ADB: మాత శిశు మరణాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వైద్యుల సూచనల మేరకు బీపీ, షుగర్, రక్త, AMC స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలను సమయానుసారంగా నిర్వహించాలన్నారు. గర్భిణి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు.
WGL: రాయపర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన గారే సయేంద్ర బిక్షపతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వారి అనుచరులతో కలసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వారిని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ADB: ఉద్యోగం పేరుతో మోసం చేసిన ప్రశాంత్ జవాడే, రాజేష్ పై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ SI నాగరాజు శుక్రవారం తెలియజేశారు. మహారాష్ట్ర సింగరేణి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాధితుని వద్ద నుండి రూ.2 లక్షలు వసూలు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసే మాటల నమ్మవద్దని, నిర్భయంగా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు.
భూపాలపల్లి మండలం నగరం గ్రామానికి చెందిన పాయిలి తిరుపతి కుమారుడు అనారోగ్యంతో సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ ఆసుపత్రికి చేరుకొని బాలుడిని పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, హాస్పిటల్ యాజమాన్యానికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
JN: బంగారం ఇస్తానని ప్రజలను మోసం చేసిన భార్యాభర్తలు అరెస్ట్ అయిన ఘటన పాలకుర్తిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన సింగపురం గౌరమ్మ, ఆమె భర్త సింగపురం వెంకటయ్యలు బంగారం దొరికిందని డబ్బులు ఇస్తే అందులో కొంత వాట ఇస్తాను అని నమ్మబలికి మోసం చేశారు. దర్యాప్తు చేసి నేడు వారిని పోలీసులు రిమాండ్కు చేశారు.
HYD: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘GOAT TOUR TO INDIA 2025’లో భాగంగా DEC 13న HYDకి రానున్నారు. ఈ సందర్భంగా, మెస్సీకి స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. మెస్సీ వంటి లెజెండ్ను మన గడ్డపై చూడటం ప్రతి ఫుట్బాల్ అభిమాని కల అని ఆయన ‘X’లో ట్వీట్ చేశారు.
MHBD: సీరోలు మండల కేంద్రంలో శుక్రవారం BRS నాయకులు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ MLA డీ.ఎస్. రెడ్డ్యానాయక్ హాజరై, మాట్లాడుతూ.. రాబోయే పంచాయితీ ఎన్నికల్లో BRS అభ్యర్థుల కోసం కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BRS నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి పరిశీలకులు శ్రీనివాసులు సందర్శించారు. పాఠశాలలో తరగతి గదులను, ఉపాధ్యాయుల బోధన తీరును, విద్యార్థుల పఠన సామర్థ్యం, కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, విద్యార్థుల జవాబు పత్రాలను పరిశీలన చేశారు. ఎంఈవో డాక్టర్ సత్యనారాయణతో కలిసి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.
RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేవనాథ జీయర్ స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని, సనాతన హిందూ ధర్మాలను పాటించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
BHPL: భూపాలపల్లిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ‘దీక్ష దివాస్’ వాల్ పోస్టర్ను ఇవాళ ఆవిష్కరించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష దినమైన నవంబర్ 29ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు. బీఆర్ఎస్వి నాయకుడు కొల్లోజు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. KCR దీక్ష ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు.
JN: జఫర్ గడ్ మండలం రఘునాధ పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య శుక్రవారం నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గత 32 సంవత్సరాల నుంచి పార్టీలో పని చేస్తున్నాను అని, ప్రజలు ఆదరించి సర్పంచ్గా గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తాను అని అన్నారు.
JN: స్టేషన్ ఘన్పుర్ మండలం ఇప్పగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మందపురం అనిత -సతీష్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ పార్టీ తరుపున ఆ పార్టీ శ్రేణుల సమక్షంలో ఆమె ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇటీవల జరిగిన సమావేశంలో బీజేపీ కార్యకర్తలు ఆమెను ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు.
WGL: నర్సంపేట నియోజకవర్గంలో డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించానున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరుకు నర్సంపేటలోని సభ స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణంలో స్థలాన్ని MLA దొంతి మాధవరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో RDO,ACP తదితరులు పాల్గొన్నారు.
MHBD: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగూడ గ్రామ పంచాయతీకి బీజేపీ అభ్యర్థిగా గాంధీనగర్ గ్రామానికి చెందిన గుగులోత్ వినోద్ స్వామి నాయక్ను ఎంపిక చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి మురళి ఈ విషయాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆదేశాల మేరకు స్థానిక నాయకుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు BJP నేతలు పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం పునఃప్రారంభించినట్లు ఛైర్మన్ పంజాల ఆంజనేయులు గౌడ్ తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అందజేయడం జరుగుతుందని వివరించారు. రైతులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు.