త వినగానే వెళ్లి గోపయ్య భౌతిక కాయానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం నింపుతూ మనోధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.