• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తెనాలి షరాఫ్ బజార్‌లో భారీ దొంగతనం

GNTR: తెనాలిలోని జ్యువెలరీ షాపులో బుధవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దుండగులు షాపు తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి,10 కేజీల వెండితో పాటు 10 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో టూ టౌన్ సీఐ రాములు నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఈ చోరీకి పాల్పడ్డారు.

March 12, 2026 / 11:52 AM IST

‘అధికారం ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతాం’

E.G: నిడదవోలు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ 16వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు YSR విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. అధికారం ఉన్నా లేకున్నా వైసీపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. వైసీపీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని కొనియాడారు.

March 12, 2026 / 11:49 AM IST

మర్కాపురం జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటు

ప్రకాశం: తర్లుపాడు మండలంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కలుజువ్వలపాడు, మంగళకుంటలో ఇప్పటికే 733 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించామని MRO కిషోర్ కుమార్ తెలిపారు. మరో 1,267 ఎకరాల వరకు సేకరించాలని ప్రతిపాదనలు పంపామన్నారు. చెన్నారెడ్డిపల్లి, జగన్నాథపురంతో పాటు మరో రెండు గ్రామాల్లో భూములను సేకరించాల్సి ఉందన్నారు.

March 12, 2026 / 11:47 AM IST

SVUలో ఏప్రిల్ 15 నుంచి పరీక్షలు ప్రారంభం

TPT: శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని M.P.Ed, B.P.Ed, D.P.Ed నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం తెలిపారు. పరీక్షలు ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, మదనపల్లె బీటీ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

March 12, 2026 / 11:47 AM IST

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

ప్రకాశం: వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి హాజరై మాట్లాడారు. వందకు వందశాతం ప్రజలకు హామీలు నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు.

March 12, 2026 / 11:43 AM IST

ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలు అరెస్ట్

చిత్తూరులో దొంగతనం కేసు ఛేదించారు. దుర్గానగర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. వారి నుంచి రూ. 34 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

March 12, 2026 / 11:42 AM IST

టమాటా రైతులకు మరో షాక్..!

అన్నమయ్య: రామసముద్రం మండలంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో వ్యవసాయ, ఉద్యానవన సేల్స్ టాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. పాత స్టాక్ పూర్తయ్యే వరకు పాత ధరలకే అమ్మాలని సూచించారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో కొత్త షీట్ ధర రోల్‌కు రూ. 250 రూ. 350 వరకు పెరగవచ్చని తెలిపారు.

March 12, 2026 / 11:37 AM IST

‘పేద ప్రజల సంక్షేమం కోసం వైసీపీ కృషి’

కోనసీమ: పేద ప్రజల సంక్షేమం కోసం వైసీపీ కృషి చేస్తుందని అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. ఆయన అమలాపురం మండలంలోని పేరూరు గ్రామంలో వైసీపీ నాయకులు గురువారం నిర్వహించిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొని దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు పంచారు.

March 12, 2026 / 11:36 AM IST

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఘనంగా నిర్వహించారు. 16వ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నాయకుల మధ్యన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

March 12, 2026 / 11:34 AM IST

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సీపీఐ వినతి

KRNL: పెద్దకడబూరులోని మండల పరిషత్ ఆఫీస్ ముందు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. సీపీఐ నేత వీరేష్, రైతు సంఘం నేత మబ్బు అంజినేయ మాట్లాడుతూ.. సంబంధిత అధికారుల ఆఫీసు ముందే పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి అస్తవ్యస్తంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని, సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు.

March 12, 2026 / 11:31 AM IST

రైతులకు భరోసా కల్పించిన జేసీ

NLR : బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలోని రైస్‌మిల్ యజమాని తమ వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి నగదు చెల్లించడం లేదని గత 2 రోజుల నుండి రైతులు నిరసన చేస్తున్నారు. విషయాన్ని స్థానిక ఆర్‌ఐ శాంతి ప్రియ ద్వారా తెలుసుకున్న జేసి వెంకటేశ్వర్లు రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రైస్‌మిల్ యజమాని మాట్లాడారు. విచారణ చేపట్టాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.

March 12, 2026 / 11:30 AM IST

శ్మశానాల కోసం ఉద్యమించడం సిగ్గుచేటు: సాకే హరి

సత్యసాయి: స్వతంత్ర భారతదేశంలో దళితులు శ్మశాన వాటికల కోసం పోరాడాల్సి రావడం అత్యంత సిగ్గుచేటని జేఏసీ నాయకుడు సాకే హరి ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిరలో నిర్వహించిన జీపుజాత కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళిత వాడలు సమస్యల నిలయాలుగా మారాయన్నారు. కనీసం మౌళిక వసతులు కల్పించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారని విమర్శించారు.

March 12, 2026 / 11:30 AM IST

డిగ్రీ కళాశాల పాలకవర్గం సభ్యులు మృతి

W.G: అత్తిలి ఎస్.వి.ఎస్.ఎస్ డిగ్రీ కళాశాల పాలకవర్గ సభ్యులు బసవ అర్జునరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. పాలకవర్గం అధ్యక్షులు దాసం గోవిందరావు, కార్యదర్శి మద్దాల వెంకటేశ్వరరావు తమ సంతాపాన్ని తెలిపారు. అర్జునరావు కళాశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని నివాళులు అర్పించారు. అత్తిలి ఏఎంసీ ఛైర్మన్ దాసం ప్రసాద్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

March 12, 2026 / 11:22 AM IST

రాజగోపాల్‌ రావు సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

ప్రముఖ రాజకీయ నేత బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు 103వ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని సెవెన్ రోడ్డు జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి గురువారం ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ గోపాల్‌ రావు గొప్ప రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారని తెలిపారు. వరుసగా ఆరు పర్యాయాలు శ్రీకాకుళం ఎంపీగా ప్రజలకు సేవలందించారన్నారు.

March 12, 2026 / 11:22 AM IST

YSR ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైసీపీ

KRNL: దివంగత సీఎం YSR ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైసీపీ అని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, బూత్ విభాగం తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దకడబూరులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో YSR ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.

March 12, 2026 / 11:21 AM IST