KMR:సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్వంచకు చెందిన చిన్న సిద్ధయ్య (57) నిన్న రాత్రి సైకిల్పై వెళ్తుండగా KMR వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సిద్ధయ్యకు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై అనిల్ తెలిపారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న బాలికను అమెరికాకు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ నేడు జిల్లా కలెక్టర్ ప్రావిణ్య చేతుల మీదుగా సాగింది. అమెరికాకు చెందిన దంపతులు బాలికను అంతర్ రాష్ట్ర దత్తత కోసం దరఖాస్తు చేయగా పరిశీలించి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి జయంతి పాల్గొన్నారు.
BHPL: కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకముగా నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల్లో 9వ రోజు శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సరస్వతీ ఘాట్ వద్ద నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని గమనించిన పోలీసులు ప్లాస్టిక్ కుర్చీ సహాయంతో మోస్తూ నది తీరం నుంచి పుష్కర ఘాట్ మెట్లు ఎక్కించి మానవత్వాన్ని చాటుకున్నారు.
NZB: గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈనెల 25న జరిగే రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 330 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
KNR: ఫర్టిలైజర్ వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డు మార్గంలో పలు ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి విత్తనాల నిల్వ, అమ్మకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు
HYD: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ధ్యేయమని మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేర్కొన్నారు. శుక్రవారం అజంపుర డివిజన్ డివిజన్ చంచల్ గూడ, ఖాల్లా తదితర ప్రాంతాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే బలాల పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
WNP: జిల్లా కేంద్రంలోని SDMలా కాలేజీ విద్యార్థులను శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సన్మానించారు. ఇటీవల విడుదలైన మొదటి సంవత్సరం, మూడవ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన 22 మంది విద్యార్థులను శుక్రవారం ఎమ్మెల్యే కలెక్టర్ కార్యాలయంలో వారిని శాలువాలు, మెడల్లతో సన్మానించి అభినందించారు.
SRD: నారాయణఖేడ్ RTC డిపో పరిధి బస్ స్టేషన్లో ఖాళీగా ఉన్న షాపులను అద్దెకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు DM మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖేడ్లో 9, కంగ్టిలో 2, పెద్ద శంకరంపేటలో 5 షాపుల్లో పక్కా వ్యాపారం కొనసాగించేందుకు మే 29 లోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మే 30న సంగారెడ్డి ఆర్ఎం ఆఫీస్లో టెండర్ జరుగుతుందని చెప్పారు.
HYD: భాగ్యనగరంలో అందాల పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు టాప్- 24 ఎంపిక చేశారు. శుక్రవారం వీరిలోంచి 8 మందిని ఎంపిక చేస్తారు. ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. వీరిలో నలుగురు ఈ నెల 31న జరిగే ఫైనల్స్లో పాల్గొంటారు. వీరిలో ఒకరిని విజేతగా, మిగిలిన ముగ్గురిని రన్నరప్లు గా ప్రకటిస్తారు. యూరప్, ఆసియా, ఓసియానా, ఆఫ్రికా ముద్దుగుమ్మలు పోటీలోఉండబోతున్నారు.
PDPL: కలెక్టరేట్ పక్కన ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వలన దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని బృందావన్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనతో కూడిన వ్యర్థాలు పెద్దపల్లి- కరీంనగర్ రహదారిపై చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు.
ADB: జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తనిఖీ చేశారు. దుకాణ యజమానులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు విక్రయించే విత్తనాల ప్యాకెట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
MNCL: జిల్లా హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గత 2రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా ఇన్ ఫ్లో ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 TMC లు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.114 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 586 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
SRPT: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని, తెలంగాణను సాకారం చేసిన ఘనత జర్నలిస్టులకు దక్కిందని. టీయూడబ్ల్యుజే సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వజ్జే వీరయ్య అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల 31న హైదరాబాద్లో జరిగే టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు.
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జాతీయ రహదారి కూడలిలో రైతులు శుక్రవారం ధర్నా చేశారు. తడిసిన ధాన్యంను వెంటనే కోనుగోలు చేయించాలని, లారీలు, హమాలీలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి ధాన్యం కోనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
NRML: నిర్మల్ జిల్లా నుండి పలువురు బాక్సర్లు మే 24- 26 తేదీలలో మంచిర్యాలలో జరుగనున్న రాష్ట్రస్థాయి సబ్- జూనియర్, బాల, బాలికల బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా బాక్సింగ్ సెక్రటరీ, కోచ్ స్వామి శుక్రవారం ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. జిల్లా అధికారులు, బాక్సింగ్ సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.