కృష్ణా: ఉయ్యూరు (M) చిన్న ఓగిరాల నుంచి పెద్ద ఓగిరాల వరకు రైతులు వినియోగించే డొంక రోడ్డును MLA బోడే ప్రసాద్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్ ఆదివారం పరిశీలించారు. 2 కి.మీ రోడ్డులో మొదటి భాగం పనులు సాగుతుండగా, మిగిలిన భాగం సమస్యలను రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నిర్మించిన సాలిపేట–పోరంకి రోడ్డు మన్నికపై సంతృప్తి వ్యక్తం చేశారు.
VSP: గాజువాకలోని జింక్ గేటు ఎదురుగా గల 59వ వార్డ్లోని హిమచల్ నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న గిడుతూరు సాయి కుమారి (23) తన ఇంట్లో ఆదివారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు గమనించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గాజువాక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి మృతికి గల కారణాలు తెలియల్సి ఉంది.
EG: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని రౌడీ షీటర్లకు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు ధవళేశ్వరం సీఐ టి.గణేశ్ హెచ్చరించారు. ఆదివారం ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో సీఐ వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినా ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.
ATP: రాయదుర్గం ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు ఉ.10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల కన్వీనర్ హనుమంతు, ఎంపీడీవో కొండన్న తెలిపారు.
ప్రకాశం: అర్ధవీడు బస్టాండ్లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. కంకర మిషన్, ఆర్టీసీ బస్సును క్రాసింగ్ చేస్తున్న సమయంలో బస్సుకు కంకర మిషన్ తగలడంతో ఆర్టీసీ బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బ తిన్నది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కొద్ది సేపు అర్థవీడులో ట్రాఫిక్లో అంతరాయం ఏర్పడింది.
VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో నేరాలు నియంత్రణలో భాగంగా పట్టణంలో ముందుగా గుర్తించిన 80 ప్రాంతాలను ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారి భద్రతల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. వాహన పత్రాలు లేనివారిపై కేసులు నమోదుచేశామన్నారు. ఈ తనిఖీల్లో నలుగురు డీఎస్పీలు,12 మంది సీఐలు, 33 మంది ఎస్సైలు, 350 సిబ్బంది పాల్గొన్నారు.
ELR: గ్రామాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా ఐక్యవేదిక నాయకులు కృషి చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ తెంటు అప్పారావు పేర్కొన్నారు. మండవల్లిలో ఆదివారం రాత్రి మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం గురించి అవగాహన కల్పించేలా సభలు నిర్వహించాలని సూచించారు.
VSP: విశాఖ పోర్టు ఛైర్మన్ అంగముత్తు ముంబైకు బదిలీ అయినా ఇక్కడ ఇన్ఛార్జ్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. నెలలో ఒకటీరెండు సార్లే విశాఖకు వస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సెక్రటరీ వేణుగోపాల్ సైతం ఇతర పోర్టులకు ట్రాన్స్ఫర్ అయ్యారు. పూర్తిస్థాయి ఛైర్మన్, డిప్యూటీలు సైతం లేకపోవడంతో పోర్టు పాలన గాడి తప్పుతుందనే విమర్శలు ఉన్నాయి.
W.G: వయస్సుకు మించిన జ్ఞాపకశక్తితో తణుకు మండలం ముద్దాపురానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. మహాభారతం, వినాయకుని చరిత్ర వంటి ఇతిహాసాలను, ఆధ్యాత్మిక విషయాలను చిన్నారి అనర్హళంగా చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కుమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు గోవర్ధన్, అనూష ఆమెను ప్రోత్సహించినట్లు తెలిపారు.
SKLM: జిల్లాలో రబీ పంటలకు 2,102 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి త్రినాథ స్వామి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సేవ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్లు వద్ద యూరియా లభ్యమ అవుతుంది అని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NLR: నగర మేయర్గా స్రవంతి చేసిన రాజీనామాను కలెక్టర్ ఆమోదం తెలిపారు. కొత్త మేయర్ను ఎన్నుకునే వరకు కార్పోరేషన్లో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా డిప్యూటీ మేయర్లలో ఒకరిని మేయర్గా ప్రకటించాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక జరిగే వరకు రూప్ కుమార్ యాదవ్ ఇంఛార్జ్ మేయర్గా కొనసాగుతారని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
VZM: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 16న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నాయి. 18-35 ఏళ్ల మధ్య వయసు కలిగి, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 10 మల్టీ నేషనల్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయి.
AKP: నర్సీపట్నం మండలం సుబ్బారాయుడుపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి చెందినట్లు టౌన్ ఎస్సై రమేష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఉరుకూటి ఎరుకలమ్మ రోడ్డు పక్కన వెళ్తుండగా బ్రహ్మాజీ అనే యువకుడు బైక్ మీద వచ్చి ఢీకొట్టినట్లు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం KHG ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది అన్నారు.
ELR: ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నెలగంట మోగనుండగా, 17 నుంచి స్వామివారి గ్రామోత్సవాలు మొదలవుతాయి. ఈ మాసమంతా ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై సేవను నిర్వహిస్తామని ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని శివారులో వెలసిన శ్రీ కోటా సత్యమాంబా దేవి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యమ్మ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల నుంచి భారీగా భక్తులు ఆలయానికి చేరుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో తీర్థప్రసాదాలను స్వీకరించారు.