CTR: వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోవాలని పుంగనూరు వ్యవసాయ శాఖ AD శివ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పుంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో AO రాధ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం జరిగింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రాబోయే ఖరీఫ్ సీజన్లో చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. కావున నీటిని పొదుపుగా వాడాలన్నారు.
ASR: వారపు సంతల్లో నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయాలని కొయ్యూరు మండలం మంప ఎస్సై సీదరి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన గరిమండ వారపు సంతను సందర్శించారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశం నిర్వహించారు. వారపు సంతల్లో కల్తీ, గడువు ముగిసిన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుకాణాల్లో కల్తీ వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
KRNL: హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల రైతులకు హెచ్చరిక చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పశువుల గడ్డివాముల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గడ్డివాముల సమీపంలో విద్యుత్ తీగలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదం జరిగితే టోల్ ఫ్రీ 101 లేదా ఫైర్ కంట్రోల్ నంబర్ 9100108101కు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.
ASR: ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నందున, వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే పనులు మొదలు పెట్టాలని జీకేవీధి ఏవో దాసరి గిరిబాబు రైతులకు సూచించారు. మంగళవారం ఏబులం, ధారకొండ, గింజంగి, పెదవలస గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. 90శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న బిందు సేద్యం పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
VZM: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 18 నుంచి దివ్యాంగ శక్తి పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు ఎస్.కోట డిపో ప్రబంధకుడు సుదర్శనరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం 40 శాతం, ఆపైన అంగవైకల్యం ఉన్నవారికి పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ మెట్రో బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి ప్రత్యేకంగా కండక్టర్ వెనక ఒక సీటు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
CTR: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇంద్రధనుస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు RTC డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బుధవారం CM చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత పుంగనూరు ఆర్టీసీ బస్టాండులో ఉదయం 11 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు.
KRNL: ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీ కింద 45 శాతం సబ్సిడీతో అందిస్తున్న TATA V-50 వాహనాన్ని ఇవాళ ఎమ్మెల్యే బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నాగరాజుకు అందజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. SC/ST వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పథకాలను వినియోగించుకోవాలని యువతకు సూచించారు.
ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా దేవాలయాలు, ఈద్గా పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఇవాళ ఎస్డిపిఐ నాయకులు కోరారు. ఈ మేరకు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్కు ఎస్డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ కమిటీ వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు ఆరిఫ్ హుస్సేన్, సభ్యులు మాసూం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
W.G: పాలకొల్లులో మంగళవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇతర కులస్థులు, కార్పొరేట్ సంస్థలు క్షవర వృత్తిలోకి రావడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని జిల్లా అధ్యక్షుడు ఉప్పలపు దుర్గా పెద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ప్రకాశం: గుడ్లూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో గంజాయి అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. చెన్నైకు చెందిన సాయికుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం అనంతరం గంజాయి సంచులను దాచిపెట్టి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
NTR: నందిగామ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సౌమ్య మంగళవారం అన్నారు. నందిగామ బాబు జగజీవన్ రామ్ బిల్డింగులో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని, గత సంవత్సర కాలంలో రూ.114 కోట్లతో పట్టణ పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే 24 గంటల నీటి సరఫరా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
BPT: సంతమాగులూరు మండలంలోని గ్రామాల్లో “రైతన్న మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సైదా పాల్గొని రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అంశాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలు తెలుసుకుని తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
GNTR: తుళ్లూరు ఎక్స్చేంజ్ సెంటర్లోని మీసేవ కేంద్రంలో కార్మికుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ నంబర్ లింక్ సేవకు రూ. 70 బదులు రూ. 250 వరకు తీసుకుంటున్నారని, రసీదుల్లో అసలు మొత్తం చూపించడం లేదని కార్మికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
BPT: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని నియోజకవర్గ సమన్వయకర్త డా. అశోక్ కుమార్ చింతలపూడి పిలుపునిచ్చారు. అద్దంకిలోని సింగరకొండ భవన్లో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ చేసిన అభివృద్ధి పనులే పార్టీ విజయానికి బలం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
SKLM: ప్రభుత్వ బడిలో చదివి, పేదరికాన్ని జయించి సివిల్స్లో 463వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సౌరోతు రామును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాము ప్రతి విద్యార్థికి ఒక గొప్ప ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.