NDL: మార్కాపురం జిల్లాలో ఇవాళ జరిగిన బస్సు, టిప్పర్ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుని పదిమంది ప్రయాణికులు సజీవ దహనం కావడంపై ఆయన ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
KDP: గ్యాస్ కొరత ప్రభావంతో అంగన్వాడీ కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేయనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 11,400 కేంద్రాలకు స్టవ్లు అందించగా.. సానుకూల స్పందన రావడంతో మిగిలిన వాటికి ఇవ్వాలని నిర్ణయించింది.
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆ పాఠశాలకు మైక్ సెట్ బహూకరించారు. గురువారం ఆ మైక్ సెట్ను ఇచ్చినట్లు హెచ్ఎం చెంచురామయ్య ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. దాదాపుగా 61 వేలు విలువైన మైక్ సెట్ను బహుకరించినట్లు తెలియజేశారు. పూర్వ విద్యార్థులకు, పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.
NLR: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు 10 మందికిపైగా ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
VSP: గాజువాక 64వ వార్డు యాతపాలెంలో ఎకరా స్థలంలో ఆధునిక పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం డైరెక్టర్ మొల్లి పెంటిరాజు స్థలాన్ని పరిశీలించారు. కాలుష్యం తగ్గించేందుకు చెట్లు నాటి పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచనలతో APIIC నిధులతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.
TPT: టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు దాతలు భారీగా విరాళాలు అందించారు. మొత్తం రూ.60 లక్షల విరాళం అందగా, చెన్నైకి చెందిన రేవతి విశ్వనాథ్ రూ.40 లక్షలు, హైదరాబాద్కు చెందిన వి. భవేశ్ చౌదరి రూ.10,07,777, తూర్పు గోదావరి జిల్లా చెందిన పొనకల నాగేంద్ర రావు రూ.10 లక్షలు సమర్పించారు. తిరుమలలో అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు.
అన్నమయ్య: మదనపల్లె(M)చిప్పిలిలో అంగన్వాడీ టీచర్ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుకన్య, దేవేంద్ర అనే దంపతులు తక్కువ ధరకే బంగారం తెప్పిస్తామని నమ్మించి, అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి నుంచి సుమారు రూ. 30 లక్షలు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలిపింది.
KRNL: గురువారం మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలో లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో, బస్సులో మంటలు చెలరేగి పది మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు.
అన్నమయ్య: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి, ఈ కష్టకాలంలో ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి తక్షణం ఉత్తమ వైద్యం అందించాలన్నారు.
CTR: భూములు, ఇళ్లు, కమర్షియల్ భవనాల రిజిస్ట్రేషన్ ఫీజులో 90% స్థానిక సంస్థలకు చెల్లించాల్సి ఉండగా, తిరుపతి కార్పొరేషన్కు 2024 జూలై నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో రూ. 25 కోట్ల బకాయికి చేరింది. చిత్తూరు కార్పొరేషన్కు సుమారు రూ.45 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఐదేళ్లుగా సర్ఛార్జీల చెల్లింపులు లేకపోవడంతో స్థానిక సంస్థల ఆదాయం తీవ్రంగా ప్రభావితమైంది.
KRNL: హంద్రీ- నీవా సుజల స్రవంతి (HNSS) రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో నాబార్డ్ ఫండ్ కింద రూ.1,184 కోట్లతో పనులు చేపట్టాలని సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, కాల్వల విస్తరణ, ప్రధాన కాల్వల పునరుద్ధరణ జరగుతుందని తెలిపారు.
NDL: బేతంచెర్ల సమీపంలోని జిల్లా రహదారిపై ఇవాళ రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గోరుమాను కొండ వైపు వెళ్తున్న బైకును వెనుక నుంచి వస్తున్న మరో వాహనం అధిగమించే క్రమంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోజ్తో పాటు మరో యువకుడు గాయపడ్డినట్లు స్థానికులు తెలిపారు. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు పంపించారు.
W.G: రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి కొనసాగుతోన్న టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 2తో ముగుస్తాయి. వచ్చే నెల 4 నుంచి 13 మధ్య వాల్యుయేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఈసారి ట్యాబ్స్ ద్వారా మూల్యాంకనం చేసి సెంటర్లలోనే మార్కులను నమోదు చేస్తారన్నారు. అన్ని కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు.
AKP: నర్సీపట్నంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగ పురస్కరించుకొని గురువారం ఆర్డివో కార్యాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండగ మూడు రోజులు చక్కగా సాగే విధంగా పోలీస్, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఎలక్ట్రికల్, తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
KRNL: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడం పట్ల విచారం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.