• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: సోంపేట ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. చిన్నాజీవర్మ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 22, 2026 / 07:20 AM IST

మన్యం లీగ్ క్రికెట్ 2026 విజేతగా కురుపాం టీం

PPM: మన్యం లీగ్స్‌-2026 జిల్లా స్థాయి క్రికెట్‌లో విజేతగా కురుపాం జట్టు నిలిచింది. ఈ మేరకు శనివారం నిర్వాహకులు DSTO శ్రీధర్ చేతులమీదుగా విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5వేలు నగదు బహుమతి అందించారు. రన్నరప్‌గా వీరఘట్టం జుట్టుకు రూ.3వేలు, తృతీయ స్థానం సాధించిన కొండవాడ జట్టుకు రూ.2వేలు బహుమతి అందజేసారు. అనంతరం డీఎస్టీవో శ్రీధర్‌ విజేతలను అభినందించారు.

March 22, 2026 / 07:10 AM IST

మండలంలో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్

CTR: గుడిపాల మండల పరిధిలో శనివారం భారీగా పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థ్ నగర్ నుంచి వేలూరు వైపుగా పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను 2 టౌన్ సీఐ, గుడిపాల యాదమరి ఎస్సై తనిఖీ చేశారు. కూల్ లిప్స్, హాన్స్, విమల్ 23 బ్యాగులు, యాదమరి జంక్షన్ వద్ద 22 బ్యాగులు, 2 వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు.

March 22, 2026 / 07:10 AM IST

గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

తిరుపతిలో రైల్వే పోలీసుల అప్రమత్తతతో గంజాయి రవాణా ప్రయత్నం విఫలమైంది. డీఎస్పీ మురళీ మార్గదర్శకత్వంలో GRPS, RPF సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేసి ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 17 ప్యాకెట్లలో సుమారు 15.460 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.75 వేలుగా ఉంటుదని వారు అంచనా వేశారు.

March 22, 2026 / 07:08 AM IST

‘10,897 గ్యాస్ సిలిండర్లు సిద్ధం’

EG: గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరించారు. ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని, పంపిణీదారుల వద్ద 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

March 22, 2026 / 07:07 AM IST

ఇంటిపన్ను రసీదులను పంపిణీ చేసిన ఈవో

VZM: చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ EO ఝాన్సీ రాణి తన సిబ్బందితో కలసి శనివారం పంచాయతీలో ఇంటి పన్ను చెల్లించిన వారికి ఆన్‌లైన్‌ రసీదులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీకి ఇంటి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. అనంతరం పంచాయతీ సిబ్బంది చేపడుతున్న రసీదుల పంపిణీని స్దానిక MPDO సురేష్ పర్యవేక్షించారు.

March 22, 2026 / 07:00 AM IST

నేడు జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో డీ. సత్యనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సంబంధిత అధికారులు, సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు.

March 22, 2026 / 07:00 AM IST

ఒడిశా వ్యక్తిపై దాడి.. ఐదుగురు అరెస్ట్

VSP: ఒడిశాకు చెందిన వ్యక్తి విశాఖలోని లాడ్జిలో దిగారు. ఐదుగురు వ్యక్తులు ఆయనను పరిచయం చేసుకొని మద్యం కొనుగోలు చేయించి దాడి చేశారు. అనంతరం సెల్ ఫోన్, నగదు దోచుకున్నారు. బాధితుడు ఎంవీపీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుంకరి గౌతమ్, కన్నన్ చందు, వంగర సాయిదినేశ్, నిశాంత్ రెడ్డి, జగదీశ్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI చక్రధర్ రావు తెలిపారు.

March 22, 2026 / 07:00 AM IST

వలకు చిక్కిన అరుదైన కచ్చిడి చేపలు

కోనసీమ: సఖినేటిపల్లి మండలం పల్లెపాలెం మత్స్యకారుల వలకు శనివారం రెండు అరుదైన ఆడ కచ్చిడి చేపలు చిక్కాయి. ఔషధాల తయారీలో వీటిని వినియోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. అయితే ఇవి ఆడ చేపలు కావడంతో ఆశించిన స్థాయిలో ధర రాదని, అదే మగ చేపలు అయితే భారీ ధర పలికేవని మత్స్యకారులు పేర్కొన్నారు. సముద్రంలో వేటకి వెళ్లిన సమయంలో ఈ చేపలు లభించాయని తెలిపారు. 

March 22, 2026 / 07:00 AM IST

ఈనెల 25 నుంచి బ్రహ్మోత్సవాలు

GNTR: దుగ్గిరాల మండలం పెదపాలెం శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని ధర్మకర్తలు వాసిరెడ్డి దుర్గాప్రసాద్, పుతుంబాక సత్యసాయికృష్ణ, వాసిరెడ్డి శ్రీకృష్ణ, నాగార్జున తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

March 22, 2026 / 06:38 AM IST

‘మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాపై ప్రత్యేక నిఘా’

SKLM: మాదక ద్రవ్యాలు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాలు, ప్రభుత్వం నిషేధించిన వాటిని ఎవరైనా రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.

March 22, 2026 / 06:32 AM IST

త్వరలో నంది అవార్డుల పునరుద్ధరణ: మంత్రి

VSP: ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖపట్నాన్ని ప్రధాన సినీ నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

March 22, 2026 / 06:30 AM IST

వైభవంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

TPT: తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో శనివారం గరుడ సేవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమధుర భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ పరిసరాలు రామనామంతో మారుమోగాయి.

March 22, 2026 / 06:30 AM IST

శ్రీరామనవమి వేడుకలకు ఎస్‌వీ మోహన్ రెడ్డికి ఆహ్వానం

KRNL: ఆలూరు మండలం కమ్మరచేడులో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గ్రామస్థులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆయనను కలుసి కార్యక్రమానికి విచ్చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 06:28 AM IST

బీజేపీ పార్టీలో చేరిన వ్యాపారవేత్త

అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు బీజేపీ పార్టీలో చేరారు. శనివారం విశాఖలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. బీజేపీ ఆశయాలు సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.

March 22, 2026 / 06:19 AM IST