SS: నల్లమాడ మండలం పెమనకుంటపల్లిలో రైతు శంకర్ నాయక్ నిర్మించిన ప్రభుత్వ మినీ గోకులం షెడ్ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. పల్లె పండుగ 2.0లో కురుమాల ఓబులేసుకు మంజూరైన మరో మినీ గోకులం షెడ్కు భూమిపూజ చేశారు. మినీ గోకులాల ద్వారా పశువులకు రక్షణ కలుగుతుందన్నారు.
TPT: సులూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్-2026 జరగనుంది. ఈ వేడుకలు ఈ నెల 10,11,12 తేదీలలో జరుగనున్నది. ఈ రోజు రాత్రి సభా స్థలి వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పర్వేక్షిస్తున్నారు. ఈ ఏర్పాటు పై ఉన్నతాధికారులు భద్రతా సిబ్బందిలకు సూచనలు ఇచ్చారు.
అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఐక్య విద్యార్థి యువజన సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రశ్నించిన నాయకులపై కేసులు, రౌడీషీట్లు పెట్టడాన్ని ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రౌడీషీట్లు వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
SS: పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సవిత శుక్రవారం ప్రత్యేక కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం కేవలం ఉద్యోగం కాదు, అది ఒక పవిత్ర సేవ అని కొనియాడారు.
KDP: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు.. స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి లారీలు, బస్సులు, కార్లు,వ్యాన్ల డ్రైవర్లను నిలిపి నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తం చేసి పంపుతున్నారు. వాహనాలు నడుపుతున్నప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచించారు.
సత్యసాయి: పుట్టపర్తిలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా జరపాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. పరేడ్ మైదానంలో ఏర్పాట్లు, భద్రతపై ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రగతిని చాటేలా అభివృద్ధి శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
VZM: కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఇంఛార్జ్ కౌశిక్ ఈశ్వర్ నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు యువజన విద్యార్థి విభాగాలకు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారని అడిగారు. జాబ్ క్యాలెండర్ వంటి హామీలను ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
కృష్ణా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు విద్య, వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని MLA యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బాపులపాడు(M) రెమల్లెలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ క్లినిక్కు శంకుస్థాపన చేయగా, రూ.44 లక్షలతో నిర్మించిన అంతర్గత CC రహదారులను ప్రారంభించారు. అనంతరం ప్రజా దర్బార్లో పాల్గొన్నారు.
VZM: చీపురుపల్లి పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి, శిలాఫలకం ఆవిష్కరణ (ROB) శనివారం ఉ 9:30 గంటలకు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ మల్లిక్ నాయుడు పాల్గొనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
W.G: ఆదర్శ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుంపగడప విరిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీలు తమ సృజనాత్మకతను ప్రదర్శించగా, విజేతలకు లయన్స్ క్లబ్ సభ్యులు బహుమతులు అందజేశారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడంలో దోహదపడతాయని కళాశాల ప్రిన్సిపల్ కే. సుజాత తెలిపారు.
NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రేపు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని నాగాయగుంట పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటనలో తెలిపారు. మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
ASR: గూడెం కొత్తవీధి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బోయిన కుమారి అధ్యక్షతన ఎంపీడీవో రమణబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. పలువురు పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు ప్రశ్నలతో అధికారులపై విరుచుకుపడ్డారు. మారుమూల గ్రామాలకు నిర్మిస్తున్న రహదారులకు అటవీశాఖ అధికారులు అడ్డంకులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
VSP: వైసీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా జి.వి. రవిరాజును నియమించారు. శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రవిరాజు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
CTR: పూతలపట్టు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో చిత్తూర్ ఎంపీ జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఫోన్ ద్వారా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లులో PDSU నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షుడిగా అఖిల్, ప్రధాన కార్యదర్శిగా వినోద్, ఉపాధ్యక్షుడిగా మధు, సహాయ కార్యదర్శిగా భరత్ ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.