TG: కట్టుకున్న భర్తే.. భార్యను హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటుచేసుకుంది. మార్చి 27న కవిత తన ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో మార్చి 30న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జడ్చర్లలో ప్రియుడితో కలిసి ఉందని గుర్తించి.. ఆమెను తీసుకుని వచ్చేందుకు పోలీసులతో కలిసి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో కారులోనే కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు.
TG: ఖమ్మం జిల్లా కొనిజర్ల వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తెల్లవారుజామున లారీ, కారు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మృతులు రాజమహేంద్రవరానికి చెందిన వీర్రాజు, వీర శైలజగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: సంగారెడ్డి(D) జహీరాబాద్లో భర్త సిద్ధారెడ్డి భార్య కవితను హత్య చేశాడు. మార్చి 27న కవిత ప్రియుడితో వెళ్లిపోవడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలించారు. జడ్చర్లలో ప్రియుడుతో ఉన్నట్లు గుర్తించి.. జహీరాబాద్ తీసుకొస్తుండగా పోలీసులతో వెళ్లిన భర్త మార్గమధ్యంలో భార్యను కత్తితో పొడిచాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: తూర్పు గోదావరి జిల్లాలో కారు పంట కాలువలోకి దూసుకెళ్లడంతో భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను వెలగతోడుకు చెందిన భోగిల్లి సతీష్(40), కిరణ్మయి(36)గా గుర్తించారు. మండపేట మం. తాపేశ్వరం వద్ద ఈ ఘటన జరగ్గా.. గమనించిన స్థానికులు వెంటనే సతీష్ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలను రక్షించారు. కాకినాడలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సతీష్ తల్లిదండ్రులు తెలిపారు.
TG: FBలో మహిళ పేరుతో వచ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ HYDకు చెందిన వీరభద్రరావు అనే టెకీని నిండా ముంచేసింది. ఓ మహిళ ఆన్లైన్ ట్రేడింగ్లో అధిక లాభాలంటూ ఆశ చూపగా.. నమ్మిన వీరభద్రరావు ఓ యాప్ ద్వారా గత SEP-DEC కాలంలో ఏకంగా రూ.2.36 కోట్లు పెట్టుబడి పెట్టాడు. చివరకు లాభాలు రాకపోగా, పెట్టిన డబ్బు కూడా వెనక్కి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
AP: కడప జిల్లా ఆలంఖాన్పల్లెలో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ రేగింది. డీజే డాన్స్ దగ్గర ఈ గొడవ జరగ్గా.. మాటామాటా పెరిగి కత్తితో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పెద్ద దస్తగిరి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని రిమ్స్కు తరలించారు. అతనిపై ఆస్పత్రి ప్రాంగణంలోనూ దాడి జరగ్గా.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KKD: తొండంగి మండలం రావికంపాడు వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం చెందాడు. మృతుడు ఎల్లయ్యపేట పంచాయతీ ఉద్యోగి ఎస్.సత్య వెంకటేష్ (30) గా గుర్తించారు. మృతుడు తన స్వగ్రామమైన అన్నవరం నుంచి వ్యక్తిగత పనులపై కత్తిపూడి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: HYD గోల్గొండ ఖిల్లా ప్రాంతంలో 308 ప్యాకెట్ల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో పోలీసులకు 11 మంది నిందితులు ఉండగా.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 2.03 కిలోల గంజాయి, బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదార్థాలు, గంజాయిని విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
AP: గుంటూరు జిల్లా తాడికొండలో దారుణం చోటుచేసుకుంది. తమ బంధువుపై దాడిచేశాడంటూ మరియదాసు అనే వ్యక్తిని నలుగురు రాళ్లతో కొట్టి చంపేశారు. మద్యం దుకాణంలో రమేష్తో గొడవపడగా.. మరియదాసు బీర్ సీసాతో దాడిచేశాడు. దీనిపై రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. అంతలో అతని బంధువులు మరియదాసుపై రాళ్లతో దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: శ్రీకాకుళం జిల్లా మందస మం. పెద్దకేసుపురంలో విషాదం చోటుచేసుకుంది. జీడితోటలో పిడుగు పడి తల్లీకూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను కృష్ణవేణి, యోగేశ్వరిగా గుర్తించారు. కాగా అకాల వర్షాల నేపథ్యంలో వర్షం పడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
TG: హన్మకొండ జిల్లా గోపాలపురంలో కత్తిపోట్ల కలకలం రేగింది. రూ.3 లక్షల అప్పు విషయంలో కార్తీక్, రామ్ చరణ్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగి గొడవ పెద్దది కావడంతో రామ్ చరణ్పై కార్తీక్ కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఉన్న రామ్ చరణ్ని స్థానికులు MGM ఆస్పత్రికి తరలించారు. కత్తి దాడి అనంతరం పరారైన కార్తీక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AP: కడప జిల్లా వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్ తీగలు తగలడంతో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులోని 21 మంది ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై క్షేమంగా కిందికి దిగారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్రోచ్ రోడ్డుకు మట్టి ఎత్తుగా వేయడంతో బస్సుకు విద్యుత్ లైన్ తాకినట్లుగా స్థానికులు తెలిపారు.
సత్యసాయి: జాతీయ సమైక్యత శిబిరానికి కదిరి STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర, NSS UNIT-1 విద్యార్థిని సారిక ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ స్మిత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం మాండ్యలోని విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరంలో సారిక పాల్గొననున్నట్లు వెల్లడించారు.
TG: భూపాలపల్లి రేగొండలోని రేపాకలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుమారులు తండ్రిని చంపేశారు. చేరాలు భార్య హైదరాబాద్లో ఇద్దరు కుమారుల వద్ద ఉంటుంది. తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న కుమారులు.. ఇంటికి వచ్చేసారికి వారిద్దరూ కలిసి ఉండటంతో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చికిత్సపొందుతూ తండ్రి మృతి చెందాడు.
TG: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లెడలో విషాదం నెలకొంది. పెళ్లైన నెల రోజులకే యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మార్చి 5న శ్రీకాంత్తో అఖిల వివాహం జరిగింది. ఇవాళ అత్తింట్లోనే అఖిల సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.