SKLM: మందస మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘ సభ్యులతో వెలుగు పీవో పైడి కూర్మా రావు ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకు ద్వారా కేవలం 92 పైసలు వడ్డీకే సంఘానికి సుమారు రూ.8 లక్షల వరకు అతి తక్కువ వడ్డీకి ఎలాంటి ప్రాసెస్ చార్జీ లేకుండా అందిస్తున్న దానిని సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు.
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం మేరకు ఔత్సాహికులను గుర్తించి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. SVEP ద్వారా వ్యాపార యూనిట్లను గ్రౌండ్ చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ఈనారీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
KDP: ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సూచించారు. సిద్ధవటంలోని 30 పడకల ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. MLA మాట్లాడుతూ.. రాత్రి వేళలో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు.
ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఇంఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బారు నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను పరిశీలించి, అధికారులతో మాట్లాడి ఎరిక్షన్ బాబు పరిష్కరించారు. మరికొన్నింటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ELR: కోర్టు మొనిటరింగ్ సెల్ ఏర్పాటుతో కేసుల పరిష్కారం వేగవంతమైందని ఏఎస్పీ నక్క సూర్యచంద్రరావు తెలిపారు. శనివారం ఏలూరులో ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 41 కేసుల్లో 51 మందికి శిక్షలు పడేలా కృషి చేసి, 156 శాతం వృద్ధి సాధించినందుకు సిబ్బందిని అభినందించారు. నిరంతర పర్యవేక్షణతో నేరస్థులకు తగిన శిక్షలు పడుతున్నాయన్నారు.
W.G: తాడేపల్లిగూడెం (M) కుంచనపల్లి శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ధనుర్మాస సేవ నిర్వహించారు. స్వామి వారికి పోతురాజు త్రిమూర్తులు – వినయశ్రీ దంపతులు తోమాల సేవ, అభిషేకాలు జరిపారు. ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ దాసరి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
KDP: అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతోందని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలను నమ్మవద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దీనిపై మండిపల్లి స్పందించారు. ఈ విషయంలో రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందన్నారు.
కృష్ణా: గన్నవరం RTC బస్టాండ్లో MRP కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒకటి రెండు రూపాయలు అదనంగా ఉంటే పెద్ద ఇబ్బంది లేదని, కానీ ఐదు రూపాయలకు పైగా వసూలు చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. అధిక ధరల కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
W.G: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఇవాళ భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు S. శ్రీదేవి సందర్శించారు. ముద్దాయిలతో ఆయన మాట్లాడారు. బెయిల్ వచ్చి కూడా జామీన్లు సమర్పించని కారణంగా విడుదల కాని ముద్దాయిల వివరాలు నమోదు చేసుకున్నారు. ముద్దాయిల భోజన వసతులను, వైద్య సదుపాయాలను ఆరా తీశారు.
E.G: బొమ్మూరు ప్రెస్ క్లబ్ కార్యకాలాపాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, తక్షణమే చర్యలు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ JAC వర్కింగ్ జర్నలిస్టులు శనివారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి వినతిపత్రం అందజేశారు. ప్రెస్ క్లబ్ నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అందువల్ల ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో క్లబ్ నిర్వహణ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
CTR: కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి శ్రీ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని, ఆలయ ఏఈవో రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, తదితరులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.
ATP: అజ్మీరులోని హజ్రత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ 814వ ఉరుసు ఉత్సవాల సందర్భంగా గుత్తిలోని జామియా మసీదులో శనివారం మసీదు కమిటీ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చక్కెర చదివింపులు నిర్వహించారు. ముందుగా మసీదులో హజ్రత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ పేరు మీద ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు.
SKLM: జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన దిశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పురోగతి, అభివృద్ధి కార్యక్రమాల పనితీరును సమగ్రంగా సమీక్షించారు. వైద్యం, వ్యవసాయం, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
ప్రకాశం: కనిగిరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దేవరపల్లి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య క్షులు షేక్ సైదా పార్టీ కండవును వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.
KDP: ప్రముఖ సినీ నటులు సాయికుమార్, ఆదిలు ఇవాళ సాయంత్రం కడపకు రానున్నారు. మీరు నటించిన శంభాల చిత్రం విజయోత్సవ ర్యాలీలో భాగంగా నేడు కడప నగరంలో SR థియేటరుకు రానున్నారు. ఈ మేరకు ఆయన అభిమాన సంఘం నాయకుడు యూసఫ్ ఆధ్వర్యంలో కడప నగరంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం పెద్ద దర్గాకు వెళ్తారని ఆయన పేర్కొన్నారు.