TG: హైదరాబాద్ అత్తాపూర్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఛాతీ నొప్పితో చేరిన శ్రీనివాస్రావు అనే వ్యక్తి, యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసిన తర్వాత పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణం సంభవించిందని ఆగ్రహించిన మృతుడి బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.