MDK: శివంపేట మండలంలో రోడ్డుపై గుంతలను యువకులు సోమవారం పూడ్చివేశారు. శివంపేట నుంచి చాకిరిమెట్ల వరకు తూప్రాన్ – నర్సాపూర్ రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. గూడూరు గ్రామానికి చెందిన యువకులు కంకర సిమెంట్ డస్ట్ సేకరించి గుంతలను పూడ్చివేశారు. ప్రజలు ప్రమాదాల బారిన పడుతుండడంతో గుంతలను పూడ్చినట్లు యువకులు తెలిపారు.
NLG: సీఎం సహాయనిధి పథకం పేదలకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పల్లపు బుధుడు అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన పాకాల బచ్చయ్యకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహకారంతో మంజూరైన చెక్కును సోమవారం వారు కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో గ్రామ నేతలు పాల్గొన్నారు.
SRD: కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని CITU రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని శాండ్విచ్ ఎంప్లాయిస్ యూనియన్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు.
HYD: వర్షపు నీరు సాఫీగా చెరువులోకి వెళ్లేలా గుర్రం చెరువుని శుభ్రం చేయాలని చాంద్రాయణగుట్ట కార్పొరేటర్ అబ్దుల్ వహాద్ ఆదేశించారు. సోమవారం అధికారులతో కలిసి కార్పొరేటర్ గుర్రం చెరువును పరిశీలించారు. చెరువులో పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని క్లియర్ చేయాలన్నారు. వర్షాకాలంలో స్థానికుల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మహిళా శక్తి సంబరాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ పరిధి హనుమాన్ వెంచర్లో గంజాయి సేవిస్తూ అమ్మకాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో ఇద్దరూ పారిపోగా, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు వివరించారు.
RR: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డులో నూతనంగా ఏర్పాటైన దేవా ఫుడ్ కోర్ట్ను చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యజమాని మురళీకృష్ణ, డా. సౌజన్య దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, చంద్రమౌళి, రవీందర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
NLG: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ 68 మంది అర్జీ దారులతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు త్వరిత న్యాయం అందేలా కృషి చేయాలి సూచించారు. మధ్యవర్తులు అవసరం లేదనీ బాధితులు ప్రత్యక్షంగా రావాలనీ తెలిపారు.
MDK: రెవెన్యూ కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల భద్రత క్రమ పద్ధతిలో ఉండాలని సూచించారు. అధికారులు ప్రజా సమస్యలపై జవాబుదారితనం అవసరమని పేర్కొన్నారు.
WGL: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్య శారద దేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 78 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం చేయాలని సూచించారు.
WGL: నర్సంపేటలోని మారుమూల గిరిజన తండాకు చెందిన ఉషేన్ నాయక్ తన కృషి పట్టుదలతో కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ శాఖలో Ph.D డాక్టరేట్ పూర్తి చేశారు. ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతులమీదుగా బంగారు పతకంతో పాటు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. గతంలో వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా సేవలు అందించాడు.
MDK: మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు విచ్చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
KMM: పోర్చుగల్లో ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తు సమర్పించాలని జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. 21-40 ఏళ్ళు కలిగిన గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, వీరికి 2-5 సం.రాల అనుభవం ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు, రెజ్యూమ్ లను tomcom.resume@gmail.com కు మెయిల్ చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9440049937 కు సంప్రదించాలన్నారు.
WGL: చెట్టును మనం కాపాడితే మనల్ని చెట్టు కాపాడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వన మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఆకుపచ్చని తెలంగాణ కోసం శక్తి వంచన లేకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమం చేపట్టాలి అని అన్నారు.
MHBD: జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం పట్టాలు ఇవ్వాలని రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, ఈ రిలే నిరాహారదీక్షలో పలువురు చిన్నారులు ‘పట్టాలివ్వండి పొంగులేటి సార్’ అని రాసిన ప్లకార్డులు పట్టుకోవడం అందరిని అకర్షించింది.