• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆశా కార్యకర్తపై ప్రచురితమైన కథనాలపై వివరణ

PPM: మక్కువ పీహెచ్‌సీ పరిధిలోని డి.శిర్లాం గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త విద్యావతిపై ఇటీవల వెలువడిన కథనాలపై ఇంఛార్జ్ డీఎంహెచ్‌వో డాక్టర్ కె.వి.ఎస్ పద్మావతి స్పష్టత నిచ్చారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. విద్యావతి ఫిబ్రవరి 16, 2008 సం.లో ఆశా కార్యకర్తగా నియమితులై నవంబర్1, 2023 వరకు విధులు నిర్వహించారని తెలిపారు.

December 13, 2025 / 06:54 PM IST

‘వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తే లక్ష్యం’

అన్నమయ్య: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యమని ఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య తెలిపారు. శనివారం రాయచోటి డివిజన్‌లోని మాసాపేట సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన, ఇంజనీర్లతో సమావేశమయ్యారు. వ్యవసాయ కనెక్షన్లు సీనియార్టీ ప్రకారం ఇవ్వాలని, లైన్ అంతరాయాలు తగ్గించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

December 13, 2025 / 06:54 PM IST

వాటర్ ట్యాంక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA

ASR: కూటమి పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అన్నారు. శనివారం అడ్డతీగల మండలం తుంగమడుగుల, దుచ్చర్తి, బందమామిళ్లు, గ్రామాల్లో వాటర్ ట్యాంక్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాకోడులో పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

December 13, 2025 / 06:50 PM IST

ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష

PPM: సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానున్న శుభ్రం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ ప్రభాకరరెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, దేవాదాయ శాఖ అధికారులు, ఇతర అధికారులతో కలసి మంత్రి శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

December 13, 2025 / 06:36 PM IST

డుంబ్రిగుడలో మండల సర్వసభ్య సమావేశం

ASR: డుంబ్రిగుడ మండల గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి మూడు నెలలకు నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం శనివారం చప్పగా జరిగింది. ప్రజాప్రతినిధులు సమస్యలపై పెద్దగా స్పందించకపోవడంతో సమావేశం నామమాత్రంగా సాగింది. పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖల అభివృద్ధి పనులను అడ్డంకులు లేకుండా పూర్తి చేయాలని సభ్యులు కోరారు.

December 13, 2025 / 06:23 PM IST

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి ఆర్థిక ప్రోత్సాహం

NTR: గతేడాది గానుగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి 522 మార్కులు సాధించిన తేజశ్రీకి ఇవాళ రూ. 5 వేల ఆర్థిక ప్రోత్సాహం అందించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎస్.వి.వి.ఎస్.ఆర్. ఆంజనేయులు సౌజన్యంతో ఈ సహాయం అందించగా, పాఠశాల పూర్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు రాంప్రదీప్ సిబ్బందితో కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

December 13, 2025 / 06:21 PM IST

నిర్ణీత గడువులో టీకాలు తప్పని సరి

PPM: సామాన్యులతో పాటు ఉన్నతాధికారులు సైతం తమ పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాధినిరోధక టీకాలను వేయించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం సంతోషకరమని, ప్రజలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుందని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం జిల్లా అధికారి డా. టి. జగన్ మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం టీకా కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు.

December 13, 2025 / 06:12 PM IST

రణస్థలంలో ప్రజా అర్జీలను స్వీకరించిన ఎంపీ

SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. శనివారం రణస్థలంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎంపీకి వివరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

December 13, 2025 / 06:07 PM IST

వాలీబాల్ పోటీల విజేతలకు బహుమతులు

KDP: క్రీడలు శారీరక, మానసిక ప్రశాంతతను అందిస్తాయని మైదుకూరు సీఐ రమణారెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించారు. మైదుకూరులో స్థానిక అకాడమీ క్రీడా మైదానంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, నా భారత్ అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌లో 12 జట్లు పాల్గొన్నాయి. కరుణగిరి బాలశివ డిగ్రీ కళాశాల నుంచి విజేతలైన జట్లకు 1, 2 బహుమతులు అందజేశారు.

December 13, 2025 / 06:02 PM IST

‘కార్మికులకు 12వ పీఆర్సీ అమలు చేయాలి’

BPT: అద్దంకిలో శనివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ఉమామహేశ్వరరావు కార్మికులకు 12వ పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. మహాసభ అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపడతామన్నారు.

December 13, 2025 / 06:02 PM IST

భక్తిశ్రద్ధలతో ఆంజనేయుడు రథోత్సవ వేడుకలు

ATP: గుమ్మగట్ట మండలం కోనాపురం గ్రామంలో ఆంజనేయుడు రథోత్సవ వేడుకలను శనివారం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబెర్ గౌని ఉపేంద్రారెడ్డి రథోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అంజన్న నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.

December 13, 2025 / 06:00 PM IST

జగ్గయ్యపేటలో మార్కెట్ యార్డు ఛైర్మన్‌కు సన్మానం

NTR: జగ్గయ్యపేట మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా పదవి చేపట్టనున్న సీతమ్మను నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు ఇవాళ సన్మానించారు. విలియంపేట, మల్లెల కొండా ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రామారావు, నియోజకవర్గ నాయకులు దుర్గా మహేశ్వరరావు, 14, 23వ వార్డుల కౌన్సిలర్ వెంకట్, జోజి, తెలుగు యువత కార్యదర్శి రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

December 13, 2025 / 05:54 PM IST

వైభవంగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రాకార సేవ

KKD: శంఖవరం(మం) అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహించే ప్రాకార సేవను ఈరోజు వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవారి ప్రాకార సేవ జరిపించారు. అనంతరం ఆలయ పురవీధులు స్వామివారిని ఊరేగించారు.

December 13, 2025 / 05:52 PM IST

పెంచలకోనలో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి విశేష పూజలు

NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

December 13, 2025 / 05:52 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు రొంపిచర్ల బాలికల ఎంపిక

CTR: రొంపిచర్ల జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కి చెందిన నాగ సింధు, షబ్రీన్, మహేశ్వరి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరులో జిల్లాస్థాయి కౌశల్ సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహించారు. ఇందులో ఈ ముగ్గురు ప్రతిభ చూపించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరిని డీఈవో రాజేంద్రప్రసాద్ అభినందించి నగదు, ప్రశంసా పత్రం అందజేశారు.

December 13, 2025 / 05:46 PM IST