ATP: SP జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు, ఫ్రిస్కింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. సీఐలు, ఎస్సైలు ముఖ్య కూడళ్లు అయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు. గంజాయి, నిషేధిత పదార్థాల రవాణాను అరికట్టడంతో పాటు ప్రజల భద్రతను మెరుగుపరచడం లక్ష్యమని పోలీసులు తెలిపారు.
ATP: జిల్లాలోని అంబేద్కర్ నగర్లో వైసీపీ అధినేత YS జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ సాకే చంద్రలేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. పేదలకు మిఠాయిలు పంచారు.
KDP: గౌస్ నగర్లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో RO ప్లాంట్ దెబ్బ తినడంతో తమ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని తాగేవారమని తెలిపారు. ప్రస్తుతం కొళాయి నీళ్లు తాగుతున్నామని వాపోయారు. వెంటనే ఆర్వో ప్లాంటుకు మరమ్మతులు చేయించాలని DEO ను విద్యార్థుల కోరుతున్నారు
KDP: జిల్లాలో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్ ధర కేజీ విత్ స్కిన్ రూ. 240 స్కిన్ లెస్ రూ. 260 గా నమోదైంది. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ. 10 నుంచి రూ. 20 వరకు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తుంది. మీ ఊరిలో చికెన్ రేటు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
GNTR: పెదనందిపాడు గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడీపీ గ్రామ అధ్యక్షుడు శివరామకృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
CTR: జిల్లాలో ఇవాళ ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలియాజేశారు.
GNTR: ఫిరంగిపురం మండలంలోని నూదురుపాడు గ్రామంలో ఆదివారం మొబైల్ టీం వాహనం ద్వారా నుదురుపాడు మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పోలియో వాక్సిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పల్లపాటి లింగరాజు యాదవ్ మాట్లాడతూ.. పోలియో రహిత సమాజం మన అందరి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
SKLM: పలాస మున్సిపాలిటీ 31వ వార్డ్ సచివాలయం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబురావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
విజయనగరం: డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డా. పద్మావతి శనివారం విజయనగరంలో పర్యటించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రొగ్రాం అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఆనంతరం అక్కడ జరిగిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛంద్రా కార్యక్రమంలో పాల్గొని, ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీ.ఎం.హెచ్.ఓ డా. జీవన్ రాణి పాల్గొన్నారు.
GNTR: ప్రత్తిపాడు గ్రామంలో శనివారం రాత్రి నియోజకవర్గ ఎస్సీ సెల్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ‘సెమీ క్రిస్మస్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ పాల్గొని, నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ వేడుకలలో కేక్ కట్ చేసి,యేసు సందేశాన్ని వివరించారు.
W.G: భీమవరం చంద్రరావు స్కూల్ నందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వారి తల్లిదండ్రులు వేయించాలని పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.
KRNL: గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్షం వహిస్తున్న పెద్దకడబూరు పంచాయితీ కార్యదర్శి సాయి తేజను సస్పెండ్ చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ ఇవాళ డిమాండ్ చేశారు. గ్రామంలో డ్రైనేజీలు నిండిపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడం, పంచాయతీ బోర్లు నిర్వీర్యంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విధులకు సైతం డుమ్మా కొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
CTR: పూతలపట్టు మండలం SV సెట్ కళాశాల వద్ద క్రిమినల్ హాట్స్పాట్ బోర్డ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రదేశంలో నిత్యం మందుబాబులు మద్యం తాగి స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరన్నా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.
SKLM: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కేజీ చికెన్ విత్ స్కిన్ రూ. 245, స్కిన్ లెస్ రూ.265గా ఉంది. కేజీ మటన్ రూ.900 పలుకుతోంది. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ. 10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండోచ్చు. మరి మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి ? కామెంట్ చేయండి.
సత్యసాయి: పుట్టపర్తి నగరంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదవ్వడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. పట్టణాన్ని పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.