WGL: గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు గ్రామ స్మశానవాటికలో మౌలిక వసతుల కల్పనకు ₹18 లక్షలతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు అవసరమైన ప్రతి చోట సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని, విలీన గ్రామాల అభివృద్ధికి, ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలు విని పరిష్కరించడం తన బాధ్యత అన్నారు.
KNR: పోలీసు శాఖలో విధులు నిర్వహించే వారికి శారీరక ధృడత్వంతో పాటు మానసిక ధృడత్వం కూడా అవసరమని సీపీ గౌష్ ఆలం అన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మనల్ని మనం రక్షించుకునే స్థితిలో ఉన్నప్పుడే ప్రజలను సమర్థవంతంగా రక్షించగలం అని ఉద్ఘాటించారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలో సుమారు 100 మంది మహిళా పోలీసులకు (షీ టీమ్స్ సభ్యులతో ) రెండు దశల్లో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.
HYD: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఉత్తర భారతీయుల ప్రతినిధి బృందంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఉత్తర భారతీయులకు మరిన్ని అవకాశాలు, సౌకర్యాలు పెంపొందించే దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కొనసాగుతుందన్నారు.
NZB: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బాధితుడు బత్తుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 4 ఏళ్ల క్రితం ఇండియన్ హోమ్ పైప్స్ కంపెనీ ద్వారా మిషన్ భగీరథకు సంబంధించిన సుమారు రూ. 4 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశామన్నారు.
HYD: ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్ షిప్-2025 విజేతలకు బహుమతుల ప్రధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సబ్ జూనియర్ నేషనల్ జూడోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్ అందించారు. హైదరాబాద్లో జరుగుతున్న జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్- 2025లో 29 రాష్ట్రాలు పాల్గొన్నాయి.
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సారయ్య మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఆశయాలే రేవంత్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధారమని ఆయన పేర్కొన్నారు.
HYD: తెలంగాణ క్రీడా, పశు సంరక్షణ శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని వినతిపత్రం అందించారు. మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి హామీల అమలు కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
NLG: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. ఇవాళ శాలిగౌరారంలో శాలిగౌరారం ప్రాజెక్టు రిజర్యాయర్లో చేపపిల్లలను వదిలిపెట్టి అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెంచాలని, తద్వారా మత్సకార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
SRCL: వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కుమహిళ అన్నారు.
HYD: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ఓ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.
NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఇవాళ ఉదయం కార్తీక మాసం సందర్భంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య కార్తీక దీపారాధన ఘనంగా జరిగింది. అర్చకులు గణేష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దీప స్తంభం వద్ద ముగ్గులు వేసి, మట్టి ప్రమిదలతో దీపారాధన చేసి, ఆకాశ దీపానికి పూజ చేసి, కొబ్బరికాయలు కొట్టి మహిళా భక్తులు దీపోత్సవం నిర్వహించారు.
SRD: కంగ్టి మండలం బాన్సువాడ పాఠశాలలో నిర్మించిన హ్యాండ్ వాష్ ప్లాట్ ఫామ్లో కుళాయిలు లేవు. దీనికి నీటి సరఫరా లేక విద్యార్థులు మధ్యాహ్న భోజనం వేళ చేతులు కడుక్కునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు ఎదురుగా ఉన్న పబ్లిక్ హ్యాండ్ పంప్ వద్ద చేతులు కడుక్కుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. అధికారులు స్పందించి కుళాయిలు బిగించి నీటి సరఫరా అందించాలన్నారు.
NLG: మొదటి భారత మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శంకర్ నాయక్తో కలిసి ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ జీవితం ఎంతోమంది రాజకీయ నాయకులకు, మహిళా లోకానికి ఆదర్శమన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్వాల్ హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
HYD: GHMC ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో జనసేన పార్టీ ఉందని, ప్రతి డివిజన్లో పార్టీ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు. కూకట్పల్లి జనసేన కార్యాలయంలో రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలి ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.