ఉమ్మడి WGL జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 564 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలిపి 332 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. BRS 179 స్థానాలు సాధించగా.. స్వతంత్రులు 42, BJP 10 స్థానాలకు పరిమితమైంది. వంజరపల్లి జీపీకి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించగా అక్కడ సర్పంచ్ పోటీకి అభ్యర్థులు లేక ఎన్నికలు నిలిచిపోయాయి.
MLG: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భాగంగా చేపట్టిన పనులను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. పార్కింగ్, భద్రత ఏర్పాట్లు అభివృద్ధి పనుల్లో జరుగుతున్న తీరును పరిశీలించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఆలయ విస్తరణ పనులు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
HYD: గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఇవాళ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి ప్రాంగణంలో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, నేపథ్య గాయకులు, బాలు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
NZB: ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు లైఫ్ సర్టిఫికెట్లు ఇప్పటి వరకు అందజేయని వారు ఈ నెలాఖారు వరకు మీసేవ కేంద్రాల్లో సమర్పించాలని ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికులు, ఇతర కార్మికులు, ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.
ADB: తాంసి మండల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని వడ్డాడి సర్పంచ్గా బెండె జయసుధ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బాగిడి లక్ష్మిపై 140 ఓట్ల తేడాతో గెలుపొందారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 3 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
EG: ప్రధాన దేవాలయాలకు నేరుగా బస్సుల సౌకర్యం కల్పించాలని జన్నారం మండలంలోని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. జన్నారం మండలం 4 జిల్లాలకు వెళ్ళే సరిహద్దులో ఉంది. మండలం నుండి చాలామంది భక్తులు కొండగట్టు, ధర్మపురి, గూడెం, వేములవాడ దేవాలయాలకు నిత్యం దర్శించుకుంటారు. అయితే ఆయా దేవాలయాలకు మూడు నాలుగు స్టేజీలలో దిగి వెళ్లాల్సి వస్తోంది.
KNR: గన్నేరువరం మండలం మాదా పూర్ గ్రామ సర్పంచ్గా మాదరి శ్రీనివాస్ గెలుపొందారు. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ గెలుపొందారు. ఈ గెలుపుతో ఆయన మద్దతు దారులు సంబరాలు చేసుకున్నారు. నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మాదరి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
అసిఫాబాద్ జిల్లాలో జరిగిన రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది 6 మండలాల్లో జరిగిన ఎన్నికలలో 113 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 25, BRS 43 స్థానాలను, BJP 24 స్థానాలను గెలిచాయి. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సైతం 20కి పైగా స్థానాల్లో గెలిచారు. చింతలమానేపల్లి మండలంలో ఏకంగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం.
ADB: భీంపూర్ మండలం దనోర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మట్ట స్నేహ యాదవ్ (బీఆర్ఎస్) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి గోప లక్ష్మీబాయిపై 89 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో 83.06 శాతం పోలింగ్ నమోదైంది. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. గ్రామ అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటానని స్నేహ యాదవ్ తెలిపారు.
NZB: నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం మల్కాపూర్(A) సర్పంచ్గా కాటూరి నీరజ-కార్తీక్ గెలుపొందారు. బీటెక్ చదివిన నీరజ మొదటిసారిగా కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. నీరజకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని నీరజ తెలిపారు.
KNR: చిగురుమామిడి మండలం గునుకులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుతో పోటీ చేసిన గునుకుల మధుసూదన్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలుపొంది, సర్పంచ్గా ఎన్నికయ్యారు. మధుసూదన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. స్థానిక గ్రామ ప్రజలకు నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
MBNR: చిన్నచింతకుంట మండలం గూడూరులో కౌంటింగ్లో ఉత్కంఠ నెలకొంది. తొలుత కాంగ్రెస్ రెబల్ భీమన్నగౌడ్, కాంగ్రెస్ మద్దతుదారు శేఖర్కు సమానంగా ఓట్లు వచ్చాయి. టాస్ వేయడానికి నిరాకరించడంతో, ఎన్నికల అధికారులు ఒక చెల్లని ఓటును తీసుకుని, స్కేల్తో కొలిచి భీమన్న గౌడ్ వైపు స్వస్తిక్ ముద్ర ఎక్కువ ఉందని నిర్ధారించి, ఆయన్ను ఒక్క ఓటు మెజార్టీతో విజేతగా ప్రకటించారు.
భూపాలపల్లి జిల్లా చిట్యాల గ్రామ పంచాయతీ నూతన ఉపసర్పంచ్గా బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. BJP పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు BJP నాయకులు వెంకటేష్ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు.
ADB: తాంసి మండల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని పొన్నారి సర్పంచ్గా తలారి భూమన్న విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి దర్శనాల దయానంద్ పై 43 ఓట్ల తేడాతో గెలుపొందారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో 3 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.