SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ముందుగానే అకౌంట్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
హైదరాబాద్ మహానగర పరిధి విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో 27 మున్సిపాలిటీలను విలీనం చేసే ప్రతిష్ఠాత్మక ప్రక్రియకు గవర్నర్ ఆమోదం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్కు సంబంధించిన ఫైల్ గవర్నర్ ఆమోదంతో తిరిగి ప్రభుత్వానికి చేరుకుంది.
SRD: కేజీబీవీలో బాలికలకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. కొందరు ప్రత్యేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని డిఈవో దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి సమస్యలు పరిష్కరించిన చర్యలు తీసుకుంటానని డి.ఏమో హామీ ఇచ్చారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్వోగా డా. నర్సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత నెల 25న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా. రవీందర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని మానూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై డిప్యూటీ డీఎంహెచ్వోగా ఎల్లారెడ్డికి కేటాయించారు.
BHNG: తిమ్మాపురం ఊరి అభివృద్ధి కొరకు అందరి సహకారం దీవెనలతో ఇవాళ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగిందని ఎడ్ల వెంకటరెడ్డి అన్నారు. గ్రామ సర్పంచ్గా ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఖచ్చితంగా ఊరు అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ మండలంలో రెండో రోజు సోమవారం స్థానిక సంస్థల ఎన్నికలకు 202 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో శాలిక తేలు తెలిపారు. సర్పంచ్ పదవికి 29, వార్డు సభ్యుల పదవులకు 173 నామినేషన్లు దాఖలైనట్టు వివరించారు. రెండు రోజుల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 232 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు.
HYD: నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన 5 కేసుల్లో నాంపల్లి కోర్టు పీటీ వారెంట్ అనుమతించింది. ఐదు కేసుల్లోనూ పీటీ వారెంట్ అనుమతినివ్వడంతో కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం రవికి 12 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్పై సుదీర్ఘంగా ఇరు వర్గాల వాదన కొనసాగింది. కాగా, డిసెంబర్ 3న మరోసారి నాంపల్లి కోర్టు విచారించనుంది.
MNCL: దండేపల్లి మండలంలో బాలిక మిస్సింగ్, హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులు శనిగారపు బాపు, ఉపారపు సతీష్ను సోమవారం శ్రీ సిద్ది వినాయక హనుమాన్ టెంపుల్, మాదాపూర్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు, 2 బైక్లు, బాధితురాలి 2 గాజులు, ఒక పట్టగొలుసు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు.
BHNG: రామన్నపేట మండలం, సూరారం, తుర్కపల్లి, బాచుప్పల గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం నార్కెట్ పల్లిలోని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసానికి చేరుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సూరారం, తుర్కపల్లి సర్పంచిగా బరిలో నిలిచిన బందెల జయశ్రీ పుల్లయ్య, జూలకంటి ధనమ్మ నరసింహలకు బీఆర్ఎస్ మద్దతును ఆయన ప్రకటించారు.
NGKL: వంగూర్ మండలంలోని నిజాంబాద్ గ్రామం సమీపంలోని వ్యవసాయ పొలంలో విద్యుత్ ఘాతంలో సోమవారం సాయంత్రం ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన తోట బాలకృష్ణయ్య వ్యవసాయ పొలంలో ఆవు మేత మేస్తుండగా ట్రాన్స్ ఫార్మర్ వద్ద అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు.
ADB: రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు MLA బొజ్జ పటేల్, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడే గజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ నెల 4న CM రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నాయకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
HYD: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్లో సైతం ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు తెలిపారు.
SRPT: జిల్లాలో జరగనున్న మూడు విడతల పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రతి విడతకు 1,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. రూట్ మొబైల్స్తో పాటు ఎస్పీ, డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులు రంగంలోకి దిగుతాయనీ పోలింగ్ బూత్ల 100 మీటర్ల పరిధిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
WNP: శ్రీరంగపూర్ మండల కేంద్రంలోని వెంకటాపూర్ ఎక్స్ రోడ్డు నందు శ్రీరంగపూర్ పోలీసులు ఈరోజు సాయంత్రం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఏఎస్ఐ మన్యపు రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు కోడ్ అమలులో ఉన్నందున రూ.50 వేల నగదుకు మించి ఎక్కువ తీసుకెళ్లరాదని, తీసుకెళ్తే సరైన పత్రాలు ఆధారాలు చూపించాలన్నారు. అలాగే విలువైన వస్తువులు కూడా ఎక్కువగా తీసుకెళ్లరాదని వారు సూచించారు.
NLG: మిర్యాలగూడ మండలం, ఆలగడప గ్రామంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన 100 మంది సోమవారం సీపీఎంలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పక్షాన నిరంతరం పోరాడే సీపీఎంలో చేరాలన్నారు. సర్పంచులుగా సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.