కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష కాల అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
SKLM: జామి యల్లారమ్మ పండగలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందిస్తూ,వారి సేవలను కొనియాడారు. అనంతరం అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సుమారు 10 వేల మంది భక్తులకోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని వడ్డించారు.
GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం గుంటూరు ఈస్ట్ సబ్-డివిజన్ పరిధిలో మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం అందరి బాధ్యతని, అన్యాయం జరిగితే ధైర్యంగా స్పందించి పోలీసుల ‘శక్తి టీమ్’ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
CTR: వి.కోట మండల కేంద్రంలో ఆదివారం తేనెటీగల దాడిలో 20 మంది గాయపడ్డారు. వి.కోటకు చెందిన వెంకటరమణ కుటుంబ సభ్యులు స్థానిక మునీశ్వరస్వామి ఆలయం వద్ద మునిదేవర కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు అగరబత్తుల పొగకు ఒక్కసారిగా రెచ్చిపోయి అక్కడున్న వారిపై దాడి చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ ఇంటర్, ఐఐటీ-నీట్ తర్ఫీదు ఇచ్చే కళాశాలలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఐదవ తరగతికి 66మందికి గాను 49 మంది, జూనియర్ ఇంటర్ లో 95 మందికి గాను 89, ఐఐటీ-నీట్ 81మందికి గాను 76మంది మొత్తం 214మంది హాజరైనట్టు ప్రిన్సిపల్ ఎం. దుర్గారావు వివరించారు.
SKLM: నియోజకవర్గ కేంద్రం పాతపట్నం ప్రధాన రహదారి పక్కన కొలువైయున్న శ్రీ పాతపట్నం నీలమణి అమ్మవారు చతుర్దశి సోమవారం ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు వందలాదిమంది భక్తులు తెల్లవారుజామున దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవదాయ శాఖ పరిశీలనలో కార్యక్రమాలు జరిగాయి.
TPT: తిరుపతి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు అర్జీలు స్వీకరించి, ప్రజల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
KRNL: చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రతి కేంద్రానికి నిధులు కేటాయించిందన్నారు. కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేశామని తెలిపారు.
NDL: డోన్ పట్టణంలో అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న హుస్సేన్పిర కుటుంబానికి చేయూత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించారు. డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్ రెడ్డి, యశోద హాస్పిటల్ అధినేత డా. సుంకన్న, చంద్రశేఖర్ ఈ సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వాలని దాతలు పిలుపునిచ్చారు.
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా రేపు వేకువజాము నుంచి మూసివేస్తున్నట్లు ఈవోలు తెలిపారు. శ్రీశైలంలో రేపు రాత్రి 9కి భక్తులకు దర్శనం కల్పిస్తారు. మిగతా ఆలయాల్లో బుధవారం వేకువజామున సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేపడతారు.
AKP: నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పండిత సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై ఉభయదేవేరులను అదిష్టింప చేసి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పలువురు వేతపండితులను ఘనంగా సత్కరించారు.
శ్రీకాకుళం నగరంలో ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 214కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. 116 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా ప్రస్తుతం 94 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటి వరకు 135 కేసులు నమోదైనట్లు, 89 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు.
VZM: అంగన్వాడీల వర్కర్స్,హెల్పర్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో రెండుసార్లు అంగన్వాడీల జీతాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదే అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు 50 కోట్ల రూపాయలతో G5 స్మార్ట్ఫోన్లు అందించారు. ఆధునీకరణకు 50 కోట్లు మంజూరు చేశారని అన్నారు.
PPM: మన్యం పట్టణంలో సోమవారం (ఇవాళ) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. స్దానికుల వివరాల ప్రకారం.. స్దానిక అగ్రహారం వీధి మెయిన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గంటా రామకృష్ణ ని లారీ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TPT: తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు.