KMR: సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్టీఐ-2005 వారోత్సవాలలో భాగంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఐ చట్టం అమలు, మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల, బాలికల జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ యాకుబ్ తెలిపారు.
ADB: బోరజ్ మండలంలోని తర్ణం గ్రామంలో లో-లెవెల్ వంతెన వద్ద ఇటీవల వేసిన రోడ్డు చెడిపోవడంతో నిత్యం ప్రమాదాలు జరగడంతో పాటు, వాహనాలు చెడిపోతున్నాయని వాహనదారులు తెలిపారు. జాతీయ రహదారైన 353బి ప్రతిరోజు వాహనాలు బ్రేక్ డౌన్ అవ్వడంతో పాటు, ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపారు. రహదారి నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
SRD: జిల్లాలో ఈనెల 12 నుంచి 14 వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో నాగ నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 1,137 పోలియో బూతు కేంద్రాలను ఏర్పాటు చేశామని, జిల్లాలో ఐదేళ్లలోపు 1,91,668 మంది చిన్నారులు ఉన్నారని అన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
NZB: భూభారతి దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచవద్దని సబ్ కలెక్టర్ వికాస్ మహ అన్నారు. రెంజల్ తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల ప్రక్షాళన సరళిని పరిశీలించారు. అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
JN: జనగామ పట్టణ కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద బీసీ నాయకులు 42% రిజర్వేషన్ పై శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అగ్రవర్ణ బీసీ వ్యతిరేకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూడల సిద్దయ్య గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను నిలిపివేయడానికి కేసులు వేసిన వారికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
SRPT: జిల్లా కోదాడ పీఎం శ్రీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ నెల 17,18 తేదీలలో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు ఎంపికయ్యారు. సూర్యాపేటలో జరిగిన సదరన్ సైన్స్ డ్రామా జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
NZB: TU ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్ కే. అపర్ణ నియమితులయ్యారు. శుక్రవారం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్ఎస్ఎస్ కార్య కలాపాలను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్లి, రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేస్తానన్నారు.
MDK: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. పాపన్నపేట ఏడుపాయల హరిత హోటల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం మూడు సార్లు క్యాబినెట్ సబ్ కమిటీలు వేసి 64 డిమాండ్లలో 25 డిమాండ్లు పరిష్కరించాలన్నారు.
MHBD: తోర్రూర్ మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో చేరారు. పార్టీ అధ్యక్షులు, MLC తీన్మార్ మల్లన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్లు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీసీ రాజ్యాధికారం కోసం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని వారు పార్టీలో చేరిన వారికి పిలుపునిచ్చారు.
MNCL: టామ్ కామ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన అర్హత, నైపుణ్యం గల కార్మికులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లమా/ డిగ్రీ అర్హత కలిగిన వారు ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన అభ్యర్థులు అర్హులన్నారు. అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలన్నారు.
KMR: దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, లేదా రూ.3వేల జరిమానా విధిస్తూ బిచ్కుంద కోర్టు తీర్పు వెల్లడించినట్లు SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. బిచ్కుంద వాసి పోచవ్వ మెడలోని బంగారు గొలుసును దొంగలించిన దిగంబర్, తుకారాంకు అమ్మాడు. దిగంబర్ మరణించినప్పటికీ దొంగసొత్తు కొనుగోలు చేసిన తుకారాంపై నేరం రుజువు అయింది. ఈ మేరకు కోర్టు తీర్పునిచ్చింది.
JN: పట్టణంలోని ఓల్డ్ బీట్ బజార్కి పుట్ట శ్రావణ్, అతని భార్య అశ్విని శుక్రవారం పని నిమిత్తం వచ్చారు. తిరిగి వెళుతున్న క్రమంలో 3 తులాల బంగారు గొలుసు ఉన్న బ్యాగు ఎక్కడో పడిపోయింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. స్పందించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి, బ్యాగును దొరకపట్టారు. సీఐ సత్యనారాయణ సమక్షంలో వారికి గొలుసు, బ్యాగు అందజేశారు.
JGL: కోరుట్లలో అనుకోకుండా విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించినట్లు ఏడీఈ బొప్పరాతి రఘుపతి తెలిపారు. కోరుట్ల పట్టణం గృహ నిర్మాణ కూలీ షేక్ షఫీక్, మోహనరావుపేట గ్రామం గుండవేణి రాజేందర్ మరణించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల పరిహారం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
MNCL: సమాచార హక్కు చట్టంలో అందిన దరఖాస్తులకు సమాచారాన్ని నిబంధనల ప్రకారం అర్జీదారులకు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంలో పారదర్శకత, జవాబుదారీతనం ఆవశ్యకమని పేర్కొన్నారు.