WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచుల హయాంలో చేసిన అభివృద్ధి పనులకు రూ. 79.68 కోట్లు, ప్రత్యేకాధికారుల పాలనలో కార్యదర్శుల ఖర్చులకు రూ. 20 కోట్లు బకాయిపడ్డాయి. మొత్తం రూ. 99.68 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వ అంచనా. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు వేగంగా జరుగుతున్నా సమాచార పౌర సంబంధాల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నామినేషన్లు, ఎన్నికల డేటా ప్రజలకు తక్షణం చేర్చాల్సిన బాధ్యతలో జాప్యం జరుగుతోంది. అధికారుల అప్-డౌన్లు, కలెక్టర్-సమాచార శాఖ మధ్య సమన్వయ లోపం, AD, DD పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
SRPT: మునగాల మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. నామినేషన్ తదితర అంశాలు ఎప్పటికప్పుడు మండల కేంద్రానికి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
MNCL: బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి, తాండూర్ మండలం మాదారం-3 ఇంక్లైన్ నుంచి పలువురు యువకులు BRS పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత BRS ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. స్థానిక ఎన్నికల్లో యువత BRS అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు.
WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని 2 విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేస్తున్నారు. నేపథ్యంలో అభ్యర్థులు కులం ధృవికరణ కోసం తాహసీల్దార్ కార్యాలయం వెళ్లగా సర్వర్ మొరాయిస్తున్న వార్త HIT news ప్రచురించక తాహసీల్దార్ స్పందించి నామినేషన్ ఫారంపై 100 ఫారంపై సంతకం చేస్తున్నట్లు వెల్లడించారు. HIT NEWS సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
MHBD: జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)గా రాజేశ్వర్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత DEO దక్షిణామూర్తి VRS తీసుకోవడంతో ఖాళీ అయిన పదవిలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD)గా పనిచేస్తున్న రాజేశ్వర్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజేశ్వర్కు శుభాకాంక్షలు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో అత్యధిక ఓటర్ల సంఖ్య కలిగిన టాప్ 10గ్రామ పంచాయతీలు ఇవే. అందులో మేళ్లచెరువు గ్రామం 10,567 ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041), తుంగతుర్తి (5,338), మునగాల (5,338), పొనుగోడు (5,161), రామాపురం (4,797), నూతనకల్ (4,568) గ్రామాలు జాబితాలో ఉన్నాయి.
SRCL: వేములవాడ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూర బాబు సర్పంచ్ పదవికి జైలు నుంచి నామినేషన్ దాఖలు చేశాడు. బూర బాబు ఇటీవల జరిగిన ఒక కేసులో జైలుకు వెళ్లాడు. మారుపాక గ్రామం సర్పంచ్ ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడంతో బూర బాబు జైలు నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పంపించగా వారి బంధువులు నామినేషన్ దాఖలు చేశారు.
KNR: తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణపరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం,గుర్తుల కేటాయింపు, పకడ్బందీ కలెక్టర్ పమేలా అన్నారు.
HYD: దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి కేరళ వాసిగా గుర్తించారు.
MBNR: జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డిని నూతనంగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు ఆయనను సోమవారం ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సమచిత స్థానం ఇస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్వాల్, టీపీసీసీ సెక్రెటరీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
SRD: జూబ్లీహిల్స్లో హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ యాదవ్ గెలవడం గర్వకారణమని న్యాయవాదుల బృందం తరఫున సీనియర్ న్యాయవాది సుధాకర్ అన్నారు. అతి చిన్న వయసులో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని విద్యావంతులు నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ గెలవడం మామూలు విషయం కాదని కొనియాడారు. చిన్న శ్రీశైలం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి కలశామని పేర్కొన్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలంలోని శ్రీ గురుదేవ ఆశ్రమంలో ఇవాళ గీతాజయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆశ్రమాధిపతి శ్రీ సహజానంద స్వాములవారి ఆధ్వర్యంలో భక్తులు భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం నిర్వహించారు. స్వాములవారు మాట్లాడుతూ.. భగవానుడే స్వయంగా చెప్పిన ఏకైక గ్రంథం భగవద్గీత అన్నారు. మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు గీతోపదేశం చేశారని వివరించారు.
BHPL: గోరికొత్తపల్లి మండలంలోని శ్రీ గురుదేవ ఆశ్రమంలో ఇవాళ గీతాజయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆశ్రమాధిపతి శ్రీ సహజానంద స్వాములవారి ఆధ్వర్యంలో భక్తులు భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం నిర్వహించారు. స్వాములవారు మాట్లాడుతూ.. భగవానుడే స్వయంగా చెప్పిన ఏకైక గ్రంథం భగవద్గీత అన్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు గీతోపదేశం చేశారని వివరించారు.
NZB: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఏం మాట్లాడతారోనని పార్లమెంట్ పరిధి వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా 500 బెడ్ల ESI ఆసుపత్రి నిర్మాణం, పార్లమెంట్ పరిధిలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల ఓపెనింగ్, అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి ఆయన తీసుకెళ్తారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.