• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు ఉగాది పురస్కారం

KRNL: నందవరం మండలం నాగలదిన్నె జడ్పీ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం-2026 వరించింది. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం చంద్రబాబు, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందారు.

March 19, 2026 / 10:12 PM IST

శాకాంబరీ దేవిగా గంగమ్మ అమ్మవారు

KDP: చింతకొమ్మదిన్నె మండలం కొత్తపేటలో ఉగాది సందర్భంగా గురువారం గంగమ్మ తల్లి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

March 19, 2026 / 10:02 PM IST

పొన్నూరులో రేపు ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమం

GNTR: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఈ-వేస్ట్ సేకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు తెలిపారు. ప్రజలు పాత ఎలక్ట్రానిక్ వస్తువులు అందజేసి స్వచ్ఛ పొన్నూరుకు సహకరించాలని కోరారు. ప్రతి నెల 10, 20 తేదీల్లో సేకరణ కొనసాగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

March 19, 2026 / 10:00 PM IST

‘గొర్రెల పెంపకం దారులకు ఆర్థిక సహకారం అందించాలి’

ప్రకాశం: కనిగిరి మండలం నల్లారెడ్డిపల్లిలో బుధవారం పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందిన విషయం విధితమే. జిల్లా జీఎంపీఎస్ ఉపాధ్యక్షులు ఖండే బాలకృష్ణ గురువారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతి చెందిన గొర్రెల పెంపకం దారులకు ఆర్థిక సహకారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జీవన ఆధారం కోల్పోయిన గొర్రెల పెంపకం దారులకు ప్రభుత్వం సహకారం అందించాలన్నారు.

March 19, 2026 / 10:00 PM IST

రైతులకు ఎటువంటి సాయం అందలేదు: కేతిరెడ్డి

సత్యసాయి: ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం గ్రామంలో అకాల వర్షం, ఈదురుగాలుల వల్ల ఐదు ఎకరాల అరటి పంట నేలకొరిగింది. రైతు రామ్మోహన్‌కు చెందిన తోటను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురువారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడుసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా రైతులకు ఎటువంటి సాయం అందలేదని విమర్శించారు.

March 19, 2026 / 09:00 PM IST

ఇప్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు

కోనసీమ: ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగ రంజాన్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేట కమ్మిరెడ్డి పాలెం మసీదులో గురువారం ఏర్పాటు చేసిన ఇప్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యానికి, సామాజిక ఐక్యతకు ప్రతీక ఇప్తార్ అని కొనియాడారు.

March 19, 2026 / 09:00 PM IST

మద్యం మత్తులో యువకుడు హల్‌చల్

KDP: బద్వేల్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో మూడు రోజులుగా హల్‌చల్ సృష్టించాడు. దర్గావీధిలో చిన్న పిల్లలపై కత్తితో దాడికి యత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిల్లలు ఇళ్లలో నుంచే బయటకు రాకుండా ఉండే పరిస్థితి నెలకొంది. దీంతో ఆగ్రహించిన స్థానిక యువకులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, కాళ్లు కట్టేసి మత్తు దిగే వరకు నీళ్లు పోశారు.

March 19, 2026 / 09:00 PM IST

బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు

NTR: నందిగామ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి సంబంధించి న్యాయవాదుల ఎన్నిక సందర్భంగా అభ్యర్థులు నామినేషన్లు గురువారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు ర్యాలీగా బయలుదేరి కోర్టు ఆవరణలో కమిషనర్ వద్దకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి కరిముల్లా, ఉపాధ్యక్ష పదవికి రామకృష్ణ, కార్యదర్శిగా రామారావు నామినేషన్లు సమర్పించారు.

March 19, 2026 / 09:00 PM IST

‘జీవో నెంబర్ 5ను రద్దు చెయ్యండి’

పార్వతీపురంలో 24 గంటలు షాపులు తెరిచి ఉంచే జీవో నంబరు-5ని రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ జీవో కార్మిక హక్కులకు విరుద్ధమని పేర్కొంది. గురువారం సుందరయ్య భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్మికులపై పని భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.

March 19, 2026 / 08:46 PM IST

మాజీ సీఎంకి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

ASR: ఢిల్లీలో కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కలిసి గిరిజన ప్రాంత సమస్యలను వివరించామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అరకు ఎంపీ తనూజరాణి తెలిపారు. అల్లూరి జిల్లాలో బాక్సైట్ తవ్వకాల చర్యలను ఆపాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. గురువారం ఆమె మాజీ సీఎంని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

March 19, 2026 / 08:44 PM IST

124వ రోజుకు చేరుకున్న దీక్షలు..!

KRNL: ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 124వ రోజుకు చేరాయి. ఈరోజు క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు పాలక, ప్రతిపక్ష నేతలు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 19, 2026 / 08:38 PM IST

ఈద్గా మైదానాన్ని పరిశీలించిన సిఐ సుబ్బరాయుడు

CTR: పుంగనూరు SS పేటలోని ఈద్గా మైదానాన్ని అంజుమన్ కమిటీ సభ్యులతో కలిసి సీఐ సుబ్బరాయుడు పరిశీలించారు. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక నమాజుల ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ప్రార్థనల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.

March 19, 2026 / 08:36 PM IST

ఏయూలో ఉగాది వేడుకలు

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర, ఆన్‌లైన్ విద్యా కేంద్రంలో ఉగాది సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ ఆచార్య నాయుడు మాట్లాడుతూ.. ఉద్యోగులందరూ కలిసి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. మహిళా సిబ్బంది వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

March 19, 2026 / 08:31 PM IST

అమ్మవారికి ప్రత్యేక పూజలు

PLD: శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలోని శ్రీ అడివి పేరంటాలమ్మ అమ్మవారి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.

March 19, 2026 / 08:30 PM IST

‘జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలి’

NDL: జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించాలని డోన్‌లో జర్నలిస్ట్ నాగరాజు గురువారం విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 25 వేల మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారికి పెన్షన్ పథకం అమలు చేయాలని, తమిళనాడు తరహాలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు.

March 19, 2026 / 08:30 PM IST