• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇందిరమ్మ గృహప్రవేశాలు

MDK: శివంపేట మండలం గోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలను చేపట్టారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలలో పాల్గొన్నారు. అనంతరం ఇందిర మహిళా శక్తి చీరలను మహిళలకు అందజేశారు. నాయకులు మాధవరెడ్డి, వెంకట్రాంరెడ్డి, నవీన్ గుప్తా, లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.

November 24, 2025 / 09:05 PM IST

‘మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి’

WNP: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోట మండలం పాలెం గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. మహిళల కోసం ప్రభుత్వం సమైక్య ద్వారా రుణాలు ఇవ్వడం ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ నేతలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

November 24, 2025 / 08:57 PM IST

‘జిల్లాకు అత్యధికంగా వడ్డీ లేని రుణాల కేటాయింపు’

NLG: రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 26.34 కోట్ల వడ్డీ లేని రుణాలను జిల్లాకు కేటాయింపు జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మహిళా సంఘాలకు మూడోసారి పెద్ద ఎత్తున నియోజకవర్గాల వారీగా వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. HYD నుండి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు.

November 24, 2025 / 08:56 PM IST

గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ

MBNR: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

November 24, 2025 / 08:56 PM IST

అనుమానాస్పదంగా యువకుడి మృతి

HYD: బాచుపల్లి-మియాపూర్ రోడ్డులో మమత మెడికల్ సర్వీసెస్ అకాడమీ ఆసుపత్రి ఎదుట గుర్తు తెలియని యువకుడు ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ విషయాన్ని గమనించి డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలక్ట్రికల్ పోల్‌కు అమర్చిన వైర్ సహాయంతో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 24, 2025 / 08:51 PM IST

కురుమూర్తి జాతర హుండీ ఆదాయ వివరాలు

MBNR: అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం 3వ హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు సమర్పించిన కానుకలు మొత్తం రూ.30,58,980 ఆదాయం వచ్చినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ లెక్కింపులో పాలకమండలి సభ్యులు, సేవకులు, అర్చకులు పాల్గొన్నారు.

November 24, 2025 / 08:50 PM IST

50 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

ఖమ్మం వన్ టౌన్ ఎస్సై మౌలానా తన సిబ్బందితో ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, సోమవారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఒరిస్సాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి పూణేలో అమ్ముతున్నట్లు వారు అంగీకరించారు. వారి నుంచి 50.137 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

November 24, 2025 / 08:48 PM IST

‘ప్రభుత్వ విధులను జవాబుదారీతనంతో పకడ్బందీగా నిర్వర్తించాలి’

KMM: ప్రభుత్వ విధులను అధికారులు జవాబుదారీతనంతో పకడ్బందీగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజావాణికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

November 24, 2025 / 08:47 PM IST

నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష: ASF SP

ASF: జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలు సాగు చేసిన కేసులో నిందితుడు పాండురంగ‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధిస్తూ ASF సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. నిందితుడికి శిక్ష ఖరారయ్యేలా కృషి చేసిన పోలీసులను ఆమె అభినందించారు.

November 24, 2025 / 08:46 PM IST

‘అవగాహన సదస్సు సద్వినియోగం చేసుకోవాలి’

SRCL: ఈనెల 24 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు సిరిసిల్లలో భవన, ఇతర రంగాల నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు సిరిసిల్ల కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పెద్ద ఎత్తున ఈ సదస్సుకు కార్మికులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

November 24, 2025 / 08:46 PM IST

రిజర్వేషన్ల ప్రక్రియ పునఃపరిశీలన

ADB: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదిక, బీసీ డిక్లరేషన్ కమిషన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని పునఃపరిశీలించినట్టు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వారి జనాభాకన్నా తక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదని స్పష్టం చేశారు.

November 24, 2025 / 08:45 PM IST

ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యము: MLA

MHBD: మరిపెడ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఇవాళ ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, MLA రామచంద్రనాయక్ పాల్గొన్నారు. రైతుబంధు, రైతు బీమా, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాల ద్వారా ప్రజాధనాన్ని ప్రజల శ్రేయస్సుకే వినియోగిస్తున్నామని, దుర్వినియోగం చేయమని ఆయన పేర్కొన్నారు.

November 24, 2025 / 08:38 PM IST

వరి పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు

VKB: బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటలో సోమవారం ప్రో. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు వరి పొలాలను సందర్శించారు. చీడ పీడల నిర్వహణ గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డా. కిరణ్ బాబు, డా. అరుణశ్రీ, రైతు విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

November 24, 2025 / 08:37 PM IST

దేవరకొండ డీఎస్పీగా ఎం.వి శ్రీనివాస్

NLG: దేవరకొండ డీఎస్పీగా ఎం.వి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మల్కాజ్గిరి ఏసీపీగా విధులు నిర్వహిస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. పౌరులు శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

November 24, 2025 / 08:36 PM IST

పని దినాలలో మరమ్మతులు ఎందుకు..?

VKB: ప్రభుత్వ పని దినాలలో విద్యుత్ సరఫరా మరమ్మతులను నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు విద్యుత్ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. కుల్కచర్ల మండలంలో విద్యుత్ మరమ్మతులు నిమిత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

November 24, 2025 / 08:36 PM IST