WGL: సంగెం మండలం రంగంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్కు తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో గుగులోతు కవిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త సుకుమార్ పిల్లలతో కలిసి ఫంక్షన్కు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న కవిత ఆవేదనతో ఈ అడుగు వేసినట్లు స్థానికులు తెలిపారు. తలుపు తీయకపోవడంతో అనుమానంతో చూడగా ఉరేసుకున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GDWL: గద్వాల మండలం అనంతపురం గ్రామంకు అక్రమంగా ఆటోలో మద్యం తరలిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఇవాళ రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాహనాన్ని తనిఖీ చేయగా 18 మద్యం కాటన్ బాక్సులు ఉన్నట్లు గుర్తించారు. అనుమతి పత్రాలను పరీక్షించగా అనుమానం రావడంతో సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. జిల్లాలో మద్యం తరలిస్తే కట్టిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
KMR: అగ్రవర్ణాల పెత్తనం అణచివేతకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్ అన్నారు. పట్టణంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి పూర్తిగా అన్యాయమని మండిపడ్డారు.
NZB: ఆహార కల్తీ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ అధికారి రసూల్బీ అన్నారు. జాతీయ పాల దినోత్సవం సందర్భంగా నగరంలోని గంగాస్థాన్లో గల వివేకానంద మఠంలో బుధవారం చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్య జీవితంలో పాల వాడకం తప్పనిసరిగా మారిపోయిందన్నారు.
JGL: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల వార్షిక పరీక్షలు 2026 జనవరి/ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్న నేపథ్యంలో 5 డిసెంబర్ 2025లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు. ఫీజులు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు. అప్లై చేసిన అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని DEO కార్యాలయంలో ఇవ్వాలన్నారు
జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీగా ఇటీవల నూతనంగా నియమితులైన శేషాద్రిని రెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్ను కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఆమె పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన విధులను నిర్వర్తించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని ఆయన సూచించారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన గీతకార్మికుడు కూనూరు సుమన్ ఇవాళ సాయంత్రం తాడిచెట్టు ఎక్కుతూ మోకుజారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానిక రైతులు, గౌడులు వెంటనే హుటాహుటిన WGL రిలీఫ్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సుమన్ను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు.
MDK: స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ రేపు మెదక్ విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె రేపటి నుంచి మెదక్ జిల్లాలో స్థానికల సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల తీరును పరిశీలన చేస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
MBNR: పట్టణంలో బుధవారం అనారోగ్య కారణాలతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భూత్పూర్ గ్రామానికి చెందిన కంపిల చరణ్ (20) వెన్నెముక నొప్పితో బాధపడుతూ, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. తోటి పనివారు లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
BHPL: జిల్లా BRS కార్యాలయంలో ఇవాళ మాజీ MLA GVR ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. GVR మాట్లాడుతూ.. KCR నీళ్లు- నిధులు- నియామకాల లక్ష్యంతో తెలంగాణ సాధించారని, కాంగ్రెస్ BCలకు 42% హామీ ఇచ్చి 17%కే పరిమితం చేసి మో మోసం చేసిందని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని, కేసీఆర్ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
MBNR: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం వెల్లడించారు. ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్.ఎస్.టీ బృందాలకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సెలవులు లేవన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లాలోని ఎంపీడీవోలు,తహసీల్దారులతో వెబ్ఎక్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.
మెదక్ జిల్లా హవేలీఘన్పూర్లో కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సాయంత్రం పర్యటించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియపై పలు సూచనలు చేశారు. నామినేషన్ స్వీకరణకు తగిన ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీడీవోను ఆదేశించారు.
BHPL: పంచాయితీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని MLA GSR పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయంలో గోరికొత్తపల్లి, రేగొండ, మొగుళ్ళపల్లి మండలాల నాయకులతో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కరుణాకర్తో కలిసి మాట్లాడారు. కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలనే అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించాలని కోరారు.
NZB: రూరల్ మండలంలోని పాల్దా గ్రామంలో మంగళవారం బీజేపీ కార్యకర్తపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అడ్మిన్ డీసీపీ బస్వా రెడ్డిని కలిసి విన్నవించారు. రూరల్లో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని కోరారు. ఇంకోసారి బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్డార్ అంటూ బుధవారం హెచ్చరించారు.