ELR: పిప్పర జడ్పీ హైస్కూల్లో బుధవారం బాల్య ముక్తా భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ బీ. చంద్రావతి మాట్లాడుతూ.. బాలికా హక్కుల పరిరక్షణకు సమాజంలోని అందరూ కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జయ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
VZM: బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన పడాల కళ్యాణ్ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. భోగాపురం మండలం సుందరపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కళ్యాణ్ కలిసిన ఎమ్మెల్యే.. ఆయన సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణ్ విజయం యువతకు ఆదర్శం కావాలని సూచించారు. అనంతరం ఘనంగా సత్కరించారు.
VSP: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలోని కృష్ణా కాలేజీలో బుధవాం జరిగిన వినియోగదారుల సదస్సులో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సేవలు, పథకాలు, డిజిటల్ ఫీడ్బ్యాక్ విధానం గురించి అవగాహన కల్పించారు. జిల్లాలోని ప్రధాన బస్స్టేషన్లలో డిజిటల్ ఫీడ్బ్యాక్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
W.G: ప్రతీ విద్యార్థి సమయ పాలన, క్రమశిక్షణ పాటిస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని జిల్లా DEO నారాయణ అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్ను బుధవారం ఆయన సందర్శించారు. 100 రోజుల ప్రణాళికను సమీక్షించారు. వెనుక బడిన విద్యార్థులు ఎలా ఉత్తీర్ణత సాధించావచ్చో తెలిపారు. స్కూల్లో వినియోగదారుల దినోత్సవం జరిపారు. HM జాన్ బాబు, శ్రీలత, వసంతమాలిక, పాఠశాల టీచర్లు పాల్గొన్నారు.
VSP: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని అనాథ మృతదేహానికి బుధవారం ఆవర్ హ్యాండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల సమాచారంతో స్పందించిన సంస్థ ప్రతినిధి పిల్లి గోవింద రాజు స్వంత ఖర్చులతో దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ మానవతా సేవను స్థానికులు అభినందించారు.
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీఈడీ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. I, II సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.
CTR: బంగారుపాళ్యం మండలం తుంబకుప్పంలో విషాద ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న బిక్కిరెడ్డి చెరువులో ఓ శిశువు మృతదేహం కలకలం రేపింది. అటుగా వెళ్లిన పశువుల కాపర్లు బుధవారం మధ్యాహ్నం చెరువులో శిశువు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: గజపతినగరం మండలంలోని కెంగువ, ఎం కొత్తవలస గ్రామ సచివాలయాలను బుధవారం ఎంపీడీవో కళ్యాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. అలాగే ప్రజలకు అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.
E.G: వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఇంఛార్జ్ జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం-2025ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ న్యాయ పాలన ద్వారా వినియోగ దారులకు సత్వర న్యాయం సాధ్యమవుతోందని పేర్కొన్నారు.
కృష్ణా: మచిలీపట్నంలోని పారిశుధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించేందుకు పారిశుధ్య కార్మికులకు తడి చెత్త–పొడి చెత్త డబ్బాలు 850, పుష్ గాడ్స్ 76 మంత్రి కొల్లు రవీంద్ర పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చెత్తను వేరు వేరుగా సేకరించడం ద్వారా స్వచ్ఛమైన పట్టణంగా మారుస్తామని తెలిపారు.
ASR: రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం జంక్షన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంపచోడవరం వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు యువకులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ELR: ఇనుమూరు గ్రామంలో గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన గిరిజనులు, గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన పోలీస్, రెవెన్యూ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బుట్టాయిగూడెం (M) ఇనుమూరు బాధితులను కలసి పరామర్శించారు. గిరిజనేతరులకి హక్కులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
VSP: నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం మూడవ జోన్ 18వ వార్డు పరిధిలోని ఎంవిపి కాలనీ సెక్టర్ 9లో సుమారు రూ.66.50 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మించిన సామాజిక భవనం మొదట అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు.
KRNL: వాల్మీకి బోయ వర్గానికి చెందిన మహిళకు కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి దక్కడం అరుదైన అవకాశం అని మంత్రాలయం జనసేన ఇన్ఛార్జి వాల్మీకి బి. లక్ష్మన్న పేర్కొన్నారు. బుధవారం నూతన టీడీపీ అధ్యక్షురాలికి శుభాకాంక్షలు తెలియజేసి ఘన సన్మానం చేశారు. ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
NDL: కంది పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడాన్ని రాయలసీమ సాగునీటి సాధనం సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. కందులతో పాటు పెసలు, మినుములను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.