VZM: వాహన నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని SI రమేశ్ కోరారు. బొబ్బిలి పట్టణంలోని పాత డంపింగ్ యార్డు వద్ద ఆదివారం వాహనాలను తనిఖీ చేసి పాత చలానాలను కట్టించారు. వాహన నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని వాహనదారులను కోరారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్ బాలురలకు వాహనాలు ఇవ్వవద్దన్నారు.
విశాఖలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఇంటింటి సర్వేలో బతికున్న వారిని మృతులుగా నమోదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్మ చర్యలు తీసుకుని ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కొత్త రోడ్డు, రెల్లివీధి, దస్పల్ల హిల్స్ సచివాలయాలకు చెందిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
NDL: బేతంచెర్ల సంజీవ్ నగర్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో స్థానిక జట్టు ప్రథమ స్థానం సాధించింది. ప్యాపిలి జట్టు ద్వితీయ, గోనెగండ్ల తృతీయ, ఎం బాయ్ జట్టు నాలుగో స్థానాల్లో నిలిచాయి. విజేతలకు నగర పంచాయతీ ఛైర్మన్ చలం రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు.
NLR: మంత్రి ఆనం సోమవారం ఆత్మకూరులో నిర్వహించే పలు కార్యక్రమలలో పాల్గొంటారు. ఉదయం నెల్లూరులో కార్యక్రమాలు అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే P-4 ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గ ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2026-27 బడ్జెట్ వివరాలను శాఖల వారీగా అధికారులతో సమీక్షిస్తారు.
WG: పాలకొల్లు పెంకుళ్లపాడులో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు సోమవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మంత్రి నిమ్మల రామానాయుడు టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసి చూపించిందని మంత్రి పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్ జిమ్ దగ్గరలో పేకాట ఆడుతూ ఐదుగురు వ్యక్తులను పోలీసులకు తమకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు SI హరికృష్ణ ఆదివారం తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
సత్యసాయి: RDT సంస్థకు FCRA రెన్యూవల్ కోసం కృషి చేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు MLA బండారు శ్రావణి, ADCC బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి పాలాభిషేకం చేశారు. పేదలు, రైతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో విశేష సేవలందిస్తున్న RDTకి కూటమి ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ATP: అనంతపురంలోని జేఎన్టీయూ, ఎస్కేయూ విశ్వవిద్యాలయాలను ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప నేడు సందర్శించనున్నారు. తొలుత జేఎన్టీయూలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశమై ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్టీ సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఎస్కేయూ అధికారులతో భేటీ అయి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.
KRNL: కౌతాళం మండలం ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి ఆలయం ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక అలంకరణ దర్శనం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
TPT: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన ఓబులేషు (38) పలు పేర్లు మార్చుకుని ప్రజలను మోసం చేశాడు. సిగరెట్లు, చక్కెర హోల్సేల్ వ్యాపారం పేరుతో రూ.లక్ష పెట్టుబడికి రోజుకు రూ.3 వేలు ఇస్తానని నమ్మబలికి, తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో సుమారు రూ.8 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు అతన్ని ఇవాళ అరెస్ట్ చేశారు.
PPM: కొమరాడ మండలం దుగ్గి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది సోమవారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
SKLM: కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో బాలికలను మోసం చేసిన రమణ, రామిరెడ్డి, అలాగే సహకరించిన శాంతిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణ ఆదివారం తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రుల నిరంతరం పర్యవేక్షణ అవసరమని తెలిపారు.
AKP: ఎలమంచిలి సబ్ డివిజన్ పరిధిలో అభ్యుదయ రైతులు ఇవాళ ఉదయం విజ్ఞాన యాత్రకు బస్సులో బయలుదేరి వెళ్లారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి జండా ఊపి ప్రారంభించారు. పోలవరం జిల్లా పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు గురించి తెలుసుకుంటారని ఆమె పేర్కొన్నారు. రైతుల వెంట వ్యవసాయ అధికారులు మోహన్ రావు, సరోజినీ వెళ్లారన్నారు.
VSP: ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రథయాత్ర మహోత్సవం వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారిని రథంపై అధిష్ఠింపజేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం వంటి క్రతువులు చేశారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుమార్తె అతిధి గజపతిరాజు రథాన్ని ప్రారంభించారు.
తిరుపతి: చింతలచేను రోడ్డులోని మంజునాథ ట్రావెల్స్లో దారుణం జరిగింది. డ్రైవర్ సెల్వరాజ్ (55)ను క్లీనర్ గోపి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సెల్వరాజ్ తల వెనుక భాగంలో గోపి బలంగా కొట్టి ప్రాణాలు తీశాడని సమాచారం. హత్య అనంతరం నిందితుడు గోపి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.