• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం, కార్ పార్కింగ్, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.35,49,759 ఆదాయం వచ్చిందన్నారు.

April 14, 2025 / 07:14 PM IST

అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: మాజీమంత్రి

WNP: చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. రేవల్లి మండలం చెన్నారంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో సోమవారం నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీమంత్రి మాట్లాడుతూ.. పండుగలు భక్తి భావం,ఐక్యమత్యం పెంపొందిస్తాయన్నారు.

April 14, 2025 / 05:37 PM IST

పదవి విరమణ పొందిన హోంగార్డును సన్మానించిన సీపీ

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి బెల్లంపల్లి సబ్ యూనిట్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రాజలింగు కుటుంబాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆత్మీయంగా సన్మానించారు. కమిషనరేట్లోని ఆయన కార్యాలయంలో రాజలింగుకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. అడిషనల్ DCP అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ACP రాఘవేంద్రరావు ఉన్నారు.

April 14, 2025 / 05:35 PM IST

దళితులను అవమానించడమే ప్రజా పాలనా?: కవిత

NZB: దళితులను అవమానించడమే ప్రజా పాలనా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘X’ లో ప్రశ్నించారు. లింగంపేట మండలంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నం అని కవిత అన్నారు. బట్టలు విప్పి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

April 14, 2025 / 05:27 PM IST

కుమారుడి పేరుపై ట్రస్ట్‌ను ప్రారంభించిన బాబు మోహన్

HYD: విద్య, వైద్యంతో పాటు ఆర్థికంగా వెనుకబడి వారికి చేయిత అందించేందుకు తన కుమారుడి పేరుపై ట్రస్ట్‌ను ప్రారంభించినట్లు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు. పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్‌ను హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఆయన ప్రారంభించారు. తన కుమారుడు 2003లో రోడ్డు ప్రమాదంలో మరణించాడని గుర్తు చేసుకున్నారు.

April 14, 2025 / 05:27 PM IST

విలేకరి కుటుంబాన్ని పరామర్శించిన MLA వినోద్

MNCL: నెన్నెల గ్రామనికి చెందిన మన తెలంగాణ వార్త పత్రిక విలేకరి రేణిగుంట్ల వెంకన్న ఇటీవల గుండె పోటుతో మరణించారు. విషయం తెలిసిన MLA వినోద్ సోమవారం వారి ఇంటికి వెళ్లి వెంకన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. వెంకన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

April 14, 2025 / 05:07 PM IST

ఘనంగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

NZB: బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజ్, జిల్లా కార్యదర్శి వినయ్ కుమార్, ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు అలుక కిషన్, అమృత్ తదితరులు ఉన్నారు.

April 14, 2025 / 05:06 PM IST

అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పూల అంబేద్కర్ చిత్ర పటనికి మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

April 14, 2025 / 04:52 PM IST

‘అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

NZB: చందూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ . అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2025 / 04:48 PM IST

అంబేడ్కర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ నివాళి

HYD: అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. రాజేంద్రనగర్ చౌరస్తా, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను గుర్తుంచుకోవాలని.. న్యాయం, సమానత్వంపై ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

April 14, 2025 / 04:27 PM IST

హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి: కమాండెంట్

SRCL: దళిత హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి సర్దాపూర్‌లోని బెటాలియన్‌లో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితుల హక్కుల కోసం పోరాటమే కాకుండా దేశ మొదటి న్యాయమంత్రిగా పనిచేసి ఎన్నో సేవలను అందించాలని కొనియాడారు.

April 14, 2025 / 03:04 PM IST

CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

NRML: నిర్మల్ పట్టణం బంగాల్పేట్ కు చెందిన సుంకరి నరేష్ ఇటీవల అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందగా వారికి మంజూరైన 90 వేల CMRF చెక్కును ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆస్పత్రులలో ఖరీదైన చికిత్స అందించేందుకు CMRF ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

April 14, 2025 / 02:18 PM IST

‘అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేడ్కర్’

SRD: దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్విరామంగా పోరాడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ చరిత్రను రచించి, ప్రపంచం గర్వించదగిన మేధావి ఆయన అని పేర్కొంటూ కొనియాడారు.

April 14, 2025 / 11:03 AM IST

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

MHBD: అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

April 14, 2025 / 10:59 AM IST

సమ సమాజ స్థాపన స్నాపికుడు అంబేద్కర్

KMM: భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్భంగా.. సోమవారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని, కస్నాతండాలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రామస్తులు పూలమాలలేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామమూర్తి మాట్లాడుతూ.. అంబేద్కర్ సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన స్నాపికుడని అన్నారు.

April 14, 2025 / 09:45 AM IST