అన్నమయ్య: నెలవంక దర్శనంతో రేపు రంజాన్ పండుగ, దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫిత్ర్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మసీదుల్లో ప్రత్యేక నమాజ్లు, జకాత్–ఫిత్రా విరాళాలతో ముస్లింలు పండుగను ఆనందంగా ఆచరించనున్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులతో శుభాకాంక్షల మార్పిడి జరుగనుంది. ఈద్గాహ్లలో భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉంది.
BPT: జిల్లాలో నిషేధిత భూముల 22ఏ జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 530 ఎకరాల భూమిని జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 1,406 దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
NTR: వత్సవాయి మండలం డబ్బాకుపల్లిలో శుక్రవారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మురళీకృష్ణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కీలకమని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి రూ.5 లక్షల బీమాను జనసేన పార్టీ అందిస్తుందని తెలిపారు.
ప్రకాశం: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామంలో ఏర్పాటుచేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, వైసీపీ చేసిన రూ.లక్షల కోట్ల లోటు బడ్జెట్ను చేసిందని మండిపడ్డారు.
KDP: వైఎస్ విజయమ్మ ఆస్తుల విషయంలో స్టాంప్ వేసి ప్రకటన చేయడం భాద కలిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇది TDPకు చెందిన వారి నుండే బయటికి వచ్చిందని, వైఎస్ కుటుంబ ఇంటి గుట్టు మొదట వారికే చేరవేస్తున్నారని రాచమల్లు అన్నారు. విజయమ్మ, షర్మిల, సునీతలు జగన్ మోహన్ రెడ్డిని రెండు రాష్ట్రాలలో దిగజారుస్తున్నారన్నారు.
CTR: రొంపిచర్ల మండలం చిచ్చిలివారిపల్లికి చెందిన వైసీపీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బాలాజీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పీలేరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయనను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
అన్నమయ్య: మదనపల్లె(మం) చీకుల బైలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు(భువనేష్ రెడ్డి-6, కుశిల్ రెడ్డి-10)మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. తండ్రి శివారెడ్డితో సహా మరో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు.
W.G: గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తున్నామని, ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు వేయిస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలంలో సుమారు రూ. 5 కోట్లతో జరిగే కాళీపట్నం-భీమవరం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు.
NDL: ప్యాపిలి(మం) గోపాల్ నగరంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన వెంకటకృష్ణ (32) అనే వ్యక్తి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎమ్మార్వో సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
GNTR: గుంటూరు కొత్తపేట కృష్ణమహల్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ బార్ వద్ద 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అలాగే జీజీహెచ్ వద్ద 50 నుంచి 55 ఏళ్ల వయసున్న అజ్ఞాత మహిళ అపస్మారక స్థితిలో పడివుండి మరణించింది. ఈ రెండు మృతదేహాలను పోలీసులు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
కృష్ణా: మచిలీపట్నంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదర, సోదరీమణులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినాన్ని మతసామరస్యానికి ప్రత్యేకగా జరుపుకుంటూ, అందరితో సోదర భావంతో మెలుగుతూ, ఘర్షణలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
ప్రకాశం: దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఉన్న గురుకుల పాఠశాలలో టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నాణ్యత, రుచి, తాగునీటి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. భోజనం బాగాలేకపోతే తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.
ELR: గ్రామ సీమలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో మండల ప్రజా పరిషత్తు అధికార్లు, పాలకవర్గ సభ్యులు పాత్ర కీలకం అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం ముసునూరు మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. గ్రామాల్లో త్రాగునీరు, సాగునీరుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
KKD: కాకినాడ, పెద్దాపురం డివిజన్ పరిధిలో అన్ని మండలాలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారనే సమాచారంతో RDO మల్లిబాబు, తహసీల్దారులతో తనిఖీలు నిర్వహించారు. 140 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. RDO మాట్లాడుతూ వారిపై కేసు నమోదు చేసి అత్యవసర వస్తువుల చట్టం సెక్షన్ 6A కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లి కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ టీ. వెంకటేశ్వర్లు తెలిపారు. 1వ తరగతి దరఖాస్తులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. 2వ నుండి 5వ తరగతి దరఖాస్తులు కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. తరగతులు తాత్కాలికంగా గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నారు.