• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌లను సత్కరించిన ఎమ్మెల్యే

SKLM: జలుమూరు మండలంలోని సర్పంచులను మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ పదవి గ్రామస్థాయిలో గౌరవప్రదమైనదని, గ్రామ స్వరాజ్య స్థాపనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోన్నారు. మరికొద్ది రోజులలో సర్పంచ్ పదవీకాలం ముగియడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

March 25, 2026 / 10:12 PM IST

వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ట

కోనసీమ: రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో బుధవారం సీతారాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ కోదండరామ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఉదయం 9.45 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృషభ లగ్న మందు విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.

March 25, 2026 / 10:00 PM IST

సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ATP: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటి ఇబ్బందులపై ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల లోపు 9550480972 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన వివరించారు.

March 25, 2026 / 09:52 PM IST

వేసవికి ముందే నీటి సమస్యలపై చర్యలు

BPT: అమృతలూరులో గ్రామీణ నీటి భద్రత ప్రణాళికలపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో మారుతి ప్రసూనాంబ మందస్తుగా సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో, సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

March 25, 2026 / 09:43 PM IST

అమరావతిలో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన జానీ బాషా

PLD: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జానీ బాషా అన్నారు. బుధవారం అమరావతిలోని SRKH హైస్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇలాంటి టోర్నమెంట్లు యువత ప్రతిభ చాటుకోవడానికి ఒక మంచి వేదికగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేశారు.

March 25, 2026 / 09:38 PM IST

ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి అస్వస్థత

NLR: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను రాయవేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. న్యూరో సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 09:34 PM IST

జూదరులపై ఎస్ఐ ఉక్కుపాదం

సత్యసాయి: సోమందేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో రూకలపల్లి గ్రామ పరిసరాలలో జూదం ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్ లో మొత్తం 9 మంది జూదరులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 28,350/- నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసామని తెలిపారు. 

March 25, 2026 / 09:34 PM IST

లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు

KKD: అన్నవరం దేవస్థానం కొండ పై ఉన్న షాప్‌లో MRP కన్నా ఎక్కువ ధరలుకు అమ్ముతూ భక్తులను దోచేస్తున్నారని విశ్వ హైందవ పరిషత్ సభ్యులు లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కొండపైన తనిఖీలు నిర్వహించి MRP కంటే ఎక్కువగా అమ్ముతున్న 2 షాపులపై, ఎటువంటి అనుమతులు లేకుండా వనమూలికలు అమ్ముతున్న ఓ షాప్ పై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

March 25, 2026 / 09:25 PM IST

‘ఈనెల 29లోపు ధాన్యాన్ని విక్రయించాలి’

AKP: జిల్లాలో రైతులు ఈనెల 29వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని విక్రయించాలని జేసీ సౌర్యమాన్ పటేల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు 65 రైతు సేవా కేంద్రాల ద్వారా 70.946 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21,162 మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 09:24 PM IST

కృష్ణ ఫార్మర్స్ కోపరేట్ సొసైటీని ప్రారంభించిన కేడీసీసీ ఛైర్మన్

NTR: జగ్గయ్యపేట కృష్ణ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆవరణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ ఛైర్మన్ రఘురాం పాల్గొని నూతన సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. భవనంలో చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించి, రైతులకు సేవలందించేందుకు చేపట్టిన చర్యలకు గాను అభినందించారు. చివరిగా సభ్యులకు డివిడెంట్‌లను అందజేశారు.

March 25, 2026 / 09:21 PM IST

శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం కార్యక్రమం

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి పండుగను నిర్వహించనున్నారు. భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమ ఏర్పాట్లను టీడీపీ యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

March 25, 2026 / 09:17 PM IST

బొత్సను పరామర్శించిన పాపారాయుడు

కోనసీమ: ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జిల్లా వైసీపీ రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పరామర్శించారు. బుధవారం విజయనగరం జిల్లాలోని ఆయన నివాసానికి నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించారు.

March 25, 2026 / 09:00 PM IST

‘సీఎంతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం’

ATP: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరగడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ప్రఖాత సంస్థలు ఏపీకి రావడం, ఇక్కడి పారిశ్రామిక ప్రగతిని సూచిస్తోందన్నారు.

March 25, 2026 / 09:00 PM IST

‘శ్రీరామ నవమికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు’

E.G: శ్రీరామనవమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26న రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు DPTO వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. భద్రాచలంతో పాటు సమీప క్షేత్రాలకు అద్దెపై బస్సులు కూడా ఏర్పాటు చేశామన్నారు. గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల నుంచి కూడా భద్రాచలానికి బస్సులు ఉంటాయని పేర్కొన్నారు.

March 25, 2026 / 08:53 PM IST

పేకాట శిబిరాలపై దాడులు.. భారీగా నగదు స్వాధీనం

ప్రకాశం: పామూరు మండలం అనుములకొండ గ్రామ శివారులో పేకాట శిబిరాలపై ఎస్సై అనుక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.21,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పేకాట, జూదం వంటివి నిర్వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 25, 2026 / 08:45 PM IST