CTR: ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలంలో రైతులతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 36,473 మంది రైతులకు సుమారు రూ.19.76 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
VZM: గజపతినగరం పోలీసు స్టేషన్ సర్కిల్ పరిధిలో నాటు తుపాకులు ఉంటే సమాచారం ఇవ్వాలని బొబ్బిలి ఇంఛార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు కోరారు. నాటు తుపాకులు ఉంటే సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. సమాచారం ఇచ్చిన పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాపై కూడా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
ASR: పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయి. డీఆర్వో అంబేద్కర్, ఎస్డీసీ నీలకంఠరావు వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కర్నూలు: ప్రముఖుల పై సోషల్ మీడియా వేదికల్లో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే పోస్టులు చేయడం చట్ట విరుద్ధమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Vsp: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఈనెల 22, 23వ తేదీల్లో వర్క్షాప్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఉపకులపతి రాజశేఖర్ తన కార్యాలయంలో శుక్రవారం విడుదల చేశారు. ‘జియోటెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాబ్లమేటిక్ గ్రౌండ్’ అంశంపై ఈ వర్క్షాప్ నిర్వహించనున్నారు.
SS: లేపాక్షి తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహించిన అన్నదాత సుఖీభవ మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ సౌజన్య లక్ష్మి మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
W.G.వీరవాసరం జెడ్పి హైస్కూల్లో గ్రామంలో 3వ విడత అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం శుక్రవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో రైతు ఖాతాలో రూ. 6000 జమ చేయడం జరుగిందన్నారు. భీమవరం నియోజకవర్గంలో మూడో విడతలో 8,335 మంది రైతులకు రూ 4.72 కోట్లు జామ కానున్నాయన్నారు.
NDL: రేపు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని అన్ని మసీదులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శిస్తున్నట్లు ఆయన అన్నారు. కావున నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
PPM: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి జిల్లాలో నిర్వహించే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కొమరాడ ఎస్సై ఎం. జగదీష్ మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ డంగభద్ర గ్రామంలో శుక్రవారం పర్యటించి, సభా స్థలాన్ని పరిశీలించారు. డిసిసి జిల్లా అధ్యక్షులు దాలినాయుడుతో యాత్రకు సంబంధించిన విషయాలు చర్చించారు.
GNTR: అన్నదాత సుఖీభవా-పీఎం కిసాన్ 2025-26 మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని సాయికృష్ణ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్విహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని, వర్చువల్గా వీక్షించారు.
ప్రకాశం: టంగుటూరు మండలంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తులు కారణంగా విద్యుత్తు నిలిపివేస్తున్నట్లు ఏఈ రామకృష్ణ తెలిపారు. టంగుటూరు టౌన్తోపాటు రాయివారిపాలెం, పసుపు కుదురు, అనంతవరం, ఆలకూరపాడు, వెలగపూడి, తాళ్లపాలెం, గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.
ATP: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పథకానికి రాష్ట్ర మంత్రివర్గం రూ.480 కోట్లు మంజూరు చేసింది. ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి చేయడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు రూ.380 కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ATP: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పథకానికి రాష్ట్ర మంత్రివర్గం రూ.480 కోట్లు మంజూరు చేసింది. ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి చేయడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు రూ.380 కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
కడప: జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని శాఖల సహకారంతో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO శంషుద్దీన్ తెలిపారు. జిల్లాలో 28,152 మంది విద్యార్థులకు 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,783 మంది ఇన్విజిలేటర్లు, 167 మంది చీప్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 7 ఫ్లయింగ్, 30 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు.
KRNL: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నాడని TDP ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఇవాళ పెద్దకడబూరులో అన్నదాత సుఖీభవ- PM కిసాన్ 3వ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 41,992 మంది రైతులకు గాను రూ. 23.85 కోట్లు మంజూరు కాగా.. పెద్దకడబూరు మండలానికి 9,662 మంది రైతులకు రూ.5.58 కోట్లు మంజూరయ్యాయి.