MBNR: జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో ఆదివారం వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభానికి మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినా సరఫరా జరగడంతో ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు, మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
BDK:పేద ప్రజలకు అండగా ఎర్ర జెండా నిరంతరం పని చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. అయోధ్య అన్నారు. ఆదివారం మణుగూరు సమితి సింగారంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజల హక్కుల కోసం సీపీఐ పోరాడుతుందని చెప్పారు. పేద ప్రజలకు, ప్రజా పోరాటాలకు ఎర్రజెండా దిక్సూచి అని తెలిపారు. మణుగూరు అభివృద్ధిలో సీపీఐ పాత్ర మరువలేనిదన్నారు.
JGL: ధర్మపురి పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరుట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోరుట్ల నియోజకవర్గంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కోరుట్లలో అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా కళ్యాణ కట్ట రూ.1,70,000, VIP దర్శనాలు రూ.13,05,000, బ్రేక్ దర్శనాలు రూ.5,97,300, ప్రసాద విక్రయాలు రూ.22,43,690, కార్ పార్కింగ్ రూ.6,08,500, వ్రతాలు రూ.2,02,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 63,64,480 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.
MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఆదివారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజల ఆరోగ్యానికి వరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల కృష్ణయ్య, సలాం, కురువ మన్యం పాల్గొన్నారు.
SRPT: మోడీ పాలనలో కార్పొరేట్లకే రెడ్ కార్పెట్ వేస్తోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్లోని అమరవీరుల భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ విధానాల వల్ల అన్ని రంగాలు నిర్వీరం అయ్యే పరిస్థితి దాపురించిందని, ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్నారు.
NLG: నకిరేకల్లోని గురు మందిరంలో వేసవి బాలల సంస్కార శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. విశ్వహిందూ పరిషత్, జిల్లా మాతృ శక్తి ఆధ్వర్యంలో పది రోజుల శిక్షణలో 100 మందికి పైగా బాలలు పాల్గొని శ్రీరామాయణం, నిత్య ప్రార్ధన శ్లోకాలు, హనుమాన్ చాలీసా, ఆటలు, వ్యాయామం, కథలు, దేశభక్తి గీతాలు, కోలాటం వంటి అంశాల్లో శిక్షణ పొందారు.
SRPT: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ శివారులోని దర్గా వద్ద కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి ఇటుక బట్టిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు.
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో దేశం కోసం వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన పోరులో వీర మరణం పొందిన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.
KMR: మాతృమూర్తి అమ్మ ఆప్యాయత ఎంతో గొప్పదని కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే అన్నారు. మాతృ దినోత్సవ సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే తన తల్లి కాళ్ళకు పాదాభివందనం చేశారు. మాతృ దినోత్సవం సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తన తల్లికి పాదాభివందనం చేసి నమస్కరించారు.
సంగారెడ్డి: కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడిల హానిక EAPCET పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 692 ర్యాంక్ సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గడిల నవీన, గడిల శ్రీనివాస్ రెడ్డి ఆనందంతో ఉప్పొంగి పోయారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం, కృషితో మంచి ర్యాంకును సాధించగలిగానని హానిక తెలిపింది. ఆమెను గ్రామస్తులు అభినందించారు.
HYD: శ్రీ నరసింహ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సికింద్రాబాద్ బాటా సమీపంలోని శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. ఆలయాన్ని పుష్పాలతో ఎంతో అందంగా అలంకరించారు. వేద పండితులతో హోమాలు, భక్తిగీతాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
KMR: పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైలాన్ వద్ద జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు లింగారెడ్డి భిక్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ గారి చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతుల పక్షపాతి షబ్బీర్ అలీ అని అన్నారు.
NRML: నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామంలోనీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. భారత సైనికులకు ఆత్మ స్థైర్యం నింపాలని ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ మండల, గ్రామ కేంద్రాల్లో గల ఆలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖయ్యుం మరణించగా ఆదివారం జరిగిన ఆయన అంత్యక్రియలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ధైర్యం చెప్పి పరామర్శించారు. మంచి నాయకుడిని కోల్పోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.