• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పీ4 విధానంతో విద్యావ్యవస్థ మరింత బలోపేతం’

GNTR: గుంటూరు పట్టణంలోని బ్రాడీపేట శారదా నికేతన్ కళాశాలలో గుళ్లపల్లి సుబ్బారావు సంస్థ రూ.25 లక్షలతో తరగతి గది, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. వీటిని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ప్రారంభించారు. సుదీర్ఘకాలంగా సంస్థ చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు. సీఎం పీ4 విధానంతో విద్యావ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు.

April 1, 2026 / 08:26 PM IST

ప్రొద్దుటూరులో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరులోని 27వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 14,313 మంది లబ్ధిదారులకు రూ. 6,20,64,500లు NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

April 1, 2026 / 08:26 PM IST

రిజర్వాయర్ నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లి సమీపంలోని కలిచెర్ల గ్రామంలో జలజీవన్ మిషన్ కింద నిర్మాణంలో ఉన్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. రూ.2370 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని పీలేరు, రాయచోటి ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

April 1, 2026 / 08:26 PM IST

జీవీఎంసీ వార్డులు పెంపు

విశాఖ జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జనాభా, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా స్థానిక ఎన్నికలు ఇకపై 120 వార్డుల ఆధారంగా నిర్వహించబడతాయి.

April 1, 2026 / 08:14 PM IST

‘ప్రభుత్వ భూములను పరిరక్షించాలి’

AKP: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత భూముల తాజా పరిస్థితిని తెలియజేస్తూ నివేదికలను సమర్పించాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రీ సర్వే తదితర అంశాలపై విధివిధానాలను వివరించారు

April 1, 2026 / 08:14 PM IST

‘ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’

VZM: నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామంలో సుమారు రూ 80 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్ ఛైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షుడు, సర్పంచ్ మాకేన నవీన్ పాల్గొన్నారు.

April 1, 2026 / 08:11 PM IST

నందిగామలో పెరిగిన వార్డుల సంఖ్య

NTR: నందిగామలో వార్డుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ జనాభా పెరుగుదల, అభివృద్ధి అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 28 వార్డులను 32కు పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. వార్డుల సంఖ్య పెరగడం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని అధికారులు అన్నారు.

April 1, 2026 / 08:10 PM IST

రేపు బుచ్చిలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మినగల్లు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

April 1, 2026 / 07:53 PM IST

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన UCW సొసైటీ

ATP: గుంతకల్లు పట్టణంలో యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ సోసిటీ(UCWS) ఆధ్వర్యంలో ఎఫ్.సీ.ఐ గోడౌన్ వద్ద అనురాగ్ వృద్ధాశ్రమంలో, ఉన్న వృద్ధులకు నిత్యవసర సరుకులు, బియ్యము, కందిపప్పు, మంచి నూనె పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్, అనిల్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నగేష్ పాస్టర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

April 1, 2026 / 07:51 PM IST

భోగాపురంలో ‘బడ్జెట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్’

VZM: భోగాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నాగమాధవి అధ్యక్షతన బుధవారం ‘బడ్జెట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్’ నిర్వహించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు, మార్కెట్ల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా అంతరపంటలు, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించారు.

April 1, 2026 / 07:48 PM IST

విజయవాడలో ట్రాఫిక్ నివారణకు పోలీసుల చర్యలు.

NTR: విజయవాడలో ట్రాఫిక్ సమస్యల నివారణకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం, ఏసీపీ రామ్ చందర్రావు పర్యవేక్షణలో వన్ టౌన్ కెనాల్ రోడ్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డుపై వస్తువులు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న షాపులను తొలగించి, యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

April 1, 2026 / 07:48 PM IST

మాలధారణ భక్తులకు ఆర్థిక సాయం

విశాఖలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చైత్ర పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా మాలధారణ భక్తులకు వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000ల ఆర్థిక సాయం అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆసీలమెట్టలోని ఆయన కార్యాలయంలో వార్డు ప్రెసిడెంట్ దశమంతల మాణిక్యాలరావుతో కలిసి భక్తులు వాసుపల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు.

April 1, 2026 / 07:44 PM IST

రైతులు ప్రత్యామ్నాయ ఎరువులపై దృష్టి సారించాలి: సీఎం

NLR: వింజమూరులో రైతుల స్టాళ్లను సీఎం చంద్రబాబు సందర్శించారు. యూరియా వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువులపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని, డ్రోన్ల ద్వారా పిచికారీ చేయాలని కోరారు. అలాగే యూరియా లభ్యత సమస్యలపైనా వారితో చర్చించారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

April 1, 2026 / 07:39 PM IST

అమరావతికి చట్టబద్ధత.. బాపట్లలో సంబరాలు

BPT: అమరావతికి చట్టబద్ధత లభించడంపై బాపట్లలో హర్షం వ్యక్తమైంది. బుధవారం 11వ వార్డు ఇందిరా నగర్‌లో సంబరాలు జరిగాయి. నారా భువనేశ్వరి, అంజనా దేవి చిత్రపటాలకు స్థానిక మహిళలు పాలాభిషేకం చేశారు. రాజధాని ఉద్యమంలో మహిళల త్యాగాలను వారు కొనియాడారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలపడంలో ఎంపీ కృష్ణప్రసాద్ కృషి మరువలేనిదని యల్లమంద ప్రశంసించారు.

April 1, 2026 / 07:34 PM IST

వాడపల్లిలో చక్రస్నాన కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన

కోనసీమ: ఆత్రేయపురం వాడపల్లి దేవస్థానంలో గురువారం జరిగే చక్రస్నాన కార్యక్రమ ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలు సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 1, 2026 / 07:31 PM IST