• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించండి’

TPT: సత్యవేడు నియోజకవర్గంలో ఏడు మండలాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతిలోని ఎస్పీడీసీల్ సీఎండీ శివశంకర్‌ను కోరారు. ఇందులో భాగంగా ముడియూరు సబ్ స్టేషన్ టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని, చమర్తి కండ్రిగ సబ్ స్టేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరగా, సీఎండీ దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

November 14, 2025 / 03:04 PM IST

త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నిరసన

కృష్ణా: పెందూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ సచివాలయం వద్ద రైతులతో కలిసి సీపీఎం నేతలు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్వోలు సుదర్శన్, స్వప్నకి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి నరసింహరావు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు తాగునీరు అందడం లేదన్నారు.

November 14, 2025 / 02:37 PM IST

కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

చిత్తూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ తుషార్ దూడి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల నియంత్రణ వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ద్వారా చిత్తూరు ప్రజలకు 24/7 రక్షణ అందించడమే జిల్లా పోలీసుల దృడ సంకల్పం అన్నారు‌. 

November 14, 2025 / 02:16 PM IST

జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుంటూరు GGH క్యాజువాలిటీ గేటు ముందు టీ షాప్ వద్ద సుమారు 55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అస్వస్థతతో శుక్రవారం కుప్పకూలిపోయాడు. అతడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని GGH శవాగారంలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలన్నారు.

November 14, 2025 / 02:14 PM IST

రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

ATP: పెద్దపప్పూరు మండలంలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై GRP పోలీసులు విచారణ చేపట్టారు.

November 14, 2025 / 01:30 PM IST

కాలభైరవ ఆలయంలో మరో చోరి

NTR: పెనుగంచిప్రోలు (మ) ముండ్లపాడు అడ్డరోడ్డులోని శ్రీ కాలభైరవ ఆలయంలో కూడా చోరీ జరిగినట్లు ఆలయ నిర్వహకులు పూర్ణచంద్రరావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఆలయంలో అభిషేకాలు నిర్వహించేందుకు ఆలయానికి వెళ్లి చూడగా తాళాలు పగులకొట్టి ఉండటంతో పాటు హుండీలోని డబ్బులు మాయమయ్యాని చెప్పారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరుస చోరీ ఘటనలతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

November 14, 2025 / 01:26 PM IST

సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గోన్న ఎంపీ కలిశెట్టి

VZM: విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం 30వ CII భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. AP బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడంతోపాటు, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా CM చంద్రబాబు ఆధ్వర్యంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడం గర్వంగా, ఆనందంగా ఉందని తెలియజేశారు.

November 14, 2025 / 01:18 PM IST

పెన్నాహోబిలం స్వామిని దర్శించుకున్న విశ్వేశ్వర రెడ్డి

ATP: ఉరవకొండ వైసీపీ ఇన్‌ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి శుక్రవారం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

November 14, 2025 / 01:02 PM IST

విశాఖ జూ పార్క్‌లో పిల్లలకు ఉచిత ప్రవేశం

VSP: బాలల దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్ లో పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఎలాంటి టికెట్ లేకుండా జూ పార్క్‌ను సందర్శించవచ్చు అని పేర్కొన్నారు. బాలల్లో ప్రకృతి, వన్యప్రాణులపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జూ అధికారులు తెలిపారు.

November 14, 2025 / 01:01 PM IST

విశాఖలో ఘనంగా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని

VSP: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అధ్యక్షులు హాసిని వర్మ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలలదినోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి, పిల్లలకు చాక్లెట్లు పంచారు. ఈ కార్యక్రమం భీమిలి ఇంఛార్జ్ సవరవిల్లి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

November 14, 2025 / 12:35 PM IST

చేనేత కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ

SKLM: గార మండలం జొన్నలపాడు గ్రామంలో ఇటీవల తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చేనేత కార్మికులకు శుక్రవారం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గొలువి వెంకటరమణ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులకు సహాయం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

November 14, 2025 / 12:15 PM IST

బస్సు ప్రమాదంపై ఫారెస్ట్ అధికారుల విచారణ

అన్నమయ్య:  జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురి కావడం తెలిసిందే. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న వినాయక ట్రావెల్ బస్సు చిన్నమండెం వద్ద బైక్ ఫారెస్ట్ చెక్ పోస్టును ఢీకొంది. దానిని వెనకే వస్తున్న బెంగళూరు – పోరుమామిళ్ల ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై మదనపల్లె సబ్ DFO శ్రీనివాసులు విచారిస్తున్నారు.

November 14, 2025 / 12:11 PM IST

డిప్లొమాలో స్పాట్ అడ్మిషన్‌లకు ఆహ్వానం

KRNL: నగర పరిధిలోని బి. తాండ్రపాడులో ఉన్న ఎసీపీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 19వ తేదీన డిప్లొమా ఫార్మసీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9441825230 నంబరుకు సంప్రదించాలని సూచించారు.

November 14, 2025 / 12:10 PM IST

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GST డబ్బులు మాయం..!

KDP: ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్‌కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. వెంటనే జీఎస్టీ అధికారులు ఆడిట్‌కు సిద్ధమయ్యారు.

November 14, 2025 / 12:09 PM IST

విశేష పుష్పాలంకరణతో దర్శనమిచ్చిన చౌడేశ్వరి దేవి

NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి మాత ఇవాళ విశేష పుష్పాలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున ప్రాతకాల పూజలు కుంకుమార్చన, రుద్రాభిషేకం అభిషేకం, మహా మంగళహారతితో పూజలు చేశారు. కార్తీకమాసం కావడంతో జిల్లా నలమూలల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు రాకుండ చూసుకున్నారు.

November 14, 2025 / 12:08 PM IST