KNR: రబీ సీజన్ పంటలకు అవసరమైన యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం 340 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు బారులు తీరారు. యూరియా కోసం నానా తంటాలు పడుతున్నామని, గత సీజన్లో యూరియా లేకపోవడంతో పంటలు సరిగా పండలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
MBNR: కురుమూర్తి గ్రామ శివారు నుంచి మట్టి పేరుతో అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అక్రమార్కులు ఖాళీ వాహనాలతో పరారయ్యారు. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేశారు.
KNR: తిమ్మాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల సర్పంచులు ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా తాట్ల తిరుపతి, సలహాదారులుగా సురం స్వప్న, ఉపాధ్యక్షులుగా మామిడి మమతా, కనకం లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఆవుదుర్తి రామకిషన్, కోశాధికారిగా గోదరి శోభారాణి పాల్గొన్నారు.
KMM: తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతులు చిల్లర బాలకృష్ణ (కార్ డ్రైవర్), రాయల అనిల్ వీరి స్వగ్రామం జాఫర్ గాడ్ జనగామకు చెందిన వారుగా గుర్తించారు. అటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులు అజయ్, కొల్లిపాక క్రాంతి, గట్టు రాకేష్. ఈ ముగ్గురి స్వగ్రామం స్టేషన్ ఘన్పూర్గా గుర్తించారు.
NGKL: అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో మండలంలోని బీఆర్ఎస్ మాజీ సర్పంచులను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఏఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు. పట్టుబడిన వారిలో మాజీ సర్పంచులు కొమ్ము రాజయ్య, సుదర్శన్ ఉన్నారు.
KMM: తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మిట్టపల్లి సమీపంలోని శంకర్ దాదా వద్ద లారీ- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: భిక్కనూర్ మండలం మోటాట్ పల్లిలో శనివారం ఎర్ర రాజు హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు శివ కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. సోదరుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని చంపినట్లు నిండుతుడు ఒప్పుకొన్నుట్లు సీఐ చెప్పారు. అతన్ని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
KMR; పిట్లంకు చెందిన యువకుడు తుకారాం సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి సినీ రంగంలో రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కాగితం పడవలు’ విడుదలకు సిద్ధమవుతోంది. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ను ఈ నెల 27న ఘనంగా విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని ప...
NLG: మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ సర్పంచ్లు తండు కవిత చంద్రయ్య అన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని శాంతియుత నిరసనకు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్యక్రమానికి వెళ్లకుండా డిండి మండల పోలీసులు సోమవారం ముందస్తుగా మాజీ సర్పంచ్లను అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.
MHBD: జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నూతన యూరియా బుకింగ్ యాప్ ప్రవేశపెట్టిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల తెలిపారు. ప్లే స్టోర్లో “ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్” డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే బుకింగ్ చేసి 24 గంటల్లోపు ఎరువులు తీసుకోవచ్చని సూచించారు.
BDK: గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్లను ఆదివారం ఇల్లందు పట్టణ కేంద్రంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సన్మానించారు. అధికార పార్టీ బెదిరింపులకు, ఒత్తిళ్లకు ఏమాత్రం తగ్గకుండా బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి గులాబీ కార్యకర్తలు సైనికుల్లా పోరాటం చేశారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు.
NRPT: ఊట్కూరు మండలంలపెద్దపొర్ల గ్రామానికి చెందిన 12 ఏళ్ల కార్తీక్ అనే బాలుడు ఆదివారం ఊట్కూరు మండలంలో విద్యుత్ షాక్తో మృతి చెందాడు. తల్లిదండ్రులతో కలిసి పత్తిని బొలెరో వాహనంలో నింపుతున్నప్పుడు, వాహనం విద్యుత్ తీగలకు సమీపంలో ఉండటంతో ప్రమాదవశాత్తు బాలుడికి విద్యుత్ తగిలింది. ఆసుపత్రికి తరలించే లోపే బాలుడు మృతి చెందాడు.
HYD: వేరువేరు విభాగాల ఆధ్వర్యంలో ఉన్న వరదకు సంబంధించిన నాలాలన్నింటిని ఒకే విభాగం కిందికి తీసుకొచ్చినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. అన్ని నాలాలను SNDP విభాగానికి అప్పగించాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల క్రితమే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం సర్వే ప్రారంభమై తుది దశ పూర్తయింది. త్వరలో సమగ్ర నివేదిక సిద్ధం కానుంది.
GDWL: జిల్లా ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలని ఆదివారం జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు సూచించారు. రోడ్డు నియమాలు పాటించకుండా వాటిని అతిక్రమించి, వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, మైనర్లు డ్రైవింగ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహనాలు నడిపితే అట్టి వాహనాలు సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
MBNR: జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ (38) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. విధుల్లో అందరితో స్నేహపూర్వకంగా ఉండే ప్రవీణ్ అకాల మరణం పట్ల తోటి ఉద్యోగులు, అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.