నెల్లూరు వనంతోపు సెంటర్కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు.
అన్నమయ్య: వాల్మీకిపురం మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విఠలం గ్రామానికి చెందిన రైతు శివారెడ్డి ట్రాక్టర్ను పొలం వద్దకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
KDP: గొల్లపల్లి-జమ్మలమడుగు మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. మైలవరం మండలం గొల్లపల్లి నుంచి జమ్మలమడుగు వెళ్లే రోడ్డుపై లారీ, ట్రాక్టర్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. లారీ ట్రాక్టరు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది.
KDP: గొల్లపల్లి-జమ్మలమడుగు మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. మైలవరం మండలం గొల్లపల్లి నుంచి జమ్మలమడుగు వెళ్లే రోడ్డుపై లారీ, ట్రాక్టర్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. లారీ ట్రాక్టరు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది.
TG: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ట్రావెల్ బస్సు లారీని ఓవర్ టేక్ చేస్తూ.. తాకుతూ వెళ్లింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు పక్కకు వాహనాలను ఆపి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ వారిని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు చనిపోగా.. లారీలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
TG: కామారెడ్డి దొనకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు కాగా ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమినాడులోని చెన్నై శివారులో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఏసీ నుంచి మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హరిప్రసాద్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: కాకినాడ(D) కోటనందూరు(M) కాకరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల కుమారుడితో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులను నర్సీపట్నం పెదబొడ్డేపల్లికి చెందిన భాగ్యలక్ష్మి, సాయిగా గుర్తించారు. భర్త, అత్తమామల వేధింపులే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ATP: తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిని నోటితో కొరికి గాయపరిచిన వింతైన ఘటన బొమ్మనహాళ్ మండలంలో చోటుచేసుకుంది. శ్రీధర్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం రాజన్న వద్ద రూ. 5000 అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీధర్.. రాజన్న చెంపపై నోటితో తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: కరీంనగర్లోని గోపాలపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొడుకు బైక్ అడగడంతో పంట డబ్బులు వచ్చాక కొనిస్తానని తండ్రి మాటిచ్చాడు. అయితే అడిగిన వెంటనే కొనివ్వలేదని మనస్తాపానికి గురైన రిత్విక్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో విద్యార్థి కౌశిక్ మృతిపై చిక్కుముడి వీడింది. తోటి విద్యార్థి నాటు తుపాకీతో కాల్చడంతోనే కౌశిక్ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. తుపాకీతో ఆటలాడుతుండగా ఈ ఘటన జరిగిందని తేల్చిన అధికారులు.. సదరు విద్యార్థి, అతని తండ్రి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
TG: సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. షాద్నగర్లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న ఇద్దరిని ఈగల్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. SR ఇన్నోవేషన్స్ సంస్థ నిషేధిత కెమికల్స్ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఇండియా మార్ట్ ద్వారా రాజస్థాన్కు చెందిన నిందితులకు SR ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ నిషేధిత కెమికల్స్ను సరఫరా చేస్తున్నాడు.
TG:: హైదరాబాద్లోని ముషీరాబాద్లో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రదీప్, విజయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జె.ఆర్.ప్రదీప్ నుంచి హాష్ ఆయిల్ను విజయ్ కుమార్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 367 గ్రాముల హాష్ ఆయిల్, బైక్, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
TG: హైదరాబాద్లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసు పేరుతో రిటైర్డ్ జడ్జిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. CBI అధికారులమని వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్కు పాల్పడ్డారు. బెంగళూరు ఇందిరానగర్లో ఆయనపై కేసు నమోదు అయిందని సైబర్ కేటుగాళ్లు బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో అతని నుంచి రూ.1.66 కోట్లను కొట్టేశారు.