ADB: జిల్లాలో గంజాయిని కనుమరుగు చేయడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని SP అఖిల్ మహాజన్ తెలియజేశారు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ శివారులో గంజాయి మొక్కలు పండిస్తున్న తండ్రి, ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఒకరిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయిని పండిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
KMR: రామారెడ్డి మండలంలోని మద్దికుంట మండల పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశానుసారం ఫ్రీ ప్రైమరీ (యల్కేజీ)ని మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు ప్రారంభించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో ప్రీ ప్రైవరీ ప్రారంభించడం సంతోషదగ్గ విషయమని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు 4 సంవత్సరాలు నిండిన తమ పిల్లలను పాఠశాలకు పంపి వినియోగించుకోవాలని సూచించారు.
NGKL: పోలీసులపై దాడి చేసిన ఓ వ్యక్తికి కల్వకుర్తి న్యాయస్థానం రెండేళ్లు జైలు శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించింది. ఈ విషయాన్ని కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి శుక్రవారం తెలిపారు. దొంగతనం కేసులో నిందితుడైన జీడిపల్లి గ్రామానికి చెందిన సైదులును అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్ళగా, అతడు పోలీసులపై దాడి చేశారు. దీంతో కోర్టు అతనికి శిక్ష ఖరారు చేసింది.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 7వ వార్డు శాంతినగర్ కాలనీలో రహదారి శిథిలమై, మట్టిరోడ్డుపై వర్షాల వల్ల గుంతలు పడి ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు శుక్రవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.
MNCL: తాడ్లపేట అటవీ రేంజ్ పరిధిలో అటవీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని FRO సుష్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు ప్రాంతాల ఆక్రమణదారులు ప్రణాళికబద్ధంగా కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో అటవీ సిబ్బందిపై దాడి చేసి మిర్చి పొడిని అటవీ సిబ్బంది కళ్ళపై బలవంతంగా రుద్దారని తెలిపారు. నిందితులను దండేపల్లి పోలీసులు అరెస్టు చేశారన్నారు.
NRML: కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈరోజు రాత్రి వరద గేట్లు తెరిచి నీటిని వదిలే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నది పరివాహక ప్రాంతం దిగువన పశువులు, పల్లెకారులు, గొర్రె కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KMR: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ‘ఐకేపీ’ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ఐకేపీ డీపీఎం రాజయ్య తెలిపారు. బిక్కనూరు మండలంలో 673 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 95 మంది డ్వాక్రా మహిళలకు రూ.1.17 కోట్ల రుణాలు అందించామని ఆయన చెప్పారు. ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండాలని సూచించారు. ఇది మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుందని ఆయన అన్నారు.
MLG: ఏటూరునాగారం మండలం కేంద్రంలోని కొండై గ్రామం నుంచి ఊరటం వెళ్లే మట్టి రహదారి గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇవాళ గ్రామస్థులు ఐకమత్యంతో చెక్కలు, మట్టితో తాత్కాలికంగా రోడ్డును బాగుచేశారు. ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతోందని, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
గద్వాలలోని హమాలీ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు మున్సిపల్ కమిషనర్కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ. నర్మద మాట్లాడుతూ.. కాలనీలో వీధి లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు.
JGL: కొడిమ్యాల మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం పర్యటించారు. ముందుగా స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో మండలానికి చెందిన 46 ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 12,16,500విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందించారు, తరువాత కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే SGF అండర్-14, అండర్-17 క్రీడలను ప్రారంభించారు.
KMM: గిరిజన వసతి గృహాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, శుక్రవారం ఖమ్మం నగరంలోని గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయం ఎదుట కార్మికులు, ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో, ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు.
BHNG: సర్వాయి పాపన్న మోకు దెబ్బ గీత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన బైరి విశ్వనాథం గౌడ్ను ఎంపిక చేశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జెక్కే వీరస్వామి శుక్రవారం నియామక పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహిళాలకు ప్రీ బస్సు, రూ. 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తుందన్నారు.
MLG: జిల్లా కేంద్రంలో శుక్రవారం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా. అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మేడారం గద్దెల మార్పిడిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివాసీ పెద్దలు, తలపతుల అభిప్రాయాలను పరిగణించాలని, కోయ మూలాలను విస్మరిస్తే ఆలయ గుర్తింపు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
NLG: నల్గొండ పట్టణంలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, పశుసంవర్ధక, మున్సిపల్, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.