కృష్ణా: కంకిపాడు హైవేపై ఫ్లైఓవర్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు గాయపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్లు ఢీకొనడంతో వారు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. కంకిపాడు, ఈడుపుగల్లు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరరుకున్నారు.
ప్రకాశం: రంజాన్ పర్వదిన సందర్భంగా శనివారం కొండపిలో ముస్లింలతో కలిసి సామూహిక ప్రార్ధనలలో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాదాసు వెంకయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సోదర భావనలతో సౌబ్రాతృత్వంలో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక వైసీపీ నాయకులు పలువురు ఉన్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శనివారం సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ జి.వి.ఆర్. శేఖర్తో కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కురువ పెటయ్య ఇవాళ ఆకస్మికంగా మృతిచందాడు. ఈ వార్త తెలిసి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి కె.రాజీవ్ రెడ్డి, మండల కన్వీనర్ బసిరెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పెటయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కోనసీమ: ఐ.పోలవరం(మం) మురముళ్లలో ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణానికి శనివారం కాకినాడకు చెందిన గమిడి వర ప్రసాద్ రూ.10 వేలు, హైదరాబాద్కి చెందిన చిలుకూరు సాయమ్మ రూ.10,116లు విరాళం ఆలయ అధికారులకు అందించారు. దాతలకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
E.G: గోపాలపురం నియోజవర్గం రామన్నగూడెం గ్రామపంచాయతీ దేవినేనివారి గూడెంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ద్వారకతిరుమల సొసైటీ ఛైర్మన్ పోలిన శ్రీనివాసరావు పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
CTR: కార్వేటి నగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రంజాన్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. స్థానిక మసీదులు, ప్రార్థన మందిరాలను పోలీసు సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి చాక్లెట్లు, పూలు పంపిణీ చేశారు. ప్రేమ ఆప్యాయతలను పంచుతూ.. సోదర భావాన్ని తెలియజేశారు.
KRNL: ఆదోని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవిత్ర ఉపవాసాలు, భక్తి ప్రార్థనలు, దువాలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక చింతన, కరుణాభావంతో రంజాన్ మహిమను గుర్తుచేసుకుంటూ ఐక్యత, సౌభ్రాతృత్వం ఆకాంక్షించారు.
ATP: పుట్లూరు(మం) ఎల్లుట్లలో అకాల వర్షం, గాలివానకు దెబ్బతిన్న అరటి తోటలను YCP మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం పరిశీలించారు. పంట కోత దశలో నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని తెలిపారు. బాధితులకు ధైర్యం చెప్పిన మహేశ్వర్ రెడ్డి, పంట నష్టం వివరాలను ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సత్యసాయి: పరిగి(మం) హైవే వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్ గుర్తులు గత మూడు రోజులుగా పడిపోయి ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన పరిగి చిన్నపల్లి గ్రామానికి చెందిన యువకులు శనివారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిగ్నల్ గుర్తులను సరిచేశారు. యువకుల ఈ సేవా భావాన్ని గ్రామ పెద్దలు అభినందించారు.
PPM: వీరఘట్టం మండలంలోని రేగులపాడు- య. వెంకమ్మరేట మధ్యలో సీఎస్పీ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేజ అనే యువతికి గాయాలయ్యాయి. తెట్టంగి గ్రామానికి చెందిన ఈ యువతి తన బంధువులతో కలిసి స్కూటీపై పార్వతీపురం వెళుతుండగా మార్గం మధ్యలో స్కూటీ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను వైద్య చికిత్సల కోసం వీరఘట్టంకు తరలించారు.
KKD: పిఠాపురంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ఫాస్ట్ ఫుడ్, మిఠాయి దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కమర్షియల్గా వినియోగిస్తున్న 4 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. వాణిజ్య అవసరాలకు ఇంటి సిలిండర్లను వాడడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
NTR: నందిగామ అశోక్నగర్ ఈద్గా ప్రాంగణంలో ఈద్-ఉల్-ఫితర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నమాజ్ చేశారు. ప్రార్థనల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
KDP: గోపవరం మండలంలోని గోపవరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర HP గ్యాస్ గోడౌన్ను బద్వేల్ RDO చంద్రమోహన్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులను పరిశీలించి, స్టాక్ ఎంత ఉందనే అంశాలపై ఆరాధీశారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలవకుండా సరఫరా చేయాలని సూచించారు. ఆయనతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ శివ శంకర్ ఉన్నారు.
AKP: సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలోని సీతారాముల వారి ఆలయంలో ధ్వజస్తంభం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, పెందుర్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అదీప్ రాజు పాల్గొన్నారు.