• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

లక్కీరెడ్డిపల్లిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లిలో ఆదివారం ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. 132 కేవీ సురకవాండ్లపల్లి సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ మార్పిడి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

March 7, 2026 / 10:35 PM IST

తాడేపల్లిగూడెంలో న్యాయ విజ్ఞాన సదస్సు

W.G: మహిళలు చట్టాలను న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని జడ్జిలు కే. మాధవి, ఎస్. సూర్య కిరణ్ సూచించారు. శనివారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమని, వారికి అనేక చట్టాలు ఉన్నాయన్నారు. వాటిని సక్రమంగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఎండీవో వీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 09:51 PM IST

మహిళలకు ఎస్పీ శుభాకాంక్షలు.!

KDP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సమాజం, కుటుంబ వ్యవస్థలో మహిళలు బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.

March 7, 2026 / 09:45 PM IST

అంబాజీపేట బీజేపీ మండల అధ్యక్షుడుగా ఆంజనేయులు

కోనసీమ: అంబాజీపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కురసా ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఈ మేరకు పుల్లేటికుర్రు గ్రామంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ పాల్గొని అతనిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఆంజనేయులను పలువు నాయకులు ఘనంగా సత్కరించారు.

March 7, 2026 / 09:35 PM IST

బీజేపీకి వాళ్లు బానిసలుగా మారారు: షర్మిల

ELR: రాష్ట్రంలో జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీకి బానిసలుగా, బినామీలుగా మారారు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. వీళ్లల్లో ఒక్క నాయకుడు కూడా ప్రత్యేక హోదా కావాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, అమరావతిని నిర్మించాలని కోరలేదని ఎద్దేవ చేశారు.

March 7, 2026 / 09:32 PM IST

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. రాయచోటి నియోజకవర్గంలో మహిళా మార్ట్, గృహాల పట్టాలు, విద్యా సౌకర్యాల ద్వారా మహిళలకు ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు.

March 7, 2026 / 09:27 PM IST

అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన ప్రజాప్రతినిధులు

NLR: కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్ లక్ష్మీదేవి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గ్రామాలలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.

March 7, 2026 / 09:20 PM IST

మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి: ఎస్సై

కోనసీమ: అంబాజీపేట జడ్పీ హైస్కూల్‌లో మహిళా దినోత్సవంలో భాగంగా శనివారం తైక్వాండో సీనియర్ కోచ్ త్రిమూర్తుల అధ్యక్షతన విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మహిళా భద్రతకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.

March 7, 2026 / 09:00 PM IST

హల్లికెరలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సత్యసాయి: అగళి మండలం హల్లికెర పంచాయతీలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు సుమారు రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 09:00 PM IST

తిరుపతిలో నకిలీ మద్యం పట్టివేత

TPT: తిరుపతిలో పోలీసులు నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో నకిలీ మద్యం బయటపడింది. శేషాద్రి నగర్‌లో గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పాడిపేట ఇందిరమ్మ గృహాల్లో నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిని తిరుచానూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో DSP బేతపూడి ప్రసాద్, సీఐలు, ఎస్సై పాల్గొన్నారు.

March 7, 2026 / 09:00 PM IST

శ్రీవారి సన్నిధిలో ఉంగుటూరు ఎమ్మెల్యే

ELR: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వేద పండితులు ఆయనను ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.

March 7, 2026 / 08:59 PM IST

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే

VSP; ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నెలలో ఒకరోజు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం సమావేశం శనివారం విశాఖలో జరిగింది. ఉద్యోగుల సంఘాలు పటిష్టంగా ఉన్నప్పుడే సమస్యలను సాధించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

March 7, 2026 / 08:56 PM IST

వినాయకుడిని దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారుడు

CTR: కాణిపాకంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈవో ధనపాల్ పాల్గొన్నారు.

March 7, 2026 / 08:52 PM IST

త్తెనపల్లి మెప్మా కార్యాలయంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

పల్నాడు: సత్తెనపల్లి మెప్మా కార్యాలయంలో శనివారం ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వి. విజయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది దివ్వెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. మహిళలకు కల్పించిన ఆస్తి హక్కు, మనోవర్తి, వరకట్న వేధింపుల నిరోధక చట్టాలపై ఆయన సమగ్రంగా వివరించారు.

March 7, 2026 / 08:52 PM IST

నరసాపురంలో ఐదుగురు అరెస్ట్

W.G. నరసాపురం(మం) యర్రంశెట్టివారిపాలెం పీతానివారిమెరక శివారులో శనివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్లు నరసాపురం రూరల్ ఎస్సై టీ. వెంకట సురేశ్ తెలిపారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 3,210 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

March 7, 2026 / 08:49 PM IST