కోనసీమ: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు “స్టాప్, వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం ముమ్మరంగా నిర్వహిస్తోంది.దీనిలో భాగంగా అమలాపురంలో మంగళవారం రాత్రి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లను గుర్తించి, వారిని వాహనం దింపి, నీళ్లతో ముఖం కడిగించిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
E.G: చాగల్లు PHC పరిధిలో బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు తల్లిదండ్రుల అనుమతితో ఈ టీకాలు వేస్తున్నట్లు వైద్యాధికారి తనుజ తెలిపారు. మూడు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా బాలికలందరూ ఈ టీకా వేయించుకోవాలని ఆమె సూచించారు.
SKLM: హిరమండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కాళీప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు జరిగిన పనులకు సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, వేతనదారులు హాజరుకా వాలని కోరారు.
PPM: గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామానికి బుధవారం ఏనుగులు గుంపు చేరుకుంది. దాంతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. పంటలు పొలాలు ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరాడ మండలంలో సంచరించిన ఏనుగులు గరుగుబిల్లి మండలానికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోకి చొరబడుకుండా మంటలు ఏర్పాటు చేశారు.
ATP: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డిని రాయదుర్గం యువనాయకుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన పార్టీ కార్యక్రమాలు, నూతన కమిటీల నియామకంపై అధినేతకు వివరించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో చేస్తున్న కృషిని జగన్ అడిగి తెలుసుకున్నారు.
NLR: చాగలమర్రి మండలం మల్లెవేముల రహదారి పక్కన ఉన్న నీటి క్వారీ ప్రమాదకరంగా మారింది. వందలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో అదుపు తప్పితే వాహనాలు నీటిలో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రక్షణ రైలింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు.
KRNL: ఎమ్మిగనూరులో 2026-27 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ పరీక్ష రాసే విద్యార్థులకు మొదటసారి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆదోని పాలి టెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చిన్నపురెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు పట్టణంతో పాటు మంత్రాలయం, పత్తికొండ పట్టణాల్లో పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
W.G: ఆకివీడు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ వెల్లడించారు. బుధవారం ఉదయం పలు వార్డుల్లో పర్యటించిన ఆయన, క్షేత్రస్థాయిలో కార్మికుల పనితీరును స్వయంగా పరిశీలించారు. డ్రైన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించి, చెత్తకుప్పలను వెంటనే ట్రాక్టర్ల ద్వారా తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పరిశ్రమ ప్రమాద ఘటనలో పెద్దాపురానికి చెందిన పాలకుర్తి కనక సత్తిరాజు గుప్తాను అరెస్ట్ చేసినట్లు DSP కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పరిశ్రమ యజమానులు అడబాల అర్జునుడు, అడబాల వీరబాబులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు నిందితులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
VSP: విశాఖలో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. GVMC పరిధిలో మిగిలిన 25 బార్ల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఏడాదికి రూ.95 లక్షల లైసెన్స్ ఫీజుతో పాటు దరఖాస్తుతో రూ.5 లక్షల నాన్ రిఫండబుల్ డీడీ తప్పనిసరి కావడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
E.G: రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు మత సమైక్యతకు నిదర్శనమని మండపేట టౌన్ సిఐ సురేష్ అన్నారు. మండపేట జామియా మస్జిద్ కమిటి ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. మండపేట కలువ పువ్వు సెంటర్ లో ఉన్న అహలే సున్నత్ వల్ జామియా మస్జిద్లో జరిగిన ఇఫ్తార్లో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.
NDL: మిడుతూరు మండలంలో సుమారు 2,500 ఎకరాల్లో సాగు చేసిన పొగాకు పంట కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. కంపెనీలు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చినా, ఇప్పటివరకు ప్రారంభించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలోనే కొనుగోళ్లు మొదలయ్యాయని గుర్తుచేశారు. క్వింటాకు రూ.18 వేలు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
VZM: జిల్లా పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు తపాలా అదాలత్, పెన్షన్ అదాలత్ నిర్వహించనున్నట్లు పర్యవేక్షకులు శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్ ఈ నెల 25 ఉదయం 11 గంటలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు, ఫిర్యాదులు ఈ నెల 23 లోపు పంపాలన్నారు.
కృష్ణా: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను జిల్లా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,60,000 లక్షల విలువ చేసే 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. గంజాయి రవాణా చేసేవారు సేవించే వారిపై నిఘా ఉంచుతూ వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మైనార్టీల సంక్షేమంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన రిజర్వేషన్లు, జగన్ హయాంలో అందించిన షాదీ తోఫా, గౌరవ వేతనాలే ముస్లింలకు నిజమైన గుర్తింపునిచ్చాయని పేర్కొన్నారు.