• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భవిత కేంద్రంలో ఏఐ ల్యాబ్ ప్రారంభం చేసిన కలెక్టర్

ADB: డైట్ కళాశాలలో ఆవరణలోని భద్రత కేంద్రంలోని శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా, కృత్రిమ మేధ ఏఐ ఆధారిత ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల అభ్యాసన సమర్థులను మెరుగుపర్చడానికి ఈ ల్యాబ్ ఆధునిక యంత్రాలు మౌలిక వసతులు రూపొందించాలని దీనివల్ల పిల్లల కమ్యూనికేషన్ అభ్యాస నైపుణ్యాలు మెరుగుపడతాయని, అని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

December 12, 2025 / 07:38 PM IST

అత్యాచార బాధితుల పరిహారంపై కలెక్టర్ సమీక్ష

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి అత్యాచార బాధితులకు పరిహార పంపిణీ పై సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అత్యాచార బాధితులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిడి నిర్మల పాల్గొన్నారు.

December 12, 2025 / 07:24 PM IST

‘కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖతం చేస్తామని బెదిరింపులు’

KMM: రఘునాధపాలెం మండలం జీకే బంజర ఉత్కంఠ భరితంగా సాగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు జ్యోతి గెలించింది. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. BRS పార్టీ గెలుపుకు కారణమైన బోడ వీరన్న, మాలోత్ వీరన్న అనే వ్యక్తులను చంపుతామని ఫోన్లు చేసి అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని కాంగ్రెస్ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు.

December 12, 2025 / 07:20 PM IST

రెండవ విడత ఎన్నికలపై సమీక్ష

NZB: ఎన్నికల రెండవ విడత నిర్వహణ నేపథ్యంలో నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ పీ.సాయి చైతన్య సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరగనున్న నేపథ్యంలో, బందోబస్తు ఏర్పాట్లను డిచిపల్లి సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో చర్చించారు.

December 12, 2025 / 07:17 PM IST

మంత్రిని కలిసిన పెద్ద సూరారం నూతన సర్పంచ్

NLG: పెద్ద సూరారం గ్రామ నూతన సర్పంచ్ గుండె జానమ్మ, వార్డు సభ్యులు శుక్రవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త సర్పంచ్‌, వార్డు సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులకు నిజాయితీగా సేవలందించాలని సూచించారు.

December 12, 2025 / 07:07 PM IST

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

SRPT: కోదాడ మండలంలో రేపు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

December 12, 2025 / 06:41 PM IST

‘862 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు’

ASF: జిల్లాలో రెండో విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP నితికా పంత్ పేర్కొన్నారు. 862 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించాలని సూచించారు. ఎవరైనా గొడవలకు ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 12, 2025 / 06:38 PM IST

‘ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి’

KNR: జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకటేశ్వర్లుతో కలిసి ఈ ప్రక్రియ నిర్వహించారు..

December 12, 2025 / 06:36 PM IST

‘ఎనిమిది మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు’

ADB: జిల్లాలోని రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 14న నిర్వహించనున్న నేపథ్యంలో ఎనిమిది మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు అవుతాయని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలియజేశారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు గౌరవించి ప్రజలు సహకరించాలని కలెక్టర్ ప్రజలను కోరారు.

December 12, 2025 / 06:33 PM IST

44 మంది విద్యార్థులకు అస్వస్థత

HYD: మాదాపూర్ పరిధిలోని చందానాయక్ తండా ప్రభుత్వ ప్రాఠశాలకు చెందిన 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థత చెందగా.. కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారాణాలు తెలియాల్సి ఉంది.

December 12, 2025 / 06:30 PM IST

అప్పుల బాధతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

HNK: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో అప్పుల బాధతో యాకూబ్ పాషా (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా పెరగడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

December 12, 2025 / 06:30 PM IST

హిందీ సబ్జెక్టు బోధించడానికి దరఖాస్తుల ఆహ్వానం

NLG: నల్గొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు హిందీ బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ స్వామి తెలిపారు. అభ్యర్థులు ఎంఏ, బీఏ, హెచ్పీటీ (HPT) విద్యార్హత కలిగి ఉండాలని, డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు.

December 12, 2025 / 06:25 PM IST

‘బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించండి’

NZB: సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. NZB మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి అంటే కేవలం పనులు ప్రారంభించడమే మాత్రమే కాదని, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని సమయానికి అర్థం చేసుకొని సమయానికి అమలు చేయడం అన్నారు.

December 12, 2025 / 06:25 PM IST

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

MDK: జవహర్ నవోదయ పరీక్ష కేంద్రాల వద్ద 163 (144 సెక్షన్) బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ DV శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పరిధిలో రేపు నిర్వహించనున్న ఆరు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఉండడం నిషేధమన్నారు.

December 12, 2025 / 06:24 PM IST

‘ఈవీఎం వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాలి’

జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదాంను కలెక్టర్ సత్యప్రసాద్ సమగ్రంగా తనిఖీ చేశారు. గోదాంలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, యంత్రాల సాంకేతిక స్థితిని పరిశీలిస్తూ ఎన్నికల ప్రక్రియలో భద్రత అత్యంత కీలకమని తెలిపారు. నిరంతర పర్యవేక్షణ, ఎలాంటి లోపాలు లేకుండా వ్యవస్థలు పనిచేసేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

December 12, 2025 / 06:23 PM IST