• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్య గిత్త జయసూర్య రేపటి పర్యటన వివరాలు

NDL: నంది కొట్కూరు MPDO కార్యాలయం నందు రేపు గ్రీవెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్య జయసూర్య ఉ. 10.30 గం.లకు హాజరై, ప్రజల నుంచి సమస్యల వినతులు స్వీకరించనున్నారు. ఈ మేరకు కార్యాలయం సమాచార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కావున సంబందిత అధికారులు, పాల్గొనాలని పిలుపునిచ్చారు.

December 18, 2025 / 09:02 PM IST

చౌడేపల్లి మండలంలో వ్యక్తి ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం నేతిగుట్లపల్లెకు చెందిన రవి (55) కుటుంబ సమస్యల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. గురువారం పురుగు మందు తాగిన రవిని కుటుంబీకులు గమనించి చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్సలు అందిస్తుండగానే అతను మృతి చెందినట్లు తెలిపారు.

December 18, 2025 / 08:58 PM IST

వచ్చే ఆదివారం నుండి పాఠశాలల్లో హ్యాపీ సండే

కోనసీమ: వచ్చే ఆదివారం నుంచి మండపేటలోని మునిసిపల్ పాఠశాలల్లో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండపేట పురపాలక సంఘం కమిషనర్ టీవీ రంగారావు పేర్కొన్నారు. మండపేట మునిసిపల్ ఉపాధ్యాయుల సమావేశం గురువారం సాయంత్రం మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మండపేట పురపాలక సంఘ పరిధిలో గల పురపాలక సంఘ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు.

December 18, 2025 / 08:57 PM IST

గ్రీవెన్స్ కార్యక్రమం ఈనెల 22వ తేదీకి వాయిదా

కృష్ణా: ఈనెల 19న శుక్రవారం నిర్వహించాల్సిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల దృష్ట్యా ఈనెల 22కి వాయిదా వేసినట్లు కలెక్టర్ డీ.కే. బాలాజీ గురువారం తెలిపారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఈ మార్పును గమనించి, 22వ తేదీన జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ బాలాజీ కోరారు.

December 18, 2025 / 08:56 PM IST

పోర్టును సందర్శించిన అమెరికా కాన్సులేట్ జనరల్

VSP: యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్, హైదరాబాద్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ గురువారం విశాఖ పోర్ట్ అథారిటీను సందర్శించారు. పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్ దుర్గేష్ కుమార్ దూబే సహా సీనియర్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. పోర్టులోని ఆధునిక మౌలిక వసతులు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునికీకరణ–యాంత్రీకరణ పనులను వివరించారు.

December 18, 2025 / 08:51 PM IST

మదనపల్లి మండలంలో దంపతులపై దాడి

అన్నమయ్య: మదనపల్లి మండలం కొండామారిపల్లి బెస్తపల్లిలో గురువారం సాయంత్రం చెత్త వేయడం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా పురుషోత్తం, అలివేలు దంపతులపై అదే వీధిలో నివసించే మురళి, లీలావతి దంపతులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన పురుషోత్తం, అలివేలులను కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

December 18, 2025 / 08:51 PM IST

కంప్యూటర్ లిటరసీ పై విద్యార్ధినిలకు శిక్షణ

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో పిఎం ఉష కార్యక్రమాన్ని గురువారం ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధినిలకు 5 రోజులు కంప్యూటర్ లిటరసీపై శిక్షణ ఇస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఉన్నత విద్య అభ్యసించే వారి నైపుణ్యత పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే పిఎం ఉష కార్యక్రమ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.

December 18, 2025 / 08:45 PM IST

‘ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలి’

అన్నమయ్య: చిట్వేల్ మండలంలో ZPHS పాఠశాల వేదికగా మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించగా, ఉత్తమ ప్రతిభ కనబరిచినవి జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని ఉపాధ్యాయులు అన్నారు.

December 18, 2025 / 08:45 PM IST

దాడి కేసులో ముగ్గురికి జైలు శిక్ష

KDP: మైదుకూరు మండలం వరదాయపల్లెలో 2016లో జరిగిన దాడి కేసులో ముగ్గురికి 3 నెలల జైలు, రూ. 3 వేల జరిమానా విధిస్తూ మైదుకూరు జడ్జి ఖాజా మొయినుద్దీన్ గురువారం తీర్పు చెప్పారు. బోరుబావి వద్ద శాంతమ్మపై వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, కల్పన రాళ్లతో దాడి చేసినట్లు రుజువు కావడంతో శిక్ష పడిందని సీఐ రమణారెడ్డి తెలిపారు.

December 18, 2025 / 08:42 PM IST

నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు

AKP: పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఏసీ కళ్యాణ మండపం నిధులు దుర్వినియోగంపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు స్థానిక టీడీపీ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. శుభకార్యాల ద్వారా కళ్యాణ మండపానికి రూ. 69 లక్షలు ఆదాయం రాగా, రూ. 49 లక్షలు మాత్రమే పంచాయతీ ఖాతాల్లో జమ చేశారని పేర్కొన్నారు. రూ. 22 లక్షలు దారి మళ్ళించారని ఆరోపించారు. రికవరీకి చర్యలు తీసుకోవాలని కోరారు.

December 18, 2025 / 08:40 PM IST

మంత్రికి ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే

పార్వతీపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చురుగ్గా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే పలువురు మంత్రులును, ఉన్నతాధికారులను కలిసి నిధులు సాదించే పనుల్లో నిమగ్నమయ్యారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణను ఈరోజు కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు అందజేశారు.

December 18, 2025 / 08:38 PM IST

ఘనంగా సిమ్స్ క్రిస్మస్ వేడుకలు

VZM: సిమ్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు. కొత్త ఏవియేషన్ ఎడ్యూసిటీ ఈ క్రిస్మస్ నెలలో ఏర్పాటు చేయడం మనకే గర్వ కారణమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పాస్టర్ ప్రభాకర్ దైవ సందేశాన్ని తెలపగా, క్వయర్ సంగీతాన్ని అందజేశారు.

December 18, 2025 / 08:36 PM IST

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

WG: చాట్రాయి పోలీస్ స్టేషన్‌ ను నూజివీడు డీఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.స్టేషన్ నిర్వహణ, రికార్డులు మరియు కేసుల పురోగతిని డీఎస్పీ కెవివిఎన్‌వి. ప్రసాద్ క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సకాలంలో న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. మండల పరిధిలో శాంతి భద్రతలను కాపాడడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

December 18, 2025 / 08:35 PM IST

CEC శ్రీశైలం పర్యటన ఖరారు

NDL: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు 12PMకు HYD చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి శ్రీశైలం రానున్నారు. 20న మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 21న HYD రవీంద్ర భారతిలో TG BLOలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తారు.

December 18, 2025 / 08:35 PM IST

రేపు అమలాపురం విద్యుత్‌కు అంతరాయం

కోనసీమ: అమలాపురం పట్టణంలో గల 132 కేవీ ఉప కేంద్రంలో విద్యుత్తు ఆధునీకరణ పనులు చేయుటకు గాను శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ గురువారం తెలిపారు. అమలాపురం పట్టణం, అల్లవరం మండలం పరిధిలో గల అన్ని గ్రామాలకు, 33/11 పేరూరు సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

December 18, 2025 / 08:33 PM IST