• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్సార్ ఫండ్స్ విరివిగా కేటాయించాలని ఎమ్మెల్యే వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్సీఎల్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. గన్నవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ ఏర్పాటుకు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన హెచ్సీఎల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

December 11, 2025 / 09:21 PM IST

‘మున్సిపల్ కార్మీకులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి’

W.G: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల జీతాలు ప్రతినెల సకాలంలో చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ కోరారు. గురువారం తణుకులో కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా చేసి అనంతరం మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు ఇవ్వాలని కోరారు.

December 11, 2025 / 08:56 PM IST

జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు అరెస్ట్

కృష్ణా: మోపిదేవి లంకలో అక్రమంగా జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు జూదం శిబిరంపై ఇవాళ దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,420/-, సెల్ ఫోన్లు – 4 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. చట్టా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పమని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

December 11, 2025 / 08:55 PM IST

నూతన అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: పొన్నూరులో అంజుమన్ కమిటీ నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌ను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తక్కువ సమయంలో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసిన అంజుమన్ కమిటీకి, దాతలకు అభినందనలు తెలిపారు. అంజుమన్ కమిటీ అభివృద్ధికి రూ.2 లక్షల వ్యక్తిగత విరాళం ప్రకటించారు.

December 11, 2025 / 08:55 PM IST

‘ఐవిఆర్ఎస్‌లో జిల్లా ర్యాంకు మెరుగుపరుస్తాం’

VZM: ప్రభుత్వం చేపడుతున్న ఐవిఆర్ఎస్ సర్వేలో జిల్లా ర్యాంకును మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని జేసీ ఎస్. సేధు మాధవన్ అన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలతో చీఫ్ సెక్రటరీ విజయానంద్ నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

December 11, 2025 / 08:50 PM IST

ఒంగోలులో మహిళపై అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు

ప్రకాశం: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నారాయణకు పదేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పు ప్రకటించారు. 2021లో మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై విచారణ సాగింది. దోషిగా తేలిన నిందితుడిపై శిక్ష అమలు కానున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

December 11, 2025 / 08:43 PM IST

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రామకృష్ణ

VZM: విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డొక్కాడ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చెందిన రామకృష్ణ గతంలో ఏఎంసీ ఛైర్మన్‌గా, ఆయన భార్య మంగమ్మ గుమ్మలక్ష్మిపురం జడ్పీటీసీగా పనిచేశారు. గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

December 11, 2025 / 08:41 PM IST

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా విఠల్ రావు

SKLM: కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల గ్రంథాలయ ఛైర్మన్‌లను గురువారం రాత్రి ప్రకటించింది. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా  పలాసకి చెందిన పీరుకట్ల.విఠల్ రావును నియమించింది. ఈ మేరకు ఆయన తన పైన నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందున సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే శిరీషకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అన్నారు.

December 11, 2025 / 08:41 PM IST

‘ఇంటి పన్ను చెల్లించాలి’

ASR: ఇళ్ల యజమానులందరూ ఇంటి పన్ను చెల్లించి, తమకు సహకరించాలని కొయ్యూరు మండలం ఎం.మాకవరం పంచాయతీ అభివృద్ధి అధికారి శివ శంకర్ కోరారు. గురువారం పంచాయతీలో ఇంటింటికీ తిరుగుతూ ఇంటి పన్ను సేకరణ కార్యక్రమం చేపట్టారు. పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇళ్ల యజమానులందరూ పంచాయతీకి ఇంటి పన్ను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

December 11, 2025 / 08:38 PM IST

వివిధ శాఖల్లో పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

W.G: వివిధ శాఖలలో పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో గురువారం ఈ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మనబడి మన భవిష్యత్తు ఫేజ్ వన్ క్రింద 430 పనులను రూ14.17 కోట్ల వ్యయంతో చేపట్టి నూరు శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు

December 11, 2025 / 08:38 PM IST

వైసీపీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు

నెల్లూరు: వైసీపీ పార్టీలో ఐదుగురు కార్పొరేటర్లు చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైసీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ ఆరో డివిజన్ కార్పొరేటర్, ఓబుల రవిచంద్ర ఐదవ డివిజన్, సాహితీ 51 డివిజన్, శ్రీకాంత్ రెడ్డి 16వ డివిజన్, ఫ మీద 34వ డివిజన్ కార్పోరేటర్లు ఉన్నారు. వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

December 11, 2025 / 08:36 PM IST

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: MLA

GNTR: పొన్నూరు శివారులోని VNR ఇంజినీరింగ్ కళాశాలలో రేపు జరగబోయే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ సూచించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తుందన్నారు. 18-35 సంవత్సరాలు వయసు, టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.

December 11, 2025 / 08:36 PM IST

పల్నాడు DEOగా రామారావు బాధ్యతలు

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)గా పి.వి.జె. రామారావు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల లోటు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ DEOకు సూచించారు.

December 11, 2025 / 08:36 PM IST

కావలిలో ఎస్పీ సీరియస్ వార్నింగ్

NLR: కావలిలో జిల్లా ఎస్పీ డా.అజిత వేజెండ్ల స్వయంగా వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి, ఆయుధాలు, ఓపెన్ డ్రింకింగ్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గంజాయి సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రాత్రిళ్లు గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని, అనుమానితులపై 112కి సమాచారం ఇవ్వాలని సూచించారు.

December 11, 2025 / 08:32 PM IST

‘నీటి సమస్యను పరిష్కరించుటమే లక్ష్యం’

ప్రకాశం: నీటి సమస్యకు శాస్వితముగా పరిష్కరించడమే ముఖ్య లక్ష్యమని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. గురువారం 14 వ వార్డులో ఆయన పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ట్యాంకర్స్ ద్వారా 420 నుంచి 100 ట్యాంకర్లకు తగ్గించి పైపు లైన్స్ ద్వారా శాశ్విత నీటి పరిస్కారం చూపుతున్నట్లు ఆయన తెలిపారు.

December 11, 2025 / 08:30 PM IST