• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

ADB: సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన ఆత్రం నగేశ్ విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరిపారు. నూతన సర్పంచ్ నగేశ్‌ను పార్టీ నాయకులు, గ్రామస్తులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

December 14, 2025 / 03:49 PM IST

బాల నగర్ బీజేపీ అభ్యర్థి బెండ వీణ గెలుపు

MDK: మెదక్ మండలం బాలానగర్ గ్రామ పంచాయతీ బీజేపీ అభ్యర్థి బెండ వీణ 200 పై చిలుకు ఓట్లతో పద్మపై గెలుపొందారు. తనపై నమ్మకం ఉంచి తనను భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆమె తెలిపారు.

December 14, 2025 / 03:47 PM IST

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ భేష్

ADB: స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ బోథ్ నియోజకవర్గం ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం సిరికొండ మండలంలో పర్యటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

December 14, 2025 / 03:45 PM IST

మృతుడికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

NLG: చిట్యాలకు చెందిన పల్లపు రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్, స్థానిక మున్సిపల్ మాజీ ఛైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డితో కలిసి ఆదివారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారితో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

December 14, 2025 / 03:44 PM IST

అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం

BHNG: చౌటుప్పల్‌లోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్న ప్రసాద వితరణ ఆదివారం 35వ రోజుకు చేరుకుంది. మొగుదల సాహితీ రమేష్ గౌడ్, ఆరుట్ల సంతోష లింగస్వామి దంపతులు అన్నవితరణ దాతలుగా సహకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తూర్పునూరి నరసింహ గౌడ్, సన్నిధానం స్వాములు దాతలను సత్కరించారు.

December 14, 2025 / 03:34 PM IST

మొక్కజొన్నకు క్వింటాకు రూ. 2100

NGKL: అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం 140 క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి వచ్చాయి. అత్యధిక ఒక క్వింటాల్‌ కు రూ.2001 లభించింది. మధ్యరకం మొక్కజొన్నకు క్వింటాకు రూ.1,890, ధర పలుకగా. కనిష్ఠం గా రూ.1,451 ధర పలికినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంతటి రజిత మల్లేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ తెలిపారు.

December 14, 2025 / 03:31 PM IST

లోక్య తండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మౌనిక విజయం

JN: నర్మెట మండలం లోక్య తండ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు మౌనిక 41 ఓట్ల మెజార్టీతో ఆదివారం ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టమైంది. ఫలితాలతో మద్దతుదారుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

December 14, 2025 / 03:30 PM IST

కురవి వీరన్నను సందర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులు

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయాన్ని BRS ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పిపి కరుణాకర్ దంపతులు, తదితరులున్నారు.

December 14, 2025 / 03:27 PM IST

మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

SDPT: కొమరవెల్లిలో మల్లన్న కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మల్లన్న కళ్యాణోత్సవానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పోలీస్ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

December 14, 2025 / 03:22 PM IST

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన DCP

PDPL పెద్దపల్లి జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని DCP బి. రామ్ రెడ్డి తెలిపారు. అంతర్గం మండలంలోని కుందన్పల్లి, పెద్దంపేట్, ఎల్లంపల్లి, మూర్ముర్, కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని, శాంతియుత ఎన్నికల నిర్వహణే తమ ప్రధాన లక్ష్యమన్నారు.

December 14, 2025 / 03:15 PM IST

వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళి పరిశీలిన

KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలోని ఐదు మండలాల్లో రెండవ విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 162 పోలింగ్ స్టేషన్‌లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ స్క్రీన్‌లో వీక్షించారు.

December 14, 2025 / 03:14 PM IST

ఉగ్గంపల్లిలో ఓటు వేసిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్

MHBD: చిన్నగూడూరు మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. రెండో విడత ఎన్నికల్లో నియోజకవర్గంలో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

December 14, 2025 / 03:13 PM IST

సర్పంచ్ కు మాజీ ఎమ్మెల్యే సన్మానం

NGKL: తెలకపల్లి మండలం పర్వతాపూర్ గ్రామ సర్పంచ్‌గా గెలిచిన బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి కొట్ర ప్రసన్న రాజును మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జమున దంపతులు ఈరోజు సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.

December 14, 2025 / 03:06 PM IST

పదవీ బాధ్యతలకు ముహూర్తం ఖరారు

VKB: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. డిసెంబర్ 17వ తేదీన సర్పంచ్ ఎన్నికలు పూర్తవుతాయన్నారు. డిసెంబర్ 20వ తేదీన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, పాలకవర్గాలు పదవీ బాధ్యతల స్వీకరణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

December 14, 2025 / 03:06 PM IST

బీఆర్ఎస్ మనుగడ కోల్పోయింది: ఎమ్మెల్యే

MBNR: గ్రామాల అభివృద్ధికి అడ్డుతగిలేవారిని కాకుండా, అభివృద్ధి సాధించేవారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోయిందని, అందుకే ఎన్నికల్లో నిలబడటానికి కూడా భయపడుతోందని విమర్శించారు. ప్రజలు తమ విజ్ఞతను ఉపయోగించి మంచికి ఓటు వేయాలన్నారు.

December 14, 2025 / 03:06 PM IST