WNP: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని బుధవారం తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హాయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజును ఈనెల 5 వరకు చెల్లించాలని అపరాధ రుసుము రూ. 50తో ఈనెల 12 వరకు అలాగే రూ. 75 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చన్నారు.
NZB: భారత రాజ్యాంగ వజ్రోత్సవాలను నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ MLA జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ స్పూర్తితో ముందుకు సాగుదామన్నారు.
ADB: ఉట్నూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల కారణంగానే దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్, రమేశ్, పాల్గొన్నారు.
MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో మొదటి విడతలో 139 గ్రామపంచాయతీలకు, 1188 వార్డు సభ్యుల ఎన్నిక జరగనున్నాయి. రాజాపూర్, మహబూబ్ నగర్, నవాబుపేట, గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. అధికారులు ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.
☞ పోటీ చేసే అభ్యర్థికి కనీస వయసు 21సంవత్సరాలు నిండి ఉండాలి.☞ అభ్యర్థి అదే గ్రామంలో ఓటరై ఉండాలి. ☞ వార్డు మెంబర్ని బలపరిచే వ్యక్తికి స్థానిక వార్డులో ఓటు ఉండాలి.☞ రిజర్వేషన్ అయితే సంబంధిత CASTE CERTIFICATE తప్పనిసరిసరి.☞ NOTE: 2K25 ఆర్డినెన్స్ ద్వారా ముగ్గరు పిల్లల నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది.
MBNR: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈరోజు రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలపై ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉంచిందని, పోలీసు శాఖ ప్రజల హక్కులను కాపాడుతూ బాధ్యత ఉందని తెలిపారు.
NZB: ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం నగరంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల వేల రాజ్యాంగ నిర్మాతను స్మరించుకున్నామన్నారు.
KMM: ఏన్కూర్ మండలం రేపల్లెవాడ గ్రామంలో పాముకాటుకు గురై కాళింగు రాములు మృతి చెందారు. కాగా మంగళవారం వారి పార్థివదేహానికి వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ధర్మా నాయక్, షేక్ బాజీ, షేక్ చాంద్ పాషా, సుధాకర్ ఉన్నారు.
NLG: యువకులు స్వశక్తితో ఎదిగేందుకు ఉపాధి మార్గాలను ఎన్నుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్లోని మూసి రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అంజనేయం గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నాణ్యమైన సేవలందించి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత తదితరులు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ – దంతేపల్లి ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, కంకర రాళ్లతో ప్రయాణానికి అత్యంత ఇబ్బందికరంగా తయారైంది. ఈ మార్గంలో నిత్యం జిల్లా ప్రజలు కామారెడ్డి పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే అవస్థ పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. గతంలో నిధులు మంజూరైనా పనులు చేపట్టలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
WGL: కరోనా కాలంలో రెమిడిసివర్ కుంభకోణంలో కీలక నిందితుడైన డెంటల్ డాక్టర్ ప్రస్తుతం WGL కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్గా కొనసాగుతున్నారు. భాస్కర కామినేని కాలేజీ నలుగురు PG విద్యార్థుల రీకౌంటింగ్లో మార్కులు కలిపి పాస్ చేసిన స్కాంలో ఆయన పాత్ర కూడా ఉంది. డిప్యుటేషన్ పై ఇక్కడికి వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
RR: జిల్లా పరిధి కొత్తగూడ చెరువు గార్బేజితో నిండిపోతుందని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల్లో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుందని, మరోవైపు రోడ్ల పై గార్బేజి వదిలేసి వెళుతున్నారని, దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చెరువును క్లీన్ చేయాలని అధికారులను కోరుతున్నారు. గతంలో చెప్పిన పట్టించుకోలేదన్నారు.
RR: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నగరా మోగింది. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు యువత ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయొచ్చని పేర్కొన్నారు. https://tsec.gov.in/nominationRuralSarpanch.do వెబ్సైట్ ద్వారా మీ గ్రామపంచాయతీ, మండలం, తదితర పూర్తి వివరాలు నింపాల్సి ఉంటుందని వివరించారు. SHARE IT
NLG: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జంపింగ్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్కు చెందిన నార్కెట్పల్లి మండలం గోపాలాయపల్లికి మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు ఇవాళ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నకిరేకల్లోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే వేముల వీరేశం వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
NZB: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల కోడ్ నిన్న సాయంత్రం నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈరోజు నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దరఖాస్తులు స్వీకరించమని NZB రూరల్ MLA క్యాంప్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కళ్యాణ లక్ష్మీ దరఖాస్తులు కూడా చూడబడవన్నారు. ఈ విషయాన్ని రూరల్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు గమనించాలని సూచించారు.