కోనసీమ: మండపేట పురపాలక సంఘం 2025-26 సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. మార్చి 31 అర్ధరాత్రి నాటి నివేదిక ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మండపేట రెండవ స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో వినుకొండ(పల్నాడు జిల్లా) ప్రథమ స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానంలో రాజం(విజయనగరం జిల్లా) నిలిచాయి.
KDP: బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామ సమీపంలో శ్రీదేవి భూదేవి సమేత ఆది చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం గరుడోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణ అధికారి రామలింగారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం హోమము అభిషేకం, అలాగే రాత్రికి గరుడ వాహన పూజలు ఉంటాయన్నారు. పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయని చెప్పారు.
AKP: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను బుధవారం నుంచి అమలులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో రాంబిల్లి మండలం పెదకలువలాపల్లి, వై.లోవ గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. సీఐటీయూ మండల కన్వీనర్ దేవుడు నాయుడు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చడం అన్యాయం అన్నారు.
SKLM: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో మందుబాబులు చల్లని బీర్లవైపుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి నెల నుంచి మద్యం కంటే బీర్లు ఎక్కువగా తాగుతున్నారు. జిల్లాలో నెలకు రూ.90 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుండగా, అందులో బీర్ల విక్రయాలే అధికంగా జరిగాయి. కాగా, జిల్లాలో 185 మద్యం షాపులు, 20 బార్లు ఉన్నాయి.
W.G: ఆచంటలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని కలెక్టర్ నాగరాణి బుధవారం ప్రారంభించారు. జిల్లాలోనే అత్యంత హంగులతో కార్యాలయం నిర్మించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీవో దాసిరాజు, జడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీపీ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ 35వ వార్డులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీతమ్మపేటలోని జనసేన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సమక్షంలో ఆ పార్టీ నేతలు జనసేనలో చేరారు. వార్డు అధ్యక్షుడు లెంక త్రినాధ్, కడవల రఘు ఆధ్వర్యంలో వైసీపీ యూత్ ప్రెసిడెంట్ గండిబోయిన చిన్నతో పాటు సుమారు 50 మంది యువకులు జనసేన కండువా కప్పుకున్నారు.
ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో పెర్రి ఇసుక రేవుపై మైనింగ్, రెవిన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడి నిర్వహించాయి. కొద్ది రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు వారు గుర్తించారు. ఈ సందర్భంగా ఐదు ట్రాక్టర్లు, పడవలను సీజ్ చేసినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కృష్ణా: గత ప్రభుత్వంలో వ్యవస్థలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిందని మాజీ CM జగన్పై MLA బోడె ప్రసాద్ విమర్శించారు. ఉయ్యూరు(M) చిన్న ఓగిరాలలో పెన్షన్లు పంపిణీ చేసి, రూ.30 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను బుధవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోనూ రూ.100 కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు.
PPM: బలిజిపేట మండలం నారాయణపురం గ్రామంలోని చేనేత కార్మికులు నేస్తున్న చీరలకు విదేశాల్లో మంచి గిరాకీ వచ్చేటట్టు తన వంతు కృషి చేస్తామని విజయ్ చంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేసే ధ్రువ పత్రాలను అందజేశారు.
గుంటూరు: పొన్నూరు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో మంజూరైన 14 స్పౌజ్ (విడో) పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. పెన్షన్ పొందిన వ్యక్తి మరణిస్తే భార్యకు వెంటనే పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఎమ్మెల్యేే వెంట అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ASR: రాజవొమ్మంగి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 8వ తేదీ (బుధవారం) జరుగుతుందని ఎంపీడీవో యాదగిరీశ్వరరావు తెలిపారు. ఎంపీపీ గోము వెంకట లక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగే ఈ సమీక్ష సమావేశానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో రావాలని ఎంపీడీవో కోరారు.
ATP: అనంతపురం రూరల్ పంచాయతీ సర్పంచ్ ఉదయ్ పదవీకాలం పూర్తి కావడంతో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయ్తో పాటు వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, పంచాయతీ అధికారులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధికి ఉదయ్ చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే కొనియాడారు.
ప్రకాశం: జరుగుమల్లి మండలం చిరుకూరపాడులో ఉపాధి హామీ పనులకు బుధవారం మంత్రి స్వామి భూమిపూజ నిర్వహించారు. మండలంలో ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనికి వచ్చే వారికి వేసవిలో ఎండలు అధికంగా ఉన్నందున వారికి తగు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజబాబు, మండల నాయకులు పాల్గొన్నారు.
ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ఒక నెల పింఛన్ తీసుకోకుంటే నిలిపివేసేవారని, కూటమి ప్రభుత్వంలో రెండు మూడు నెలలది కలిపి ఇస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
NLR: చేజర్ల మండలంలో స్వచ్ఛాంధ్రా-స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని బుధవారం ప్రారంభించారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే ఈ వాహనానికి చెత్త ఇచ్చి దానికి బదులుగా ఉపయోగకరమైన వస్తువులు తీసుకోవచ్చని టీడీపీ నాయకులు తెలిపారు. పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.