ప్రకాశం: సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడులో జరుగుతున్న తిరుణాల సందర్భంగా కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరావు చేపట్టారు. డీఎస్పీ తిరుణాల ప్రాంగణాన్ని సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ భద్రతా చర్యలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
NTR: నందిగామ రెవిన్యూ డివిజన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీ కే పోసి బాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 7 అర్జీలు అందగా, రెవిన్యూ శాఖకు 3, విద్యా శాఖకు 2, వ్యవసాయ శాఖకు 1, సర్వే శాఖకు 1 అర్జీ వచ్చినట్లు తెలిపారు. అర్జీలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సకాలంలో పరిష్కరించాలన్నారు.
VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో గృహ నిర్మాణ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) – హౌసింగ్ ఫర్ ఆల్ (HFA) పథకంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 2,50,893 ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా సోమవారం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల చేతులమీదుగా లబ్ధిదారులకు 4,286 ఇళ్ల పంపిణీ చేశారు.
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం అల్లివలస జనసైనికుడు అప్పన్న యాక్సిడెంట్లో గాయపడి శ్రీకాకుళం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం జనసేన పార్టీ ఇంఛార్జ్ డా. విశ్వక్సేన్ అప్పన్నను పరామర్శించి రూ.5000 మెడికల్ ఖర్చుకు అందజేశారు. ఆయనతో పాటు రణస్థలం మండల మైలపల్లి రాంప్రసాద్, కాకర్ల బాబాజీ తదితరులు ఉన్నారు.
PPM: పీ-4తో బంగారు కుటుంబాల తలరాతలు మారనున్నాయని, పేదరికం లేని సమాజమే లక్ష్యం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పీ-4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆధార్ కార్డు నిర్మూలన చేయటమే సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అన్నారు.
PLD: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఏ మాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRSలో ఆమె పాల్గొని బాధితుల నుంచి 103 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు తక్షణమే ఊరటనివ్వాలని స్పష్టం చేశారు.
EG: ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన p4 విధానాన్ని రాజానగరం నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి ఇవాళ అభినందించారు. p4 స్ఫూర్తితో వెదుళ్ళపల్లి స్కూల్ భవన నిర్మాణము, భోజనశాలకు కాంపౌండ్ వాల్కు సొంత నిధులు యాజమాన్యానికి అందజేశారు. దాతల స్ఫూర్తిని కొనియాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వీరన్న చౌదరిని సన్మానించారు.
VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్వయాన సోదరుడు, ప్రముఖ న్యాయవాది కీ.శే కోలగట్ల తమ్మన శెట్టి ఆకస్మిక మరణం పట్ల భీమిలి జడ్పీ ఛైర్మన్ వెంకట అప్పలనాయుడు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు అప్పలనాయుడు, వెంకటనారాయణ (సర్పంచ్), తాతీ నాయుడు తదితర నాయకులు తమ్మన శెట్టి నివాసానికి చేరుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పలు కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 10:30 గంటలకు హిరమండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 23 పంచాయతీల సర్పంచుల సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం చేపడుతారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు.
NTR: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అద్భుతం చోటుచేసుకుంది. సాయంత్రం 6.3 నిమిషాలకు అమ్మవారి గర్భం గుడి పైనుంచి సూర్యకిరణాలు ప్రసరించడంతో భక్తులు ఆనంద పర్వసులైనారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన చూడలేదని భక్తులతో పాటు ఆలయ సిబ్బంది కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు, నాణ్యతతో పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో 111 అర్జీలు అందగా, వాటిలో 25 రెవిన్యూ శాఖవి కాగా, ఇతర శాఖలకు చెందినవి 86 అందాయని అన్నారు.
సత్యసాయి: హిందూపురం పార్లమెంట్ పరిధిలోని నేషనల్ హైవేపై ఎదురవుతున్న ప్రమాదాల నివారణకు ఎంపీ బీకే పార్థసారధి కీలక చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్హెచ్ఏఐ (NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ను ఇవాళ కలిసి కొడికొండ, పాలసముద్రం, సోమందేపల్లి, పెనుకొండ, ముక్తాపురం, మరూరు, రాప్తాడు, తపోవనం ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్లపై వివరించారు.
ASR: డుంబ్రిగూడ(M)బిజుమరవలస గ్రామానికి చెందిన కిల్లో బాబి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ సిరీస్ పోటీలు నేపాల్లో ఈ నెల 26 నుంచి 30 వరకు జరిగాయి. YGCI ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న బాబి, 100 మీటర్ల పరుగులో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ విజయంతో గ్రామస్థులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 60 ఫిర్యాదులు అందినట్లు సోమవారం ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.