BDK: భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నా ప్రభుత్వం గానీ, అధికారుల గానీ పట్టించుకోవడంలేదు. రోజుకొకరు బలి అవుతున్నా స్పందించడం లేదు. ఎన్ని ధర్నలు చేసినా అధికారులకు చలనం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇసుక ర్యాంప్ల నిర్వాహణ వల్లనే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
SRPT: సర్పంచ్ ఎన్నికల నియమావళిపై పాలకీడు మండలం శూన్య పహాడ్ గ్రామంలో ఈరోజు పోలీసులు, జిల్లా కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. సీఐ చరమందరాజు మాట్లాడుతూ.. ప్రజలు నియమావళికి లోబడి, ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోటేష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
BDK: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీరామ దీక్షలో భాగంగా రామ దీక్ష తీసుకున్న స్వాములకు ఆలయం నందు చందన గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్తీక పునర్వసు రోజు శ్రీరామ దీక్ష తీసుకున్న దీక్షితులు పాల్గొన్నారు.
KMM: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని ఎస్సై లక్ష్మీ భార్గవి అన్నారు. బుధవారం మధిర మండలంలోని పలు గ్రామాలలో స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నిక నియమావళికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
SRPT: పాలకీడు మండలంలోని గుడుగుంట్లపాలెం, పాలకీడు నామినేషన్ కేంద్రాలను ఈరోజు ఎస్పీ నరసింహా పరిశీలించారు. ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలవుతుందని తెలిపారు. మూడు విడతల్లో మొత్తం 170 సమస్యాత్మక గ్రామాల్లో భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.
MDK: వరి కోయ్యలను కాలిస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ ఏడిఏ పుణ్యవతి తెలిపారు. మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో వరి పొలాలను సందర్శించారు. రొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. ఏవో కవిత, ఏఈవో రజిత పాల్గొన్నారు.
KNR: 2019 స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,210 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 108 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. KNRలో 15, PDPLలో 13, JGTLలో 37, SRCLలో 43 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నిధులు కేటాయిస్తామనటంతో, ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకున్న నాయకులకు నిరాశే మిగిలింది.
KNR: చొప్పదండి మండలంలోని జ్ఞాన సరస్వతి ఆలయ తృతీయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా, హనుమాన్ దేవాలయం మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ADB: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న PDSU రాష్ట్ర నాయకులను అరెస్టు చేయటం సమంజసం కాదని జిల్లా కార్యదర్శి అశోక్ బుధవారం అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 4న నిర్వహించే CM సభను అడ్డుకుంటామని తెలియజేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని కోరారు.
NLG: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు ప్రశాంత ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా గ్రామస్తులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నార్కట్ పల్లి, యల్లారెడ్డి గూడెం గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన కల్పించారు.
MBNR: ఎన్సీసీ క్యాడెట్లు, యువత దేశభక్తి మరియు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని కల్నల్ ప్రశాంత్ కుమార్ అన్నారు. మహబూబ్నగర్లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన 8వ తెలంగాణ ఇటాలియన్ ఎన్సిసి వార్షిక శిక్షణ శిబిరం ముగింపు వేడుకలో పాల్గొన్న ఆయన, నవంబర్ 25 నుంచి సాగిన ఈ శిబిరంలో 519 మంది క్యాడెట్లు పాల్గొన్నట్లు తెలిపారు.
MBNR: మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి నవజాత శిశువుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆయన నవజాత శిశువులకు వైఎస్సార్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లు శిశువుల సంరక్షణకు, ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
HYD: GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేస్తూనే డిప్యూటీ కమిషనర్లకు డిసెంబర్ 5 డేడ్ లైన్ విధించారు. విలీనానికి సంబంధించిన అన్ని రికార్డులను డిసెంబర్ 5 లోపు సబ్మిట్ చేయాలని, అంతేగాక మిగతా ఆదేశాలను సైతం అమలు చేయాలని సూచించారు. ఈ ప్రొసీడింగ్ పత్రాలను మేడ్చల్, రంగారెడ్డి జిల్లా అధికారులకు పంపారు.
HYD: GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక, మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మీషన్లు, వర్క్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.