• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మోహన్ తండ్రి పార్థివ దేహానికి గంగుల నివాళి

NDL: దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన వైసీపీ నేత కాకర్ల మోహన్ నాయుడు తండ్రి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ధైర్యం చెప్పారు.

December 28, 2025 / 04:45 PM IST

బ్యాట్ పట్టిన ఎమ్మెల్యే అశోక్

SKLM: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అశోక్ బాబు అన్నారు. గ్రామీణ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. కంచిలి(M) మకరాంపురంలో టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు బ్యాట్ పట్టుకుని స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారు.

December 28, 2025 / 04:36 PM IST

నారాకోడూరు హత్య స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాకోడూరు గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన హత్య ఘటన స్థలాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నేరస్థలాన్ని సవివరంగా పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీస్ అధికారుల నుంచి తెలుసుకున్నారు.

December 28, 2025 / 04:32 PM IST

పాడె మోసిన మంత్రి దుర్గేశ్

WG: కాపు సామాజికవర్గ ప్రముఖ నాయకుడు అర్లపల్లి బోస్‌ అంతిమయాత్ర ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. ఆయన పార్థివ దేహాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా భుజాన మోసి వీడ్కోలు పలికారు. కాపుల అభ్యున్నతికి బోస్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. ఆయన మృతి సామాజికవర్గానికి తీరని లోటని పేర్కొంటూ నివాళులర్పించారు.

December 28, 2025 / 04:27 PM IST

రేపు యాగంటి హుండీ ఆదాయం లెక్కింపు

NDL: బనగానపల్లె మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి హుండీ లెక్కింపు సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఆలయ ఈవో డీ. పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా దేవాదాయశాఖ పర్యవేక్షణ అధికారి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉదయం 8 గంటలకు హుండీ లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.

December 28, 2025 / 04:25 PM IST

జిల్లాలో విషాదం.. తండ్రీకొడుకుల మృతి

ASR: కూనవరం మండలం నర్సింగపేటలో ఆదివారం ప్రమాదం జరిగింది. కోడిపుంజుతో ఈత కొట్టించే ప్రయత్నంలో తండ్రీకొడుకులు సింహాద్రి అప్పారావు (42), జస్వంత్ (14) వ్యవసాయ నీటి గుంతలో పడి మృతి చెందారు. ఆశ్రమ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

December 28, 2025 / 04:24 PM IST

అనంతలో ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం

ATP: రూరల్ పరిధిలోని పాపం పేట బస్తీలో బీజేపీ యువజన సీనియర్ నాయకుడు అజేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అజేశ్ మాట్లాడుతూ.. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. మహాభారత, భగవద్గితను చదివి అహింసను వదలాలన్నారు. భారతదేశంలో ఉన్న సనాతన హిందూ ధర్మం గొప్పదనం ప్రపంచానికే తెలిసిందన్నారు.

December 28, 2025 / 04:19 PM IST

ప్రణవ్ గోపాల్‌ను కలిసిన కళింగ వైశ్య కార్పొరేషన్ నేతలు

VSP: రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ బోయిన గోవిందా రాజు నేతృత్వంలో డైరెక్టర్‌లు ఆదివారం VMRDA ఛైర్మన్ ఎం.వీ. ప్రణవ్ గోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు న్యాయం చేస్తూ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తుందని ప్రణవ్ గోపాల్ తెలిపారు.

December 28, 2025 / 04:17 PM IST

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మృతి

ATP: వజ్రకరూరు మండలం తట్రకల్ గ్రామంలో YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ అశోక్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైసీపీ నాయకులు అశోక్ కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

December 28, 2025 / 04:12 PM IST

రేపు ‘పరిశుభ్రత’ కార్యక్రమం: ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రేపు యాడికిలో ‘మన యాడికి పరిశుభ్రత-మనందరి బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం నుంచి జేసీబీలు, ట్రాక్టర్లతో పట్టణంలోని పురవీధులు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను, కాలువలను క్లీన్ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం పిలుపునిచ్చింది.

December 28, 2025 / 04:07 PM IST

ఉరితాళ్లతో AIYF నిరసన

GNTR: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో AIYF వినూత్న నిరసన చేపట్టింది. కొత్తపేట భగత్‌సింగ్ బొమ్మ సెంటర్ వద్ద బిక్షాటన చేసి, మెడకు ఉరితాళ్లు బిగించుకొని ఆందోళన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోతే జనవరి 30న ఛలో విజయవాడ చేపడతామని నాయకులు హెచ్చరించారు.

December 28, 2025 / 04:04 PM IST

కార్యకర్తలే పార్టీ కి బలం: ఎమ్మెల్య బుడ్డా

NDL: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని శ్రీశైలం ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. నేడు మండలంలోని వేల్పనూరులో కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. అనంతరం కార్యకర్తలను అబినందించి, సత్కరించారు. కార్యకర్తలకు ఉత్తమ అవార్డులు అందజేశారు.

December 28, 2025 / 04:03 PM IST

చంద్రబాబుపై మండిపడ్డ కాకాణి గోవర్ధన్ రెడ్డి

NLR: పేదలకు ఇచ్చే ఇల్లు విషయంలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో నిర్మాణం జరిగిన ఇళ్లను సైతం చంద్రబాబు ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.4లక్షలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మొఖం చాటేశారని,కాకాణి గోవర్ధన్ విమర్శించారు.

December 28, 2025 / 04:03 PM IST

దర్శి మండల UTF కమిటీ కౌన్సిల్ సమావేశం

ప్రకాశం: దర్శి మండల కౌన్సిల్ సమావేశం MPDO కార్యాలయంలో జరిగింది. UTF మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎన్నికల అధికారిగా జిల్లా గౌరవ అధ్యక్షులు రవి, ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు హాజరయ్యారు. అతిథులుగా జిల్లా కార్యదర్శులు మీనిగ శ్రీను, రాజశేఖర్, రాష్ట్ర కౌన్సిలర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు

December 28, 2025 / 03:59 PM IST

తణుకు ఎమ్మెల్యేను కలిసిన డెమోన్ పవన్

W.G: బిగ్ బాస్ షోలో తణుకుకు చెందిన డెమోన్ పవన్ మూడో స్థానంలో నిలిచి తణుకు గర్వకారణంగా నిలిచారని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు తన పేరును పరిచయం చేస్తూ తణుకు పట్టానికి కూడా పేరు తెచ్చారన్నారు. యువత తమకు నచ్చిన రంగాలు ఎంచుకొని వాటిలో ఎదగాలన్నారు.

December 28, 2025 / 03:47 PM IST