• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పార్టీ బలోపేతమే లక్ష్యం: కేతిరెడ్డి

సత్యసాయి: కార్యకర్తలకు అన్యాయం జరిగిందని పార్టీ అధినాయకుడు జగన్‌ గ్రహించారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 9 వేల మందితో కమిటీలు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

March 8, 2026 / 10:06 AM IST

అమ్మో చికెన్ ధరలు ఇలా ఉన్నాయా..?

కర్నూలు: జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ. 257, స్కిన్‌ లెస్ చికెన్ రూ. 292, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వారు పేర్కొన్నారు.

March 8, 2026 / 09:49 AM IST

కుంభాభిషేక వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: చిత్తూరు బజారు వీధిలోని శ్రీ శివ షణ్ముఖ వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన 9వ మహా కుంభాభిషేక వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, అర్చకులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 8, 2026 / 09:48 AM IST

జమ్మలమడుగులో విజిలెన్స్ దాడులు

KDP: జమ్మలమడుగులోని లక్ష్మీ నగర్ కాలనీలో ఓ రేకులు షేడ్‌లో దాచిన 53 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్ సీఐ శివన్న ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో విజిలెన్స్ అధికారుల వరుస దాడులతో అక్రమ రేషన్ బియ్యం రవాణాదారులలో వణుకు మొదలైంది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గొడౌన్‌కు తరలించారు.

March 8, 2026 / 09:40 AM IST

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

SKLM: స్నేహితుడి వివాహానికి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి, బంధువులకు శుభలేఖలు ఇచ్చి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొని బడ్డీ బాలకృష్ణ (25) అనే ఆర్మీ జవాను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో యువకుడు ఆర్.దిలీప్ అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రున్ని చికిత్స కోసం 108లో ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై ఆర్.జనార్దన్ రావు కేసు నమోదు చేశారు.

March 8, 2026 / 09:37 AM IST

‘అజీవికా మిషన్ పథకాలపై అవగాహన కల్పించాలి’

W.G: ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్’, అజీవికా మిషన్ పథకాలపై జిల్లా వ్యాప్తంగా ఆరు వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఈ పథకాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.

March 8, 2026 / 09:36 AM IST

రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృత దేహం

PPM: టౌన్‌ రైల్వే స్టేషన్‌లోని రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృత దేహాన్ని ఇవాళ GRP పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తిని రైలు ఢీకొని మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడు బ్రౌన్‌ కలర్‌ జీన్‌, నీలిరంగు టీ షర్ట్‌ ధరించి 22 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుందని HC రత్నకుమార్‌ తెలిపారు. అతడి సమాచారం తెలిస్తే పార్వతీపురం GRP పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

March 8, 2026 / 09:34 AM IST

రగ్బీ జట్లకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ

KRNL: కృష్ణా జిల్లా గన్నవరంలో ఇవాళ జరిగే రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ అండర్-12 రగ్బీ పోటీలకు ఎంపికైన కర్నూలు జిల్లా బాలబాలికల జట్లకు రామాంజనేయులు స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. ఇటీవల కర్నూలు బి. క్యాంపులో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

March 8, 2026 / 09:34 AM IST

‘విజయానికి భావోద్వేగ మేధస్సు కీలకం’

VSP: అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల వ్యక్తిగత, వృత్తిపరమైన విజయాలకు భావోద్వేగ మేధస్సు కీలకమని అమెరికాలోని ‘ఈక్యూ ఫర్ పీస్’ సంస్థ అధ్యక్షుడు మాట్ పేరెల్‌స్టేయిన్ తెలిపారు. గోపాలపట్నం శ్రీ మురళీకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భావోద్వేగాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించ‌వ‌చ్చ‌న్నారు.

March 8, 2026 / 09:34 AM IST

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కు ITDP నాయకురాలు రేణుక ఫిర్యాదు

GNTR: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకర దుష్ప్రచారంపై తెనాలికి చెందిన ITDP నాయకురాలు జెట్టి రేణుక శనివారం మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో తనకు సంబంధం లేకపోయినా, కొందరు YCP సోషల్ మీడియా సభ్యులు తన ఫోటోలు వాడుతూ అసత్య పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

March 8, 2026 / 09:33 AM IST

‘మహిళలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’

NDL: సమాజంలో తమ హక్కులపై ప్రతీ మహిళ అవగాహన కలిగి ఉండాలని ఆత్మకూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి రాహుల్ అంబేద్కర్ పేర్కొన్నారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు.

March 8, 2026 / 09:31 AM IST

ఆలయంలో నిర్మాణ పనుల పరిశీలన

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో త్వరలో రాతి నిర్మాణం కాబోతున్న గర్భాలయం,విమాన గోపురం, ముఖ మండపం, రాతి వర్గములను ఆదివారం రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, ఆలయ ఈవో విజయ రాజు కలిసి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, దేవాదాయ శాఖ కర్నూల్ స్థపతి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

March 8, 2026 / 09:30 AM IST

మహిళలు సమాజానికి స్ఫూర్తిప్రదాతలు: ఎస్పీ

అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణం, కుటుంబ వ్యవస్థను నిలబెట్టడంలో మహిళల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి మహిళ తన లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

March 8, 2026 / 09:29 AM IST

జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..!

అన్నమయ్య: జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ. 257, స్కిన్ లెస్ చికెన్ రూ. 292, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వారు పేర్కొన్నారు.

March 8, 2026 / 09:27 AM IST

ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఏలూరు: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను శనివారం కలెక్టర్ వెట్రిసెల్వి తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీసీ కెమెరాలు, బీయూలు, సీయూలు, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేసి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

March 8, 2026 / 09:25 AM IST