• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

త్రాగునీటి బోరుకు శంకుస్థాపన చేసిన సర్పంచ్

ASR: హుకుంపేట మండలం తీగలవలస పంచాయితీలోని బసలబంద గ్రామంలో మంగళవారం త్రాగునీటి బోరుకు సర్పంచ్ బేసు శంకుస్ధాపన చేశారు. గ్రామానికి త్రాగునీరు అందించుటకు పంచాయితీ మరియు జల్ జీవన్ మిషన్ పథక నిధుల నుండి సుమారు రూ.6 లక్షలు మంజూరు అయినట్లు ఇంజనీరు జె చందు తెలిపారు.

February 18, 2025 / 08:26 PM IST

రీ సర్వే పనులను పరిశీలించిన జేసీ

W.G: రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి రికార్డులు ఆధునీకరించేందుకు ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మొగల్తూరు మండలం కె.పి పాలెం గ్రామంలో జరుగుచున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను జేసీ సరిహద్దుల మ్యాప్‌లను పరిశీలించారు.

February 18, 2025 / 08:21 PM IST

‘శత శాతం ఉత్తీర్ణత నమోదు కావాలి’

VZM: జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత నమోదు కావాలన్నారు. అంతకుముందు అంగన్వాడీ కార్యకర్తల ఆరు రోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు అందజేశారు.

February 18, 2025 / 08:19 PM IST

దాడి కేసులో ఇద్దరికీ రిమాండ్

ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలంలోని మురుగమ్మిలో జరిగిన దాడి కేసులో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. గ్రామానికి చెందిన వెంగల్ రెడ్డి, శబరి కంఠారెడ్డి పై ఈనెల 13న వల్లెం రాజశేఖర్ రెడ్డి, అతని భార్య రాజ్యలక్ష్మి దాడి చేశారన్నారు. మెజిస్ట్రేట్ ముందు ఇద్దరినీ హాజరు పరచగా కనిగిరి జడ్జి భరత్ చంద్ర ముద్దాయిలిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు.

February 18, 2025 / 08:18 PM IST

‘ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి’

SKLM: ఆక్వాకల్చర్ టెక్ 2.0 కాంక్లేవ్ కార్యక్రమం రెండు రోజుల పాటు విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంగళవారం ఉదయం టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కె.అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆక్వా రంగం సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దేశంలోనే ఏపీ ఆక్వా ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.

February 18, 2025 / 08:12 PM IST

‘చెత్తను ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలి’

VZM: గ్రామాలలో సేకరించిన చెత్తను ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు సూచించారు. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటలోని ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రాన్ని డీపీఈఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్ బిఎస్ఎన్ పట్నాయక్‌తో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. తడిపొడి చెత్తను వేరు చేసి ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని క్లాప్ మిత్రలకు సూచించారు.

February 18, 2025 / 08:08 PM IST

ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ ఛాంపియన్స్

NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా వీరులపాడు మండలం నుంచి పంచాయతీ ఛాంపియన్స్‌గా శిక్షణ పొందిన 8 మంది మంగ‌ళవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా NIRD PR కో-ఆర్డినేటర్ జీవీ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

February 18, 2025 / 07:57 PM IST

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: గొల్లపూడిలో ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు ఎన్నికల ప్రచారంలో మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పట్టభద్రుల ఓట్లను అభ్యర్థించారు.

February 18, 2025 / 07:10 PM IST

జగన్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు: బెజవాడ నజీర్

కృష్ణా: జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని టీడీపీ నేత బెజవాడ నజీర్ విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనతో విసిగిపోయిన జనం వైసీపీని గద్దె దించినా జగన్‌‌కు బుద్ది రాలేదని, పోలీస్ అధికారులను, టీడీపీ నేతలను బట్టలు ఊడదీసి నిలబెడతానని హెచ్చరించే విధానం చూస్తే మానసిక రుగ్మతతో బాధపడుతునట్లు స్పష్టమైందన్నారు.

February 18, 2025 / 06:39 PM IST

శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యేలు

W.G: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగాలని ఆకాంక్షించారు.

February 18, 2025 / 05:17 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్పీ

ATP: ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో మంగళవారం ఎస్పీ జగదీశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రతిష్ఠ గురించి అడిగి తెలుసుకున్నారు.

February 18, 2025 / 05:09 PM IST

జడ్పీ హై స్కూల్లో యానివర్సరీ స్పోర్ట్స్ మీట్

కృష్ణా: పామర్రు జడ్పీ హై స్కూల్లో యానివర్సరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఎంఈఓ పద్మారాణి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా రాణి మాట్లాడుతూ.. స్కూల్ యానివర్సరీ స్పోర్ట్స్ మీట్‌ను చేపట్టి, పలు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు రవికిషోర్, మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

February 18, 2025 / 03:21 PM IST

‘ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’

SS: పెనుకొండలో ఆటో కార్మికులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ పోర్టు రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని ప్రైవేట్ పరంచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

February 18, 2025 / 02:23 PM IST

గుడిబండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

SS: గుడిబండ పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రకాల దస్త్రాలను పరిశీలించి వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అనంతరం డీఎస్పీ స్థానిక పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ.. సకాలంలో కేసులను పరిష్కరించి అక్రమ మద్యం, గ్యాంబ్లింగ్ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

February 18, 2025 / 02:14 PM IST

’22 కేజీల గంజాయి స్వాధీనం’

ASR: జీ.మాడుగుల మండలంలోని కోడాపల్లి పంచాయతీ గన్నేరుపుట్టు గ్రామంలో 22 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై షణ్ముఖరావు మంగళవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా మగు, జగదీశ్వరరావుకు చెందిన ఇంట్లో నిల్వ ఉంచిన గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

February 18, 2025 / 02:10 PM IST