PPM: జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 11న జరగబోయే మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి హాజరుకావాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రని అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు. శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి కరపత్రాలు అందించారు.
ELR: గణపవరం గ్రామంలో స్వయంభూ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయ పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గణపవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేకరించిన రూ.28,000 ఆలయ నిర్మాణానికి విరాళంగా ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ ప్రజావేదికలో అంగన్వాడి ఉపాధ్యాయులు, హెల్పర్లకు నియామక పత్రాలను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరు నిబద్ధతతో పని చేయాలన్నారు.
కృష్ణా: అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరుసల్పిన తొలినాటి యోధుడు జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే రాము అన్నారు. నందివాడ మండలం రామాపురంలో ఇవాళ జరిగిన ఫూలే వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే, కూటమి నాయకులు నివాళులర్పించారు.
VZM: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జిల్లా కేంద్రంలోని గంట స్తంభం వద్ద శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. సేకరించిన సంతకాలతో గవర్నర్ను కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు.
VZM: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్థానిక గంట స్తంభం వద్ద శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. సేకరించిన సంతకాలతో గవర్నర్ను కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు.
ELR: పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలను, వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 43 మందికి రూ.22 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందించారు.
KRNL: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ కర్నూలు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ ప్రకటించారు. ఈ పొడిగింపు డిసెంబర్ 1, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్త కార్డుల జారీ జరిగే వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నవంబర్ 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
WG: నరసాపురం వై.ఎన్. కళాశాలలో శుక్రవారం రూ.2 కోట్లతో నిర్మించిన నూతన బాలుర వసతి గృహాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాల నుంచి చిరంజీవి, కృష్ణంరాజు, దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు విద్యని అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకున్నారని కొనియాడారు.
బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని (పీ-4) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులు, వినతులు అందుకున్న ఆయన సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
SKLM: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడల పోటీలు శుక్రవారం నిర్వహించారు. వికలాంగుల శాఖ ఇన్ఛార్జ్ AD బి.షైలజ, DSOA మహేష్ జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ముందుగా వికలాంగులకు వాకింగ్ పోటీలు జరిగాయి.
NDL: ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో సెక్యూరిటీ అనలిస్ట్ కోర్సుకు ఉచిత శిక్షణను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. APSSDC ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కోర్సుకు డిగ్రీ, బీటెక్ విద్యార్హత ఉన్నవారు అర్హులన్నారు. 3 నెలల ఉచిత శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి గల వారు కళాశాలను సంప్రదించాలన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం రాఘవరాజు పురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజా దర్బార్’ శుక్రవారం నిర్వహించారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఇబ్బందులను ఆర్జీల రూపంలో సమర్పించారు. రూపానంద రెడ్డి తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు.
CTR: చిత్తూరు ప్రజలు విన్నవించే సమస్యలను పరిష్కరించడంపై అధికారులు శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రజాదర్బార్లో శుక్రవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా అర్జీదారులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు.
CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి పీసీఆర్ కూడలిలోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ప్రజల కోసం, బాలికల విద్య, మహిళల హక్కుల కోసం జ్యోతిబాపూలే చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.