MBNR: జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ల నుంచి జిల్లా ఇన్స్పెక్షన్ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ. ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
MBNR: మహమ్మదాబాద్ మండలం చౌదర్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బాల భీమాంజనేయుడి జాతర బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవం డిసెంబర్ 5న ఉదయం 4 గంటలకు కనులపండువగా జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నారక్కపేట గ్రామంలో ఓటర్ లిస్టులో అధికారలు తప్పిదాలు చేశారంటూ గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఒకే వ్యక్తికి లిస్ట్లో వ్వేర్వేరు పేరులతో మూడు చోట్ల ఓటు నమోదు చేశారని తెలిపారు. ఏ పేరుతో నామినేషన్ సమర్పించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు స్పందించి తప్పిదాలను సరిచేయాలని కోరారు.
NLG: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు ప్రజాసేవ చేద్దామని నామినేషన్లు వేస్తుంటే, మరికొందరేమో ఇదే అదునుగా దందా చేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కొందరు కావాలని నామినేషన్లు వేసి, ప్రధాన పోటీ దారులతో మాట్లాడుకుంటున్నారని, కొంత డబ్బు తీసుకొని విత్ డ్రా చేసుకుంటున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది.
NLG: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొందరు ప్రజాసేవ చేద్దామని నామినేషన్లు వేస్తుంటే, మరికొందరేమో ఇదే అదునుగా దందా చేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కొందరు కావాలని నామినేషన్లు వేసి, ప్రధాన పోటీ దారులతో మాట్లాడుకుంటున్నారని, కొంత డబ్బు తీసుకొని విత్ డ్రా చేసుకుంటున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది.
MBNR: హన్వాడ మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 90 సర్పంచ్, 177 వార్డులకు నామినేషన్లు స్వీకరించినట్లు సహాయ ఎన్నికల అధికారిణి యశోద తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పరిశీలన పూర్తయ్యాక, చెల్లుబాటైన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 6న ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.
NLG: అసెంబ్లీ రౌడీ సినిమాలో జరిగిన ఘటనను తలదన్నే విధంగా తిప్పర్తి మండలంలో సీన్ జరిగిందని, ఈ ఘటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఉందని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు యాదగిరిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
SRD: విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే ప్రజా బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు విద్యుత్ అధికారి చక్రపాణి స్పష్టం చేశారు. మంగళవారం బొల్లారం పరిధిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పలు వీధుల్లో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో మాట్లాడని ఆయన పలు సూచనలు చేశారు.
WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకగ్రీవం కోసం ఒత్తిడి, ఒప్పందాలు జోరు మొదలైంది. పలువురు అభ్యర్థులు, పార్టీ నాయకులు గ్రామాభివృద్ధి పేరుతో చర్చలు జరుపుతూ ఒకరిని ఏకగ్రీవం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరికొందరు నగదు డిపాజిట్ చేస్తేనే విత్డ్రా చేస్తామని నిర్ణయాత్మకంగా చెబుతున్నట్లు సమాచారం.
MDK: భార్య మంజుల (34)ను హత్య చేసి భర్త శ్రీశైలం (37) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంజుల, శ్రీశైలం దంపతులకు ఓ కుమారుడు ఉండగా, అమ్మమ్మ గారింటి వద్ద ఉండి చదువుకుంటున్నాడు. రాత్రి సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ ఇవాళ ఉదయం ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MDCL: కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ అజిత్ కుమార్ (23) మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: గూడూరు మండలం మచ్చర్ల గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గ్రామస్థులు షరతులు పెట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుగా అగ్రిమెంట్ రాసి ఇస్తేనే ఓట్లు వేస్తామని బ్యానర్ ప్రదర్శించారు.సైడ్ డ్రైనేజీ,కోతుల బెడద, సీసీ రోడ్లు,స్ట్రీట్ లైట్లు వంటి సమస్యలను పరిష్కరిస్తానని అభ్యర్థి బాండ్ రాసి ఇవ్వాలని, లేదంటే ఓట్లు వేయమని గ్రామస్తులు తేల్చిచెప్పారు.
MHBD: నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట జీపీ సర్పంచ్ స్థానం కోసం బియ్యాల పావని, ఆమె కోడలు బియ్యాల నలిని దేవి నామినేషన్లు దాఖలు చేశారు. పావనికి బీఆర్ఎస్, నలినిదేవికి కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో గ్రామంలో అత్తా కోడళ్ల మధ్య ఎవరు గెలుస్తారానే ఆసక్తికర చర్చ జరుగుతుంది.
BDK: టేకులపల్లి మండలం దాస్ తండ గ్రామపంచాయతీ లచ్యా తండా నుంచి మంగళవారం యువకులు బీజేపీలో చేరారు. ప్రధాని మోడీ నాయకత్వం చూసి బీజేపీ పార్టీలో ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పనిచేసిన రుద్రారపు హరీశ్ గత ఏడాది డిసెంబర్ 2న ఆత్మహత్య చేసుకున్న ఘటనకు నేటికి ఏడాది పూర్తయింది. ముళ్లకట్ట సమీపంలోని రిసార్టులో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆయన మృతి చెందారు. ప్రేమ వ్యవహారమే మరణానికి కారణమని, ఆ సమయంలో ఓ యువతి ఆయనతో రిసార్టులో ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ సంచలన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.