ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసుపై NIA సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో 10 మంది నిందితులపై NIA దాఖలు చేసిన 7,500 పేజీల భారీ ఛార్జ్షీట్ నుంచి కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడుల కోసం నిందితుడు ఆన్లైన్లో నకిలీ ఐడీతో బాంబుల తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించాడని, ఓ ప్రైవేట్ వర్సిటీలో తాత్కాలిక ల్యాబ్ కూడా పెట్టినట్లు వెల్లడైంది.