ADB: భీంపూర్ మండలంలోని ఇందూరుపల్లి గ్రామంలో పీవీటీజీ పథకం కింద మంజూరైన 60 ఇందిరమ్మ ఇళ్లకు స్థానిక నాయకులు గురువారం భూమి పూజ చేశారు. మాజీ సర్పంచ్ టేకం దాదారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కపిల్ యాదవ్, నితిన్, సుధాకర్ తదితరులున్నారు.
WNP: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై గురువారం వనపర్తి కలెక్టర్లో సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లికృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డిలు హాజరుకానునట్లు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సీతారాం తెలిపారు.
SRCL: కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని క్యాబినెట్ సెక్రటరీ (కో-ఆర్డినేషన్), సెంట్రల్ సెక్రటేరియట్ ఆదేశించారు. భూసేకరణ, రైల్వే లైన్ పనులు, ఇతర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెను జిల్లా కలెక్టరేట్ నుంచి ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. పనుల వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.
HYD: భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్కు రాష్ట్రపతి నిలయం వేదిక కానుంది. ఈనెల 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవాల్లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్ & డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు నగరానికి రానున్నారు.
MBBR: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్17,19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలను రేపు జిల్లా స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ఇవాళ తెలిపారు. క్రీడాకారులు ఈనెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు నెంబర్ 99592 20075కు సంప్రదించాలన్నారు.
ADB: అప్రమత్తతో ఉంటూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలియజేశారు. ప్రమాదాల నివారణకై జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ క్లబ్ ప్రారంభించినట్లు వెల్లడించారు. శీతాకాలంలో రహదారులపై పొగమంచు వల్ల వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ సాధ్యమని పేర్కొన్నారు.
MNCL: జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారంలో స్కూల్, జూనియర్ కళాశాల స్థాయి విద్య మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉంది. డిగ్రీ చదవాలంటే లక్షెట్టిపీట, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల పట్టణాలకు విద్యార్థులు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
NLG: తమ సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మికులు గురువారం ఉదయం చండూరు నుంచి హైదరాబాద్లోని చేనేత కమిషనర్ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ జరిగే ధర్నాలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. వారికి చేనేత సహకార సంఘం ఛైర్మన్ జూలూరు శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు రాపోలు వెంకటేశం తదితర నాయకులు మద్దతు ప్రకటించారు.
NZB: గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు పోతుండగా సరస్వతీ కెనాల్కు 650, మిషన్ భగీరథకు 231 వదిలామన్నారు. ప్రాజెక్టులోని పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.
NLG: ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలు, యువతులకు నేటి నుంచి చీరలు పంపిణీ ప్రారంభమవుతుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఈ కార్యక్రమం చేపట్టింది. మొదటి విడత పంపిణీ గురువారం నుంచి గ్రామాల్లో ప్రారంభమై, జిల్లాలోని 3,66,532 మంది సభ్యులకు డిసెంబర్ 9 వరకు అందించనున్నారు.
KMR: చుట్టుపక్కల గ్రామాల్లో పొద్దెక్కినా పొగమంచు విడవట్లేదు. గురువారం చిన్నమల్లారెడ్డి, పాతరాజంపేట, సరంపల్లి, నర్సన్నపల్లి గ్రామాలు ఉదయం సూర్యోదయం వెలుగుల్లో కూడా మసకబారి కనిపించాయి. ప్రతిరోజూ పొగమంచు దట్టంగా కమ్మేస్తూ ఉదయం 10 వరకు అలాగే ఉంటుందని స్థానికులు తెలిపారు. పొగమంచుతో పాటు చలి ప్రభావంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఓ మహిళ ఇందిరమ్మ ఇంటిని కక్షతో నిలిపివేశారంటూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అన్ని అర్హతలు ఉన్నా MLA గండ్ర, అధికారులు ప్రొసీడింగ్ కాపీని రాత్రికి రాత్రి నిలిపివేశారని, ఎందుకు నిలిపారో సమాధానం చెప్పట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది.
WGL: నగరంలో ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణకు అనువైన స్థలాన్ని త్వరలో కేటాయిస్తామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఇవాళ బల్దియా ప్రధాన కార్యాలయంలో RTC అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మేయర పాల్గొన్నారు. సమర్థవంతమైన నిర్వహణకు అవసరమైన సూచనలు మేయర్ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి తగిన స్థలాన్ని గుర్తిస్తామన్నారు.
HYD: మీసం తిప్పే వయసులో యువత మత్తుకు చిత్తవుతున్నారు. అనేక డ్రగ్స్ కేసుల్లో రవాణా దారులుగా ఉన్నారు. HYDలో గత ఆరేళ్లలో సుమారు 1000 మందికి పైగా యువత పలు కేసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.12 నుంచి 16 ఏళ్ల వయసులో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. చెడు ప్రభావిత వీడియోలు బుర్రలోకి చేరడంతో తప్పటడుగులు వేస్తున్నారు వారి సంఖ్య సైతం పెరుగుతుంది.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ 23వ వార్డు పరిధిలోని శివాజీ నగర్లో విద్యుత్ శాఖ అధికారులు కాలనీ బాట గురువారం నిర్వహించారు. సినిమా రోడ్డులోని ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.