BPT: జిల్లాలో రబీ సీజన్కు సరిపడా 8, 641 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మార్చి 25 వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ దుకాణాల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ. 266.50 మాత్రమేనని, ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
GNTR: 2019-2024 మధ్య 60 లక్షల మెట్రిక్ టన్నుల నెయ్యిలో కల్తీ జరిగిందని, ఇందులో రూ. 240 కోట్ల కుంభకోణం ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఎన్డీడీబీ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టే, నెయ్యిలో వెజిటబుల్, అనిమల్ ఫ్యాట్ కలిపినట్లు సిట్ నివేదిక కూడా స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ ఆరోపణలు చేశారు.
ASR: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో ఎస్బీఐ ఏటీఎం సుమారు ఎనిమిది నెలలుగా పనిచేయడం లేదు. దీంతో స్థానిక వినియోగదారులు, పర్యాటకులు డబ్బులు ఉపసంహరించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఏటీఎంలు కూడా సక్రమంగా పనిచేయక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాత యంత్రాల కారణంగా సమస్య ఏర్పడిందని, కొత్త ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
VSP: శ్రీహరిపురం జీవీఎంసీ వాణిజ్య సముదాయంలో దుకాణదారులు ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా అద్దెలు చెల్లిస్తూ దుకాణాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్కింగ్ లేకుండా కాయగూరలు, పండ్ల బండ్లు ఉండడంతో వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 దుకాణాల్లో 30 ఖాళీగా ఉండటంతో జీవీఎంసీకి సంవత్సరానికి రూ.40 లక్షల నష్టం వస్తోందని ఆరోపించారు.
PPM: సీతంపేటమండలం దాసుగుమ్మడ నుంచి అంబలిగండివెళ్లే రహదారి రాళ్లు తేలి అధ్వానంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అటవీ ఉత్పత్తులు మార్కెట్కు తరలించడానికి, రోగులను అంబులెన్స్లో ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి నరకం చూస్తున్నారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
PLD: రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలో నంబర్–1గా నిలపాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక టూరిజం పాలసీని ప్రకటించిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో పర్యాటక శాఖ బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సాంస్కృతిక – చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కిలో టమాటా రూ.45 ఉండగా, బుధవారం అది రూ.6కు పడిపోయింది. ఈ ధర కూలీల ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్కు తీసుకెళ్లినా రవాణా ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు టమాటాలను పొలాల్లోనే వదిలేస్తున్నారు.
ప.గో.జిల్లా జేఏసీలోని సభ్య సంఘాల నాయకులకు చోటు కల్పించడం హర్షనీయమని STU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి వర్మ, రామచంద్రరావు తెలిపారు. జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్గా STU జిల్లా కార్యదర్శి KV.రామచంద్రరావు, జిల్లా జేఏసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా జిల్లా అధ్యక్షులు PRVS సాయి వర్మలను ఏకగ్రీవంగా భీమవరంలో ఎన్నుకున్నట్టు గురువారం తెలిపారు.
సత్యసాయి: మంగళగిరిలోని TDP కార్యాలయంలో మడకశిర నియోజకవర్గ క్లస్టర్ కన్వీనర్ల శిక్షణ తరగతులు గురువారం జరిగాయి. మడకశిర, గుడిబండ, రొళ్ల, అగళి, అమరాపురం మండలాల నుంచి కన్వీనర్లు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు వీరికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై శిక్షణ ఇచ్చారు.
KRNL: పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు.
PPM: మార్ట్ (Manyam Agri Rural Transformation) ప్రాజెక్టు జిల్లా ప్రగతికి సరికొత్త బాట వేయనుందని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. దీనికి సంబంధించి ప్రతి శాఖాధికారి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలతో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులు, మహిళ ఆదాయం రెట్టింపు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఛాంబర్లో మార్ట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు.
గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన నైట్ షిఫ్టులు, క్యాజువాలిటీ, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ల విధులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
NDL: డోన్ మండలం కొత్తబుర్జులో ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో బుధవారం MLA కోట్ల జయసూర్య ప్రకాశ రెడ్డి సభా స్థలం, హెలిప్యాడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో గిన్ఫ్రా ప్రిసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు గతంలో కేటాయించిన 121.53 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సంస్థ అంతర్గత కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భూమిని ఇకపై అంతరిక్ష, రక్షణ రంగ ప్రాజెక్టుల ఏర్పాటుకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
W.G: ఆక్వా రైతాంగానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీడు, సీడు ధరలను ప్రభుత్వం నియంత్రించాలని, నాణ్యమైన విత్తనాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు. ఆక్వా రంగానికి విద్యుత్ రాయితీలు కొనసాగించాలని కోరారు.