SKLM: పలాస మండలం బ్రాహ్మణతర్ల ఎస్సీ కాలనీలో సోమవారం అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతి చెందారు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న స్మశానానికి తీసుకెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొలాల్లో పంట వేసే సమయంలో చివరి మజిలీకి వాళ్లు అనుభవించే కష్టాలు వారణాతీతం, పొలం గట్లుపై నుంచి వెళ్లలేక, పొలంలో దిగలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోయారు.
ప్రకాశం: ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న కలెక్టర్ల సమీక్షా సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధంచేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. నిన్న ఒంగోలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ల సమావేశానికి అవసరమైన నివేదికల గురించి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ATP: గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన ఇడ్లీల తోపుడు బండ్లకు మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో తోపుడు బండ్లు మొత్తం మంటల్లో ఖాళీ బూడిదయ్యాయి. సుమారు రూ.50 వేల దాకా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
W. G: తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ నెల 17, 18వ తేదీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. నిన్న సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 17న పీజీ, 18న పీహెచ్డీ కోర్సులకు మాన్యువల్ కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.
VZM: వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే చోరీకి పాల్పడిన పీ. నూకరాజును పోలీసులు సోమవారం కొంపెల్లిలో అదుపులోకి తీసుకున్నారు. వావిలపాడు, రామస్వామిపేట, వల్లంపూడి గ్రామాలలో జరిగిన ఈ చోరీలకు సంబంధించి నిందితుడి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు.
ATP: ఢిల్లీ వేదికగా డిసెంబర్ 16 నుంచి 19 వరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ‘సర్పంచ్ శక్తి’ సదస్సుకు వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మోనాలీసా ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి నలుగురు మహిళా సర్పంచ్లు ఎంపిక కాగా.. ఉమ్మడి జిల్లా తరఫున మోనాలీసాను ఎంపిక చేయడం విశేషం. ఆమె ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కృష్ణా: ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పల్స్ పోలియో కార్యక్రమ గోడపత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం ఆలయం వద్ద ఆటో, కారు డ్రైవర్లు హద్దు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పిఠాపురం సీఐ జీ. శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం రాత్రి పట్టణ ఎస్సై వీ. మణికుమార్, సిబ్బందితో కలిసి ఆలయ ప్రాంగణంలో డ్రైవర్లకు చట్టంపై అవగాహన కల్పించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సమస్యలుంటే తెలియజేయాలన్నారు.
TPT: దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో భక్తులు సులభంగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు కియోస్క్ మిషన్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమల తరహాలో తిరుచానూరు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయాల్లో భక్తుల అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.
ATP: ఎస్కేయూ పరిధిలో పీజీ కోర్సు ఎంబీఏ(జనరల్) మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగ డైరెక్టర్ జీవీ రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 16 వరకూ రోజుమార్చి రోజు పరీక్షలు ఉంటాయన్నారు. ఎంబీఏ (ఫైనాన్స్) మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 31 వరకూ ఎస్కేయూ, అనుబంధ కళాశాలల్లో నిర్వహిస్తామన్నారు.
VZM: అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 17న బొబ్బిలి శ్రీకళా భారతి ఆడిటోరియంలో 75ఏళ్లు నిండిన పెన్షనర్లను సన్మానించనున్నట్లు పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రామమూర్తి తెలిపారు. పెన్షనర్ల దినోత్సవం ప్రచార పత్రాలను సోమవారం విడుదల చేశారు. సమావేశానికి పెన్షనర్లు హాజరు కావాలని కోరారు.
VSP: విజయనగరం జిల్లా భోగాపురంలో దేశంలోనే తోలి ఏవియోషన్ ఏరోస్పేస్, డిఫెన్స్ ఏడ్యుకేషన్ సిటీని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో నేడు లాంఛనంగా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. జీఎంఆర్-మాన్సాస్ అధ్యర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలో 160 ఎకరాల స్థలంలో స్థాపించనున్నారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారు.
ASR: ఎటపాక మండలం బుట్టాయి గూడెం సబేస్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో తోటపల్లి 11 కేవీ ఫీడర్ పరిధిలోని వ్యవసాయ రైతులకు రెండు రోజుల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్తు నిలిపివేస్తామని ఈఈ వెంకటరమణ తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, మాజీ జడ్పీ ఛైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు సోమవారం రాత్రి తిరుమలలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. చిత్తూరు నియోజకవర్గంలోని దిగువమాసపల్లిలో శ్రీ గోవిందరాజుల గుట్టపై వెలసిన శ్రీవారి పాదాలు ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. స్థానిక ఆలయాల అభివృద్ధిపై ఆయనతో చర్చించారు.