• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నీటి సమస్యపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న నీటి సమస్యలపై మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి బుధవారం ముడా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. వేసవి నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని అన్నారు. అన్ని డివిజన్లకు అంతరాయం లేకుండా నీటి సరఫరా జరగాలని అధికారులను ఆదేశించారు.

March 18, 2026 / 01:20 PM IST

అనంతసాగర్ పాఠశాలలో బాలకవి సమ్మేళనం

SDPT: తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నకోడూరు మండలం అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో బాలకవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 20 మంది విద్యార్థులు పాల్గొని తమ కవితలు వినిపించారు. అరవై సంవత్సరాల పేర్లు విద్యార్థులు చదివి వినిపించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులు పర్షరాములు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 18, 2026 / 01:18 PM IST

కమిషనరేట్ పరిధిలో నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారు. 12 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 18, 2026 / 01:16 PM IST

గుండెపోటుతో మాజీ సీపీఎం నాయకుడు మృతి

MHBD జిల్లా వ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా ఈరోజు ఉదయం మాజీ సీపీఎం నాయకుడు కుర్ర మహేష్ హార్ట్ అటాక్‌తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదఛాయలు అమలుకున్నాయి. మహేష్ మృతిపట్ల జిల్లా పరిధిలోని నాయకులు, ప్రజలు సంతాపం తెలుపుతున్నారు.

March 18, 2026 / 01:16 PM IST

తై బజార్ వేలంలో రూ. 43.35 లక్షల ఆదాయం

MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో తై బజార్ వేలంపాటలో రూ. 43.35 లక్షల ఆదాయం సమకూరింది. కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వేలంపాటలు నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన నాగరాజు వేలం పాటల్లో తై బజార్ దక్కించుకున్నారు. గత ఏడాది కంటే రూ. 7.35 లక్షల ఆదాయం అధికంగా సమకూరిందని తెలిపారు.

March 18, 2026 / 01:15 PM IST

ఉచిత మెగా పశువైద్య శిబిరం

BHNG: తుర్కలషాపురంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 284 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసి, 48 పశువులకు గర్భకోశ వ్యాధి పరీక్షలు చేసి మందులు అందజేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ యాకుబ్ మాట్లాడుతూ.. రైతులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 18, 2026 / 01:15 PM IST

పాత పద్ధతిలోని ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి: సీఐటీయూ

NLG: పాత పద్ధతిలోని ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని CITU జిల్లా కార్యదర్శి సలీం డిమాండ్ చేశారు. మండలంలోని దుప్పలపల్లిలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను ఇవాళ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘VB రాంజీని’ రద్దుచేసి ‘MG జాతీయ ఉపాధి హామీ పథకాన్ని’ కొనసాగించాలని కనీస వేతనం రూ.600 ఇవ్వాలని కోరారు.

March 18, 2026 / 01:11 PM IST

నార్నూరులో పర్యటించిన పోలీస్ ఈగల్ టీం

ADB: నార్నూర్ మండలంలోని నాగల్కొండ గ్రామంలో బుధవారం ‘పోలీస్ ఈగల్ టీం’ పర్యటించింది. ఈ సందర్బంగా మత్తు పదార్థాల నియంత్రణపై ఎస్సై శ్రీసాయి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, గుట్కా, మద్యం వంటి పదార్థాలను పూర్తిగా నిషేదించాలని సూచించారు. గంజాయి విక్రయించినా, తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదు పాల్గొన్నారు.

March 18, 2026 / 01:11 PM IST

రేపు వాసవీమాత ఆలయంలో ఉగాది పూజలు

GDWL: రేపు ఉగాది పండుగను పురస్కరించుకుని శాంతినగర్ లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకుడు వినయ్ కౌశల్ తెలిపారు. వేకువజామున అమ్మవారికి అభిషేకం, అర్చన, మహా మంగళహారతితో పాటు పంచాంగ శ్రవణం, గోమాత పూజ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

March 18, 2026 / 01:10 PM IST

కొండాపురంలో రంజాన్ తోఫా పంపిణీ

BHNG: జిల్లాలోని తుర్కపల్లి మండలం కొండాపురంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు తోఫా పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప సర్పంచ్ జహంగీర్, వార్డ్ సభ్యులు స్వప్న, మధు, రవికిరణ్, పాండు పాల్గొన్నారు.

March 18, 2026 / 01:10 PM IST

కేల్ మహోత్సవ కరపత్రాల ఆవిష్కరణ

NRPT: మరికల్ మండలంలో భారతదేశపు అతిపెద్ద క్రీడా వేడుకగా భావించే భారత ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. క్రీడాకారులు మార్చి 24వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

March 18, 2026 / 01:10 PM IST

‘కౌన్సిలర్లు ప్రజలకు సమయం కేటాయించాలి’

RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమని మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమతా వెంకట్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది రోడ్లన్నీ శుభ్రం చేశారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజలకు సమయం కేటాయించి వారి సమస్యలు తెలుసుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ సూచించారు.

March 18, 2026 / 01:08 PM IST

రేపు ఆర్కే కన్వెన్షన్‌లో ఉగాది వేడుకలు

NRML: ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను గురువారం స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు జబర్దస్త్ టీం సభ్యులు హాజరవుతున్నారని ఉగాది పచ్చడి వితరణ, పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బుధవారం పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు.

March 18, 2026 / 01:06 PM IST

గ్రామపంచాయతీకి ఫర్నిచర్ బహుకరణ

NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామ సర్పంచ్‌గా తన చిన్ననాటి మిత్రుడు సాగర్ల భానుశ్రీ భిక్షం ఎన్నికైన సందర్భంగా..1998 టెన్త్ బ్యాచ్‌కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ గుత్తా శ్రీధర్ రెడ్డి, పిశాటి జంగారెడ్డి తమ స్నేహాన్ని చాటుకున్నారు. రూ.60 వేల విలువైన నూతన ఫర్నిచర్‌ను గ్రామ పంచాయతీకి విరాళంగా అందజేశారు. ఈ ఉదారతకు సర్పంచ్ భానుశ్రీ భిక్షం కృతజ్ఞతలు తెలిపారు.

March 18, 2026 / 01:01 PM IST

నేడు ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిపై సమీక్ష

NGKL: వెల్దండ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిపై నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కృష్ణయ్య తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 75 ఇండ్ల గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని.. ఈ సమావేశానికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.

March 18, 2026 / 01:00 PM IST