VSP: పద్మనాభం మండలం పొట్నూరు గ్రామానికి చెందిన ముద్దాడ శ్రియాన్ సత్తా చాటాడు. మొన్నవచ్చిన సైనిక్ స్కూల్ ఫలితాల్లో సదరు విద్యార్థి ఎన్నికయ్యాడు. అయితే, నిన్న విడుదలైన నవోదయ ఫలితాల్లో కూడా మెరిశాడు. మొత్తం వంద మార్కులకు గానూ 86.25 మార్కులు సాధించి 399వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. దీంతో శ్రియాన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరంలోని కంటోన్మెంట్ దండుమారెమ్మ దేవాలయంలో ఈనెల 19 నుంచి 24 వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. ఉత్సవాల ప్రారంభంలో ఎస్పీ పాల్గొని, జ్యోతి ప్రజ్వలనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలకి ఎస్పీతో పాటు, అదనపు ఎస్పీ పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చింతకాయల రాజేష్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పండితులు నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించారు.
GNTR: ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది 10,060 పోస్టులతో క్యాలెండర్ విడుదల కావడం హర్షణీయమని, యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
CTR: కాణిపాకంలో ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కళ్యాణ వేదికపై సిద్ధి–బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పండితులు నూతన సంవత్సర ఫలితాలను వివరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.
ASR: పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణరాజు అన్నారు. పోలవరం జిల్లాలో పులి సంచారం జరుగుతుందని సమాచారం ధ్రువీకరించామన్నారు. సాయంత్రం 6 తర్వాత ఉదయం ఆరులోపు ఇళ్లను విడిచి బయటకు వెళ్లవద్దు అన్నారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలన్నారు. పులి సంచారం దాని సహజ గుణంలో భాగంగా జరుగుతుందన్నారు.
AKP: నక్కపల్లిలో ఈనెల 23న జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర బాబ్జి పిలుపునిచ్చారు. గురువారం కోటవురట్ల మండలం గొట్టివాడ గ్రామంలో ఈ మేరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు.
KKD: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను గురువారం జగ్గంపేట సర్కిల్ పోలీసులు మర్యాదపూర్వకంగా కలిశారు. జగ్గంపేట సీఐ తిరుపతిరావు, ఎస్సైలు రఘునాథరావు, శివ నాగబాబు, సతీష్ కుమార్ గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్లోని ఎంఈవో ఆఫీస్ దగ్గర ఉన్న కాలనీలో నాలుగు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉగాది పండగ రోజున కూడా నీళ్లు రాకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.
PLD: చిలకలూరిపేట మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పుల్లారావు సమీక్ష నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వేసవిలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు, ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణం చేసిన పండితులు ఈ సంవత్సరం సుభిక్షం, సస్యశ్యామలం ఉంటుందని తెలిపారు.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ దేవస్థానాలకు చెందిన వేద పండితులు అర్చకం ప్రసాద్ శర్మ, జగన్నాథమయ్య, పద్మనాభ భట్టార్, లక్ష్మణాచార్యులను కలెక్టర్ ఆనంద్ ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ. 10,116 నగదు పురస్కారాన్ని అందజేశారు.