PPM: గుమ్మలక్ష్మీపురంలోని ఏకలవ్య పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. ఏప్రిల్ 4న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ కాండిడేట్ ID, పుట్టిన తేదీతో వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.
PPM: ఎల్విన్ పేట గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీరాములవారిని పల్లకిలో భక్తులు ఊరేగించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు.
పల్నాడు జిల్లాలో పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లకు వర్క్ స్పేస్లు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఏపీ నైబర్ భాగంగా వర్క్ స్పేస్లను లీజుకు ఇవ్వాలనుకునే వారు (APTS) ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తులు www.apts.gov.in వెబ్సైట్లో సమర్పించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 8143650320ను సంప్రదించాలని సూచించారు.
ELR: పాడి రైతులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ ఏడీ గోపాల్ నాయక్ కోరారు. గణపవరం (M) జల్లికొమ్మరలో శుక్రవారం గాలికుంటు నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 97 పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ నెల 27 నుంచి 31 వరకు మండలవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
KRNL: ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ చారిత్రాత్మక ప్రాజెక్ట్గా నిలవనుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. సుమారు రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఏర్పడనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. సుమారు 5,465 ఎకరాల్లో ఏర్పాటు కానున్నదని తెలిపారు.
ఉమ్మడి కృష్ణాలో సాగు, తాగునీటి కాలువల పూడికతీత పనుల నిధుల కేటాయింపు రాజకీయ దుమారం రేపుతోంది. క్షేత్రస్థాయి సమస్యల తీవ్రతతో సంబంధం లేకుండా, ప్రతి నియోజకవర్గానికి సరాసరి రూ.2.5 నుంచి రూ.3.5 కోట్ల వరకు కేటాయించడంపై కొందరు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కాగా, రూ.40 కోట్లతో ప్రాధాన్యత క్రమంలో పిచ్చిమొక్కల తొలగింపు, పూడికతీత పనులు చేపడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
VSP: సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్లా బొజ్జి రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి మొక్కులు తీర్చుకున్న ఆయన, అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఇవాళ సికింద్రాబాద్ వాస్తవ్యులు గుంటూరి లలితా శ్రీ వారి కుటుంబ సభ్యులు రూ. 50,116 వేలు విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
NLR: శ్రీరామనవమి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, అభ్యంతరకర కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదలకూరు CI గుత్తి వెంకటరావు హెచ్చరించారు. అసభ్య ప్రదర్శనలు చేస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఉత్సవాలు భక్తి, శాంతియుత వాతావరణంలో జరగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. మహిళలు నగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
GNTR: తాడేపల్లి మండలం ఉండవల్లిలో జేబుదొంగతనాలకు పాల్పడుతున్న విష్ణు, విక్టర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం బస్సు యాత్రలో పలువురి జేబులు కత్తిరించినట్లు గుర్తించారు. నిందితులపై ఉమ్మడి గుంటూరు జిల్లాలో 8 కేసులు, రాష్ట్రవ్యాప్తంగా మరో 6 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.75,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వీరేంద్ర తెలిపారు.
NDL: డోన్ న్యాయవాది కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పోలీసులను అవమానించేలా మాట్లాడారనే ఆరోపణలపై ప్రజలు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ MRPS జిల్లా ఉపాధ్యక్షుడు నాగన్న స్పందిస్తూ.. బాధ్యతాయుత వృత్తిలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని వెల్లడించారు. పోలీసులు ప్రజల రక్షణకే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
KRNL: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడిని జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి అమరావతిలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పీ.లేవిడి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాములవారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
PLD: రొంపిచర్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ సమీపంలోని రామాలయం వద్ద సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సీతారామ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపుగా కళ్యాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తిరుపతి జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ వ్యవస్థ, సత్యం, ధర్మానికి రామాయణం ఆదర్శమన్నారు. వేడుకల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.