ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చాలా ఏళ్లుగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని తెలిపారు.
ATP: జిల్లా TDP అధ్యక్షుడిగా పూల నాగరాజును నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏపీఎస్ఆర్టీసీ కడప రీజియన్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరిని నియమించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు ఈ నియామకాలు చేపట్టారు.
ATP: గుత్తిలో హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. హిందూ సమ్మేళనం నిర్వాహకులు గోపాల్ మాట్లాడుతూ.. గుత్తిలో మొదటిసారిగా ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశ సమైక్యతకు ప్రతిరూపం హిందూ సమ్మేళనం అన్నారు.
గుంటూరు నగరంలోని 24వ డివిజన్ ఎస్పీ బంగ్లా ఎదురు ప్రాంతంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో 1600 కిలో లీటర్ల సామర్థ్యం గల ఇఎల్ఎస్ఆర్ (ఓవర్హెడ్ ట్యాంక్) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు నిరంతరంగా శుద్ధి చేసిన మంచినీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
బాపట్ల 7వ వార్డు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలియో వ్యాధి నివారణకు పోలియో చుక్కలే ఏకైక మార్గమని, 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
VSP: వైసీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకులను భీమిలి నియోజకవర్గంలో ఇంఛార్జ్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చిన్న శ్రీను కుటుంబ సమేతంగా సింహాచలంలో స్వామివారిని దర్శించుకున్నారు. 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారాన్ని స్వామి వారికి సమర్పించారు. జగన్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టినట్లు తెలిపారు.
PLD: నరసరావుపేటలో కొలువైన గంగమ్మ అంకమ్మ తల్లి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
GNTR: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు DMHO విజయలక్ష్మి హెచ్చరించారు. PHC తనిఖీలలో భాగంగా శుక్రవారం రాత్రి పెదకాకాని మండలం వెనిగండ్ల PHCని తనిఖీ చేయగా తాళం వేసి ఉందని, విధులు నిర్వహించాల్సిన మెడికల్ అధికారి, స్టాఫ్ నర్సు లేకపోవడంపై DMHO ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గైర్హాజరైన వారికి ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
శ్రీకాకుళం: సోంపేట మండలంలోని బారువ బీచ్లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.
NLR: కావలి ముసునూరు జడ్పీ హైస్కూల్లో పోలియో పల్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, ఆర్డీవో సన్నీ వంశీకృష్ణ ఆదివారం ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత్ నుంచి పోలియోను తరిమికొట్టేందుకు అందరూ అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
SKLM: ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా లావేరు శాఖా గ్రంథాలయములో ఆదివారం గ్రంధాలయాధికారి శ్రీనివాసరావు విద్యార్థులతో సూర్య నమస్కారాలు వేయించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అది మనసుకు ప్రశాంతతను, శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఎన్నో చెడు అలవాట్లను సైతం ధ్యానం ద్వారా దూరం చేసుకోవచ్చు అన్నారు.
ATP: గుంతకల్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ కేకును అనంతపురం జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం వైసీపీ నేతలు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు ఆస్పరిలో నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పార్టీ నాయకులు, MRPS నాయకులు సంజప్ప కొనియాడారు. ఇందులో భాగంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో అవసరమని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఈ టీకా వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలన కోసం శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు.
VZM: బొండపల్లి మండలం గొట్లాం జిల్లా పరిషత్ పాఠశాలలో పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలన్నారు.