• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పే స్కేలు అమలు చేయాలని వినతి

GNTR: IERP స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి రెగ్యులర్ ఉపాధ్యా యులుగా గుర్తించి పే స్కేలు అమలు చేయాలని NTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనిగల హైమారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నివాసంలో కలిసి NTA సభ్యత్వం అందజేసి, వినతిపత్రం అందించారు.

February 23, 2026 / 06:24 AM IST

విజయవాడలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు ప్రణాళికలు

NTR: విజయవాడ రాజీవ్ పార్క్ నుంచి గంగూరు కూడలి వరకు 14KM పొడవున ఆరు వరుసల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఒకే ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలా లేక కనకదుర్గ వారధి–BENZ సర్కిల్, BENZ సర్కిల్–గంగూరు వరకు రెండు భాగాలుగా నిర్మించాలా అనే అంశంపై చర్చ సాగుతోంది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద భూ సేకరణ జరగనుందని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 06:20 AM IST

విద్యుత్ సంస్థలపై నేడు డయల్ యువర్ సీఎండీ

VSP: విద్యుత్ సమస్యలపై సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీ రాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలో శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు 11 జిల్లాలకు చెందిన వినియోగదారులు 8688400499 నెంబర్‌కు ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

February 23, 2026 / 06:19 AM IST

పేకాట స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

కృష్ణా: కొడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లిపాలెంలో పోలీసులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. జూదం జరుగుతున్నదన్న సమాచారంతో SI కె. చాణక్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,070ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

February 23, 2026 / 06:13 AM IST

నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో PGRS

VSP: సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యలకు తక్షణ స్పందనకోసమే అని చెప్పారు.

February 23, 2026 / 06:09 AM IST

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు: ఆర్‌ఐవో

SKLM: ఇవాళ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా నడుమ పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్‌ఐవో సురేష్‌ కుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభం కాగా, 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు.

February 23, 2026 / 06:05 AM IST

అనంతపురంలో రేపు జాబ్ మేళా

ATP: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా తెలిపారు. పేటీఎం సంస్థ అనంతపురంలోని పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందన్నారు. పదవ తరగతి నుంచి పైచదువులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

February 23, 2026 / 06:00 AM IST

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ సీఎండీ’

ATP: జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. వినియోగదారులు 89777 16661, 91547 90355 నంబర్లకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని సూచించారు.

February 23, 2026 / 05:30 AM IST

అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

తూ.గో. జిల్లాలో అనూరియా (మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్యులతో ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. వ్యాధి వ్యాప్తి నివారణకు అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

February 23, 2026 / 05:30 AM IST

మహిళలకు నారీ శక్తిపై అవగాహన

SKLM: పలాస మండలం మహాదేవిపురంలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్‌పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మహిళ తమ సెల్‌ఫోన్‌లో నారి శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.

February 22, 2026 / 10:01 PM IST

దారుణం..యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

కాశినాయన మండలం గంగనపల్లెకు చెందిన దిలీప్(24) అనే వ్యక్తిపై దుండగులు ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించారు.గాయపడిన యువకుడిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:41 PM IST

మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇంఛార్జ్ స్పందన

అన్నమయ్య: తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇన్‌చార్జ్ పోతుల సాయినాథ్ ఆదివారం స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు జరిగితే శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం బాలిక బాబాయి తనను సంప్రదించిన విషయం నిజమేనని, అప్పట్లో మందలించామని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:10 PM IST

మంచి మనసు చాటుకున్న మంత్రి సవిత

సత్యసాయి: రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన ప్రశాంతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి సవిత తక్షణమే స్పందించారు. బాధితురాలి వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివారం రూ. 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా కల్పించారు.

February 22, 2026 / 09:00 PM IST

పలు లాడ్జీలను తనిఖీ చేసిన సీఐ

VZM: బొబ్బిలి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధి రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు లాడ్జీలను సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ఖచ్చితమైన ఆధారాలు తీసుకొని ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు.

February 22, 2026 / 08:59 PM IST

పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

ASR: పీఎం ఉష పథకంలో భాగంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై 15 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ ఆదివారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి తెలిపారు. సీఎంఎస్ లేబొరేటరీస్, పీఎం ఉష కోఆర్డినేటర్ డాక్టర్ టీఎన్ రసూల్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారన్నారు. మొదటి బ్యాచ్ గా 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామన్నారు.

February 22, 2026 / 08:58 PM IST