SKLM: నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుని జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు సమాజానికి మార్గదర్శకులని మంత్రి అన్నారు.
కడప: జిల్లాలో శెనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వస్తున్న ఫిర్యాదులపై జేసీ నిధిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శెనగ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులపై సోమవారం సాయంత్రం కడపలో సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో అదనపు వసూళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అన్నమయ్య: ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలకు పరిష్కారం లభించింది. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 33 వెబ్ ల్యాండ్ 1B పత్రాలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కోర్ట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 9 మంది రైతులకు కలెక్టర్ స్వయంగా 1B పత్రాలు అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
W.G: భీమవరం ప్రకాశం సర్కిల్లో సోమవారం ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం 100 రోజుల పని కల్పించిందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం 52 రోజులు కూడా చూపడం లేదని నేతలు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందని YS షర్మిల మండిపడ్డారు.
WG: జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ సేవలను విస్తరించేందుకు నిధుల సేకరణ చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం రక్తదాన మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు కార్యక్రమం నిర్వహించనున్నారు. మానవతా సేవలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యమని జేసీ తెలిపారు.
KDP: YVU విశ్వవిద్యాలయం 21వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. యువత మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేవలం గ్రూప్స్, సివిల్స్ వంటి వాటిపైనే దృష్టి సారించి సమయాన్ని వృధా చేసుకోకుండా, సంపద సృష్టిలో చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్ఛారు.
KRNL: పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ఆదోని ఫస్ట్ జూనియర్ సివిల్ జడ్జి సాయి సుబాష్ విచారణ జరిపారు. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా విధించగా, ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఎం. రమేష్కు 15 రోజుల జైలు శిక్ష పడిందని, పెద్దకడబూరు ఎస్సై మారుతి తెలిపారు.
నెల్లూరులోని జగనన్న కాలనీ సమీపంలో పెన్నా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నవాబుపేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తెలుపు గోధుమ రంగు ఫుల్ హాండ్స్ గళ్ళ చొక్కా ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు తెలిసినవారు 9440796306 సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
TPT: బాలికపై లైంగిక దాడి చేసిన నవీన్ (20)కు హనుమకొండ మొదటి అదనపు జిల్లా సహా పోక్సో కోర్టు న్యాయమూర్తి బి. అపర్ణాదేవి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.14 వేల జరిమానా విధించారు. చిల్లకూరు మండలంనికి చెందిన నవీన్ బాధితురాలిని వేధిస్తూ లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. బాలికకు ప్రభుత్వం నుంచి రూ.14 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బిపేటలోని మస్జిద్-ఎ-లబాబియన్ మసీదులో వైసీపీ మైనారిటీ నేతలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించి, అనంతరం మసీదులో నిర్వహించిన నమాజ్లో పాల్గొన్నారు.
కాకినాడ ట్రాఫిక్ 1, 2 పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 70 మంది పట్టుబడ్డారని ట్రాఫిక్-1 సీఐ నూని రమేశ్ తెలిపారు. వీరిని సోమవారం మేజిస్ట్రేట్ చింతా నాగేంద్రరావు ముందు హాజరుపరిచారు. కోర్టు 22 మందికి జైలు శిక్ష, 48 మందికి ఒక్కొక్కరికి 10 వేల జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా ప్రభాకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన పరిధిలో నేరాలను నియంత్రించి శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
KKD: కోటనందూరు(మం) కాకరపల్లి శివారు చెరువులో సోమవారం లభ్యమైన మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మి(35), ఆమె కుమారుడు సాయి(3)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్ల భాగ్యలక్ష్మి కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI చెన్నకేశవరావు తెలిపారు.
AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో మంగళవారం గ్రామ దేవత పారిపల్లెమ్మ అమ్మవారి పండగను నిర్వహించడానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కృష్ణా: కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలను వినేందుకు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో జి. సుధా ప్రవీణ్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి. సాయిబాబు హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.