NLG: రాజకీయాల్లో మార్పు రావాలని, యువతకు ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్పల్లికి 200 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి భరత్కు అని వర్గాల ప్రజల అండదండ ఉందన్నారు. పనిచేసే వ్యక్తిని గెలిపించాలని ఎమ్మెల్యే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
KMR: గడువు దాటిన తర్వాత ప్రచారం నిషేధం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు సాయంత్రం 5 తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో 2 అంతర్జిల్లా చెక్ పోస్టులు, 2 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేటి సాయంత్రం నుంచి ఎన్నికలు జరిగే 10 మండలాల్లో మద్యం విక్రయాలు చేపట్టవద్దన్నారు.
NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విశ్వాసం పొందేందుకు అభ్యర్థులు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఆరూరి శివకుమార్.. మేనిఫెస్టో హామీలను నిజాయితీగా అమలు చేస్తానని బాండ్ పేపర్పై రాసిచ్చి ఓటర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. యువకులకు మద్దతు ఇవ్వాలని ఆయన గ్రామస్థులను కోరారు.
SDPT: తెలంగాణ సాధనలో కేసీఆర్ ఆమరణ దీక్ష, అమరుల త్యాగాలను స్మరిస్తూ.. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు విజయ్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని బీఆర్ఎస్ శ్రేణులు కొనియాడారు.
NZB: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు బాల్కొండ పోలీసులు మంగళవారం ఆయా గ్రామాల్లో విస్తృతస్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే, బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతం, వ్యాపార కేంద్రాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ ఈ ప్రచారాన్ని నిర్వహించారు.
WNP: వనపర్తి డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో రేపు ఉదయం 9 గంటలకు ఎస్జీఎఫ్ అండర్ 14 ఉమ్మడి జిల్లా బాలుర హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు జరుగుతాయని ఇవాళ SGF జిల్లా కార్యదర్శి బొలెమోని కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లా ఎజీఎఫ్ జిల్లా కార్యదర్శి క్రీడాకారులను సకాలంలో పోటీలకు పంపించి సహకరించాలని కోరారు. క్రీడలకు తగిన ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదనపు కలెక్టర్ మాధురి ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మజ రాణి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, జిల్లా యువజన అధికారి ఖాసీమ్ భేగ్, తదితర అధికారులు పాల్గొన్నారు.
BHPL: తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఇవాళ రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి రేగొండ మండల అధ్యక్షుడు నరసయ్య, టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
KMR: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, డయల్ 100, సోషల్ మీడియాపై కళాబృందం సభ్యులు పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శేషారావు, కానిస్టేబుల్ ప్రభాకర్, సాయిలు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
MLG: వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చక్రపు శ్రీనివాస్ (కత్తెర గుర్తు) గెలిపించాలని కోరుతూ.. కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్యఅతిథిగా TPCC ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
SDPT: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజునే (డిసెంబర్ 14) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే హరీశ్ రావును న్యాయవాదుల బృందం కోరింది. పోలింగ్ రోజు పరీక్ష నిర్వహించడం సరికాదని, వెంటనే వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతిపత్రం ఇచ్చారు.
KMR: నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచి స్థానం జనరల్ వర్గానికి కేటాయించారు. గ్రామస్థులంతా కలిసి కేతవత్ లక్ష్మీభాయ్ను ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నట్లు తీర్మానించారు. ఏకగ్రీవంగా తీర్మానించినందుకు లక్ష్మీభాయ్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. నిస్వార్థంగా సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.
WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాలలో ఓటర్ స్లిప్పుల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ అధికారులు (BLO) ఇంటింటికి తిరిగి స్లిప్లును పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ పర్వతగిరి మండలంలో BLO కరుణాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు స్లిప్పులు అందజేశారు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మంగళవారం ఎన్నికలు పోలింగ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేజ్2 రిటర్నింగ్ అధికారి రవిబాబు, పంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతంరెడ్డితో కలిసి పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు పాటించవలసిన నియమాల గురించి వివరించారు.