కోనసీమ: పాడి రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే విడుదల చేశారు. పశువుల సోకే గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న రాయదుర్గం-తుమకూరు రైల్వే లైన్ పనులను ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు బుధవారం పరిశీలించారు. రైల్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి రైళ్ల రాకపోకలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ASR: డుంబ్రిగూడ మండలం కింజెరు గ్రామంలో 78 మీటర్లు, కుట్టి గ్రామంలో 110 మీటర్ల డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పంచాయతీ సర్పంచ్ లక్ష్మి హాజరై పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి డ్రైనేజ్ నిర్మాణం ఉపయోగపడుతుందని తెలిపారు. పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు.
GNTR: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సదస్సు ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై విస్తృతంగా చర్చించారు. ‘స్వర్ణాంధ్ర 2047’ దృష్టిపత్రంలో పేర్కొన్న పది సూత్రాల అమలు దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష జరిగింది.
VZM: సీనియర్ పాత్రికేయుడు, సినిమా రచయిత KNY పతంజలి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక గురజాడ గ్రంధాలయం ఆవరణలో నున్న పతంజలి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో పతంజలి రచనలకు ప్రత్యేకత ఉందన్నారు.
GNTR: పొన్నూరు పట్టణంలోని జీబీసీ (GBC) రోడ్డులో ఇవాళ జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బాపట్ల వైపు వెళ్తున్న ధాన్యం లోడు ట్రాక్టర్ వీజే గ్రాండ్ హోటల్ వద్ద స్కూటీని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
అన్నమయ్య: పదో తరగతి విద్యార్థులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆల్ ది బెస్ట్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో హాల్ టికెట్ చూపిస్తే పరీక్ష కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు.
AKP: పారిశుధ్య పనులు నిర్వహణకు పాయకరావుపేట మండలానికి 8 ట్రాక్టర్ తొట్టెలను ప్రభుత్వం సరఫరా చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. గతంలో వీటికి ట్రాక్టర్ ఇంజన్లను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. పీఎల్ పురం, అరట్లకోట, పెంటకోట, పెదరామభధ్రపురం, మంగవరం, శ్రీరాంపురం, పాల్మన్ పేట గ్రామాలకు వీటిని కేటాయించామని ఆయన వెల్లడించారు.
PPM: సీతానగరం మండలం గాదెలవలస నుంచి ఏగోటివలస వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఇవాళ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు రోడ్లు లేకుండా పోయింది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
GNTR: వేసవి వేడి పెరగడంతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. గత నెలలో ఉమ్మడి జిల్లాలో 17.5 మిలియన్ యూనిట్లు వినియోగించగా, ప్రస్తుతం 20.1 మిలియన్ యూనిట్లకు చేరింది. జిల్లా సర్కిల్లో కూడా డిమాండ్ 7.3 నుంచి 8.5 మిలియన్ యూనిట్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. విద్యుత్ను పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు.
VSP: జిల్లా హౌసింగ్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న TKT.కనకరాజు మేనేజర్గా పదోన్నతి పొందారు. గత ఏడాది జూన్లో ఆయన ఎఎమ్గా బాధ్యతలు చేపట్టారు.ప్రభుత్వం ఆయనను హౌసింగ్ మేనేజర్గా పదోన్నతి కల్పించింది. త్వరలో ఏలూరు జిల్లా మేనేజర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల మండలంలో 4 పరీక్ష కేంద్రాలకు జిల్లా విద్యాశాఖ అధికారులను నియమించింది. కొలిమిగుండ్ల జడ్పీ పాఠశాలకు జయసుధ, సుబ్బలక్ష్మమ్మ, మోడల్ స్కూల్కు వెంకటేశ్వర రెడ్డి నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. అంకిరెడ్డి పలరామకోటి రెడ్డి లీల మాధురి తిమ్మనాయినిపేటకు పాండురంగారెడ్డి శంకర్ చీఫ్ డివోగా వ్యవహరిస్తారని MEO అబ్దుల్ కలాం తెలిపారు.
కృష్ణా: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదుసార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1984,89,98లో మచిలీపట్నం నుంచి, 2004,09లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.
VZM: బొబ్బిలి కమిషనర్ ఎల్.రామలక్ష్మి బుధవారం పట్టణంలోని స్దానిక పాతపోస్ట్ అఫీస్, వెలమవారివీధి, గాంధీ బొమ్మ అంబేద్కంర్ బొమ్మ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత పోస్ట్ ఆఫీసు ప్రాంతంలో అపారిశుద్ధ్యం పేరుకుపోవడంతో శానిటరీ సెక్రటరీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో చెత్త లేకుండా చూడాలని ఆదేశించారు.