GNTR: పొన్నూరు మండలంలో లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలని తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 35 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల మేరకు ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఆదేశించారు.
ఏలూరు ఆర్డీవో కార్యాలయంలో బుధవారం సమాచార హక్కుచట్టం-20 ఏళ్ల వేడుకలు ఆర్డీవో అచ్యుత అంబరీష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ చట్టం అవినీతిని అరికట్టడానికి ఒక ముఖ్యమైన ఆయుధమని, అధికారులు సకాలంలో సమాచారమిచ్చి పౌరులకు సంతృప్తి కరమైన సేవలు అందించాలన్నారు. ఈ చట్టం ద్వారా ఎంతో మంది ప్రయోజనం పొందుతున్నారని, ఇది సుపరిపాలనకు కీలకమని తెలిపారు.
ATP: రాయదుర్గంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేళాలో అర్హులైన నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు. మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7801031771 నంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
VZM: రాజాం మండలం కంచరం హైస్కూల్ విద్యార్థులను గ్రామస్థులు బుధవారం ఘనంగా సన్మానించారు. అండర్–17 రాష్ట్రస్థాయి స్విమ్మింగ్, రన్నింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఏ. సంతోషిణి సహా జిల్లాస్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు దుర్గారావు, నారాయణ నాయుడులను దుస్సాలువాతో సత్కరించారు.
VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇంఛార్జిగా సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సేల్స్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘ నేతలు హర్షం వ్యక్తం చేసి, కొత్త నాయకత్వంలో ప్లాంట్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
GNTR: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు బుధవారం తాడేపల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పలు రాజకీయ అంశాలపై జగన్తో డైమండ్ బాబు చర్చించారు. రానున్న రోజుల్లో వైసీపీని తాడికొండ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని జగన్ డైమండ్ బాబుకు సూచించారు.
ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా ఈ నెల19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు. నాగ హనుమాన్ గ్రూప్స్ ప్రతినిధులు పాల్గొంటారని, మెకానికల్ డిప్లమో, బీటెక్, MBA, ఎంకామ్, BBA, ఎంసీఏ విద్యార్హతలు కలిగి 25-35 ఏళ్ల గల పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
కృష్ణా: పెనమలూరు పరిధిలోని గణపతి నగర్, పెద్దపులిపాకలో ఎస్సై బీ. ప్రసాద్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. పోలీసులను చూసి తప్పించుకోబోయిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.250 కిలోల గంజాయి, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
నెల్లూరుకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ (31)పై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ను ప్రయోగించింది. వ్యక్తులను అపహరించడం, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు దోచుకోవడం వంటి అభియోగాలపై ఆమె ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో ఈ చర్య తీసుకున్నారు.
W.G: నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ పరిధిలోని రాజులపాలెం అమ్మవారి ఆలయ ప్రాంతాన్ని ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ జి. శ్రీవేద బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఆలయ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున స్థానికులు ఎవరూ వివాదాలకు వెళ్లరాదని, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కృష్ణా: కంకిపాడు మండలంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి బాలయేసు దైవమే కారణమని ఆయన అన్నారు. ప్రేమ, శాంతి, ఐక్యత సందేశాన్ని క్రిస్మస్ అందిస్తుందని పేర్కొన్నారు.
కోనసీమ: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో గురువారం శ్రీస రేఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఉపాధి మేళా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 10 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉద్యోగ నియామకాలు చేపడతారని వివరించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
SKLM: గ్రామీణ (M) మునసబు పేటలోని గురజాడ విద్యాసంస్థలో శుక్రవారం జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈవో ఎ.రవి బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉ.9 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన శత శాతం ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చేలా HMలు చర్యలు చేపట్టాలని కోరారు.
కృష్ణా: యూనివర్సిటీ(KRU) పరిధిలో ఈ నెల 27న జరగాల్సిన పీజీ (LLM) మూడో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఈ నెల 27న జరగాల్సిన LLM మూడో సెమిస్టర్ పరీక్షను ఈ నెల 31న నిర్వహిస్తామని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ పీ. వీరబ్రహ్మచారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుధవారం నియోజకవర్గంలోని ఐదుగురు పేదలకు తన సొంత నిధులతో తోపుడు బండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని కోవూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డి పాళెం, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల వారికి ఈ బండ్లు పంపిణీ చేశారు. దాంతో లబ్ధిదారులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.