NDL: శ్రీశైలం మల్లన్న స్వామివారి స్పర్శ దర్శనం భక్తులకు ఆదివారం సాయంత్రం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని దేవస్థానం అధికారులు శనివారం తెలిపారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ఉత్సవాలు ముగిసే వరకు కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని దేవస్థానం వెల్లడించింది.
KRNL: ఆదోనిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకల సాక్షిగా కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఇంఛార్జ్ మల్లప్పకు ఎమ్మెల్యే తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. 18 వేల మెజారిటీతో గెలిపించిన తమ త్యాగాన్ని మరువొద్దని, గౌరవం ఇవ్వకుంటే జనసేన ద్వేషం ఎలా ఉంటుందో చూపిస్తామని ఆ పార్టీ నేత సాయి హెచ్చరించారు.
WG: గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు వినియోగదారులను దోచుకుంటున్నారని సీపీఐ నేతలు ఎం. సీతారాం, మండల నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం తాడేపల్లిగూడెం బస్టాండ్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఒక్కో సిలిండర్కు రూ. 1500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
ATP:గుంతకల్ డి.ఎస్.పి శ్రీనివాసులను ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు ముందుగా ఏబీవీపీ గుంతకల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పాలిసెట్ కోచింగ్ కరపత్రాలను DSP చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి గుంతకల్లులో ఈ ఉచిత పాలిసెట్ కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ నెల 23న జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, ప్రధాన కార్యదర్శి పిరికట్ల విటల్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు శనివారం సమావేశం నిర్వహించారు. సభ్యులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ELR: దెందులూరు ప్రజల దాహార్తిని తీర్చటం కోసం రూ. 250 కోట్లతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకోనుంది. శనివారం పెదవేగ మండల క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న జరగనున్న సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి, నిధులు మంజూరుకు కృషి చేనున్నట్లు పేర్కొన్నారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగుతుంది. ఈ ఆస్థానంలో సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఆలయంలో మార్చి 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
CTR: కార్వేటినగరం మండల కేంద్రంలోని గాండ్లమిట్ట కూడలిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. DY.CM పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పాల్గొన్నారు.
PPM: పార్వతీపురంలోని పార్వతినగర్లో ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా నేత్ర వైద్యాధికారి జీరు నగేష్ రెడ్డి తెలిపారు. నీటి కాసుల వ్యాధి ఉన్నవారికి ఉచితంగా నిమ్స్ హాస్పిటల్లో శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. గ్లకోమా నివారణ కార్యక్రమంలో బాగంగా కంటి సమస్యలు పరిష్కరించాలని ఈ కార్యక్రమం అన్నారు.
TPT: ఓజిలి(మం) జోస్యులవారికండ్రిగ వద్ద స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ వందల ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయల అక్రమ సంపాదన జరుగుతోందని చెబుతున్నారు. ప్రతిరోజూ భారీగా ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవాడం లేదని వారు అంటున్నారు.
కడప: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేసి, సెంటర్ల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
WG: పాలకొల్లు MMKNM మున్సిపల్ హైస్కూల్లో మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధుల పక్కనే కూర్చుని వారితో కలిసి భోజనం చేస్తూ.. వారి కుటుంబ వివరాలు, పాఠశాలకు వస్తున్న విధానంపై ఆత్మీయంగా ముచ్చటించారు.
ASR: అరకులోయ మండలం సిర్గాం పంచాయతీ లంతంపాడు గ్రామంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డా. కంబిడి కృష్ణకుమారి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో సమావేశమై పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనంతరం గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు.
VZM: జిల్లాలో గ్యాస్ కొరతపై ఏపీ హోటల్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లక్షల మందికి ఉపాధి దూరమవుతుందన్నారు.. గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
AKP: నాతవరం మండలం గాంధీనగరం సమీపంలోని అటవీ ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ గిరి ఆధ్వర్యంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సారా తయారీకి ఉపయోగించే 1400 లీటర్ల బెల్లం పులుపును, సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. సారా తయారీ, రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నామని ఎస్ఐ వై.తారకేశ్వరరావు పేర్కొన్నారు.