• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాలికను వేధించిన యువకుడు అరెస్ట్

గుంటూరు నల్లపాడు పరిధిలో బాలికను మోసగించి లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న యాకసిరి ఆనంద్ (22)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ బి.వి. మధుసూదనరావు తెలిపారు. బాలికలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

March 15, 2026 / 09:36 AM IST

34 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

కడపలోని పలు హోటళ్లు, గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై V&E, Civil Supplies అధికారులు శనివారం అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గృహ వినియోగానికి ఇచ్చే LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వివిధ చోట్లలో 8 కేసులు నమోదు చేసి, మొత్తం 34 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

March 15, 2026 / 09:28 AM IST

వైసీపీ అసెంబ్లీ పరిశీలకలుగా BVR చౌదరి

ELR: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా బి.వి.ఆర్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.

March 15, 2026 / 09:26 AM IST

నేతి వెంకన్న ఒక్క రోజు ఆదాయం ఎంతంటే..?

PLD: దేవరంపాడు నేతి వెంకన్న స్వామి ఆలయానికి ఫాల్గుణ మాసం శనివారం సందర్భంగా భారీగా ఆదాయం సమకూరింది. హుండీ కానుకలు, ప్రసాదాల విక్రయాల ద్వారా మొత్తం రూ.19,67,938లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హుండీ ద్వారా రూ.11.25 లక్షలు, లడ్డూ ప్రసాదం, దర్శన టిక్కెట్ల ద్వారా రూ. 8.42 లక్షలు లభించాయి. ఈవో సురేష్ సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది.

March 15, 2026 / 09:06 AM IST

టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్: ఎస్పీ

NLR: జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం రాత్రి తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

March 15, 2026 / 08:59 AM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

సత్యసాయి: హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ఎమ్మెల్యే బాలకృష్ణ లక్ష్యమని ఆయన పీఏలు సురేంద్ర, వీరయ్య తెలిపారు. నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరికృష్ణ కోరారు.

March 15, 2026 / 08:58 AM IST

పక్షుల దాహార్తిని తీరుస్తున్న యువత

ATP: పుట్లూరు మండలం ఎల్లుట్ల యువకులు వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు నడుం బిగించారు. అటవీ ప్రాంతంలో పక్షుల కోసం నీటి సౌకర్యం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జీవరాశుల రక్షణకు వారు చూపుతున్న చొరవను ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి అభినందించారు. సామాజిక బాధ్యతతో స్పందించిన ఎల్లుట్ల యువతపై ప్రశంసలు కురుస్తున్నాయి.

March 15, 2026 / 08:53 AM IST

జిల్లాలో మాంసం ధర ఎంతంటే..?

పల్నాడు జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్‌తో కూడిన చికెన్ రూ. 278, స్కిన్‌లెస్ చికెన్ రూ. 317, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ. 900-1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.

March 15, 2026 / 08:52 AM IST

తోటపల్లి పరిసరాల్లో ఏనుగుల గుంపు

PPM: తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో గల మొక్కజొన్న, అరటి తోటల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపించినప్పుడు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

March 15, 2026 / 08:51 AM IST

నేడు ఒంటిమిట్టలో బండలాగుడు పోటీలు

KDP: ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీర గంగమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వార్షిక మహోత్సవాల్లో ఆఖరి 3వ రోజు బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగనున్నాయి. ఈ పోటీలను రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించనున్నారు. అనంతరం రాత్రికి అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరగనుంది.

March 15, 2026 / 08:50 AM IST

కర్లపాలెంలో పోలీసుల కార్డన్ సెర్చ్

BPT: కర్లపాలెంలోని ‘వజ్రపహార్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జగదీష్ నాయక్ వెల్లడించారు. 39 మంది పోలీసు సిబ్బందితో ఈ దాడులు నిర్వహించామని తెలిపారు.

March 15, 2026 / 08:50 AM IST

వాహనాల తనిఖీల్లో 36 మద్యం సీసాలు పట్టివేత

SKLM: మెలియాపుట్టి మండల పట్టు పురంలో ఎస్సై మహ్మద్ అమీర్ ఆలీ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు చాపర గ్రామానికి చెందిన ఆర్.వెంకటేశ్ ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలు తీసుకెళ్తుండగా, అతనిని తనిఖీ చేయగా 36 మద్యం సీసాలు అతని నుంచి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

March 15, 2026 / 08:42 AM IST

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

ATP: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను ఆర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై ఆర్జీలను రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని పేర్కొన్నారు.

March 15, 2026 / 08:39 AM IST

మళ్లీ ఊర్లోకి పులి.. భయాందోళనలో ప్రజలు

KKD: పాపికొండల అభయారణ్యం వదిలి పులి జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ప్రస్తుతం కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. గతంలో అధికారులు పట్టుకుని అడవిలో విడిచినా, సులభంగా వేట దొరుకుతుండటంతో మళ్లీ గ్రామాల బాట పట్టింది. రేడియో కాలర్ ద్వారా అటవీ శాఖ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. 

March 15, 2026 / 08:38 AM IST

మానవత్వం చాటుకున్న ఎస్సై

ELR: పెదపాడు గ్రామానికి చెందిన నేలగట్ల నరసింహారావు 36 అనే వ్యక్తి గత కొంతకాలంగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ.. ఈనెల 5వ తేదీన మృతి చెందాడు. ఆ కుటుంబ పరిస్థితిని గ్రామ పెద్దలు, పెదపాడు ఎస్సై ఆర్. శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. మృతుని దశదిన కార్యక్రమం నిమిత్తం పెదపాడు పోలీస్ స్టేషన్ తరఫున 75 కిలోల 3 బియ్యం బస్తాలను అందజేసినట్లు తెలిపారు.

March 15, 2026 / 08:35 AM IST