KNR: చిగురుమామిడి మండలంలో మొత్తం 17 గ్రామపంచాయితీ సర్పంచ్, ఉప సర్పంచ్లు అలాగే మండలంలోని 157 వార్డు సభ్యులకి రేపు ప్రమాణస్వీకారం జరుగనుంది. మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న స్పెషల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ఎన్నుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు
MDCL: రామంతపూర్, హబ్సిగూడ డివిజన్ పరిధిలో ట్రంక్ లైన్ పూడికతీయుట పనులకు HMWSSB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కీలక పనుల కోసం జలమండలి రూ. 1.98 కోట్ల నిధులను మంజూరు చేసింది. వర్షాకాలంలో మురుగు నీరు పొంగి పొర్లటం, నీటి నిల్వలు ఏర్పడకుండా ముందస్తు చర్యగా డీసిల్టింగ్ చేపట్టనున్నారు. పనులు పూర్తయితే కాలనీల్లో పారిశుధ్యం మెరుగుపడి ప్రజలకు ఉపశమనం కలగనుంది.
SRD: సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయం సమీపంలో భవిత సెంటర్ భవన నిర్మాణానికి ఆదివారం స్థానిక నూతన సర్పంచ్ శ్రీనివాసరావు సమక్షంలో SSA ఏఈ ముగ్గు వేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం ఈ భవన నిర్మాణానికి సర్వ శిక్ష అభియాన్ కింద రూ. 9.50 లక్షల నిధులు మంజూరైనట్లు చెప్పారు.
MDK: నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం ఎస్సై రాజేష్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించే వాహనా దారులు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. అలాగే ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని కోరారు.
NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఇంజనీరింగ్ శాఖల విభాగాల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్, నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
MDCL: మేడ్చల్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మేడిపల్లి మండలం పరిధిలో ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలం 23 ఉన్నత పాఠశాల నుంచి సుమారు 10 వేల మంది విద్యార్థులు ఇంటర్ చదువుల కోసం వెళ్తున్నారు. వారికి ఇబ్బందులు తప్పటం లేదు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ CPI కార్యదర్శిగా దాగం మల్లేష్ ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణ CPI కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా మల్లేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో CPI బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నాయకులు వెంకటస్వామి, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
జనగామ పట్టణ కేంద్రంలో సోషల్ వాయిస్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ కింగ్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ మారబోయిన పాండు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కలవరకే ఉచిత మందులు అందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
KMR: పెద్ద కొడప్గల్ మండలం అంజని గేట్ దగ్గర జాతీయ ప్రధాన 161 రహదారిపై ఆదివారం ఎస్సై అరుణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. సీటు బెల్టు, హెల్మెట్లను కచ్చితంగా వాడాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని గుంజాల గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ కుమ్ర న్యానేశ్వర్, ఉప సర్పంచ్ సందీప్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆదివారం ఆసిఫాబాద్ పట్టణంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ ఆమె పేర్కొన్నారు.
SDPT: కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించి రాత్రి భోజనం వసతిని పరిశీలించారు. వంట గదికి వెళ్లి రాత్రి భోజనానికి సంబంధించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించారా, సన్నబియ్యం నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. కామన్ డైట్ ప్రకారం భోజనం అందించాలన్నారు.
VKB: తాండూర్లోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 850 మంది విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. అండర్-14,16 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అండర్-14 విభాగంలో ‘విశ్వవేద హైస్కూల్’ విద్యార్థి క్రిత్విక్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి బహుమతి అందుకున్నాడు.
KMR: సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలవడం గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి యెండల లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్ఛార్జి విక్రంరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో బీజేపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమవేశం కార్యక్రమం నిర్వహించారు.
PDPL: ఇంటర్ స్టేట్ ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ కరాటే పోటీల్లో ముత్తారం మండలంలోని దరియాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కటా విభాగంలో 13 బంగారు పతకాలు, 10 వెండి పతకాలు, 01 కాంస్య పతకంతో పాటు కుమితి విభాగంలో 2 బంగారు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఎంఈవో హరిప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్ అభినందించారు.
WNP: కొత్తకోట మండల కేంద్రంలో గురులయ్య అబిద్ హుస్సేన్ ఆశ్రమ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ముస్లిం సోదరులు నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సర్వమతాల సారాంశం ఒక్కటేనని, నియోజకవర్గంలో సామరస్య పూర్వక వాతావరణాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు.