• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విశాఖ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ఆందోళన

VSP: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, మిగిలిన 1,810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో ఇవాళ విశాఖ కలెక్టరేట్ వద్ద వినతిపత్రం సమర్పించారు. విధులకు ఆటంకం కలగకుండా వెంటనే 5జీ ఫోన్లు ఇవ్వాలని, గ్రాట్యూటీ గైడ్‌లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు.

December 12, 2025 / 12:42 PM IST

రేపు సిమ్స్ మెస్సీయా మార్చ్

VZM: జిల్లాలో శనివారం సాయంత్రం 5 గం.ల నుంచి సిమ్స్ మెస్సీయా మార్చ్ క్రిష్టమస్ సంబరాలు ఘనంగా జరుగునని అధ్యక్షులు టి.ఆనంద్, సెక్రటరీ ఆర్.ఎస్.జాన్ ఇవాళ తెలిపారు. ఈసందర్బంగా నిర్వహించిన క్రిస్మస్ ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, పొడుగు మనుషులు, X-mas, తీన్మార్, విచిత్ర వేషాలు మొదలైనవి ఉండునని తెలిపారు. కావున ఈ ర్యాలీ అందరు హాజరుకావాలని కోరారు.

December 12, 2025 / 12:37 PM IST

విజయవాడ ఎంపీ గారు.. కాస్త చొరవతీసుకోండి.!

NTR: విజయవాడ కొత్త GGH సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సెంట్రల్ ఏసీ వ్యవస్థ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్, గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు సరైన గాలి కూడా అందడం లేదు. ఈ సమస్య కొన్ని నెలలుగా ఉన్నా, పరిష్కారం లభించడం లేదు. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ చిన్నికి అధికారులు సమస్యను వివరించారు.

December 12, 2025 / 11:56 AM IST

జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న ‘జాతీయ లోక్ అదాలత్’

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ. రామకృష్ణయ్య తెలిపారు. గతంలో 16,621 కేసులు పరిష్కరించామన్నారు. ఈసారి 42 ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేశారు. క్రిమినల్ రాజీపడదగిన కేసులు, మోటార్ క్లెయిమ్స్, చెక్‌బౌన్స్, ట్రాఫిక్ చలానాలు, సివిల్ వివాదాలు పరిష్కరించుకోవచ్చన్నారు.

December 12, 2025 / 11:54 AM IST

బుచ్చిలో ఘనంగా ప్రసన్న జన్మదిన వేడుకలు

NLR: బుచ్చి పట్టణంలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ బధిరుల పాఠశాలలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమక్షంలో రూరల్ అధ్యక్షుడు, సతీష్, పట్టణ అధ్యక్షుడు షాహుల్, కౌన్సిలర్లు, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

December 12, 2025 / 11:53 AM IST

రేపు నెల్లూరు ZP సాధారణ సమావేశం

నెల్లూరు ZP సమావేశం శనివారం ఉదయం 10. 30 గంటలకు జరుగుతుందని జడ్పీ సీఈవో శ్రీధర్ తెలిపారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంభందించి బడ్జెట్‌పై చర్చ జరుగుతుందన్నారు. అదే విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సవరణలపై కూడా చర్చిస్తామన్నారు

December 12, 2025 / 11:45 AM IST

అఖండ సినిమాను తిలకించిన ఎమ్మెల్యే

SKLM: నర్సంపేటలో ఇవాళ రిలీజ్ అయిన అఖండ టు సినిమాను నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తిలకించారు. ఇది హైందవ ధర్మాన్ని కాపాడే చిత్రంగా అభివర్ణించారు. ఆయనతో పాటు నియోజకవర్గ నేతలు అభిమానులు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

December 12, 2025 / 11:45 AM IST

వైసీపీ నేత కర్నాటి రాంబాబుకు కీలక పదవి

NTR: గతం ప్రభుత్వంలో దుర్గ గుడి పాలకమండలి ఛైర్మన్‌గా పనిచేసిన కర్నాటి రాంబాబుతో సహా విజయవాడకు చెందిన మరో ఇద్దరు వైసీపీ నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు లభించాయి. విజయవాడకి చెందిన కర్నాటి రాంబాబుకు రాష్ట్ర స్థాయి పదవి రావడంతో వైసీపీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తనకు పదవి రావడానికి సహకరించినందుకు పార్టీ అధి నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

December 12, 2025 / 11:40 AM IST

నరసాపురం నుంచి వందేభారత్

W.G: నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15న ముహూర్తం ఖరారయింది. ప.గో. నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది.

December 12, 2025 / 11:34 AM IST

వీరసాగారం కాలువ.. ఓ వ్యక్తి దర్జాగా మూసివేత

VZM: కొత్తవలస జెడ్పీ పాఠశాల వద్ద ఉన్న వీరసాగరం నీరు ప్రవహించే కాలువను ఓ వ్యక్తి మట్టితో చదును చేసి సిమెంట్ పైపులతో మూసివేస్తున్నారు. ఇంఛార్జ్ తహసీల్దార్ పి. సునీతను సంప్రదించగా సంబంధిత విఆర్వోను పంపించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద జలవనరులశాఖ ఏఈఈ కే. హనుమంతరావును వివరణ కోరగా వీరసాగరం కాలువ మూసివేతకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.

December 12, 2025 / 11:33 AM IST

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళా రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్సై మధుసూదన్ రావు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె వయసు సుమారుగా 30 – 35సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9440627567 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

December 12, 2025 / 11:31 AM IST

పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కర్రా సుధాకర్ నియామకం

కృష్ణా: 6వ అదనపు జిల్లా జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎపీపీ)గా అవనిగడ్డకు చెందిన న్యాయవాది కర్రా సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర్వులు అందుకున్న సుధాకర్, విజయవాడలోని కృష్ణా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి విజయలక్ష్మికి ఈరోజు జాయినింగ్ రిపోర్టు అందజేశారు.

December 12, 2025 / 11:30 AM IST

చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి మృతి

ప్రకాశం: గిద్దలూరు మండలం సంజీరావుపేట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన .దాదాపు 5 నెలల కిందట జరిగిన సంఘటన ఇవాళ బయట పడింది. దంతరపల్లి గ్రామానికి చెందినా శ్రీనివాసులు శారద అనే భార్యాభర్తలు దాదాపు 5 నెలల కిందట మిస్సింగ్ అయినట్టు కేసు నమోదు.వారే అని అనుమానం వ్యక్తం చేస్తున్న చుట్టుపక్కల గ్రామస్తులు పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తెలియాల్సి ఉంది.

December 12, 2025 / 11:29 AM IST

మంత్రితో PUC ఛైర్మన్ భేటీ

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే,PUC ఛైర్మన్ కూన రవి కుమార్, ఇవాళ విజయవాడలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధి, స్థానిక సమస్యలు, భవిష్యత్‌ కార్యక్రమాలపై ఇద్దరూ సవివరంగా చర్చించినట్లు సమాచారం. పార్టీ బలోపేతం, ప్రజా సేవల మెరుగుదల, యువతకు అవకాశాలపై కూడా ఈ సమావేశంలో పలు సూచనలు, అభిప్రాయాలు పంచుకున్నారు.

December 12, 2025 / 11:26 AM IST

గంజాయి రవాణా నియంత్రణకు డాగ్ స్క్వాడ్ తనిఖీలు

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి రవాణాను అరికట్టేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వస్తువులను ప్రత్యేకంగా పరిశీలించి, పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

December 12, 2025 / 11:22 AM IST