• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఎం ఆశీస్సులు తీసుకున్న నవీన్ యాదవ్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా CM రేవంత్ రెడ్డిని కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు అందించారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ ప్రగతి సంబంధిత అంశాలపై చర్చ జరిగింది.

November 17, 2025 / 08:58 PM IST

యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీపీ

NZB: యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆయన పాల్గొన్నారు. ఎడపల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ శిక్షణ మైదానంలో 26 టీంలను ఏర్పాటు చేసి క్రికెట్​ టోర్నీని బోధన్​ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

November 17, 2025 / 08:55 PM IST

కేసుల ఇన్వెస్టిగేషన్ పరిశీలించిన డీఎస్పీ

MDK: తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసుల ఇన్వెస్టిగేషన్‌ను డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. పెండింగ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్, రికార్డులను పరిశీలించారు. ఇన్వెస్టిగేషన్, రికార్డుల క్రమబద్ధీకరణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగకృష్ణ, ఎస్సై శివానందం పాల్గొన్నారు.

November 17, 2025 / 08:52 PM IST

డయల్​ 100 దుర్వినియోగం.. ఒకరికి 7 రోజుల జైలు శిక్ష

NZB: ప్రజల సౌకర్యార్థం అత్యవసర సమయంలో ఫోన్​ చేయడానికి పోలీస్​ శాఖ డయల్​ 100ను ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా ఫోన్​ చేసి సమయం వృథా చేస్తున్నారు. డయల్ 100ను దుర్వినియోగం చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం ఏడు రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి సోమవారం తెలిపారు.

November 17, 2025 / 08:49 PM IST

‘ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి’

SRPT: ‘ప్రజావాణి’ ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరై పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.

November 17, 2025 / 08:47 PM IST

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపాలి: ఎంపీ

KMM: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు & MLC తాత మధు సోమవారం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ అనుక్షణం ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన సమస్యల పట్ల పోరాడాలని ఎంపీ పిలుపునిచ్చారు.

November 17, 2025 / 08:45 PM IST

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో MLA ప్రత్యేక పూజలు

KMR: బాన్సువాడ పట్టణం కోటగల్లిలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ సంస్థ ఛైర్మన్ కాసుల బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

November 17, 2025 / 08:41 PM IST

షాపుల ముందు వాహనాలు నిలపొద్దు: ఎస్సై

WNP: వనపర్తి పట్టణంలో రోడ్లపై పార్కింగ్ నివారణపై ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర షాపుల యజమానులకు అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. షాపుల ముందు వాహనాలు నిలపడం వల్ల రోడ్లు బ్లాక్ అవుతున్నాయని, అత్యవసర సేవలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రోడ్డు కోసం నియమాలు అవసరమని, అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు.

November 17, 2025 / 08:37 PM IST

వాజేడులో వలకు చిక్కిన వింత చేప

MLG: వాజేడు మండల కేంద్రంలో మత్స్యకారుడు జవ్వ రవి సోమవారం చేపల వేటకు వెళ్లగా వలలో వింత చేప చిక్కింది. తాను ఎప్పుడూ చూడని ఆకారంలో ఉన్న ఈ చేప తొలిసారిగా వలలో పడిందని రవి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ చేపను చూసేందుకు పరుగులు పెట్టారు. వింత రూపం కలిగిన ఈ చేప ఏ జాతికి చెందినదో తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగింది.

November 17, 2025 / 08:36 PM IST

అమ్మాయిల పై వేధింపుల్లో HYD ఫస్ట్..!

HYD: నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో ఆన్ లైన్‌లో చిన్నారులు, మహిళల పై జరుగుతున్న వేధింపుల్లో HYD నెంబర్ వన్‌గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్ లైన్ వేదికల ద్వారా అసభ్య సందేశాలు పంపడం, మార్ఫింగ్ ఫోటోలు పంపించడం, సమ్మతి లేకుండా మెసెజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటివి జరుగుతున్నాయని పేర్కొంది.

November 17, 2025 / 08:35 PM IST

కానిస్టేబుల్ రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

SRPT: నాగారంలోని జనగామ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ కమలాకర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన స్థలాన్ని సోమవారం ఎస్పీ నరసింహ పరిశీలించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తనిఖీలు నిర్వహించే చోట బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

November 17, 2025 / 08:35 PM IST

రాజశేఖర్ హత్యలో ఏడుగురు రిమాండ్

RR: ఫరూఖ్‌నగర్ మండలం ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్య ఉదాంతంలో షాద్‌నగర్ పోలీసులు పురోగతి సాధించారు. రాజశేఖర్‌ను హతమార్చి దహనం చేసిన ఘటనలో 8 మంది హంతకులను పోలీసులు గుర్తించారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు బైకులు, రూ.6,5000 నగదు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.

November 17, 2025 / 08:34 PM IST

ఇండియా బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించిన కలెక్టర్

BHPL: జిల్లా కేంద్రంలోని మంజూరునగర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఇండియా బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియా బ్యాంక్ జిల్లాలో ఈ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించనుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు ఉన్నారు.

November 17, 2025 / 08:33 PM IST

నైపుణ్య శిక్షణ కేంద్రాలను సందర్శించిన డీఐఈవో

WNP: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే వారికి ఆన్ జాబ్ ట్రైనింగ్ ముఖ్యమని వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య అన్నారు. జిల్లా వ్యాప్తంగా చదువుతున్న ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులు పట్టణంలోని పలు కేంద్రాలలో నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. ఈ కేంద్రాలను సోమవారం సందర్శించి, విద్యార్థుల హాజరు నైపుణ్యాలను పరిశీలించారు.

November 17, 2025 / 08:33 PM IST

నార్కోటిక్ స్నిఫర్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో అన్ని కిరాణా షాపులలో స్థానిక ఎస్సై రాజకుమార్, నరేష్‌లు సోమవ్ నార్కోటిక్ స్నిపర్ డాగ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండలంలో ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు, చిన్నపిల్లలకు గుట్కా సిగరెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

November 17, 2025 / 08:31 PM IST