• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తాటికల్లు ఆస్వాదించిన మాజీ మంత్రి

JN: కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటనలో భాగంగా శనివారం తాటికల్లు ఆస్వాదించారు.తాటికల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, మండల, గ్రామ స్థాయిల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

January 17, 2026 / 08:47 PM IST

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష

హనుమకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 26న జరుగు గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్ నెమరుగముల రవి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులతో ఏర్పాటలను సమీక్షించి దిశ నిర్దేశం చేశారు.

January 17, 2026 / 08:47 PM IST

ప్యారడైజ్ నుంచి శామీర్ పేట.. రెండేళ్లు TARGET

MDCL: ప్యారడైజ్ నుంచి శామీర్ పేట వరకు నిర్మించనున్న సెకండ్ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన టెండర్ ఖరారైనట్లు HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కారిడార్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ఉత్తర హైదరాబాద్‌కు అనుసంధానం మరింత మెరుగవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

January 17, 2026 / 08:44 PM IST

తెల్లాపూర్‌లో AKAAY PLAY విద్యా సంస్థ ప్రారంభం

SRD: అంతర్జాతీయ ప్రమాణాలతో నిండిన AKAAY PLAY విద్యాసంస్థను 2026 గాను తెల్లాపూర్‌లో ప్రారంభిస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి తెలిపారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెల్లాపూర్ ప్రాంతంలోని ప్రజలకు ఆధునిక విద్యా సంస్థను ప్రారంభిస్తున్నామని అన్నారు. నూతన స్కూల్ ప్రారంభోత్సవానికి జిల్లా BJP అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హాజరయ్యారు.

January 17, 2026 / 08:42 PM IST

పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు, విద్యుత్ అంతరాయాలపై చర్చించారు. పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

January 17, 2026 / 08:41 PM IST

జాతర భద్రతల పై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి

MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా శాంతి భద్రతల ఏర్పాట్ల పై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను SP సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి సందర్శించి.. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. భద్రతలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతి చిన్న అంశాన్ని అప్రమత్తంగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

January 17, 2026 / 08:39 PM IST

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పలువురు చేరికలు

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శనివారం పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ట్రైసిటీ అధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు వారందరికీ కండువాలు కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు.

January 17, 2026 / 08:34 PM IST

బస్సు ఎక్కే సమయంలో మహిళకు గాయాలు

ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాంనగర్ గ్రామానికి చెందిన మహిళ బస్సు ఎక్కుతుండగా బస్సు టైరు కాలు మీదుగా వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మహిళ కాలు నుజ్జునుజ్జు అయ్యింది. గాయపడిన మహిళను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

January 17, 2026 / 08:33 PM IST

‘పిల్లలతో పని చేయించడం చట్టరీత్యా నేరం’

ADB: పిల్లలతో పని చేయించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామ సమీపంలో పాఠశాలకు వెళ్లకుండా పని ప్రదేశాలలో తిరుగుతున్న వారిని గుర్తించి చదువు ప్రాముఖ్యతను వారికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. పిల్లలను తల్లిదండ్రులు వెంట తీసుకెళ్లకుండా పాఠశాలకు పంపాలని సూచించారు.

January 17, 2026 / 08:31 PM IST

సర్పంచుల ఫోరం చైర్మన్ సన్మానించిన ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెజ్జంకి మండల సర్పంచుల ఫోరం ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గూడెల్లి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచుల సమావేశంలో గూడెం గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్‌ను సర్పంచుల ఫోరం ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు.

January 17, 2026 / 08:31 PM IST

డాక్టర్ లావణ్య కుటుంబానికి న్యాయం చేయాలి: కలెక్టర్‌కు డీసీసీ

GDWL: పేదరికాన్ని జయించి డాక్టర్ అయిన బిడ్డను కుల వివక్షతో బలి తీసుకోవడం దారుణం అని డీసీసీ అధ్యక్షుడు పటేల్ రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్‌ను కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో మోసం చేసి లావణ్య మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

January 17, 2026 / 08:31 PM IST

నల్గొండలోని ఈ ప్రాంతాల్లో కరెంటు బంద్

NLG: నల్గొండలో ఆదివారం ఉ. గం.9:00ల నుండి మ. 2:00 గంటల వరకు  కరెంటు బంద్ ఉంటుందని ఏడీఈ వేణుగోపాలచారి తెలిపారు. శాంతినగర్, AR నగర్, ముశంపల్లి రోడ్డు, రహమత్ నగర్, హైదర్ ఖాన్ గూడా, బాలాజీ ఫంక్షన్ హాల్, లిటిల్ ఫ్లవర్ కాలేజీ, సాయినగర్, ప్రకాశం బజార్, మన్యంచెలక, మిర్యాలగూడ రోడ్డు, ప్రియదర్శిని, అన్సారీ కాలనీలు, SR గార్డెన్, కుంటకట్ట ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుంది.

January 17, 2026 / 08:30 PM IST

డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి.. GHMCపై ఆగ్రహం

MDCL: రామంతపూర్ రాంరెడ్డి నగర్ కాలనీ డ్రైనేజీ కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. వ్యక్తి సింగ జోగి నరసింహ (50) S/O క్రాంతిగా స్థానికులు నిర్ధారించారు. కాలనీలో రోడ్డు పరిస్థితి అద్వానంగా ఉందని, డ్రైనేజీపై పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

January 17, 2026 / 08:28 PM IST

మొంథా తుఫాన్ నష్టాలను పరిశీలించిన..కేంద్ర బృందం

WGL: నెక్కొండ మండల కేంద్రం, చంద్రుగొండ, దీక్షకుంట తదితర గ్రామాల్లో ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా ఏర్పడిన విస్తృత నష్టాలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కేంద్ర బృందం ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నీటమునిగిన వరి పంటలు, నివాస గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, పశువుల నష్టాన్ని బృందం ప్రత్యక్షంగా అంచనా వేసింది. బాధితులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు.

January 17, 2026 / 08:26 PM IST

అభివృద్ధి చేసింది మేమే.. ఓటు అడిగే హక్కు మాదే: ఎమ్మెల్యే

NZB: భీమ్​గల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు తమ పార్టీకే ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని ఎల్​జే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపల్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగ హాజరయ్యారు.

January 17, 2026 / 08:22 PM IST