ASR: అరకులోయ మండలం, మారుమూల గిరిజన గ్రామమైన లోతేరు లో SI జీ గోపాలరావు ఆధ్వర్యంలో పోలీసులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరిపారు. ఈ మేరకు ఆయన కేక్ కట్ చేసి, గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు. నూతన ఏడాది ప్రజలందరికీ కలిసొచ్చి, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పోలీస్ అధికారులు తమ గ్రామంలో తమతో వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ VC కంచర్ల గంగాధరరావు నూతన సంవత్సరం సందర్భంగా కేకును కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం మూడు క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో యూనివర్సిటీ రెక్టార్ శివరాం ప్రసాద్, రిజిస్టార్ సింహాచలం, వివిధ విభాగాల అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
E.G: దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో దుద్దుకూరు వైసీపీ గ్రామ అధ్యక్షుడు పాపోలు రెడ్డి బాబు గోపాలపురం నియోజకవర్గం ఇంఛార్జ్ తానేటి వనితను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి జగన్ ఫోటోని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ గ్రామ అధ్యక్షుడు పండు ఎంపీటీసీ -1చంద్ర, ఎంపీటీసీ -2సుజాత, వెంకటేష్ పాల్గొన్నారు.
KRNL: ఆలూరులో ఆదోని జిల్లాగా ప్రకటించాలని గురువారం డిమాండ్ చేస్తూ.. సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిమానవుడి వేషధారణలో బస్టాండ్ వద్ద 21వ రోజు జేఏసీ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు, సీపీఐ, వివిధ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ డిమాండ్ వినిపించాలని కోరారు.
VSP: మధురవాడ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో జీవీఎంసీ కమిషనర్తో సమావేశం నిర్వహిస్తామన్నారు. గురువారం మధురవాడ జోనల్ కార్యాలయం ప్రారంభం అనంతరం మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం జోనల్ వ్యవస్థను విస్తరించామని, భీమిలి-మధురవాడలను వేర్వేరు జోన్లుగానే కొనసాగిస్తున్నామని చెప్పారు.
AKP: జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా మాడుగుల మండలానికి చెందిన కె. శ్రీను నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరరావు గురువారం శ్రీనుకు నియామకపత్రాన్ని అందజేశారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు.
CTR: గుడిపాల మండలం రెట్టగుంట గ్రామానికి చెందిన ఓంశక్తి మాలధారణ భక్తులు మేల్మరువత్తూరు వెళ్లి రావడానికి ‘జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి ఈ బస్సు యాత్రను జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఓంశక్తి భక్తులు పాల్గొన్నారు.
VZM: అయ్యన్నపేట జంక్షన్ సమీపంలోని కల్యాణమండపంలో జరిగిన ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబితకు ...
AKP: పాయకరావుపేట మండలం పాల్తేరులో గ్రామంలో ఫ్లెక్సీ వివాదం రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. రెండు వర్గాలకు చెందిన వారు బుధవారం అర్ధరాత్రి పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందినవారు గాయపడ్డారు. గ్రామంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పికెట్ ఏర్పాటు చేశారు.
సత్యసాయి: జిల్లాను ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. జనవరి 31 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో వాహనదారులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
NDL: నంది కొట్కూరు మండలo, కొణిదేల లో రేపు ఉదయం 10.30 గం.లకు గ్రీవెన్స్ స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు నేడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్య జయసూర్య హాజరై, ప్రజల నుంచి సమస్యల వినతులు స్వీకరిస్తారు. 11.00 గం.లకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
SKLM: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రణస్థలం మండలంలో ఉన్న గో సేవా ఆశ్రమంలో ఉన్న రాధాకృష్ణులకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
VZM: విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ఉన్న గోపినాథ్ జట్టి… ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఐపీఎస్ రేంజ్ కార్యాలయంలో ఐజీని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి నూతన సంవత్సరం, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.
WG: మైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్ష, భారీ జరిమానాలు తప్పవని నరసాపురం శక్తి టీమ్ ఇంఛార్జ్ ఎస్సై జయలక్ష్మీ హెచ్చరించారు. డీఎస్పీ శ్రీవేద ఆదేశాలతో గురువారం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాల బారిన పడేయవద్దని హెచ్చరించారు.
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద పథకానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజీగూడెం గ్రామానికి చెందిన బి. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి రూ.1 లక్ష విరాళం గురువారం అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా డిప్యూటీ ఈవో సింగం రాధకు చెక్కు అందించి, స్వామివారి ప్రత్యేక దర్శనం పొందారు.