• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గరుడ ఖండిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

SKLM: పలాస M గరుడ ఖండిలో శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు సోమవారం ప్రారంభించారు. డా. కూన అరుణ కుమారి నేతృత్వంలో రోగులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

December 8, 2025 / 11:22 AM IST

మద్యం నిల్వకు ఇబ్బందులే..!

SKLM: ఎచ్చెర్ల ఏపీ బేవరేజెస్ గోదాంలో నిల్వ స్థలం తగ్గడంతో లారీ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణా సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలకు అన్‌లోడింగ్ ఆలస్యమవుతోంది. జిల్లాలోని మద్యం షాపులు, బార్లకు సరఫరా ఇక్కడి నుంచే కావడంతో వాహనాలు ఎక్కువగా చేరుతున్నాయి. కొన్నిసార్లు 10 రోజులు వరకూ వేచి చూడాల్సి వస్తోందని డ్రైవర్లు అంటున్నారు.

December 8, 2025 / 11:21 AM IST

ఉద్యోగాలే మా లక్ష్యం: మంత్రి

అన్నమయ్య: 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. యువగుణం పాదయాత్ర చేస్తున్నప్పుడు మదనపల్లెలో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే పావని అనే మహిళను కలిశారు. మొత్తం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అని అడిగినప్పుడు, తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలు అని ఆమె చెప్పారు.

December 8, 2025 / 11:14 AM IST

అండర్-19 వన్డే ట్రోఫీకి కౌసల్య భాయి ఎంపిక

KRNL: వెల్దుర్తి మండలం ఎల్.బండ గ్రామానికి చెందిన కౌసల్య భాయి బీసీసీఐ ఆధ్వర్యంలో జరగబోయే అండర్-19 ఉమెన్స్ వన్డే ట్రోఫీకి ఎంపికయ్యారు. ఈ టోర్నీ డిసెంబర్ 13 నుంచి 21 వరకు ముంబైలో జరగనుంది. కర్నూలులోని శిక్షకుడు శేఖర్ వద్ద కౌసల్య భాయి క్రికెట్ మెలకువలు నెర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

December 8, 2025 / 11:06 AM IST

‘పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలి’

VZM: చెత్తను తమ ఇంటికి వచ్చే పారిశుద్ధ్య వాహనములకు అందజేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు సహకరించాలని రాజాం మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు కోరారు. ఇవాళ పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. కాలనీల్లోని డ్రైనేజీ సమస్యలు, పాడయిన రహదారులు, పారిశుద్ధ వం, పలు రకాల సమస్యలు ప్రజలను కలసి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి, సమస్యలు పరిష్కారిస్తామన్నారు.

December 8, 2025 / 11:04 AM IST

రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

E.G: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన నిమిత్తం సోమవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఎమ్మెల్యే పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

December 8, 2025 / 10:52 AM IST

పలాస సీఐ హెచ్చరికల జారీ

SKLM: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వై.రామకృష్ణ తెలిపారు. సోమవారం పలాస సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. స్థానికులు పోలీసులకు సహకరించాలన్నారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు.

December 8, 2025 / 10:49 AM IST

గిరిజన బాలికల హాస్టల్‌పై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ఉదయమే గిరిజన బాలికల హాస్టల్‌ను మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతి, భోజనం, నీటి సరఫరా, పరిశుభ్రత వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలు సూచించారు. భద్రత, వంటగది శుభ్రత, వైద్య పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

December 8, 2025 / 10:45 AM IST

బీజేపీ ఓబీసీ మోర్చా ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా సత్య సాయిరామ్

E.G: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా రాజమండ్రికి చెందిన కాలెపు సత్య సాయిరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రొంగాల గోపి శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. కాలెపు సత్య సాయిరామ్ గతంలో జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడుగా, బీజేపీ జిల్లా కార్యదర్శిగా, ఓబీసీ మోర్చా తూ.గో జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.

December 8, 2025 / 10:43 AM IST

శ్రీవారి సేవలో పలాస ఎమ్మెల్యే

SKLM: పలాస ఎమ్మెల్యే గౌత . శిరీష కుటుంబ సమేతంగా ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.

December 8, 2025 / 10:43 AM IST

వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

కృష్ణా: సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మరో నిందితుడు సోమవారం లొంగిపోయాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొమ్మకోట్ల లొంగిపోయాడు. ఇదే కేసులో ఇటీవల తేలప్రోలు రాము, వజ్రా కుమార్ లొంగగా, యుర్రంశెట్టి రామాంజనేయులు అరెస్టయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత వల్లభనేని వంశీ గతంలోనే అరెస్ట్ అయ్యారు.

December 8, 2025 / 10:41 AM IST

పశువుల పేడపై పంచాయితీ..ఇద్దరిపై పోలీసు కేసు

GNTR: కొల్లిపర మండలం అత్తోటలో తిరుమల శెట్టి గోపికి చెందిన ఆరబెట్టిన ధాన్యంపై దుర్గాభవాని దూడ పేడ వేయడంతో ఆదివారం రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ విషయంలో గోపి భార్య వెంకటరత్నం, దుర్గాభవాని కుమారులను నిలదీయగా, అది పరస్పర దాడికి దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో, కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 8, 2025 / 10:38 AM IST

ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు విరాళం

ASR: రాజమండ్రి ఓఎన్ జీసీ సంస్థ పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి కీలకమైన ఆక్సిజన్ పరికరాలను విరాళంగా అందించింది. మొత్తం 20బీ టైప్ సిలిండర్లు, 20డీ టైప్ సిలిండర్లు, 20ఆక్సిజన్ కన్సన్దేటర్లు ఆసుపత్రికి అందజేశారు. ఓఎన్ జీసీ మెడికల్ ఆఫీసర్ డా.రామ్మోహన్ ఈ పరికరాలను సూపరింటెండెంట్ డా. హేమలతాదేవికి అందించారు. అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రమేష్ ఉన్నారు.

December 8, 2025 / 10:29 AM IST

జిల్లాను వణికిస్తున్న చలి పులి

W.G: వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల పాలకొల్లు నియోజకవర్గం వ్యాప్తంగా పొగ మంచు, చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున రహదారులు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, చిరు వ్యాపారస్థులు, నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు రాలేకపోయారు. చలి వల్ల వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోస వ్యాధి గ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు.

December 8, 2025 / 10:26 AM IST

ఎన్టీఆర్ విగ్రహానికి రూ. 50 వేలు విరాళం

తిరుపతి: నాయుడుపేట పట్టణంలోని సీ. ఎస్ తేజ సెంటర్ వద్ద ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ నిర్మాణానికి సీనియర్ టీడీపీ నాయకులు, మాజీ నాయుడుపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ అత్తి కాయల సుబ్రహ్మణ్యం యాదవ్ 50వేల రూపాయలు నగదును అందజేశారు.

December 8, 2025 / 10:25 AM IST