PLD: వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకటరామిరెడ్డిలకు 2 రోజుల పోలీసు కస్టడీకి మాచర్ల న్యాయస్థానం శుక్రవారం అనుమతిచ్చింది. మాచర్ల రూరల్ పోలీసుల అభ్యర్థనపై జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ ఈ నెల 29, 30 తేదీల్లో కస్టడీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా జైలులో విచారణ జరగనుంది.
GNTR: గత ఐదేళ్లుగా పొన్నూరులోని గోతాలస్వామి ఆశ్రమంలో చికిత్స పొంది, మానసిక స్థితి మెరుగుపడిన నలుగురు మహిళలు శుక్రవారం ముంబైకి బయలుదేరారు. ‘మానవత’, ‘శ్రద్ధా ఫౌండేషన్’ సంస్థల సహకారంతో కోలుకున్న వీరిని అర్బన్ సీఐ వీరా నాయక్, ఆశ్రమ నిర్వాహకులు గోతాలస్వామి, నన్నపనేని బాలకృష్ణ, డాక్టర్ శ్రావణిని అభినందించారు. అంబులెన్స్లో వారి స్వస్థలాలకు పంపించారు.
E.G: దేవరపల్లి గ్రామ టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన తంగళ్ల సూరిబాబు శెట్టిబలిజ యూత్ సభ్యులతో కలిసి శనివారం రాత్రి పార్టీ నాయకుడు గన్నమని హరికృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హరికృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి నోమేంద్ర రామారావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
BPT: ఇంకొల్లులో దారి తప్పిన నాలుగేళ్ల అంగన్వాడీ బాలికను పోలీసులు గంట వ్యవధిలోనే రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. శుక్రవారం అంగన్వాడీకి వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై సురేష్ నేతృత్వంలోని బృందం తక్షణమే స్పందించి, గాలింపు చేపట్టి పాపను సురక్షితంగా చేరవేసింది.
ASR: అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు తాజాగా మరింత పెరిగాయి. అరబికా పార్చిమెంటు కేజీ ధర రూ. 510 నుంచి రూ. 520కి పెరగగా, చెర్రీ కేజీ ధర రూ. 260 నుంచి రూ. 300 వరకూ పెరిగినట్లు కేంద్ర కాఫీ బోర్డు విస్తరణ విభాగం సీనియర్ లైజన్ అధికారి రమేష్ తెలిపారు. అంతర్జాతీయ డిమాండ్ పెరగడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు.
SKLM: ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 3 న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శనివారం జిల్లా నైపుణ్యాధికారి యు సాయికుమార్ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఇంటర్ ఐటిఐ డిగ్రీ పీజీ అర్హత కలిగి, 18–33 ఏళ్ల వయసు గల యువత యువకులు అర్హులని పేర్కొన్నారు. 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఇవాళ ఉదయం 10 నుండి 12:30 గంటల వరకు భోగాపురం మండలం ముంజేరులో పార్టీ క్యాంపు కార్యాలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలను అందజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GNTR: రెడ్డిపాలెం రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడి వయసు (50) అతని శరీరంపై బిస్కెట్ కలరు గళ్ల చొక్కా, మెరూన్ కలర్ లుంగీ ఉన్నట్లు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొన్న SI సుభాని మృతదేహాన్ని పరిశీలించి జిల్లా గవర్నమెంట్ హాస్పటల్కు తరలించినట్లు పేర్కొన్నారు.
E.G: ప్రముఖ వైద్యుడు డాక్టర్ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో ఘనంగా సత్కారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రామారెడ్డి నిరంతర విద్యార్థిగా యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ATP: రాయదుర్గం పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. పార్టీ ఆవిర్భవించి నేటికి వందేళ్లు పూర్తయిందని పేర్కొన్నారు. శత జయంతి ఉత్సవంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
TPT: రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోందని తిరుపతి DEO కేవీన్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఆధునిక, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు తప్పక వీక్షించాలన్నారు.
ATP: జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న వివిధ రకాల కాలం చెల్లిన వస్తువులను వేలం వేయనున్నారు. ముఖ్యంగా మెగాఫోన్స్, బ్యాటరీలు, ఫైబర్ లాటీలు, డ్రాగన్లైట్లు వంటి సుమారు 30 వివిధ రకాల స్క్రాప్ వస్తువులను వేలం వేయ నున్నారు. ఈ నెల 29న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించనున్నారు.
W.G: విద్యా అభివృద్ధికి సమాజంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో UTF డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. షరీఫ్, ఉపాధ్య క్షులు జైరూపస్ రావు, ఎం విజయ గౌరీ, రాష్ట్ర కౌన్సిలర్ పీ.జయకర్ నేతృత్వంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో UTF జిల్లా సభ్యులు పాల్గొన్నారు.
TPT: అలిపిరి కాలినడక మార్గంలోని శ్రీనరసింహ స్వామి ఆలయ సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ షాపు వద్ద 10 అడుగుల పొడవైన పాము దర్శనమిచ్చింది. యజమాని భయాందోళనకు గురయ్యారు వెంటనే భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. ఆయన కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు.
ELR: 33 కేవీ విద్యుత్ లైను మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శనివారం జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని త్రీ ఫేజ్ విద్యుత్ సమయాల్లో మార్పు చేయటం జరిగిందని జంగారెడ్డిగూడెం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఆ సబ్ స్టేషన్ పరిధిలోని త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ఉదయం 6 -10 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందన్నారు.