NLR: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. వైసీపీ రాక్షస పాలనలో నాయకులు, కార్యకర్తలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగానే టీడీపీ విజయం చేకూరిందని ఆయన తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలోని నాపరాతి గనుల్లో నిర్వహిస్తున్నపేకాట స్థావరంపై ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9,500 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.
KRNL: ఆదోని పట్టణ శివారులోని ఇస్వీ కొండల్లో ఆదివారం పోలీసులు ఒక జూద స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మహేష్ కుమార్ నేతృత్వంలోని బృందం 9 మంది జూదరులను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి రూ.17,000, 7 సెల్ ఫోన్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. బోయ గోవిందరాజులు, బోయ పరశురాంలతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు.
అనకాపల్లి కూరగాయల మార్కెట్లో వర్తకులు స్థానిక రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం కూరగాయల మార్కెట్ను సందర్శించి స్థానిక వర్తకులతో మాట్లాడారు. వర్తకుల, రైతుల సమస్యలపై చర్చించారు. స్థానిక రైతుల నుంచి టమోటాలు కొనుగోలుకు వర్ధకులతో ఒప్పందం కుదిర్చారు.
VSP: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ను మొత్తం 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తి చేయనున్నారు. ప్లాంట్ నుంచి ఏడాదికి 17.8 MMT ఉక్కు ఉత్పత్తి కానుంది.
KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు APSPDCL CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిరుపతి సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ సమయంలో 8977716661 నెంబరుకు ఫోన్ చేసుకోవచ్చు అన్నారు.
బాపట్లలో ఈ నెల 24న ఉదయం 8.30 గంటలకు మీడియా ప్రతినిధులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వైద్య నిపుణులు పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాలు అందజేస్తారు. మీడియా ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SKLM: పాతపట్నం మేజరు పంచాయతీకి సంబంధించిన ఆశీల వేలం పాట సోమవారం జరగనుంది. పాటలో పాల్గొని హక్కులు పొందొచ్చని పంచాయతీ కార్యదర్శి వి.రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్ చెల్లించి ఈ వేలంలో పాల్గొనవచ్చునని పిలుపునిచ్చారు. పాతపట్నం పంచాయతీ ఆఫీస్లో ఈ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ATP: వినియోగదారులకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 50 గ్యాస్ ఏజెన్సీలలో వీఆర్వోలు అందుబాటులో ఉండి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
W.G: తాడేపల్లిగూడెం బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఉగాది నాటకోత్సవాలు ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్.డీ. విల్సన్ శరత్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళలను, కళాకారులను ఆదరించాలని, తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు వెలసిల్లుతాయన్నారు. అనంతరం ఆయనను సన్మానించారు.
SKLM: కార్గో ఎయిర్పోర్టుపై అపోహలు వద్దని నిర్వాసితులతో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడు అన్నారు. ఎయిర్పోర్టు నిర్వాసిత 18 గ్రామాల ప్రజలు, నిర్వాసితులతో ఆదివారం కలెక్టరేట్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎస్పీ, కలెక్టర్ సమక్షంలో కేంద్ర మంత్రి వర్చ్యువల్ గా నిర్వాసితుల సందేహాలు తీర్చినట్లు అధికారులు తెలిపారు.
SKLM: అరసవల్లి శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ.6.86 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNVD.ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు పేర్కొన్నారు.
VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
ELR: తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడిన డబ్బాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు. రాత్రి వేళల్లో ఈ స్టిక్కర్లు మెరుస్తూ.. వాహనదారులను అప్రమత్తం చేస్తాయని, దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు రవాణా నిబంధనలు పాటిస్తూ.. అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
VZM: కలెక్టరేట్లో ఇవాళ ప్రజల సమస్యల పరిష్కారం కోసం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి నిన్న తెలిపారు. అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని, భూ సమస్యల కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నెంబర్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.