ATP: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర కామర్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సెట్-I ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 5,223 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,937 మంది హాజరు కాగా, 286 మంది గైర్హాజరయ్యారని ఆయన వివరించారు.
BPT: సంతమగుళూరు మండలంలోని చవిటిపాలెంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మండల పార్టీ అధ్యక్షుడు చేవూరు వాసిరెడ్డి, మండల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తేలప్రోలు రమేష్తో కలిసి ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రకాశం: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మార్కాపురం జేసీ పి. శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో RWS, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, వాటి పరిష్కారం మార్గాల గురించి అధికారులను ఆరా తీశారు. సమస్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ATP: జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈ నెల 17న ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం కంప్యూటర్లపై పని చేయడం వల్ల జర్నలిస్టులకు కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
BPT: అద్దంకి మండలంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యత, వ్యాధుల నివారణ వంటి అంశాలపై వివరించారు. ప్రతిరోజూ శుభ్రత పాటించడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని విద్యార్థులకు సూచించారు.
KDP: ప్రొద్దుటూరులో రిపోర్టర్ల వేధింపులు తట్టుకోలేక బియ్యం వ్యాపారి నజీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగిన ఆయనను ప్రాణాపాయ స్థితిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూట్యూబ్, టీవీ ఛానెల్ రిపోర్టర్లు, ఓ హోంగార్డు డబ్బుల కోసం వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.
KNRL: విద్యార్థులు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సెట్కూర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్ సూచించారు. గురువారం ఉలిందకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు. బాలికల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని అయన తెలిపారు.
NDL: మండలంలోని ముత్యాలపాడు బస్టాండ్ సమీపంలో గురువారం కారు ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. బాచేపల్లి నుంచి చాగలమర్రికి వస్తున్న ఆటోకు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో బైక్ పైన వస్తున్న ఖాజావలికి కాలు విరగగా, రహంతుల్లా, మౌలాలీ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ASR: డుంబ్రిగూడ అంగన్వాడీ సెంటర్ పక్కన ఉన్న మంచినీటి బోర్వెల్ ను వెంటనే మరమ్మత్తు చేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి గురువారం డిమాండ్ చేశారు. బోర్వెల్ పనిచేయకపోవడంతో అంగన్వాడీ చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
ASR: డుంబ్రిగూడ అంగన్వాడీ సెంటర్ పక్కన ఉన్న మంచినీటి బోర్వెల్ ను వెంటనే మరమ్మత్తు చేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి గురువారం డిమాండ్ చేశారు. బోర్వెల్ పనిచేయకపోవడంతో అంగన్వాడీ చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
E.G: నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గురువారం సందర్శించారు. ఈ మేరకు ఒత్తిడి లేని విద్య- ఉత్తమ ఫలితాలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, ఉత్తమ సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే హాల్ టికెట్లు పెన్నులు, ప్యాడ్లు అందజేశారు.
ATP: జిల్లాలో ప్రతిష్టాత్మక ‘డిస్నీ వరల్డ్ సిటీ’ ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రసిద్ధ వాల్ట్ డిస్నీ సంస్థతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖను ఆదేశించారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాయలసీమ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
ATP: జిల్లాలో ప్రతిష్టాత్మక ‘డిస్నీ వరల్డ్ సిటీ’ ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రసిద్ధ వాల్ట్ డిస్నీ సంస్థతో సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖను ఆదేశించారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాయలసీమ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
NLR: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల పాలిట వరంలా మారిందని కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం జగదేవిపేటకు చెందిన వంగపూడి సుమతి ప్రాణాపాయ స్థితిలో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి నగదు లేక ఇబ్బంది పడుతుండడంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బాధితురాలికి రూ.3.05 లక్షలు మంజూరు చేయించారు.
VZM: గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన దుడుమూరు మహాలక్ష్మి (50) గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష 3 నెలలు సరిపడా నిత్యవసర సరుకులను శుక్రవారం వైసీపీ క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.