వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఎస్సై బదిలీలు చేస్తూ సిపి సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.నర్సంపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎల్. రఘుపతిని సీసీఆర్బీకి బదిలీ, సీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ను నర్సంపేటకు, వీఆర్లో ఉన్న ఎస్సై వెంకన్నను సుబేదారికి బదిలీ చేశారు.
BHPL: ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్య జరగనున్న మినీ మేడారం జాతరకు కమిటీని నియమించారు. జాతర కమిటీ అధ్యక్షుడిగా ఆలూరి గంగాధర్ రావు, ప్రధాన కార్యదర్శిగా చదువు అన్నారెడ్డిని ఎన్నుకున్నారు. మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్, ముల్కలపల్లి సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేశ్ నేతృత్వంలో కమిటీ ఎన్నుకున్నట్లు కమిటీ అధ్యక్షుడు గంగాధర్ రావు తెలిపారు.
MHBD: ఇనుగుర్తి మండలం లాలుతండా వద్ద శుక్రవారం బైక్ చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. అన్నారం దర్గా దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సంగెం శివ (22) అక్కడికక్కడే మృతి చెందగా, అజయ్, మహేశ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు.
HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్పై బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా అనేది తప్పనిసరిగా చూడాలి. కొనుగోలు చేసినప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల నాణ్యతపై అనుమానం వస్తే DCA వెబ్సైట్లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదుల కోసం 18005996969 కాల్ చేయండి.
KNR: వీణవంక మండలం ఇప్పలపల్లి మానేరు వాగులో ధ్వంసమైన వ్యవసాయ బావులు, మోటార్లను శుక్రవారం టీఎస్ ఎంబీసీ మైనింగ్ ఏడీ రాఘవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల చెరువులు, వాగులను ఆక్రమిస్తూ వ్యవసాయ బావులను పూడ్చిపెట్టిన ఆరోపణల నేపథ్యంలో ఆయన విచారణ చేపట్టారు. పలువురుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని మల్కుగూడ ఆదివాసీలు శుక్రవారం శ్రీ నాగోబా, శివుడి దేవతలకు భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న వారి సంప్రదాయబద్దంగా నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కనక గోపాల్ రావు, పొల్లు, ఆర్కా తిరుపతి, మాన్కు, తుకారాం, జాకు, జగదీరావు, భీంరావు, భగవతరావు, లచ్చు తదితరులు పాల్గొన్నారు.
HYDలో డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి తెలిపారు. డిగ్రీ చదువుతున్న 690 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యాలు పెంపొందించి, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
MDCL: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ వ్యాప్తంగా అధికారిక గణాంకాల ప్రకారం జనాభా సుమారు 25,900 మార్క్ దాటింది. ఈ గణాంకాలు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు, కాలనీల మొత్తం జనసంఖ్యను ప్రతిబింబిస్తున్నాయి. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజాసేవల ప్రణాళికలకు ఈ జనాభా సమాచారం కీలకంగా ఉపయోగపడనుంది.
NZB: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో మన నిజామాబాద్ జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. 6.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్ తొలి స్థానంలో నిలవగా 5.23 లక్షల MTల ధాన్యం సేకరణతో నల్గొండ సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. కాగా ఇక్కడ అమ్మకాలు చేసిన రైతులకు 7రోజుల్లోనే డబ్బును ఖాతాల్లో జమ చేస్తున్నారు.
NZB: ఆలూర్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా యల్లా సాయిరెడ్డిని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచి మండల సర్పంచుల ఫోరం బాధ్యతలను అప్పగించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, పేదప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కొర్ర కిషన్, విజయ్, గంగాధర్, మచర్ల చిన్నయ్య ఉన్నారు.
NLG: 102 అమ్మ ఒడి వాహన సేవలను గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కనగల్ పీహెచ్సీ డాక్టర్ రామకృష్ణ కోరారు. శుక్రవారం 102 సేవలపై పీహెచ్సీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలను బాలింతలను ఆసుపత్రికి తీసుకురావడం తిరిగి వారిని ఇంటికి చేర్చటంలో 102 సిబ్బంది సహకరిస్తారని వివరించారు.
NZB: క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక వికాసానికి ఉపయోగపడతాయని.. యువకులంతా సెల్ఫోన్ వదిలి క్రీడల వైపు రావాలని అంకాపూర్ సర్పంచ్ దేవేందర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో రెండు రోజులుగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
PDPL: ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు అన్నారు. రామగిరి మండలంలో జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ రావు పాల్గొని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి అన్నారు.
RR: మహారాష్ట్ర మున్సిపల్, బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సరికొత్త రికార్డు సాధించిన సందర్భంగా హయత్ నగర్ డివిజన్లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, పారదర్శక పాలన, అవినీతి లేని పరిపాలనతో బీజేపీ ప్రజల మనసులు గెలుచుకుంటోందన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయాలు సాధిస్తుందన్నారు.
ADB: యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం రాత్రి ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో బ్యాట్మెంటన్ పోటీలను ఎమ్మెల్యే స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం కలుగుతుందని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, సర్పంచ్ జలై జాకు, నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.