HYD: నగరానికి ఎగిరే టాక్సీలు రానున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ ‘వర్టిపోర్ట్స్’ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విమానాలకు రన్-వే కావాలి. కానీ ఈ ఎయిర్ టాక్సీలు హెలికాప్టర్ లాగా నిలువుగాపైకి లేస్తాయి, కిందకు దిగుతాయి. అందుకే వీటికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్లు కాగా, ఇలా యాప్లో బుక్ చేస్తే అలా వచ్చి ఇంటిమీద వాలిపోతాయి.
అదిలాబాద్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని తాంసి మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డాడి మత్తడి వాగు ప్రాజెక్టు కప్పర్ల వైపు వెళ్లే లెఫ్ట్ కెనాల్ను రైతుల కోసం మరమ్మతులు చేపట్టాలని కోరారు. అదేవిధంగా మండలానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సీఎం సానుకూలంగా స్పందించారని నారాయణ తెలిపారు.
BDK: పాల్వంచ టౌన్ సీతారాంపట్నం కాలనీలో శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆధ్వర్యంలో 300 మంది సీపీఐ పార్టీలో చేరారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ జెండా ఎగరవేయాలని ఆయన సూచించారు.
GDL: ఇటీవల నూతనంగా ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లు జిల్లాలోని DMHO ఆఫీస్లో రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు DMHO డాక్టర్ J. సంధ్య కిరణ్మయిని కలిసి శాలువాతో సత్కరించారు. DMHO మాట్లాడుతూ.. నూతనంగా ఎంపికైన 5 మంది టెక్నీషియన్లలో ముగ్గురిని ఇటిక్యాల, ధరూర్, క్యాతూర్ PHCల్లో, ఇద్దరిని PP యూనిట్, DMHO ఆఫీస్లో నియమిస్తున్నట్టు తెలిపారు.
NGKL: రాయలగండి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు రాయలగండి చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కుంద మల్లికార్జున్, అనిల్ పాల్గొన్నారు.
KMR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీనీ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల 2026 నేషనల్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన ఆమె ‘వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్-2025’స్మారక జాకెట్ను ఆయనకు బహూకరించారు. రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్న నిఖత్ను ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ప్రత్యేకంగా అభినందించారు.
SRD: సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో ఈనెల 17 నుంచి 19 వరకు ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఈవెంట్లు ఉంటాయని పేర్కొన్నారు. 15 నుంచి 21 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
BDK: కొత్తగూడెం నగర పాలక సంస్థలో ఓటర్ల జాబితాను డివిజన్, పోలింగ్ బూత్ వారీగా ప్రచురించడం జరిగిందని కమిషనర్ సుజాత ప్రకటించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్ 11, 12 ప్రకారం, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 60 డివిజన్లు, 201 పోలింగ్ బూత్ల జాబితాను విడుదల చేశామని తెలిపారు. తహశీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు.
VKB: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల రిజర్వేషన్ల ఖరారుకు జిల్లా యంత్రాంగం సిద్దమైంది. ఇవాళ ఉ.11:30 గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలిపారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది.
SDPT: పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ &డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 13 మందికి రూ.1,32,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. వీరిని వాహన తనిఖీల్లో పట్టుకున్నామని, మద్యం సేవించినట్లు నివేదిక రావడంతో స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.
HNK: పరకాల బస్టాండ్ ప్రధాన కూడలిలో గుర్తు తెలియని వ్యక్తి దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపై పడిఉండటంతో అక్కడ సంచలనం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన ఒక సామాజిక కార్యకర్త వెంటనే 108 ఎంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, కేవలం ఐదు నిమిషాల్లో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అందించి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్లోని 9వ డివిజన్ అలకాపురి కాలనీలో అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. శ్రద్ధ ఇన్ హోటల్ నుంచి హనుమాన్ దేవాలయానికి వెళ్లే రోడ్డు మధ్యలో తవ్విన గుంతను 2 నెలలు గడుస్తున్నా పూడ్చకుండా వదిలేశారు. దీనివల్ల రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు పట్టించుకోవడ లేదని, సమస్య పరిష్కరించాలన్నారు.
GDWL: ధరూర్ మండలం రేవులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గ్రూప్-3 ఉద్యోగం సాధించారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళావేదికలో నియామక పత్రాన్ని అందుకున్నారు. నాగరాజును తల్లి నర్సమ్మ కష్టపడి చదివించింది. పేద కుటుంబంలో పుట్టి మూడు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 2018లో పంచాయతీ సెక్రటరీ, గ్రూప్ -4 ఉద్యోగాలు వచ్చాయి.
NGKL: రాత్రిళ్లు ఇళ్ల ముందు బైక్ పార్క్ చేసే వారు జాగ్రత్తగా ఉండాలని లింగాల SI వెంకటేశ్వర్ గౌడ్హెచ్చరించారు. లింగాలలో శుక్రవారం ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ను దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోయి సుమారు రూ.20,000 నష్టం అయింది. బాధితుడు గువ్వన భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు.