TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ముగ్గురు ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ATP: గుత్తి మండలం చెట్నేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ స్తంభాన్ని సిమెంటు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మత్తు పనులు చేపట్టారు. ఆ సమయంలో ఈ రోడ్డు మార్గాన జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామ సమీపంలో శనివారం ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న ఓ విద్యార్థికి స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.
AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని రీక్రియేషన్ క్లబ్లో ఓ జింక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిరుతపులి బారినపడి చనిపోయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు.. జింక ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా మరణించింది? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: కె .గంగవరం (M) కోటిపల్లికి చెందిన నవ వధువు ఓలేటి వీరలక్ష్మి (19) సూసైడ్ చేసుకోవటం కలకలం రేపింది. ఫిబ్రవరి 26న పెళ్లి అయిన వీరలక్ష్మి పేరెంట్స్ ఇంటి వద్ద ఉరేసుకుని తనువు చాలించారు. తన కూతురు మృతికి అత్తింటి వారే కారణమని మృతురాలి తండ్రి సత్తిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామంలోని ఏసుబాబును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
AP: నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కొలగట్ల గ్రామం వద్ద లారీని తప్పించబోయి బస్సు పక్కకు పడింది. దీంతో ఐదుగురికి గాయాలు కాగా.. వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ జిల్లాలో ఓ కారు బావిలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతిచెందారు. నాసిక్కు 25 కిలోమీటర్ల దూరంలోని దిండోరిలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి చీకట్లో బావిని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని దుండగులు టిప్పర్తో వెంబడించి ఢీకొట్టారు. ఆ యువకుడు తీవ్రంగా గాయపడటంతో రాళ్లతో కొట్టి చంపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: అనంతపురానికి చెందిన లోకేశ్(29) హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఫార్మా కంపెనీలో పనిచేసే యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన, పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి దుస్తులు ధరించి, భోజనం తీసుకురావాలని ప్రియురాలిని బయటకు పంపారు. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
KKD: సామర్లకోటలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. సామర్లకోట, వేట్లపాలెం గ్రామాల ప్రజలు అగ్ని ప్రమాదం పట్ల ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక బృందాలు, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్లాంట్లో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వేట్లపాలెం, కొత్తూరు,సామర్లకోట వరకు పొగ వ్యాపించింది.
TG: సంగారెడ్డి జిల్లా రుద్రారం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పరిశ్రమ బస్సు ఢీకొని పదోతరగతి విద్యార్థిని మృతి చెందింది. రుద్రారం నుంచి బైకుపై వెళ్తున్న విద్యార్థిని బస్సు ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AP: పల్నాడు మాచర్లలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి దాహంగా ఉందని.. మంచినీళ్లు కావాలని నమ్మించి లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించగా.. తనకు HIV ఉందని మొరపెట్టుకున్నా వినకుండా.. ఆమెను స్కార్ఫ్తో కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
AP: పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరిగా ఉన్న మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. CCTV ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలి నుండి కీలక సాక్ష్యాలను సేకరించింది.
MP సాగర్ జిల్లాకు చెందిన రాజేంద్ర(22)-కాజల్ పటేల్(21) దంపతులు పెళ్లి బట్టలు ధరించి సూసైడ్ చేసుకున్నారు. ప్రస్తుతం కాజల్ గర్భవతి కాగా.. ఇద్దరూ రాత్రి భోజనం చేశాక బలవన్మరణానికి పాల్పడ్డారు. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సూసైడ్ లెటర్ కూడా రాయకుండా చనిపోయేంత కష్టం ఏం వచ్చిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.