• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మాచారెడ్డిలో 4 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం

KMR: మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ సర్పంచ్‌గా మరుపాక అంజమ్మ, వెనుకతండా గ్రామ సర్పంచ్‌గా కెలోత్ పద్మ, బోడిగుట్ట తండా గ్రామ సర్పంచ్‌గా మాలోత్ సంతోష్, అంకిరెడ్డి పల్లి తండా సర్పంచ్‌గా బానోత్ శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. మండలంలోని 21 గ్రామాల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

December 11, 2025 / 03:30 PM IST

వార్డు సభ్యుడిగా BRS అభ్యర్థి విజయం

WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో BRS అభ్యర్థి దుగ్యాల వాసుదేవరావు ఒకటోవ వార్డు సభ్యునిగా 100 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు ఇవ్వడంతో విజయాన్ని నమోదు చేసుకున్నారు.

December 11, 2025 / 03:29 PM IST

అల్లాదుర్గం మండలంలో 82.87 పోలింగ్

 MDK: అల్లాదుర్గం మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మూసేసరికి గ్రామంలో 82.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనట్లు అధికారులు తెలిపారు.

December 11, 2025 / 03:16 PM IST

అల్లాదుర్గం మండలంలో పోలింగ్ పోలింగ్ శాతం ఎంతంటే..?

 MDK: అల్లాదుర్గం మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మూసేసరికి గ్రామంలో 82.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనట్లు అధికారులు తెలిపారు.

December 11, 2025 / 03:16 PM IST

మందు తాగుతూ కింద పడి వ్యక్తి మృతి

NZB: వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తగుతున్న వ్యక్తి అకస్మాత్తుగా కింద పడి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. SI శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన మంగలి సాయిలు నిజాంసాగర్ వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తాగుతూ, మత్తులోకి జారుకుని ఒక్కసారిగా పడి మృతి చెందాడని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 11, 2025 / 03:08 PM IST

బాన్సువాడలో 80.50 శాతం ఓటింగ్ నమోదు

NZB: బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో వర్ని, కొటగిరి, రూద్రూర్, చందూర్ మోస్రా మండలాల్లో పోలింగ్ సమయం ముగిసే సమయానికి 80.50 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు కేంద్రాల్లో కౌంటింగ్ మొదటగా వార్డు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

December 11, 2025 / 03:06 PM IST

క్రిటికల్ కేంద్రాల్లో భద్రత పెంపు: డీసీపీ

KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గురువారం అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు పరిశీలించారు. ఎల్.గోవిందపురం, బోనకల్, నాగులవంచ సహా పలు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.

December 11, 2025 / 03:01 PM IST

ఉమ్మడి జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

KMR,:నిజాంసాగర్ మండలంలో నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈనెల 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాంబాబు తెలిపారు.మొత్తం 5124 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకున్నారని వెల్లడించారు. వారికోసం ఉమ్మడి జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

December 11, 2025 / 02:52 PM IST

విజయోత్సవాలకు అనుమతి లేదు: సీపీ

WGL: జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అలాగే, ఇవాళ విజయోత్సవాలకు సంబంధించి అనుమతి లేదని సీపీ స్పష్టం చేశారు. అలాంటి వాటికి తప్పనిసరిగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలన్నారు.

December 11, 2025 / 02:50 PM IST

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం వివరాలివే

KNR: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలివిడత కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఐదు మండలాలలో పోలైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. చొప్పదండి 83.66, గంగాధర 78. 70, కరీంనగర్ రూరల్ 84.67, కొత్తపల్లి 79.19, రామడుగు 82.0.5, పోలింగ్ శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

December 11, 2025 / 02:47 PM IST

బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన బజరంగ్ సేన

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట, కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక చేయూతగా బజరంగ్ సేన యూత్ సభ్యులచే సేకరించిన 16,500 రూపాయలు బాధితులకు ఆర్థిక చేయూతగా బుధవారం కొండగట్టులో అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు విష్ణువర్ధన్, భగవాన్, మధు,మనోజ్, రోహిత్, అఖిల్, రోహిత్,సాయితేజ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

December 11, 2025 / 02:45 PM IST

జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?

మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆరు మండలాల్లో జరిగిన 146 గ్రామపంచాయతీ ఎన్నికల్లో 85.93 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు వివరించారు. 1,63,148 ఓటర్లకు గాను 1,40,200 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

December 11, 2025 / 02:44 PM IST

టెన్షన్ టెన్షన్.. కౌంటింగ్ షురూ.!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 511 పంచాయతీలకు, 3,793 వార్డులకు కౌంటింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సుల్లో సర్పంచ్ ఓట్లు వేరు చేసి, వార్డుల వారీగా లెక్కిస్తున్నారు. వార్డులు ముగిసిన వెంటనే సర్పంచ్ ఫలితాలు పూర్తి చేయబడతాయి. అనంతరం ఉప సర్పంచ్ ఫలితాలు కూడా ప్రకటించవచ్చు. రాత్రి 9 గంటలలోపు అన్ని పంచాయతీల్లో కౌంటింగ్ ముగుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

December 11, 2025 / 02:42 PM IST

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలివే

SRCL: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలివిడత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఐదు మండలాలలో పోలైన  పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. చందుర్తి 76.53, కోనరావుపేట 81.98, రుద్రంగి 71.98, వేములవాడ అర్బన్ 75.31, వేములవాడ రూరల్ 82.47 పోలింగ్ శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

December 11, 2025 / 02:41 PM IST

పంచాయతీ ఎన్నికలలో 80.28 % ఓటింగ్

NRML:మొదటి దశ పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసాయి. మొత్తం 80.28 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండలాల వారీగా దస్తురాబాద్ 80.22, కడెం 79.87, ఖానాపూర్ 79.16, లక్ష్మణ చందా 81.14 మామడ 79.65, పెంబి 83.46 శాతం ఓటింగ్ నమోదయిందని వారు పేర్కొన్నారు.

December 11, 2025 / 02:37 PM IST