ఖమ్మం గాంధీ చౌక్లో కేఎంసీ (KMC) ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం జరిగింది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే పర్యావరణ, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణదారులకు బయోడిగ్రేడబుల్ కవర్లను వాడాలని సూచిస్తూ, ప్రతి షాపుకు ఒక కిలోగ్రాము బయోడిగ్రేడబుల్ కవర్లను ఉచితంగా పంపిణీ చేశారు.
SDPT: సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎన్నికల విధులకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11న జరిగిన ఎన్నికలకు హాజరు కాలేదని వివరించారు.
HYD: ప్యారడైజ్ సింధు కాలనీలో 42 గ్రాముల ఓజీ కుష్ను ఎస్టీఎఫ్ A టీమ్ లీడర్ అంజిరెడ్డి బృందం పట్టుకున్నారు. ఈ కేసులో ఓ కియా కారు, టూ వీలర్, రెండు మొబల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 10 మంది పాత్ర ఉందని వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే కేసుకు అనుసంధానంగా 29.8 గ్రాముల ఓజీ కుష్ను లభ్యమైంది. ఈ కేసులో ఐదుగురిపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.
PDPL: AICC జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, CM రేవంత్ రెడ్డిని మంత్రి వివేక్, పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఆయన సూచించారు. తెలంగాణను దేశంలో ఓ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దాలని ఖర్గే మార్గదర్శకం చేశారు.
GDWL: కెటిదొడ్డి మండలం పరిధిలోని స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచులు శాలువా, పుష్పగుచ్ఛం ఇచ్చి ఎమ్మెల్యేను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో సర్పంచ్గా రాయపురం రమ్య విజయం సాధించగా, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్ , రాజేశ్వరరావు శుక్రవారం ఆమెను స్వయంగా కలిసి అభినందించారు. చదువుకున్న ఎస్టీ మహిళగా అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే రమ్య సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఈ విజయానికి సహకరించిన స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
KMR: ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మహిళలకు అబార్షన్లు చేస్తే సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి విద్య హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం గైనకాలజిస్టులు, పీడియాట్రిస్ట్లు, రేడియాలజిస్టులతో జిల్లాస్థాయి ఎంటీపీ (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎమీమ్ పాల్గొన్నారు.
HNK: జిల్లాలో డిసెంబర్ 14న జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వీటితో పాటు పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, కౌంటర్లు, నీటి, భోజన వసతులు కల్పించనున్నారు.
KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. నేడు పిట్లంలోని CHCలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 62 మందికి కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఏడుగురికి సర్జరీ కొరకు లైన్స్ ఐ హాస్పిటల్ బాన్సువాడకు రిఫర్ చేయడం జరిగిందన్నారు. 15 మందికి అద్దాలు వాడాలని సూచించినట్లు పేర్కొన్నారు.
JGL: ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ఎన్నో ప్రలోబాలకు గురిపెట్టిన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయితీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో నూతంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్లను పట్టణంలోని జీఎస్. గార్డెన్లో శుక్రవారం ఘనంగా సన్మానించారు.
GDWL: గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అలీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎన్సీడీ క్లినిక్, సర్వైకల్ స్క్రీనింగ్, ఎల్డర్లీ కేర్, మెంటల్ హెల్త్, పాలేటివ్ కేర్ వంటి వివిధ విభాగాలను సందర్శించి, ప్రజలకు అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పేషంట్లను, వివిధ రికార్డులను పరిశీలించారు.
ADB: జైనథ్ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం మండలంలోని సమస్యాత్మక ప్రాంతమైన లక్ష్మీపూర్ గ్రామాన్ని సందర్శించి, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరిని బలవంతం చేయరాదని, పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల నియమాలు పాటించాలన్నారు.
WNP: కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మదనాపురం మండలం కొన్నురు, తిరుమలయ్యపల్లి, అజ్జకోలు గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ సర్పంచులను గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు.
RR: ఫరూఖ్నగర్ మండలం ఉప్పరగడ్డ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధించిన చందునాయక్ను పలువురు ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల చందు చూపిస్తున్న కృషి, ప్రజలపై ఆయనకు ఉన్న అనుబంధం ఈ విజయానికి కారణమన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా మరింత సేవ చేయాలని వారు సూచించారు.