AP: అనంతపురంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నందిని(19) అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నార్పల మండలానికి చెందిన ఈమె, హాస్టల్ భవనం వద్ద శవమై కనిపించింది. తోటి విద్యార్థుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు.
TG: నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి మండలం తాండ్ర దగ్గర కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: ఏలూరు జిల్లా వేలేరుపాడులో అగ్ని ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు సజీవదహనమయ్యారు. వలగాని సావిత్రి(60), పూలమ్మ(65) నిద్రలోనే ప్రాణాలు విడిచారు. TGలోని సూర్యాపేట నుంచి పూలమ్మ తన చెల్లిని చూసేందుకు ఏలూరు వచ్చినట్లు తెలుస్తోంది. మంటల ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా.. పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా కాలిబూడిదైంది.
TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి హైదర్గూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక జనప్రియ మార్వెల్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్లో దేవుడికి వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అర్పివేశారు. ప్రమాదంలో ఆస్తినష్టం మినహా ప్రాణనష్టం ఏమీ లేదని పోలీసులు తెలిపారు.
AP: ఏలూరు(D) ఉంగుటూరు(M) నల్లమడు శివారులో తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం రేపాయి. దూబచర్ల- చేబ్రోలు మార్గంలోని జీడిమామిడి తోటలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులు తూర్పుగోదావరి(D) నల్లజర్ల(M) అనంతపల్లికి చెందిన తల్లీకూతుళ్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరి తలకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది.
TG: జగిత్యాల మండలం మోరపెల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నివేష్, అశ్విన్, అరుణ్ అనే యువకులు థార్ కారులో ఫోన్లో IPL ఫైనల్ మ్యాచ్ చూస్తూ ప్రయాణించారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ చేస్తున్న అరుణ్ బావిలో మునిగి మృతిచెందాడు. నివేష్, అశ్విన్ బయటపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అరుణ్ మృతదేహాన్ని, కారును బయటకు తీశారు.
AP: తిరుపతిలోని పద్మావతినగర్లో కిడ్నాప్ కలకలం రేపింది. రసూల్ఖాన్ అనే వ్యక్తిని కడప గ్యాంగ్ కిడ్నాప్ చేశారు. నలుగురు వ్యక్తులు తిరుపతికి వచ్చి అపహరించారు. కడపకు చెందిన మనోహర్రెడ్డితో రసూల్ఖాన్కు ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో 5 బృందాలతో గాలిస్తున్నారు.
TG: సంగారెడ్డి జిల్లా బొల్లారం పరిధిలో దారుణం జరిగింది. బీహార్కు చెందిన అనిల్, మీనాదేవి(35) దంపతులు నిన్న రాత్రి సంతకు వెళ్లి బైక్పై వస్తుండగా వాహనం ఆగింది. పొదల్లోంచి వచ్చిన దుండగులు భర్తపై దాడి చేసి, మీనాదేవిని లాక్కెళ్లి గొంతుకోసి చంపారు. అడ్డుకోబోయిన అనిల్ను కత్తులతో గాయపరిచారు. ఘటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఉషను భర్త సురేంద్ర కత్తితో గొంతు కోసి హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాపవరంలోని పౌల్ట్రీలో దంపతులు పనిచేస్తున్నారు. సురేంద్ర ఉషను ఒడిశాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
AP: కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో నిన్న గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. యమన్ చంద్ర, సతీష్ చంద్ర, ధను మృతదేహాలను వెలికి తీసినట్లు జాలర్లు తెలిపారు. గల్లంతైన రాఘవేంద్ర, సంధ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. సరదాగా ఈతకు వెళ్లి నదిలో ఐదుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: పెద్దవడుగూరు మండలం అప్పెచర్ల గ్రామ సమీపంలోని 67 హైవేపై బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది వారిని గుత్తి ఆసుపత్రికి తరలించారు. తల్లి భవాని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. తాడిపత్రి నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
E.G: నగర శివారు కాతేరు ప్రాంతానికి చెందిన నాగేంద్ర ప్రవీణ్ (34) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదని చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి రాజమండ్రి జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేశారు.
KKD: సామర్లకోట ఐదు తూముల వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో మహిళ మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన సింహాద్రి అనే మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఇదే ప్రమాదంలో ఇప్పటికే ఉప్పాడకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
KKD: రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. అంబేద్కర్ విగ్రహం సమీపంలో రౌతులపూడి వైపు నుంచి వస్తున్న భారీ లోడుతో కూడిన టిప్పర్ లారీ ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
AP: కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతినగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త మహేష్ను భార్య ఈరమ్మ గొంతు నులిమి చంపింది. సమాచారం తెలుసుకున్న 1వ పట్టణ పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.