NLG: కాబోయే సర్పంచ్లు ఊరికో గ్రంథాలయం నెలకొల్పాలని చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయ ఉద్యమకారులు అనుముల శ్రీనివాస్ సూచించారు. సర్పంచ్ అభ్యర్ధులు గ్రామభివృద్దిలో భాగంగా గ్రామాల్లోని యువతకోసం ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఏర్పాటుకు హామీ ఇవ్వాలని అన్నారు. తమ విపంచి ఫౌండేషన్ ద్వారా ఫర్నిచర్, పుస్తకాలను అందిస్తామన్నారు.
MDK: టేక్మాల్ మండలం బర్దిపూర్లో గంగారం మంజూల (38), శ్రీశైలం(43) దంపతులు అనుమానాస్పదంగా చనిపోయిన విషయం తెలిసిందే. మండలంలో కలకలం రేపిన ఈ ఘటనపై సీఐ రేణుక రెడ్డి మీడియాతో మాట్లాడారు. పడుకున్న సమయంలో శ్రీశైలం, భార్య మంజూలను గొంతు నొక్కి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తెేలింది. ఆపై శ్రీశైలం ఇంట్లో ఉరివేసుకున్నాడు.
ADB: ఇచ్చోడలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ పాల్గొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల్లో వర్గ పోరు మరింత తీవ్రమవుతుంది. నేనే పనిలో ఉంటా!! లేదు మా వర్గం నీతి బరిలో ఉండాలని స్థానిక నాయకులు ఒకరి వైపు ఒకరు ఒత్తిడి తెస్తున్నారు. టికెట్ ఎవరికీ ఇవ్వాలన్న విషయంలో నెలకొన్న విభేదాలతో ముఖ్యంగా అధికార పార్టీలో పరిస్థితి మరి దారుణంగా మారింది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి దశ నామినేషన్ల ఉపసంహరణ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో నామినేషన్ల విత్డ్రా కోసం బుజ్జగింపుల పర్వం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను అధికారులు ప్రకటించి వారికి గుర్తులు కేటాయించనున్నారు.
KNR: విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలని, మత్తు పదార్థాలకు, ఫోన్లకు దూరంగా ఉండి చదువుకోవాలని పలువురు వక్తలు అన్నారు. చొప్పదండి ZPHS (బాలురు)లో మంగళవారం స్నేహిత కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎంఈవో మోహన్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, హెచ్ఎం జలీల్ మాట్లాడుతూ.. బాలబాలికలు ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలని, ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలని సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతున్నది. సర్పంచ్ రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులువార్డు నెంబర్గా పోటీ చేసి చెక్ పవరున్న ఉప సర్పంచ్ పదవి కైవసం చేసుకునేందుకు పోటీలో దిగుతున్నారు. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు చెక్పవర్ ఉండడంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇతర సభ్యుల మద్దతును కూడగట్టుకొనే ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో గ్రామ పంచాయతీ, వార్డు సభ్యుల నామినేషన్ల మూడో విడత ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్ నగర్, పాలకవీడు, మఠంపల్లి మండలాల్లోని 146 గ్రామ సర్పంచులకు, 1318 వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి ఈనెల 5 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది.
ADB: రేపు ఆదిలాబాద్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ తెలిపారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన మధ్యాహ్నం ఒంటి గంటలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరుకావాలన్నారు.
PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికుల భద్రత కోసం ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పోస్టల్ బ్రాంచ్ మేనేజర్ మోహన్ సాయి వివరణ ఇచ్చారు. రూ. 549 ప్రమాద బీమా పాలసీ ద్వారా రూ. 10 లక్షల కవరేజ్, వైద్య ఖర్చులకు రూ. 60 వేల సహాయం చేస్తామన్నారు.
NLG: చిట్యాల పురపాలికలో కుక్కల బెడద తీవ్రమైంది. రాత్రి సమయాల్లో పదో వార్డులో కుక్కలు గుంపులు, గుంపులుగా ఉండి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇల్లు చేరుకునేందుకు భయంతో వణుకుతూ వస్తున్నామని తెలుపుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని మాజీ వార్డు సభ్యుడు దాసరి నరసింహ కోరారు.
ADB: ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మంగళవారం రాత్రి సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. వారితో పాటు అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఉన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రౌతు రాధాకృష్ణ పీహెచ్ఎ పట్టా పూర్తి చేశారు. వృక్ష శాస్త్ర విభాగంలో ‘కంది మొక్కల్లో విత్తనాల ద్వారా జనించే వ్యాధుల సమీకృత నిర్వహణ, నిర్మూలన’ అనే శీర్షికపై గత ఐదేళ్లుగా ఆయన పరిశోధనలు కొనసాగించి, ఫలితం సాధించారు. పరిశోధన విజయవంతం అయ్యింది.
KMR: బాన్సువాడ మండలం పోచారం గ్రామపంచాయతీకి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుంటున్నారు. ఈ గ్రామపంచాయతీ 1984లో ఏర్పడగా మొదటి సర్పంచ్గా బూదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి సర్పంచులు, వార్డుసభ్యులు అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికవుతున్నారు. కాగా, మొదటిసారిగా ఈ గ్రామంలో ఎన్నికలు జరగనున్నాయి.
NZB: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ 2.0 పథకంలో భాగంగా బోధన్ పట్టణ మాస్టర్ ప్లాన్ కోసం బుధవారం నుంచి క్షేత్ర స్థాయి సర్వే ప్రారంభం కానుందని మున్సిపల్ కమీషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. పట్టణ భవిష్యత్తు ప్రణాళికకు ఈ సర్వే అత్యంత కీలకమని ఆయన వెల్లడించారు. సర్వే సిబ్బందికి పట్టణ ప్రజలు, ఇంటి యజమానులు పూర్తి సహకారం అందించాలని కమీషనర్ ప్రకటనలో కోరారు.