ఆదిలాబాద్లోని అన్ని పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహించారు. నమోదైన ప్రతి కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యేలా సమన్లు జారీ చేయాలని, తప్పించుకునే అవకాశం లేకుండా చూడాలని సూచించారు. కోర్టుకు హాజరు కాని వారిపై ఎన్బీడబ్ల్యూ (నాన్-బెయిలబుల్ వారెంట్)లు తీసుకొని చర్యలు చేపట్టాలన్నారు.
HYD: సంక్రాతి పండుగకి ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో HYDలోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ‘రైల్ వన్’ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే 3 శాతం డిస్కౌంట్ లభిస్తుందని రైల్వే అధికారులు చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పండుగ కోసం 150 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
ADB: నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంగ్లీష్ ఫౌండేషన్ అభ్యాసన నైపుణ్యాలు, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
MBNR: అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. గురువారం జడ్చర్ల పట్టణంలోని బీ.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో బిఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. బిఎల్ఓలు ఎన్నికల నియమ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా పక్కాగా మ్యాపింగ్ జరిపించాలన్నారు.
KMM: జిల్లాలోని మిర్చి యాడ్ ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 155.30 కోట్లు కేటాయించిందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆధునీకరణ పనులను రెండు దశలలో చేపట్టాలని నిర్ణయించామని, మొదటి దశలో రూ.114.96 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. మార్కెట్ యార్డ్ ఆధునీకరణలో భాగంగా 7 షెడ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ చేసి 5 షెడ్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
MBNR: జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోవల్ల వెంకటేష్ అన్నారు. గురువారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను సందర్శించారు. యూరియా విషయంలో రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేందర్ పాల్గొన్నారు
KNR: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని హుజురాబాద్ ఎంవీ ఐ కంచి వేణు అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా జమ్మికుంటలో వాహనదారులకు హుజురాబాద్ ఎంవీఐ రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనంపై వెళ్లే ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మితిమీరిన వేగం ప్రాణ సంకటమని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.
KNR: శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాలలో చంద్రబాబు శంకరశెట్టి మెమోరియల్ అవార్డు ప్రదాన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరికాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్యు వీసీ ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుల్లో రాణిస్తూ, మంచి విద్యని అభ్యసిస్తూ ఎన్నో బహుమతులు పొందాలని తెలిపారు.
BHPL: గోరికొత్తపల్లిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన CM కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథులుగా DEO రాజేందర్, MEO, SI, సర్పంచ్ శంకర్ పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. వారు క్రీడాకారులతో కలిసి రన్ చేశారు. పల్లెల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు సీఎం కప్ ఉత్తమ వేదిక అని పేర్కొన్నారు.
NGKL: అన్నదానం అన్ని దానాల కంటే ఎంతో గొప్పదని ఎస్సై మాధవరెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లైన్స్ క్లబ్ ద్వారా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.
NLG: కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
WNP: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ట్యాబ్ ఎంట్రీలో చేయడంలో జాప్యం చేసే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులకు హెచ్చరించారు. గురువారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్లో ధాన్యం కొనుగోలు ప్రగతిపై ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరిస్తున్నప్పటికీ, ఆ వివరాలను ట్యాబ్లలో నమోదు చేయాలన్నారు.
ADB: మావల మండలం కొమురంభీం కాలనీకి చెందిన నిరుపేద ఆదివాసీ విద్యార్థులకు గురువారం సామజిక కార్యకర్త పద్మావతి సుమారు 30 దుప్పట్లను అందజేశారు. వారికి ఎప్పటికి అండగా ఉంటామని హమిచ్చారు. అదేవిధంగా నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల కోసం తాత్కాలిక మరుగు దొడ్ల నిర్మాణానికి రూ.5 వేల విరాళాన్ని అందజేశారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో ఇటీవల కాటారం మండలం గుండ్రాతీపల్లి గ్రామ సర్పంచ్ సావిత్రికి నకిలీ కుల సర్టిఫికెట్ జారీ చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ విషయం బయటపడిన తర్వాత రేగొండ ఎస్సై రాజేష్ ఇవాళ కేసు నమోదు చేశారు. SI మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటన పై విచారణ కొనసాగుతోంది.
NGKL: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు-తాగు నీరు, రోడ్లు, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ కళాశాలలు, గిరిజన భవనం, తహసీల్దార్ భవనాలు మంజూరు చేశామన్నారు.