NTR: విజయవాడలో దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. కలెక్టర్ మాట్లాడుతూ… 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.