• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బాల్య వివాహాలు జరిగితే 1098కు కాల్ చేయండి’

KNR: చైల్డ్ మ్యారేజ్ నిరోధకత వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఆర్నకొండ జడ్పీ హై స్కూల్లో శుక్రవారం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో గంగాధర బ్లాక్ సీడీపీఓ నర్సింగరాణి మాట్లాడుతూ.. బాలిక వివాహ వ్యవస్థను నిర్మూలించాలని, గ్రామంలో ఎక్కడైనా ఇలాంటివి జరిగినట్లయితే 1098కు లేదా స్థానిక అంగన్వాడీ వర్కర్లకు, పాఠశాల హెచ్ఎంలకు తెలియజేయాలని కోరారు.

December 19, 2025 / 08:56 PM IST

కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేసిన MP

WGL: కాకతీయ యూనివర్సిటీలో అమలవుతున్న RUSA 2.0 (రీసెర్చ్ & ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పెంచాలని ఇవాళ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గడువు పెంచకపోతే యువత, పరిశోధకులు నష్టపోతారని, వరంగల్‌ను పరిశోధనలు, ఆవిష్కరణల హబ్‌గా అభివృద్ధి చేయడానికి కేంద్ర సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు.

December 19, 2025 / 08:53 PM IST

పాఠశాలల తనిఖీలకు స్వల్ప విరామం: డీఈవో

సూర్యాపేట జిల్లాలోని ప్యానల్ తనిఖీలకు స్వల్ప విరామం ఇస్తున్నట్లు డీఈవో అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధులు,జిల్లా సైన్స్ ఫెయిర్, విద్యార్థుల డేటా ఎంట్రీ, సిలబస్ పూర్తి చేయడం వంటి కీలక పనులు ఉన్న నేపథ్యంలో తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

December 19, 2025 / 08:52 PM IST

ఉపాధి హామీ చట్టం రద్దుపై బూర్గంపాడులో నిరసన

BDK: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ బూర్గంపాడు(M) పాండవుల బస్తీలో ఉపాధి హామీ కార్మికులు నిరసన చేపట్టారు. ‘జి-రామ్- జీ’ పత్రాన్ని తగలబెట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం కార్మికుల హక్కు అని, దానిని బలహీనపరిచే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని వారు స్పష్టం చేశారు.

December 19, 2025 / 08:52 PM IST

గ్రూప్-3 ఉద్యోగం సాధించిన రామడుగు యువకుడు

KNR: రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన పైండ్ల శ్రీకాంత్ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-3 ఫలితాలలో ఎన్నికయ్యాడు. శ్రీకాంత్ ఇప్పటికే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్-3 ఉద్యోగ సాధించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

December 19, 2025 / 08:50 PM IST

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: DCP

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ జోన్ DCP కవిత కోరారు. రాజీపడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలను ఈ మెగా అదాలత్‌ ద్వారా త్వరగా కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీమార్గమే రాజా మార్గమని ఆమె కక్షిదారులకు సూచించారు.

December 19, 2025 / 08:47 PM IST

ప్రతి విద్యార్థికి పథకాలు అందాలి: కలెక్టర్ త్రిపాఠి

NLG: ప్రభుత్వ విద్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్య, సంక్షేమ శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

December 19, 2025 / 08:46 PM IST

మేడారం సమ్మక్క జాతరకు 700 బస్సులు

కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆర్ ఎంబి.రాజు జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి రీజియన్ లోని అందరు డిపో మేనేజర్లు, అన్ని డిపోలకు చెందిన ట్రాఫిక్ ఇంఛార్జ్‌లు, మెకానికల్ ఇంఛార్జ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రీజియన్ పరిధిలోని 6 ఆపరేటింగ్ పాయింట్లు ద్వారా మేడారానికి నడుపనున్న 700 బస్సులకు ఆపరేటింగ్ పాయింట్ల ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

December 19, 2025 / 08:46 PM IST

అప్రమత్తతతో ప్రాణ నష్ట నివారణ

KMR: అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్ట నివారణ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణా రావు సూచించారు. శుక్రవారం ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

December 19, 2025 / 08:41 PM IST

రుణాలు మంజూరు చేయుటకు యూబీఐ సిద్ధం

JGL: అర్బన్ మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయుటకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నట్లు జగిత్యాల డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీలత తెలిపారు. అర్హులైన SHGల రుణ దరఖాస్తులను ఈ నెల 24లోపు పంపాలని సూచించారు. PM వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ పథకం కింద దరఖాస్తులను పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.

December 19, 2025 / 08:38 PM IST

పాలమూరు యూనివర్సిటీ నుంచి రమేష్‌కు పీహెచ్‌డీ

NGKL: కోడేర్ మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన రమేష్ పాలమూరు యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో PHD సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి, నెట్ అర్హతతో 2021లో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందారు. డా. నూర్జహాన్ పర్యవేక్షణలో నానోపార్టికల్స్‌పై పరిశోధన చేశారు. ప్రస్తుతం నర్సాపూర్‌‌లో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్నారు‌‌.

December 19, 2025 / 08:35 PM IST

సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: జిల్లా కలెక్టర్

PDPL: రామగుండం బొగ్గుగని ప్రాజెక్టుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

December 19, 2025 / 08:34 PM IST

కోటగుళ్లకు రూ.16 వేల గంట బహూకరణ

BHPL: కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు దేవాలయానికి ములుగు వెంకటాపూర్‌కు చెందిన తౌటు రెడ్డి స్వర్ణలత-భాస్కర్ రెడ్డి దంపతులు రూ.16 వేలతో 11 కిలోల గంటను సోమవారం బహూకరించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందజేసి ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

December 19, 2025 / 08:34 PM IST

పర్సనల్ మేనేజర్‌ను కలిసిన హెచ్ఎంఎస్ నాయకులు

BHPL: సింగరేణి భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్‌గా శ్యామ్ సుందర్ ఇటీవల బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం హెచ్ఎంఎస్ నాయకులు మర్యాదపూర్వకముగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు నరేష్ నేత, కార్యదర్శి మల్లేష్, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు నర్సయ్య, నాయకులు బద్దెల వంశీ, సహాయ కార్యదర్శి ఆలీ పాల్గొన్నారు.

December 19, 2025 / 08:32 PM IST

‘సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి’

NLG: గ్రామ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఉపసర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప సర్పంచ్‌గా ఎన్నికైన ఆకుల కృష్ణ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను ఆయన శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

December 19, 2025 / 08:29 PM IST