• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నగరంలో భవనాలను పరీశిలించిన కలెక్టర్ సిరి➢ పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాలో 65 మంది ఉద్యోగాలు➢ బనగానపల్లెలో పాము కాటుతో వివాహిత మహిళ మృతి➢ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 220 అర్జీలు స్వీకరణ: కలెక్టర్ రాజకుమారి

September 22, 2025 / 09:03 PM IST

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పుంగనూరులో పీఎం మోదీకి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు➢ వెదురుకుప్పం ఎంఆర్‌వో కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ➢ తిరుపతి నగరంలో పబ్లిక్ ప్రాంతాలను పరీశిలించిన మునిస్పల్ కమిషనర్ మౌర్య➢ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ 

September 22, 2025 / 09:03 PM IST

రాజరాజేశ్వరి దేవి అలంకారంలో వాసవి మాత

KDP: మైదుకూరు అమ్మవారిశాలలో సోమవారం రాజరాజేశ్వరి దేవి అలంకారంలో వాసవి మాత భక్తులకు దర్శనం ఇచ్చింది. ఉదయం నుంచి అమ్మవారి మూలవిరాట్‌కు విశేష పూజలు, హోమాలు చేపట్టారు. రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇవ్వగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు లోనయ్యారు.

September 22, 2025 / 08:52 PM IST

‘ప్రావిడెంట్ ఫండ్ మిస్సింగ్ క్రెడిట్లు జమ చేయాలి’

ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్లను వెంటనే జమ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణమరాజు డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో పరిపాలనాధికారి విజయభాస్కర్ రెడ్డిని కలిసి సంబేపల్లి ఉపాధ్యాయుల డిసెంబర్ 2021, జనవరి 2022 మిస్సింగ్ క్రెడిట్ల వివరాలను అందజేశారు.

September 22, 2025 / 08:49 PM IST

11 అర్జీలను స్వీకరించిన కాశీబుగ్గ కమిషనర్

SKLM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాశీబుగ్గలో మున్సిపల్ కార్యాలయంలో జరిగింది.మొత్తం 11 దరఖాస్తులను ప్రజల నుంచి కమిషనర్ రామారావు స్వీకరించారు. కరెంట్ స్తంభాలపై -1, జనన, మరణ -8, ఆస్తి పన్ను-2 వచ్చాయన్నారు. ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

September 22, 2025 / 08:47 PM IST

వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ‘కొణతాల’

AKP: వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ నియమితులయ్యారు. ఛైర్మన్‌గా పి.రాము, వైస్ ఛైర్మన్‌గా కె.వీ. సత్యనారాయణ నియమితులయ్యారు. డైరెక్టర్లుగా ఎస్.రాముడు, కే.లక్ష్మి, బీ.రమణ బాబు,కే.సరోజిని, ఎస్.షణ్ముఖ రాజు, ఎన్.వరలక్ష్మి తదితరులు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

September 22, 2025 / 08:43 PM IST

దీక్షాబంధన అలంకారంలో గంగాభవాని అమ్మవారు

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 బంగారుపేటలోని గంగా భవాని అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం గంగాభవాని అమ్మవారు దీక్షాబంధన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వహణ అమ్మవారిని పుష్ప మాలికలతో ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల స్వీకరించారు.

September 22, 2025 / 08:39 PM IST

‘వ్యవసాయంలో డ్రోన్‌లు, ఏఐ కీలకం’

VSP: దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, నాణ్యమైన పంటల ఉత్పత్తిని పెంచడానికి డ్రోన్స్, ఏఐ ఎంతగానో ఉపయోగపడతాయని గీతం డీమ్డ్ యూనివర్సిటీ ప్రొ-వైస్ ఛాన్సలర్ వై. గౌతమ్‌రావు అన్నారు. సోమవారం ఐఐటీ గువాహటితో కలిసి గీతం నిర్వహించిన ఒక జాతీయ స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులు ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఏఐ సహాయపడుతుందన్నారు.

September 22, 2025 / 08:36 PM IST

సరస్వతి బాయికి డాక్టరేట్ ప్రదానం

TPT: వడిత్యా సరస్వతి బాయికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి అనురాధ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఆమె ‘AI’ ఆధారిత క్లౌడ్ ఫోరెన్సిక్స్ సెక్యూరిటీ మోడల్ యూజింగ్ డీప్ లెర్నింగ్ ఫర్ ఇంట్రూషన్ ఐడెంటిఫికేషన్ అండ్ ఎవిడెన్షియరీ ప్రిజర్వేషన్” అనే అంశంపై పట్టా అందుకున్నారు.

September 22, 2025 / 08:36 PM IST

నిందితుడిని అరెస్ట్ చేయాలని ఐద్వా ఆధ్వర్యంలో నిరసన

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని మాచవరం గ్రామానికి చెందిన గురవమ్మపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ప్రకాశంను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళాసంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. 45 రోజులు గడిచినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, పోలీస్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

September 22, 2025 / 08:34 PM IST

‘స్వస్త్ నారీ మహిళల ఆరోగ్య సంజీవిని లాంటిది’

KRNL: స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ పథకం మహిళలకు ఆరోగ్య సంజీవని లాంటిదని MP నాగరాజు తెలిపారు. సోమవారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య రక్షణకు ఈ పథకం సంజీవనిగా నిలుస్తుందని, రక్తపోటు, డయాబెటీస్, క్యాన్సర్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

September 22, 2025 / 08:31 PM IST

ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ

కోనసీమ: అంబాజీపేట మండలం లో గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. కె.పెదపూడి- కొత్తపాలెం వంతెన వద్ద ఉన్న అప్సర కౌశిక గట్టుపై సోమవారం ఓఎన్జీసీ‌కి చెందిన గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. దీనిని రైతులు గమనించి వెంటనే అంబాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. వారు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేయడంతో లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించి అదుపులోకి తెచ్చారు.

September 22, 2025 / 08:28 PM IST

తహసీల్దార్ ఆదేశాలతో షెడ్ కూల్చివేత

VZM: కొత్తవలస మండల తహసీల్దార్ అప్పలరాజు ఆదేశాలతో సంతపాలెం ప్రభుత్వ భూమిలోని షెడ్‌ను సోమవారం కూల్చివేశారు. సర్వే నంబరు 25-2 ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కబేలా నిర్వహిస్తున్నాడు. తహసీల్దార్ ఆదేశాలతో కూల్చివేసినట్లు వీఆర్వో రవీంద్ర తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

September 22, 2025 / 08:26 PM IST

‘గవర్నమెంట్ ఉద్యోగం అంటూ దోచేశారు’

NLR: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.13.60 లక్షలు దోచేశారంటూ నవాబుపేటకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో ఉన్న తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని.. రేష్మ, అడిగితే బెదిరిస్తున్నారని ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకున్న ఎస్పీ బాధితురాలికి న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

September 22, 2025 / 08:25 PM IST

ర్యాలీ గ్రామంలో డీఎస్పీ హెచ్చరికలు

కోనసీమ: కులాలు, మతాలు, హీరోల పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించేది లేదని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ హెచ్చరించారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామ సచివాలయం వద్ద సోమవారం రాత్రి రావులపాలెం రూరల్ సీఐ సి.హెచ్.విద్యాసాగర్, ఎస్సై ఎస్. రాము ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి, పలు సూచనలు చేశారు.

September 22, 2025 / 08:22 PM IST