VKB: పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందిన పరిగి మండలం బర్కత్పల్లికి చెందిన సౌందర్యకు రూ.60 వేల విలువగల CMRF చెక్కులను వారి కుటుంబీకులకు అందజేశారు. పేదలకు మెరుగైన వైద్య సేవల కోసం సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MBNR: మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవలే మక్బూల్ మాతృమూర్తి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NZB: అర్బన్ నియోజకవర్గ పరిధిలో కట్టిన ఇళ్లను బాగు చేసి అర్హులైన వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే అర్హులైన వారందరితో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో నిబంధనలు తుంగలో తొక్కి తమ వారికి ఇళ్లు కేటాయించారన్నారు.
SRPT: సుమారు రూ. 3,60,000 విలువ గల కాపర్ వైర్ ను దొంగతనం చేసిన ఐదుగురు నిందితులను మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం కోదాడ డిఎస్పి కార్యాలయంలో డిఎస్పీ శ్రీధర్ రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. కాలవలపై వేసిన ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకొని రెక్కి నిర్వహించి.. కాపర్ వైరును దొంగతనం చేస్తున్నట్లుగా విచారణలో తెలిందన్నారు.
NZB: జిల్లా కేంద్రంలో CSC ఆధార్ సేవాకేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (రెవెన్యూ) ప్రారంభించారు. (CSC- GOVT OF INDIA) ద్వారా నెలకొల్పబడిన ఈ కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటికీ ఆధార్ ముఖ్యమని.. ప్రజలు సైతం ఈ ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KNR: ఉజ్వల పార్కు సమీపంలో గల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 7వ విడత అర్హులైన అభ్యర్థుల నుంచి ఐటీఐ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదవ తరగతి పాస్ ఐన విద్యార్థులు www.iti.telangana.gov.inలో ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకై 7799100360, 9989182747, 8396768680ను సంప్రదించాలన్నారు.
MBNR: జిల్లాలోని దివిటీ పల్లిలో ఐటీ టవర్ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం సందర్శించారు. ఐటీ టవర్ భవనంను పరిశీలించి, పనిచేస్తున్న సంస్థల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐటీ హబ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అర్డీఓ నవీన్ తదితరులు ఉన్నారు.
SRD: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఓల్డ్ రామచంద్రపురంలో మంగళవారం బస్తి దర్శన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ నిర్వహించారు. ఓల్డ్ రామచంద్రాపురంలో సమస్యలను కార్పొరేటర్ దృష్టికి కాలనీ వాసులు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట లక్ష్మా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మాధవ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, దామోదర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి ఉన్నారు.
KNR: గన్నేరువరం మండలం, గుండ్లపల్లి గ్రామం, గురుకుల కొండాపూర్ గ్రామాలలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి, ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు ధాన్యాన్ని ఈ కేంద్రంలో కొనుగోలు చేస్తామన్నారు.
SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అన్నారు. ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం నుండి సింగిల్ విండో డైరెక్టర్ బొక్క గంగారెడ్డితో పాటు 100 మంది బి.ఆర్.ఎస్ కు రాజీనామా చేసి వైట్ హౌస్ లో మాజీమంత్రి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురు పాల్గొన్నారు.
NGKL: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో పోస్ట్ఆఫీస్ భవనాన్ని నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పోస్ట్ ఆఫీస్ భవనం లేక ఇబ్బందుల ఎదుర్కొంటున్నామని మల్లు రవికి వివరించారు.
KMR: కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. అత్యవసర ఆపరేషన్ నిమిత్తం 60,000 వేల చెక్కును కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డి. కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.
WGL: ఆరోగ్యవంతమైన జీవన శైలిలో భాగంగా గర్భిణులు, బాలింతలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు యోగ, ధ్యానాన్ని అలవర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం వరంగల్ కాకతీయ వైద్య కళాశాల సమావేశ మందిరంలో ఆర్య జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
MBNR: అభయాంజనేయ స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని దేవరకద్ర శాసనసభ్యులు జీ మధుసూదన్ రెడ్డి కాంక్షించారు. మంగళవారం కొత్తకోట మండలం రాయిని పేట తండాలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి, నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
WGL : ఏసీపీ నందిరాం నాయక్ను నరకాసుర వధ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రం అందించారు. ఈనెల 30న ఉర్సుగుట్ట వద్ద నరక చతుర్దశి సందర్భంగా నిర్వహించే నరకాసుర వధ ఉత్సవాల్లో తగిన ఏర్పాట్లను చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు మరుపల్ల రవి, తదితరులు పాల్గొన్నారు.