• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కలెక్టరేట్‌లో వందేమాతర గీతం ఆలాపన

JGL: అఖండ భారతావనికి స్వాతంత్య్ర కాంక్షను కలిగించిన వందేమాతరం గేయం నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలల్లో వందేమాతరం సామూహిక గేయా ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత పాల్గొన్నారు.

November 7, 2025 / 12:51 PM IST

‘అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు’

ASF: అటవీ సంపదను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని FRO మజారుద్దీన్ అన్నారు. రేంజ్ పరిధిలోని జైనూర్‌లో శుక్రవారం ఫారెస్ట్ బీట్లను సందర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. అటవీ సంపద, వన్యప్రాణులను సంరక్షించుకోవాలన్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు ఏర్పాటు చేసినా, కరెంటు తీగలను అమర్చినా అటవీ చట్టాల ప్రకారం శిక్షలు తప్పవన్నారు.

November 7, 2025 / 12:44 PM IST

జూబ్లీహిల్స్‌లో రెట్టింపు అభివృద్ధి చేస్తాం: కోమటిరెడ్డి

NLG: కంటోన్‌మెంట్ కంటే జూబ్లీహిల్స్‌లో రెట్టింపు అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు రహమత్ నగర్‌లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ మాట్లాడారు. BRSను నమ్మి ఓటేస్తే గోస పడతామన్నారు. అసెంబ్లీకి రాని KCR అధికారంలోకి ఎలా వస్తారని అన్నారు. 

November 7, 2025 / 12:40 PM IST

కలెక్టరేట్ లో సామూహిక జాతీయ గీతాలాపన

ASF: బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సామూహిక గానం చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. కలెక్టరేట్లో వందేమాతరం సామూహిక గీతాలాపన నిర్వహించామన్నారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు వందేమాతరం ఆలపించమన్నారు.

November 7, 2025 / 12:40 PM IST

కానూరులో వందేమాతర గేయాలాపన

JN: జఫర్‌గడ్ మండలం కానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ గర్వాందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వందేమాతర గేయం 150 ఏళ్ల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొని సామూహిక వందేమాతర గేయాలాపన చేశారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వందేమాతర గేయం పట్ల గౌరవం, దేశభక్తిని చాటుకున్నారు.

November 7, 2025 / 12:37 PM IST

పోచారం ప్రాజెక్టులోకి 782 క్యూసెక్కుల వరద నీరు

KMR: నిజాం కాలం నాటి పోచారం ప్రాజెక్టులోకి ఈ ఖరీఫ్ సీజన్‌లో వరద కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 782 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తుందని ప్రాజెక్టు డీఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద మంజీరలో పడి నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి వెళ్తుంది. ఈసారి 29.410 టీఎంసీల వరద రావడం రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించింది.

November 7, 2025 / 12:36 PM IST

భూ సేకరణను నిలిపివేయాలి: CPM

SRD: పటాన్ చెరువు మండల చిన్న కంజర్ల గ్రామంలో పరిశ్రమల పేరుతో రైతుల భూములను తీసుకునే భూ సేకరణను నిలిపివేయాలని సీపీఎం ఏరియా బాధ్యుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 113లో 187 భూ సర్వే సేకరణ పనులను నిలిపివేయాలని అన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వక గెజిట్లో పెట్టడాన్ని వ్యతిరేకించారు. రైతులకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.

November 7, 2025 / 12:35 PM IST

చిట్యాల పోలీస్ స్టేషన్లో వందేమాతరం గీతాలాపన

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ‘వందేమాతరం’ జాతీయ గీతాలాపన చేశారు. సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని సీఐ అన్నారు. పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులున్నారు.

November 7, 2025 / 12:34 PM IST

‘సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా’

RR: హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి ఆనంద్ నగర్ కాలనీలో పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్, వీధి దీపాల వంటి సమస్యలను కార్పోరేటర్‌కు వివరించారు. స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

November 7, 2025 / 12:32 PM IST

సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టి పేలింది ఒకరు మృతి…!

VKB: పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి వద్ద ఉన్న సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు స్టీల్ కరిగించే బట్టి పేలింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందిన మహ్మద్ అలీ (33) గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు రషీద్‌తో పాటు పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

November 7, 2025 / 12:30 PM IST

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా విద్యార్థిని ఎంపిక

సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సుధగోని లహరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయులు శారదా తెలిపారు. ఈ పోటీలు ఖమ్మం జిల్లా పినపాక మండలం బయ్యారంలో ఈనెల 8 నుంచి 10 వరకు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన లహరిని పలువురు అభినందించారు.

November 7, 2025 / 12:25 PM IST

గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితుల అరెస్ట్

MNCL: భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులను ఎస్సై శ్వేత అరెస్ట్ చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. భీమారంలోని ఓల్డ్ ITDA క్వార్టర్స్ వద్ద దుర్గం సమత్, గోదారి దిలీప్ నిషేధిత గంజాయి విక్రయిస్తున్నారని తెలుసుకుని దాడి చేశామన్నారు.

November 7, 2025 / 12:25 PM IST

రౌడీషీటర్లు, ఆస్తి నేరస్థులపై కఠిన నిఘా.!

HYD: రౌడీషీటర్లు, ఆస్తి నేరస్థులపై కఠిన నిఘా పెట్టాలని అధికారులకు రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్ బాబు ఆదేశించారు. జోనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు వీరి నివాసాలు, కదలికలు, రోజువారీ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సమాచారం కలిగి ఉండాలని సూచించారు. సెటిల్‌మెంట్లు, నేర చర్యల్లో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

November 7, 2025 / 12:24 PM IST

వందేమాతరం గేయం ఆలపించిన ఎంపీడీవో

JGL: సారంగాపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వందేమాతం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఎంపీవో మహమ్మద్ సలీం, కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

November 7, 2025 / 12:17 PM IST

‘నూతన ధాన్యం కొనుగోళ్ళు కేంద్రం ప్రారంభం’

GDWL: కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాన్నిమార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుర్వ హనుమంతు ప్రారంభించారు. గతంలో కరువు కాటకాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో, గత పదేళ్ల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

November 7, 2025 / 12:17 PM IST