MNCL: కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా టీజేఎస్ నిలుస్తుందని తెలిపారు.
ADB: ఆర్టీసీ బస్టాండ్లో ఇవాళ భారీ చోరీ చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన గుర్మిత్ ఆదిలాబాద్ వ్యాపారులకు వెండి అభరణాలను సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తన బ్యాగులో రూ.95 వేల నగదు, 5 కిలోల వెండి అభరణాలతో బస్టాండ్కు వచ్చాడు. ఈ క్రమంలో ఒక బస్సులో తన సంచిని ఉంచి కిందకి దిగి మళ్లీ బస్సు ఎక్కి చూడగా సంచి కనబడలేదు. దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ నాగరా...
KNR: శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన కందుల రాజు ఆముదాలపల్లి నుంచి తిమ్మాపూర్లో పెళ్లికి వెళ్లి తిరిగి బైకుపై వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో తాడికల్ బస్టాండ్ దగ్గర తాడికల్కు చెందిన అన్వర్ పాషా బైకుపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఇరువురి బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాజు ఎడమ కాలు విరిగింది. అన్వర్ పాషా కుడి కాలుకు దెబ్బ తగిలింది.
WGL: జిల్లా కేంద్రంలోని DCC భవన్లో ఇవాళ మంత్రి వాకిటి శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
BDK: కొత్తగూడెం క్లబ్లో ఇవాళ నిర్వహించిన జాబ్ మేళాలో విధి నిర్వహణ చేసి తిరుగు ప్రయాణంలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ రోడ్డుపై నడవలేని ఇద్దరు దివ్యాంగులు ఇబ్బందిగా ఉన్నట్లు గమనించారు. వెంటనే స్పందించిన ఆయన తన సిబ్బంది పాషా సహాయంతో వారికి ఆటోలో ఎక్కించి కొత్తగూడెం బస్టాండ్ వరకు సురక్షితంగా పంపించారు.
MBNR: జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆదివారం శ్రీరామ రక్షా స్తోత్ర- హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ఆదివారం AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ఎన్నికల్లో తమకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు, తన విజయంలో పోషించిన కీలక పాత్రకు ఓవైసీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకు, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.
MBNR: మహబూబ్నగర్ మండలం మంచన్పల్లి తండాకు చెందిన రాజేశ్వరి చెవెళ్లలోని ఓ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆదివారం రూ.25 వేల చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నువ్వు డాక్టర్ అయ్యాక ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
HNK: జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (JNS)లో ఇవాళ నిర్వహించిన సమావేశంలో మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు వెలికితీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డెఫ్ ఒలింపిక్స్ 2025లో గోల్డ్ మెడల్ గెలిచిన షూటర్ ధనుష్ శ్రీకాంత్కు రూ.1.20 కోట్ల నజరానా ప్రకటించారు.
GDWL: జమ్మిచేడు శివారులోని రిజర్వాయర్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చని, నాలుగు రోజుల కిందట చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. పసుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా గుర్తిస్తే స్థానిక పీఎస్కి సంప్రదించాలన్నారు.
BDK: జిల్లాలో ఇవాళ నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమం విజయవంతం అయిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిని తెలిపారు. చదువు ఒక్కటే మనిషి జీవితాన్ని అందంగా మారుస్తుందని కలెక్టర్ వెల్లడించారు. కృషి పట్టుదల విజయానికి సోపానాలని తెలివితేటలు ఎవరి సొత్తు కాదని అన్నారు. కష్టపడితే భవిష్యత్తు అంతా బంగారమయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ADB: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ను ఆదివారం బౌద్దులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న పట్టణంలోని కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్లో జరిగే భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ, దయానంద్, కాంతారావు, మధు, గంగారాం, సంతోష్ పాల్గొన్నారు.
MBNR: పుస్తక పఠనం అలవాటు ప్రతి ఒక్కరికి అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామని చెప్పారు.
KMM: బీసీ రిజర్వేషన్ బిల్లులో మూడు పార్టీలు మూడు ముక్కల ఆట ఆడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. KCR హయాంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని వెల్లడించారు.
NGKL: కోడేరు మండలంలోని రాజాపూర్లో సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. అర్చకులు సుమలత భాస్కరశర్మ, సంతోష్ భరద్వాజ్ ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆంజనేయ హోమం, యంత్రం స్థాపన, అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని తమలపాకులతో అలంకరించి నైవేద్యం సమర్పించారు.