BHNG: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నెమల మహేందర్ గౌడ్ అన్నారు. ఇవ్వాళ రాజపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి మాట్లాడారు. మహాత్మాగాంధీ విగ్రహం ముందు పార్టీ నూతన సర్పంచులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
NZB: జిల్లా కేంద్రానికి చెందిన జంట కవులుగా పేరుగాంచిన చందన్ రావు, కందళై రాఘవాచార్యూలు రచించిన ‘రెండు ఒకట్లు’ పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. రాష్ట్రా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. ఏనుగు నరసింహ రెడ్డి ఆవిష్కరించారు. భావితరాలకు స్ఫూర్తిగా ఈ పుస్తకం ఉందని కొనియాడారు.
BDK: భద్రాచలం వైకుంఠ ఏరు ఉత్సవాల్లో భాగంగా కళాకారులు ప్రత్యక్ష చిత్రలేఖనంతో సందర్శకులను ఆకట్టుకున్నారు. గోదావరి నది తీరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఆర్ట్ స్పేస్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు తమ సృజనాత్మకతను కాన్వాస్పై ఆవిష్కరిస్తూ ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణ చేపడుతూ తిలకిస్తున్నారు.
MLG: మంగపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్న RTC బస్టాండ్ను ఇవాళ బీజేపీ ముఖ్య నేతలు పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. ప్లాట్ఫాం ఎత్తు తక్కువగా ఉండటంతో వర్షాకాలంలో ప్రయాణికులు ఇబ్బందులు పడతారని, నిబంధనలకు విరుద్ధంగా మట్టితో పనులు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విమర్శించారు. అధికారులు స్పందించాలని కోరారు.
HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రేపు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ CPI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు CPI జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. గుడిసె వాసులకు పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, తుపాను బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
BHNG: రామన్నపేట మండలం, శోభనాద్రిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎటెల్లి పరమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి నియామక పత్రం అందించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పున్న జగన్మోహన్, మేడి రవిచంద్ర, వెంకటరెడ్డి, రాంరెడ్డి, జమీరుద్దీన్ పాల్గొన్నారు.
NZB: ఆలూర్ మండలం గుత్ప సర్పంచ్ కమలా-దశరథ్ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్లోకి చేరినట్లు చెప్పారు.
KMM: మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదివారం కూసుమంచి మండలం చేగొమ్మలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలిచినా, ఓడినా ప్రజలే కుటుంబంగా పనిచేశానని, ప్రస్తుత నాయకులు ప్రజలను దూషించడం బాధాకరమని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలకు చేసే సేవ మాత్రమే నిలిచిపోతుందని తెలిపారు. పాలేరులో బీఆర్ఎస్ పునరుజ్జీవం మొదలైందని, గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించారు.
JN: జాఫర్గడ్ పట్టణ కేంద్రంలోని ‘మా ఇళ్లు’ అనాధాశ్రమాన్ని ఆదివారం పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారి చదువు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య ఇటీవల NIA అరెస్ట్ కావడంతో ఆయన సతీమణిని ఓదార్చి ధైర్యం చెప్పారు.
NLG: చింతలపాలెం మండల కేంద్రంలో ఆదివారం భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ అని అన్నారు.
ADB: వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఉన్న రికార్డులను పూర్తిగా పరిశీలించి కేసుల స్థితిగతులను తెలుసుకున్నారు. స్టేషన్కు వచ్చిన ఎస్పీకి సిబ్బంది పోలీస్ గౌరవ వందనాన్ని అందజేశారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
NLG: దేశంలో బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.
PDPL: ఓదెల మండల కేంద్రంలోని తారకరామా కాలనీ పరిధిలో 32వ రైల్వే గేటు లైన్ మరమ్మతుల కారణంగా గేటును తాత్కాలికంగా మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే గేటు నుంచి డి-86 కెనాల్ బ్రిడ్జి వరకు ఉన్న ఇరుకైన రహదారిపై వాహనాలు ఎదురెదురుగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు వెడల్పు పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో నరేందుల నరసవ్వ అనే వృద్ధురాలిని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముద్రబోయిన కుమార్ అనే వ్యక్తి హత్య చేసి, ఆమె చెవులకు ఉన్న కమ్మలను దోచుకెళ్లాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
PDPL: రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బీ.రాజేశ్వరరావు మానవత్వాన్ని చాటుకున్నారు. గోదావరిఖని మున్సిపల్ టీ-జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన రాజేశ్వరరావు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు.