E.G: రాజమండ్రిలోని ప్రకాశం నగర్లో ఉన్న బార్కాస్ అరేబియన్ కిచెన్ రెస్టారెంట్పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిన్న ఆకస్మికంగా దాడులు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.70 వేల కోట్ల డిజిటల్ పేమెంట్లను ఆదాయంగా చూపకపోవడంతో ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు. రెస్టారెంట్లో జరిగిన వ్యాపారానికి పన్ను ఎగ్గొట్టినట్లు సమాచారం రావడంతో దాడులు చేశారు.
KDP: ఎర్రగుంట్ల మండలం కలమల్లలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు ఈ వైద్య శిబిరం RTPP కాన్ఫిరెన్స్ హాల్లో జరుగుతుందన్నారు. ప్రముఖ వైద్యులతో అత్యాధునిక పరికరాలతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వారం సంతల్లో మొత్తం రూ. 3,89,920 లక్షల ఆదాయం వచ్చింది యార్డు ఎంపికశ్రేణి ఇంఛార్జి కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం జరిగిన గొర్రెలు, మేకల సంతలో రూ.2,37,400 లక్షల ఆదాయం రాగా, ఆదివారం జరిగిన పశువుల సంతలో రూ.1,52,520 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. సోమవారం బ్యాంకు ఖాతాలో ఈ నగదు జమ చేస్తామన్నారు.
NLR: తిరుకనుపూరులో రేపటి నుంచి శుక్రవారం వరకు ముత్యాలమ్మ జాతర వైభవంగా జరగనుంది. బుధవారం పోలేరమ్మ నిలుపు, గురువారం గురునాథస్వామి ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు నిర్వహించనున్నారు. భక్తుల కోసం 120 ప్రత్యేక బస్సులు, 24 గంటల వైద్య సేవలు, 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
SKLM: సివిల్స్లో 463వ ర్యాంక్ సాధించిన సౌరోతు రాము తొలిసారిగా ఆదివారం స్వగ్రామం జి.సిగడాం (M) నడిమి వలస రాగా ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు, యువకులు రాజాం చేరుకొని అక్కడ బైక్ ర్యాలీతో జి.సిగడాం మీదుగా నడిమివలస వరకు ర్యాలీగా వచ్చి హారతులిచ్చారు. రామును ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని గ్రామస్తులు కోరారు.
NDL: బనగానపల్లె మండలంలో నందవరం చౌడేశ్వరి మాత శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ వేద పండితులతో అమ్మవారిని పసుపు పారాయణంతో సింగారించి పుష్పాలంకరణలలో అలంకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి అమ్మవారికి కుంకుమార్చన, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, మహామంగళహారతి, పూజలు నిర్వహించారు.
PLD: వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగుతుందని కార్యాలయ వర్గాలు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్కు తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ASR: మన్యం ప్రాంతంలో లేత పనసకాయలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పడింది. అడవుల నుంచి సేకరించిన కాయలను గిరిజనులు ఒక్కోటి రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యాపారులు వీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి అక్కడికి తరలిస్తున్నారు. అనంతరం ఒక్కో కాయను సుమారు రూ.40 చొప్పున వారు విక్రయిస్తున్నట్లు సమాచారం.
KRNL: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో సుయతీంద్ర తీర్థుల మధ్య ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ప్రముఖులను ఆదివారం సత్కరించారు. డాక్టర్ గురుచరణ్, అనిల్ కుమార్, మఠం అధికారులు సుధీంద్ర వామనరావు, రాఘవేంద్ర అధ్యాపక్, రామచంద్రకు అభినందన పత్రాలు అందజేశారు.
KDP: అవయవ దానం కార్యక్రమాన్ని తన కుటుంబంతోనే మొదలు పెడుతున్నానని పొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి ప్రకటించారు. ఆదివారం పొద్దుటూరులో అవయవ దానంపై ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MLA తన అవయవాలను మరణానంతరం దానం చేస్తున్నట్లు అంగీకార పత్రంపై సంతకాలు చేసి నిర్వహకులకు అందజేశారు. తన కుటుంబ సభ్యులతోను అవయవ దానంపై సంతకాలు చేయించినట్లు ఆయన తెలిపారు.
ATP: గుత్తి కోట ఉత్సవాలను ఈనెల 14, 15 తేదీల్లో వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ ఆనంద్ నేతృత్వంలో ఉత్సవాల షెడ్యూలు ఖరారైంది. స్థానిక ఎమ్మెస్ ఫుట్బాల్ మైదానంలో సభలు నిర్వహించనుండగా, 15న పట్టణం నుంచి కోట వరకు హెరిటేజ్ వాక్ కొనసాగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు ఏర్పాటు చేశారు.
మన్యం: మహిళ సాధికారితతోనే సమాజం అభ్యున్నతి సాధిస్తుందని జిల్లా ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి అన్నారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న లయన్స్ క్లబ్లో ఎం.ఎస్.పీలు, విద్యార్థులు, మహిళ సిబ్బందితో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకొన్నారు. ఎస్పీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
TPT: యర్రావారిపాళెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఈ మరణాలకు కారణమైంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
VZM: వంగర KGBV గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ రోహిణి ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 6 నుంచి 10 తరగతి వరకు 40 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 47 సీట్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆధార్ కార్డు, ఫొటోలు, ఇన్కమ్, క్యాస్ట్ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 12లోగా ఆన్లైన్లో దర...
శ్రీకాకుళం: పట్టణంలో కళింగ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి హాజరై సందడి చేశారు. మరో ఫేమ్ దివ్వెల మాధురి సైతం హాజరయ్యారు. మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.