MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న నీటి సమస్యలపై మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి బుధవారం ముడా కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. వేసవి నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని అన్నారు. అన్ని డివిజన్లకు అంతరాయం లేకుండా నీటి సరఫరా జరగాలని అధికారులను ఆదేశించారు.