సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు నూతన విత్తన చట్ట ముసాయిదా బిల్లు–2025 పై అవగాహన మరియు సూచనల సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విత్తన ఉత్పత్తిదారులు, డీలర్లు మరియు రైతుల నుంసీ సూచనలు సలహాలు స్వీకరించారు.
KMM: ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు మహిళలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం రఘునాధపాలెం మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం వద్ద చేపట్టనున్న బాల సదనం భవన నిర్మాణ పనులకు కలెక్టర్ అనుదీప్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజున మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
NRPT: దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ని బుధవారం పట్టుకున్నట్లు ఎఎస్సై అరుణ్ తెలిపారు. నారాయణపేట మండలం షేర్నపల్లి గ్రామం నుంచి మొగుల్మడ్క గ్రామానికి ఇసుక తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్ అశోక్, యజమాని శివకుమార్ గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ADB: కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.
NLG: కొండమల్లేపల్లి మండలం చెన్నారం గేటు వద్ద వాహన తనిఖీల్లో ఎక్సైజ్ అధికారులు 1,800 కేజీల నల్లబెల్లం, 80 కేజీల పట్టికను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా నాటుసారా తయారీలో చేరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
NLG: తిప్పర్తి వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల ఎగుమతి లారీల కొరతతో నిలిచిపోయిందని రైతులు తెలిపారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోసి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని, యాసంగి వ్యవసాయ పనులు మొదలైనప్పటికీ కొనుగోలు వేగవంతం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
KMM: సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి కి రూ.30 కోట్ల నిధులు SDF, EGS కింద మంజూరు చెయ్యాలని ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వినతి పత్రం అందజేశారు. వెంటనే మంత్రి స్పందించి ఖమ్మం జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేసి శాంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో తక్షణం స్పందించిన మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసి యువతకు తోడ్పాటు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చిరంజీవి అన్నారు. బుధవారం వాంకిడి మండల అభివృద్ధి అధికారి పాటిల్ జోష్నాను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిఒక్కరికి ‘రాజీవ్ యువ వికాస్’ పథకాన్ని అందించాలని కోరారు.
VKB: తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 1-9 మధ్య జరిగే ప్రజాపాలన వారోత్సవాలకి ముందే గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్, త్రాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ సరఫరాలో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి 27 రోజుల హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో నగదు రెండు కోట్ల 3 లక్షల 25 వేల 676 రూపాయలు వచ్చాయన్నారు. బంగారం 228 గ్రాములు, వెండి 14 కిలోల 300 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొనగా, ఎస్ఎఫ్ఐ హోంగార్డు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు.
SDPT: సిద్దిపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై అక్రమ పార్కింగ్, దుకాణాల ముందు నిల్వలు పెడితే గురువారం నుంచి జరిమాన విధించడం జరుగుతుందని బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య తెలిపారు. ఇటీవల కాలంలో రహదారులపై వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపడం, పరిమితిని అతిక్రమించి వ్యాపారాలను నిర్వహించడం, దుకాణాల ముందుభాగంలో వ్యాపార వస్తువులను రోడ్లపై నిల్వ చేయడం వంటి చర్యలు పెరిగాయన్నారు.
MBNR: అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో రేపు విస్తృతంగా ‘లిజన్ టు చిల్డ్రెన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి ప్రకటించారు. దీని కోసం మొత్తం 22 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
JN: జనగామలో ఆర్ఎంపీ, పీఎంపీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలపై జరుగుతున్న ఎన్ఎంసీ, టీజీఎంసీ దాడులను వెంటనే ఆపాలని అన్నారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
ADB: జిల్లాలో మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద చీరల పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 1,48,052 మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
KMM: కామేపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, అగ్రికల్చర్ కార్పోరేషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. పొన్నెకల్లు గ్రామానికి నిర్మించబోయే రహదారి పైలాన్ పనులను పర్యవేక్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను సందర్శించారు.