• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వైకుంఠ ఏకాదశి దేవాలయంలో ప్రత్యేక పూజలు

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్ తిరుమలనాథ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మహబూబ్నగర్ పట్టణం నుండి తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఏడుకొండలవాడిని ప్రత్యేకంగా ఆలంకరించారు.

December 30, 2025 / 10:12 AM IST

చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

BHNG: రామన్నపేటలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఉత్తర ద్వారమున భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ గరిక సత్యనారాయణ రాధిక స్వామి వారి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

December 30, 2025 / 10:09 AM IST

బోరు ఏర్పాటు చేసిన సర్పంచ్

WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని రంగాపురం గ్రామంలో గత 6 నెలల క్రితం పాడైపోయిన బోరుబావి స్థానంలో మంగళవారం నూతన బోరును ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా బోరు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

December 30, 2025 / 10:04 AM IST

తిరుమలేశుని సన్నిధిలో ఎమ్మెల్యే

MBNR: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఈ తెల్లవారుజామున దర్శించుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.

December 30, 2025 / 10:00 AM IST

కుటుంబ సమేతంగా మంత్రి ఉత్తర ద్వార దర్శనం

SDPT: ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిమాయత్ నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర మంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని ఆయన కోరారు.

December 30, 2025 / 09:46 AM IST

వెంకన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

MBNR: పాలమూరు పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. కాటన్ మిల్లు ఆవరణలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, ప్రసాద వితరణ చేపట్టారు.

December 30, 2025 / 09:42 AM IST

యాదాద్రిని దర్శించుకున్న ఎమ్మెల్యే బీర్ల

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి వేద ఆశీర్వచనం, స్వామి వారి తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందజేశారు.

December 30, 2025 / 09:12 AM IST

స్వర్ణ గిరి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

BHNG: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి దర్శనం వేద ఆశీర్వచనం స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

December 30, 2025 / 09:10 AM IST

మంచిర్యాల చిన్నారికి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు

MNCL: మంచిర్యాలకు చెందిన మద్దెల నిత్య కూచిపూడి నృత్య ప్రదర్శనతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 27న నిర్వహించిన కూచిపూడి కళా వైభవంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించింది. నిత్య గతంలో రవీంద్ర భారతిలో నంది అవార్డు, టీటీడీ పురస్కారం అందుకుంది.

December 30, 2025 / 09:07 AM IST

‘న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు’

ADB: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదన్నారు. డీజేలు పెట్టడం, ఇతరులను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 31న రాత్రి జిల్లాలో ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

December 30, 2025 / 09:06 AM IST

ఉపాధి హామీ చట్టం అమలు చేయాలి: టీవీవీయూ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని టీవీవీయూ డిమాండ్ చేసింది.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, సంక్షేమ పథకాలు, కూలీల రేట్లు, కనీస వేతనం పెంపు, పని దినాల సంఖ్యను పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

December 30, 2025 / 09:00 AM IST

‘మైనర్ బాలికపై లైంగిక దాడులకు పాల్పడిన నేరస్థుడిపై పీడీ యాక్ట్’

KNR: మైనర్ బాలికలపై వరుస లైంగిక దాడులకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్థుడు సంపంగి ప్రేమ్ కుమార్‌పై కరీంనగర్ సీపీ పీ.డీ. చట్టం ప్రయోగించారు. SRCL చెందిన ఇతనిపై గతంలో పలు కేసులు, శిక్షలు ఉన్నప్పటికీ ప్రవృత్తి మార్చుకోలేదు. తాజాగా అలుగునూరు వద్ద బాలికపై దాడి చేసిన కేసులో జైలులో ఉండగా.. సీపీ ఉత్తర్వుల మేరకు సోమవారం అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

December 30, 2025 / 08:47 AM IST

వైకుంఠపురంలో వైకుంఠ ఏకాదశి పూజలు

SRD: సంగారెడ్డిలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠ పురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ దంపతులు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పల్లకి సేవలో భక్తులతో కలసి పాల్గోన్నారు. అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

December 30, 2025 / 08:44 AM IST

యూరియాపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

WGL: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో యూరియాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాసంగి సీజన్ 2025–26లో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలకు కలిపి మొత్తం 1,12,345 ఎకరాల సాగుకు DES 28వ వరకు 14,375 టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 434 టన్నుల యూరియా కలదని తెలిపారు.

December 30, 2025 / 08:35 AM IST

అంగన్వాడి పాటకు ప్రశంసలు

NLG: ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వారు నిర్వహించిన ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్’లో వట్టిమర్తికి చెందిన దంపతులు ప్రతిభ చాటారు. అంగన్వాడి టీచర్ ఇందిర స్వయంగా రచించి పాడిన ‘అంగన్వాడి పిల్లలము’ పాటకు, ఆమె భర్త భీష్మచారి దర్శకత్వం వహించారు. నిన్న HYDలో జరిగిన వేడుకలో సినీ ప్రముఖులు దిల్ రాజు, తనికెళ్ల భరణి చేతుల మీదుగా వీరు ప్రశంస పత్రం అందుకున్నారు.

December 30, 2025 / 08:30 AM IST