• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆలూరు బార్ అధ్యక్షుడిగా ప్రవీణ్

KRNL: ఆలూరు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీ. ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా లక్ష్మికాంత్, ఉపాధ్యక్షుడిగా ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా షాకీర్ బాషా, సహాయ కార్యదర్శిగా డీఐవీ విజయ్ రాజ్ ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

March 24, 2026 / 10:43 PM IST

ప్రపంచ క్షయ దినోత్సవంపై అవగాహన సదస్సు

KRNL: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా కర్నూలులో మంగళవారం అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. డాక్టర్ ఎల్. భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. క్షయ వ్యాధి లక్షణాలు, నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. టీబీ ముక్త్ పంచాయతీలకు, పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

March 24, 2026 / 10:21 PM IST

మట్టి తవ్వకాలను అడ్డుకున్న వైసీపీ నాయకులు

E.G: కడియం మండలం పొట్టిలంక గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 147లో అక్రమంగా తరలిస్తున్న మట్టి లారీలను మండల వైసీపీ నాయకులతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు అడ్డుకున్నారు. అక్రమ మట్టి తరలింపుపై ఇప్పటివరకు నాయకులు నోరు మెదపకుండా ఉండటం చాలా ఆశ్చర్యమన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 24, 2026 / 10:00 PM IST

బేస్తవారిపేటలో పోలీసు నైట్ బీట్

ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలో మంగళవారం రాత్రి ఎస్ఐ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నైట్ బీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను విచారించి వారి వివరాలను సేకరించినట్లు ఎస్ఐ తెలిపారు. రాత్రి వేళల్లో నేరాలను అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

March 24, 2026 / 10:00 PM IST

30న గృహప్రవేశాలుకు కలెక్టర్ ఆదేశాలు

KRNL: జిల్లాలో ఈ నెల 30న అన్ని నియోజకవర్గాల్లో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నందున ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పనులపై సమీక్షించారు. ఆప్షన్-3 కింద నిర్మించిన ఇళ్లలో లోపాలను వెంటనే సరిచేయాలని, రూఫ్ లెవెల్ చేరిన ఇళ్లను ప్రాధాన్యంతో పూర్తి చేయాలని సూచించారు.

March 24, 2026 / 09:45 PM IST

ఒంటిమిట్టలో పోలీసుల అవగాహన కార్యక్రమం

KDP: ఒంటిమిట్టలో పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హ్యాపీ కిడ్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి మారథాన్ నిర్వహించి ప్రజలకు చైతన్యం కల్పించారు. ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల స్కిట్స్ కార్యక్రమాన్ని ఆకట్టుకున్నాయి.

March 24, 2026 / 09:42 PM IST

ఈనెల 26న మాధవాయపాలెం పెర్రీ వేలం పాట

W.G: నరసాపురం-మాధవాయపాలెం ఫెర్రీ వేలం పాట ఈ నెల 26న గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయ 11.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.నాసరురెడ్డి తెలిపారు. నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలం పాటకు సంబంధించి నోటిఫికేషన్ పేర్కొన్న మార్గదర్శణాలు, నిబంధనలు పాట దారులకు వర్తిస్తాయన్నారు.

March 24, 2026 / 09:41 PM IST

ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి ఫరూక్ స్పందన

NDL: బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఇవాళ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పందించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.

March 24, 2026 / 09:41 PM IST

రేపటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న పొగాకు రైతులు

ప్రకాశం: రేపు పొదిలిలో జరగనున్న పొగాకు వేలం కేంద్రం ధరలపై మర్రిపూడి మండల రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మర్రిపూడి మండలంలో అధికంగా పొగాకు సాగు చేస్తుంటారు. పొగాకు సాగు ఖర్చులు బాగా పెరిగాయని రావిళ్ళవారిపాలెం మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం జరిగే వేలంకేంద్రంలో ధరలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా రేపటి కోసం ఎదురుచూస్తున్నారు.

March 24, 2026 / 09:30 PM IST

విద్యుదాఘాతంతో జూనియర్ లైన్మెన్‌కు గాయాలు

NDL: కొత్తపల్లి మండలంలోని శివాపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్ మెన్ ఇబ్రహీంకు ఇవాళ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 24, 2026 / 09:00 PM IST

‘పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి’

కోనసీమ: కె.గంగవరం మండలం ముసకపల్లి గ్రామంలో మంగళవారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 24, 2026 / 09:00 PM IST

నిబంధనలు ఉల్లంఘనపై కేసు నమోదు

TPT: తిరుపతి జిల్లా తడలో విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారుల సంయుక్త తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తడ కండ్రిగలోని ఎస్ఎస్ఆర్ వైన్స్, KR జీవా ఫ్రైడ్ రైస్ షాప్‌లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 6(ఏ) కేసు నమోదు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

March 24, 2026 / 08:56 PM IST

రేపు కన్నాపురంలో ఉచిత వైద్య శిబిరం

ELR: కన్నాపురంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వుందుర్తి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, ఏలూరుకు చెందిన వైద్యులు సేవలు అందించనున్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ విభాగాల్లో ఉచిత పరీక్షలు నిర్వహించి, ఔషధాలు అందజేస్తారు.

March 24, 2026 / 08:48 PM IST

మెడికల్ కాలేజీలో స్పోర్ట్స్ అభివృద్ధిపై సమీక్ష

KRNL: వైద్య విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమని వీసీ డా. పీ. చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో స్పోర్ట్స్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కాలేజీకి రూ.10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. క్రీడలు విద్యార్థుల నైపుణ్యాలు, శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.

March 24, 2026 / 08:42 PM IST

రైతులకు శిక్షణ కార్యక్రమం

ASR: ఆత్మ పథకంలో భాగంగా వరిలో మేలైన యాజమాన్య పద్ధతులపై మంగళవారం శింగవరంలో రైతులకు శిక్షణ నిర్వహించామని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ తెలిపారు. రైతులు, మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నేరుగా వరి విత్తే విధానం, ఎరువుల వాడకం, కలుపు నివారణ, తెగుళ్లు, పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీఏఏ కల్యాణి పాల్గొన్నారు.

March 24, 2026 / 08:40 PM IST