WGL: పర్వతగిరి మండలం బూర్గుమల్ల గ్రామంలో మహిళా శక్తి ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో నాణ్యతమైన చీరలను పంచుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పంచిన చీరల దిష్టి బొమ్మల కట్టడానికే పనికి వచ్చాయి అని ఆరోపించారు.
WGL: నర్సంపేట నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఇందిరా మహిళా శక్తి చీరలు, కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.
MDK: మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ఎస్సై పోచయ్య తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఎస్సై మాట్లాడుతూ..మోటార్ వెహికిల్స్ యాక్ట్–1988 ప్రకారం.. 18 ఏళ్లు నిండని వారు వాహనం నడపడం నేరమని ఆయన స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా రూ.25,000 వరకు జరిమానా, వాహనం రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
HYD: వీకెండ్ వస్తే మందుబాబులు వైన్స్, బార్లు, పబ్లో చిల్ అవుతారు. తాగిన మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా HYD పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ తనిఖీల్లో వందల మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వాహనాలు సీజ్ అయ్యాయి. కౌన్సెలింగ్, కోర్టుకెళ్లి జరిమానా కట్టాల్సిన పరిస్థితి. D&D డేంజర్ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
MHBD: తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగునున్నాయి. డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. మొదటి విడతలో నెల్లికుదురు, రెండో విడతలో చిన్న గూడూరు, దంతాలపల్లి, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు, మూడవ విడతలో మరిపెడ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల్లో వెల్లడించారు.
BDK: SGFU- 17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో పోటిల్లో జులూరుపాడు నివాసి గంధం హరిక (17) బంగారు పతకం సాధించారు. జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకం గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నేడు హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వరుసగా గెలిచి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
WNP: సత్యసాయి బాబా చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఇవాళ కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సాయిబాబా శత జయంతి సందర్భంగా ఐడీవోసీ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ప్రజాసేవకై ట్రస్ట్ ఏర్పాటు చేసి బాబా చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ఆయన చూపిన సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం చేయాలని కలెక్టర్ సూచించారు.
KNR: కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఆదివారం విద్యార్థులకు మొదటి సంవత్సరం (ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ మామిడిపల్లి సత్య ప్రకాష్ పవిత్రమైన ఉసిరి మొక్కను నాటి ప్రకృతి ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులు వారి మేధాశక్తిని వినియోగించుకుని పరిశోధనా దిశగా అడుగులు వేయాలన్నారు.
WGL: గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టే వారని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో చీరల పంపిణీలో ఎంపీ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి రాజీపడబోమని, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి రేపు కోదాడ, మునగాల, చిలుకూరు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మునగాలలో ఉచిత చేపపిల్లల విడుదల, మహిళా శక్తి చీరల పంపిణీతో రోజును ఆరంభించి, కోదాడ పట్టణంలో DMFT నిధులతో సజ్దా ప్లాట్ఫామ్, కమ్యూనిటీ హాల్ నిర్మాణ శంకుస్థాపనలు ,క్యాంప్ కార్యాలయంలో సీఎమ్ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు.
KMM: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కోరారు. పాలేరు నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అన్ని రంగాలలో విజయం సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BHNG: వలిగొండ మండలం రెడ్ల రేపాకకు చెందిన రైతు జహంగీర్ తన పత్తి పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని ఆవేదన చెందాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
NZB: ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పొన్న సంజన(15) విద్యార్థిని గతేడాది ముప్కాల్ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది. 565 మార్కులతో బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించి విద్యను అభ్యసిస్తుంది. కానీ అనారోగ్య కారణంతో ఆదివారం రోజు మధ్యాహ్నం కళాశాలలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, ఉన్నత పాఠశాల అధ్యాపకులు తెలిపారు.
MNCL: జైపూర్ మండలం వేలాల శ్రీ గట్టు మల్లన్న స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న అర్జిత సేవల టిక్కెట్ల రుసుములను పెంచనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి (EO) రమేష్ ఆదివారం ప్రకటనలోతెలిపారు. రుసుము పెంపుదలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, 15 రోజుల లోపు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంటోని ఉన్నత పాఠశాలలో బాస్కెట్ బాల్ జిల్లా స్థాయి పోటీలను ఇవాళ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల ఉత్సాహంగా ఆడారు. విజేతలకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్రీడా సంఘం నాయకులు పాల్గొన్నారు.