VSP: నగరంలోని ఎంజీఎం (MGM) పార్కులో ఈ నెల 9, 10 తేదీలలో ‘లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0’ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ మరియు ఓడరేవుల శాఖ ప్రకటించింది. సముద్ర సంబంధిత వారసత్వాన్ని ప్రోత్సహించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యం చేస్తూ లైట్ హౌస్ టూరిజాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
AKP: ప్రభుత్వం క్రీడా మైదానాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అనకాపల్లి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు. నాతవరంలో రూ. 4 లక్షల వ్యయంతో 25 సెంట్ల స్థలంలో జరుగుతున్న క్రీడా మైదానం అభివృద్ధి పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ నెల 14న మైదానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 15 మైదానాల అభివృద్ధి జరుగుతున్నాయన్నారు.
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం వాళ్తేర్ గ్రామంలో రీ సర్వే పూర్తి అయినా గ్రామానికి రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ సిబ్బంది గ్రామ సభ నిర్వహించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంతకవిటి డిప్యూటీ తహసీల్దార్, రిసర్వే డిప్యూటీ తహసీల్దార్, గ్రామ రెవిన్యూ అధికారి పాల్గొన్నారు.
WG: తణుకు ఎస్ఎన్వీటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, యోగానంద నేత్రాలయ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి లక్ష్మీ తులసి ప్రారంభించారు. విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్లు వాడకం తగ్గించి కంటి చూపుపై ఒత్తిడి తగ్గించాలని సూచించారు.
VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఎంపీడీవో పి. రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛ సంక్రాంతి-చెత్త రహిత గ్రామాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి పరిసరాలు పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను బయట వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు తడి పొడి చెత్తను అందజేయాలని సూచించారు. డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు పాల్గొన్నారు.
SKLM: లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామ సచివాలయాన్ని నోడల్ అధికారి ఎం. నారాయణమ్మ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. యూనిఫైడ్ ఫామిలీ సర్వేపై సిబ్బందితో రివ్యూ చేశారు. సర్వే వేగవంతం చేసి ఖచ్చితమైన సమాచారంతో పూర్తి చేయాలన్నారు. సిబ్బంది హాజరు ఇన్, ఔట్ తప్పని సరిగా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సీహెచ్ శంకరరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న అర్జున్ మృతి చెందారు. ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అర్జున్ మరణ వార్త తెలిసిన టౌన్ సీఐ షేక్ గఫూర్, టౌన్ ఎస్సైలు ఉమామహేశ్వరరావు, రమేష్, సిబ్బంది సంతాపం తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో అర్జున్ కుటుంబానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
W.G: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కార్యక్రమానికి ప్రజల సహకరించాలని ఎంపీడీవో వి. చంద్రశేఖర్ కోరారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పడాలలో జరుగుతున్న సర్వే, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. సర్వే పరిస్థితిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని స్వయంగా తనిఖీ చేశారు.
VSP: చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్ బుధవారం తెలిపారు. ఈ రూట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రజలు, వన్యప్రాణుల క్షేమం కోసం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసామన్నారు.
ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మార్కాపురంలోని సబ్ జైలును అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ బాలాజీ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విచారణ ఖైదీలను, కేసులలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను, వారి కేసుల వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
SKLM: జీ.సిగడాం మండలం గేదెల పేటలో గ్రామంలో రీ సర్వే గ్రామ సభను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తూ.. అధికారిక రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తుందన్నారు. ఇది ఎంతో ప్రయోజనకరమని అన్నారు.
ప్రకాశం: 38వ జాతీయ రోడ్డు భద్రతా-మాసోత్సవాల్లో భాగంగా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎస్వీకేపీ కళాశాల నుంచి కంభం కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్వయంగా బైక్ నడిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి చందన, డీఎస్పీ నాగరాజు పాల్గొన్నారు.
సత్యసాయి: హిందూపురం హెచ్డీఎస్ ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యునిగా జనసేన పార్టీ నాయకుడు కోడూరు వెంకటరమణ నియామకమయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. దీనికి సహకరించిన జనసేన ఇంఛార్జ్ ఆకుల ఉమేష్కు పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలిపాయి.
E.G: రాజమండ్రిలోని గాదాలమ్మ నగర్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను నగర కమిషనర్ రాహుల్ మీనా ప్లానింగ్ అధికారులతో బుధవారం తనిఖీ చేశారు. ఆమోదించిన ప్లాన్కు అనుగుణంగా నిర్మించిన భవనాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజమండ్రిలో జరిగే భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ నుంచి అనుమతి తప్పనిసరన్నారు.
KDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 12న బ్రహ్మంగారిమఠం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ క్లీనిక్ నిర్వహించనున్నట్లు ఆర్డీవో చంద్రమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజలు పాల్గొని, తమ భూ సమస్యను పరిష్కరించుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జాన్సన్ పాల్గొన్నారు.