• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జూదాలపై ఉక్కుపాదం’

WG: సంక్రాంతి పండుగ సాకుతో కోడిపందాలు, గుండాట, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంఛార్జ్ తహసీల్దార్ ఫరూక్ హెచ్చరించారు. సోమవారం ఆకివీడు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సై, ఎంపీడీవో, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూద కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిరంతరం గస్తీ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు

December 29, 2025 / 09:27 PM IST

గోదావరిలో చిక్కిన వింత చేప

కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి బాడవ వద్ద సోమవారం మత్స్యకారుల వలకు వింత చేప చిక్కింది. సుమారు మూడు అడుగులు పొడవున్న ఈ చేప మెడ వద్ద కొబ్బరాకులు ఉన్న గడులు ఉన్నాయి. మత్స్యకారుడు అంకాని బుజ్జి దానిని ముట్టుకున్నప్పుడు తిమ్మిరి ఎక్కడంతో అది విషపూరిత చేప ఏమో అని భయం వేసి తిరిగి గోదావరిలోకి వదిలేశాడు. ఈ వింత చేపను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

December 29, 2025 / 08:59 PM IST

టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరపాలి: కేతిరెడ్డి

ATP: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై నిష్పక్షపాత విచారణ కోరుతూ సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి అనంతపురం కలెక్టర్ ఆనంద్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పనులు చేయకుండానే నకిలీ రికార్డులతో కోట్లాది రూపాయల బిల్లులు డ్రా చేశారని ఫిర్యాదు చేశారు.

December 29, 2025 / 08:48 PM IST

బుడా ఛైర్మన్‌ను కలిసిన ఎస్.కోట ఎమ్మెల్యే

విజయనగరం: బుడా ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు మాతృమూర్తి తెంటు జయప్రకాష్ సతీమణి పెద్దకర్మ కార్యక్రమానికి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హాజరయ్యారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పాల్గొన్నారు.

December 29, 2025 / 08:39 PM IST

‘పెన్షన్ల పంపిణీని సకాలంలో నిర్వహించాలి’

కోనసీమ: జనవరి నెలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీ నాడే అధికారులు, సిబ్బంది అందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నుండి ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీపై సూచనలు చేశారు.

December 29, 2025 / 08:36 PM IST

గన్నవరం పాఠశాలలో వంద రోజుల ప్రణాళిక పరిశీలన

కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని గుడివాడ ఉప విద్యాశాఖాధికారి కొండా రవికుమార్ సోమవారం పరిశీలించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని, అలా సాధిస్తే మంచి కళాశాలలో సీటు పొంది బంగారు భవిష్యత్తు సాదించాలన్నారు.

December 29, 2025 / 08:28 PM IST

దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు

అన్నమయ్య: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఆహార భద్రతా అధికారి డా.కె.షమీమ్ బాషా సోమవారం చిట్వేల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చిల్లర, కూల్‌డ్రింక్స్, కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్లను పరిశీలించారు. ఒక కూల్‌డ్రింక్స్ షాపు, ఒక సూపర్‌ మార్కెట్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు.

December 29, 2025 / 08:28 PM IST

ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌కు భూమి పూజ

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం కె.కందులవారిపల్లి పంచాయతీలోని గాంధీనగర్ గ్రామంలో నూతన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

December 29, 2025 / 08:25 PM IST

‘ప్రశంసలు అందుకున్న CS పురం ఎస్సై’

ప్రకాశం: సీఎస్పురం మండల పరిధిలో ఎలాంటి పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పరిష్కరించడంలో ఎస్సై వెంకటేశ్వర నాయక్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలు జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించి, ప్రశంస పత్రాలు అందజేశారు. ప్రతి మండలాలు పెండింగ్ కేసు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

December 29, 2025 / 08:25 PM IST

వాలీబాల్, బీచ్ కోచింగ్ క్యాంపులు పరిశీలించిన శాప్ ఛైర్మన్

విశాఖలో 2వ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్‌లో ఏపీ తరపున ప్రాతినిద్యం వహించే పురుషులు, మహిళలకు బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డి క్రీడలో కోచింగ్ క్యాంపులు డిసెంబర్ 26 నుంచి జనవరి 2 వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు సోమవారం పర్యవేక్షించారు. క్రీడాకారులతో మాట్లాడుతూ.. క్రీడాకారులు అత్యంత ప్రదర్శన కనబరిచి పతాకాలు సాధించాలన్నారు.

December 29, 2025 / 08:24 PM IST

నరసాపురం అందుబాటులో యూరియా: AO జ్యోషిలా

W.G: రబీ సాగుకు అవసరమైన యూరియాను సిద్ధం చేసినట్లు ఏవో జ్యోషిలా తెలిపారు. 2025-26 రబీ సాగుకు మండలంలో సుమారు 153 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. MRP ధరను మాత్రమే చెల్లించి రైతులు ఎరువును కొనుగోలు చేయాలని సూచించారు. అదనపు ధరలకు విక్రయించినట్లు తమకు ఫిర్యాదులు అందితే డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

December 29, 2025 / 08:22 PM IST

దేవాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి సోమవారం తిరుపతిలోని పలు దేవాలయాలను దర్శించుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీనివాస మంగాపురం, తిరుమలలోని వారాహి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

December 29, 2025 / 08:20 PM IST

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: సీఐ

ELR: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీఐ క్రాంతి కుమార్ అన్నారు. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాల్య వివాహాల నిర్మూలనలో పోలీసు పాత్రను ఆయన విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండి బాల్య వివాహాలను నివారించడంలో సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని తెలిపారు.

December 29, 2025 / 08:20 PM IST

ఒక రోజు ముందుగానే పింఛన్ పంపిణీ

KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లను డిసెంబరు నెలకు సంబంధించి 31న పంపిణీ చేయనున్నామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. 31వ తేదీన ఫించన్‌లను పొందలేని వారికి జనవరి 2న ఇస్తామని అన్నారు. సచివాలయ సిబ్బంది 30న పింఛన్‌ల మొత్తం డ్రా చేసుకుని, 31న ఉదయం 7 గంటల లోపు పంపిణీ చేయాలి ఆదేశించారు.

December 29, 2025 / 08:19 PM IST

సీఎం చంద్రబాబు కలిసిన గుడిసె కృష్ణమ్మ

KRNL: జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ సోమవారం అమరావతిలో CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించారు. కార్యకర్తలతో సమన్వయంగా ఉంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు సూచించారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని క్రిష్ణమ్మ తెలిపారు.

December 29, 2025 / 08:17 PM IST