• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హైదరాబాద్‌కు వచ్చే విమానానికి బాంబు బెదిరింపు

HYD: సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే సిబ్బంది గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఆ విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

December 4, 2025 / 01:40 PM IST

బొటానికల్ ప్రాంత సమీపంలో బస్సు బ్రేక్ డౌన్

RR: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొటానికల్ బస్సు బ్రేక్ డౌన్ అయింది. దీంతో బొటానికల్ ప్రాంతం సమీపంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని లేదా సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.

December 4, 2025 / 01:24 PM IST

రోడ్డెక్కిన దుకాణాలు.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు

KMM: మధిర పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. దీనికి తోడు ఎడ్ల బండ్లు సైతం పట్టణంలో సంచరిస్తుండటంతో అర్ధ గంట నుంచి గంటమేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.

December 4, 2025 / 01:23 PM IST

బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్

MHBD: తొర్రూరు మండలంలోని అమర్ సింగ్ తండా మాజీ సర్పంచ్ హపవత్ సురేష్ నాయక్ ఇవాళ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దయాకర్ రావు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కష్టపడి పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారీతో గెలిపించుకోవాలని సూచించారు.

December 4, 2025 / 01:17 PM IST

‘కల్తీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలు’

VKB: వేరుశనగ రైతులకు నాసిరకం మందుల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుల్కచర్ల వ్యవసాయ అధికారి వీరస్వామి తెలిపారు. ఫర్టిలైజర్ విక్రయంపై రైతుల ఫిర్యాదుతో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. డేట్ ఎక్స్‌ఫైరీ అయిపోయిన మందులను రైతులకు విక్రయించరాదన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.

December 4, 2025 / 01:04 PM IST

‘భేటీ బచావో భేటీ పడావో’ పై అవగాహన కార్యక్రమం

నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆడపిల్లల చదువు ఆవశ్యకతను వివరించారు. చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్లి చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారని, ఆడపిల్లల రక్షణ చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మత పెద్దలు పాల్గొన్నారు.

December 4, 2025 / 01:03 PM IST

జిల్లా ల్యాండ్స్ రికార్డ్స్ A.D ఇంట్లో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి జిల్లా ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్‌పై ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో శ్రీనివాస్‌కు సంబంధించిన ఆరు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ ఇప్పటికే విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. భారీ ఆస్తులతో పాటు ఓ రైస్ మిల్లును కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

December 4, 2025 / 01:02 PM IST

పద్మనగర్ సర్పంచ్ స్థానానికి మూడు నామినేషన్లు

SRCL: తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ సర్పంచ్ స్థానానికి మూడు నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా బూర ఉష, మోర నిర్మల, ముడారి రాజయ్య నామినేషన్లు దాఖలు చేశారని వారు పేర్కొన్నారు. అభ్యర్థుల నామినేషన్లను ధ్రువీకరిస్తూ ఫారం 6ను అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే అభ్యర్థులు పలువురని కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

December 4, 2025 / 01:01 PM IST

క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే

SRD: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో పటాన్ చెరు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

December 4, 2025 / 12:58 PM IST

అంజన్న జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

నారాయణపేట: మక్తల్‌లో పడమటి అంజన్న జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో కవిత, ధర్మకర్త ప్రాణేష్ చారి ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిట్టెం రామ్మోహన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

December 4, 2025 / 12:57 PM IST

సీఐని కలిసిన పద్మశాలి కార్యవర్గ సభ్యులు

సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యులు, పట్టణంలోని పోలీస్ కార్యలయంలో సీఐ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి పూల గుచ్ఛాని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు డా. గాజుల బాలయ్య, మోర రవి, క్యాషియర్ యెల్లే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, వార్డు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

December 4, 2025 / 12:57 PM IST

ఫరూఖ్ నగర్ మండల పరిధిలో పోలీస్ కవాతు

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద, ఎల్లంపల్లి, చౌలపల్లి గ్రామాల్లో పట్టణ సీఐ విజయ్ కుమార్, ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఓటరు స్వేచ్ఛాయుతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని ఉద్దేశంతోనే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

December 4, 2025 / 12:55 PM IST

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

మెదక్: జిల్లా కేంద్రం గోల్ బంగ్లాలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిణి విజయ, సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

December 4, 2025 / 12:55 PM IST

ఉద్రిక్తత.. మార్కెట్ యార్డు గేటుకు తాళం

గద్వాల: గురువారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. గత వారం రోజులుగా గన్ని సంచులు, రవాణా వాహనాలు లేవని, అధికారుల నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపించారు. పంటను అమ్ముకున్నా సంచులు, వాహనాల బాధ్యత రైతులదే అని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు.

December 4, 2025 / 12:54 PM IST

‘విద్యార్థినులకు దాతల చేయూత’

VKB: దోమ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో దాతలు ఆర్యన్ రాజ్‌పుత్, దీపన్ భూపతి, సంఘ సేవకురాలు అనిత, నిఖిత సహకారంతో రూ. 80 వేల విలువ గల క్రీడా సామగ్రిని అందించారు. క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకట్, ప్రధానోపాధ్యాయుడు రాములు, కేజీవీబీ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

December 4, 2025 / 12:54 PM IST