• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తుడుం దెబ్బ నూతన మండల కమిటీ ఏర్పాటు

MLG: మేడారంలోని ITDA ప్రాంగణంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో ఇవాళ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నవీన్, ఉపాధ్యక్షులుగా జూనేశ్, సుధీర్, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా తాటి సురేశ్, సహాయ కార్యదర్శిగా సాగర్ కోశాధికారిగా సురేష్‌లను ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు మహేష్ తెలిపారు.

November 18, 2025 / 04:19 PM IST

ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు: మాజీమంత్రి

NGKL: పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తిలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంగళవారం ఆయన పత్తి కొనుగోళ్లపై నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

November 18, 2025 / 04:10 PM IST

విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుంది: రంజిత్ కుమార్

GDWL: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకంలో నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థులకు విద్యను అందనీయకుండా చేస్తుందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. మంగళవారం కే.టీ.దొడ్డి మండలం నందిన్నె జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గదులు, ఉపాధ్యాయుల కొరతను అధికారులు స్పందించి త్వరగా పరిష్కరించాలన్నారు.

November 18, 2025 / 04:06 PM IST

డ్రగ్స్ రహిత సమాజాన్నితీర్చిదిద్దాలి: ఎంపీడీవో

BHNG: డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో భాస్కర్ అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు.

November 18, 2025 / 04:02 PM IST

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: రుద్రంగి మండలం మానాల గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం జాతర మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్‌ను ఘనంగా సన్మానించారు.

November 18, 2025 / 04:01 PM IST

హైదరాబాద్‌లో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా

HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని కొందరి బైక్స్‌లో ఇంజిన్ వేడెక్కడం, పొగ రావడం వంటి సమస్యలతో ఈగుట్టు రట్టయింది. నకిలీ ఆయిల్ వాడితే బైక్‌లు, కారులు త్వరగా బోర్‌కు వస్తుందని, క్లచ్‌లో తేడా వస్తే మెకానిక్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. నమ్మకమైన చోటనే సర్వీసింగ్ చేయించుకోవాలని, ఆయిల్ కొనాలని చెప్పారు.

November 18, 2025 / 03:50 PM IST

నేను చాలా ధైర్యమున్న వ్యక్తిని: కవిత

KMM: ఆస్తి, కుటుంబ వివాదాలు అంటూ తనపై చేస్తున్న ఆరోపణలు నిజం కావని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘నేను ధైర్యమున్న వ్యక్తినని, ఆడబిడ్డని తీసుకెళ్లి 6 నెలలు తీహార్ జైల్లో పెడితే ధైర్యంగా ఎదుర్కొన్నానని, వేరే వాళ్లు అయితే ఇంట్లో కూర్చుంటారన్నారు. నా భుజాలపై బరువు ఉంది. తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదనే నేను ధైర్యంగా బయటికొచ్చి ఫైట్ చేస్తున్నానని తెలిపారు.

November 18, 2025 / 03:45 PM IST

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి: MP నగేశ్

ADB: డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ మిషన్ పరివర్తన దివస్ కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలన్నారు. భారత దేశాన్ని నషాముక్త్ భారత్ చేయుటకు సంకల్పంతో చేయాలని పిలుపునిచ్చారు.

November 18, 2025 / 03:41 PM IST

‘సీనియర్ నేతలను వదులుకుని KCR తప్పు చేశారు’

NZB: సీనియర్ నేతలను వదులుకుని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇవాళ ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారన్నారు.

November 18, 2025 / 03:32 PM IST

‘సిర్పూర్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలి’

ASF: సిర్పూర్ (T) రైల్వే స్టేషన్‌కు సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవని ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా సిర్పూర్ రైల్వే స్టేషన్‌కు సంబంధించి పలు అభివృద్ధి పనుల విషయమై వారికి వివరించారు. పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే GM తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

November 18, 2025 / 03:31 PM IST

మద్యం సేవించి వాహనం నడపరాదు: ASI

VKB: మర్పల్లి మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలను సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చని ఏఎస్సై భూపతి రెడ్డి అన్నారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, మైనర్స్ డ్రైవింగ్‌పై ప్రత్యేక అవగాహన కల్పించారు. వేగం కన్నా ప్రాణం మిన్న అని నినదించారు.

November 18, 2025 / 03:30 PM IST

డిసెంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్

NRML: నిర్మల్ జిల్లాలో డిసెంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం జరుగుతుందని డీఈవో భోజన్న, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

November 18, 2025 / 03:28 PM IST

ర్యాలీ ప్రారంభించిన కేంద్ర మంత్రి

SRCL: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా పట్టణంలో సర్దార్ 150వ యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.

November 18, 2025 / 03:27 PM IST

‘బీఎస్పీకి ప్రజలు అధికారం ఇవ్వాలి’

BDK: చర్ల మండలంలోని ఉప్పరగూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ సెక్టార్ సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ మాట్లాడుతూ.. చర్ల మండలంపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి గాని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గాని ఎటువంటి ప్రేమ, చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

November 18, 2025 / 03:26 PM IST

ఏసీబీకి పట్టుబడిన ఎస్సై

MDK: ఏసీబీ అధికారులకు ఎస్సై పట్టుబడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో హార్వెస్టర్‌పై నమోదైన ఓ కేసు విషయంలో ఎస్సై రాజేష్ రూ.20,000 డిమాండ్ చేశాడు. ఇవాళ బాధితుని వద్ద నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 18, 2025 / 03:25 PM IST