• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఏపూరు లో ‘బేటి బచావో బేటి పడావో’ కార్యక్రమం

NLG: చిట్యాల మండలం ఏపూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికల విద్య, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్, గంజాయి మత్తుపదార్థాల వల్ల అనర్ధాలు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 100 గురించి అవగాహన కల్పించారు. సీడీపీవో లావణ్య, హెచ్ఎం మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

November 25, 2025 / 04:53 PM IST

వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేత

JN: మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎంపీ కడియం కావ్య, MLA కడియం శ్రీహరిలు అన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఇవాళ మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాలపై వడ్డీ రాయితీ చెక్కుల పంపిణి కార్యక్రమం జరిగింది. ఎంపీ, MLA, కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు.

November 25, 2025 / 04:47 PM IST

కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: రాజయ్య

JN: స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మాజీ MLA తాటికొండ రాజయ్య మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో BRS మద్దతుతో గెలిచి పార్టీ మారి, ఇంకా రాజీనామా చేయడం లేదని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

November 25, 2025 / 04:44 PM IST

మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

SRD: పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో యువకుడు ప్రభుత్వ స్కూల్ ఆవరణలో ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన గడ్డమీద ఉమామహేశ్వర్ (23) సోమవారం ఇంటి వద్ద కుటుంబీకుల మధ్య గొడవ తలెత్తడంతో మనస్థాపం చెంది, స్థానిక పాఠశాలలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 25, 2025 / 04:26 PM IST

వరంగల్ మార్కెట్‌లో పడిపోతున్న మొక్కజొన్న ధర

WGL: పట్టణంలోని ఎనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత దారుణంగా పతనమవుతున్నదని రైతులు వాపోతున్నారు. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర సోమవారం రూ.1,970కి పడిపోయింది. ఇవాళ మరింత తగ్గి రూ.1900కి పతనమైంది రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సూక పల్లికాయకు రూ.6వేలు, 5531 రకం మిర్చికి రూ.16,500 ధర ఉందని వారు తెలిపారు.

November 25, 2025 / 04:24 PM IST

మహిళా సంఘాల కు వడ్డీ లేని రుణాలు పంపిణీ

SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీరహిత రుణాల పంపిణీ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలపర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. నియోజకవర్గంలోని 2713 సంఘాలకు రూ.2.10 కోట్లు రుణాలు మంజూరు చేసినట్టు ఆర్డీవో సూర్యనారాయణ తెలిపారు.

November 25, 2025 / 04:23 PM IST

నిధులు కేటాయించిన ప్రభుత్వం

HYD: నగరంలోని కార్పొరేటర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక్కో డివిజన్‌కు రూ. 2 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లకు రూ. 300 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మేయర్ విజయలక్ష్మి తెలిపారు.

November 25, 2025 / 04:16 PM IST

ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన

WGL: వర్ధన్నపేట (M)లోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఇవాళ MLA నాగరాజు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ…పేద ప్రజలకు సమీప ప్రాంతాల్లోనే మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ. 28 కోట్ల వ్యయంతో ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.

November 25, 2025 / 04:13 PM IST

మూసీలోకి 19 లక్షల చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే వీరేశం

NLG: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసి ప్రాజెక్టులో మంగళవారం 19 లక్షల ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. గెస్ట్ హౌస్‌కు మరమ్మతులు చేపడతామన్నారు.

November 25, 2025 / 04:12 PM IST

సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి: ఎమ్మెల్యే

GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని ఫంక్షన్ హాల్లో మంగళవారం ముస్లిం మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరిన ఆయన, కుట్టు మిషన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

November 25, 2025 / 04:09 PM IST

ఎదురెదురుగా బస్సులు.. పొంచి ఉన్న ప్రమాదం

NLG: చిట్యాల బస్ స్టాండ్‌లోకి HYD నుండి వచ్చే బస్సులు ఒకే దారి నుండి తిరిగి NLG, SRPT వైపు వెళుతుండడంతో ఎదురెదురుగా బస్సులు ఢీకొనే ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. HYD నుంచి వచ్చిన బస్సులు బస్టాండ్‌లోకి వచ్చి తిరిగి భువనగిరి రోడ్డు నుంచి SRPT, NLG వైపు వెళ్లాలనే సూచనను అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

November 25, 2025 / 04:02 PM IST

‘ఐదు నిమిషాలల్లో లోన్ అనగానే ఆశపడొద్దు’

WGL: కేవలం 5 నిమిషాల్లో లోన్ వస్తుందనే మాటలు నమ్మి, అపరిచితులకు మీ వివరాలు ఇవ్వద్దని WGL పోలీస్ కమిషనరేట్ పోలీసులు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ RBI అనుమతి లేని యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దని, వాటి నుంచి లోన్ తీసుకోవోద్దని హెచ్చరించారు. ఎవరికి ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించొద్దని సూచనలు చేశారు.

November 25, 2025 / 03:59 PM IST

‘ ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలి’

KNR: రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రంలో సీపీ గౌష్ ఆలం తదితరులు పాల్గొన్నారు.

November 25, 2025 / 03:48 PM IST

హెడ్ కానిస్టేబుల్‌ను సత్కరించిన సీఐ

KMM: మధిర సర్కిల్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వంగాల నాగేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. ఈ సందర్భంగా మంగళవారం మధిర రూరల్ సీఐ మధు ఆయన్ని అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడంతో మధిర విధుల నుంచి ఆయన రిలీవయ్యారు. కొత్త విధులకు త్వరలో రిపోర్టు చేయనున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు.

November 25, 2025 / 03:43 PM IST

ఆర్టీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్

NLG: చందంపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన TGSRTC వారి భారత్ పెట్రోలియం బంక్‌ను ప్రారంభించినట్లు దేవరకొండ ఆర్టీసీ డిపో ఇంఛార్జ్ డిపో మేనేజర్ పడాల సైదులు మంగళవారం తెలిపారు. మండలంలోని పరిసర గ్రామ వాహనదారులు, వ్యవసాయదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలతో పెట్రోల్, డీజిల్ అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

November 25, 2025 / 03:42 PM IST