అక్టోబర్ 1వ తేది నుంచి జనసేన వారాహి విజయయాత్ర నాలుగో విడత ప్రారంభం కానుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ఆ యాత్ర పునఃప్రారంభమవుతుందని, జనసేన సైనికులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
చంద్రబాబుకు మరో 11 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అక్టోబర్ 5వ తేది వరకూ ఆయన రాజమండ్రి జైలులోనే ఉండనున్నారు. సోమవారం బెయిల్పై విచారణ ఉంటుందని జడ్జి తెలిపింది.
మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
స్కిల్ స్కామ్లో సీఐడీ దూకుడు కొనసాగుతోంది. రెండో రోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించింది. కిలారు రాజేశ్ షెల్ కంపెనీల నిధులను లోకేశ్కు పంపించారని తెలిసింది.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. మరో వైపు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులను అచ్చెన్నాయుడు ప్రకటించారు. జనసేన నాయకులతో నారా బ్రహ్మాణి చర్చలు జరుపుతోంది. రాష్ట్రం వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలను టీడీపీ నేతలు చేపడుతున్నారు.
స్కిల్ స్కామ్లో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి కార్లతో ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీస్తున్నారు. ఏపీ సరిహద్దు వద్ద భారీగా పోలీసులను మొహరించారు. విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదని సీపీ స్పష్టంచేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు(Karumuri Venkata Nageswara Rao) ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం అరెస్టు అయ్యారని ఈ మేరకు గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తోన్నాయి. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్, విజయవాడ నుంచి చెన్నై వరకు వందేభారత్ రైళ్లను రేపు (ఆదివారం) ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.