NLR: విడవలూరు మండలంలోని ముదివర్తి, అన్నారెడ్డిపాలెం, అలగానిపాడు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ విజయ కుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముదివర్తి సబ్ స్టేషన్ వద్ద 11/33 KV విద్యుత్ లైన్ల RDSS స్కీమ్ పనుల కారణంగా.. ఆక్వా, వ్యవసాయం, త్రాగునీటి కరెంట్ సరఫరా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామన్నారు.
ATP: ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల కోసం పని చేసేవారే నిజమైన నాయకులని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జిలతో ఆయన సమావేశమయ్యారు. సచివాలయాల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చొరవ చూపాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
TPT: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్గా ఎస్ఆర్ సుస్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ నియామకాలలో ఎంపికైన ఆమెకు ఇదే తొలి పోస్టింగ్ కావడం విశేషం. కార్యాలయంలో సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తానని సుస్మిత తెలిపారు.
E.G:కొవ్వూరు డివిజన్ పరిధిలో మంగళవారం నుంచి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ టీకాలు వేయనున్నట్లు డిప్యూటీ DMHO జె. సంధ్య ప్రకటనలో తెలిపారు. 14 నుంచి 15 ఏళ్ల లోపున్న 4,410 మంది బాలికలను ఇందుకోసం గుర్తించినట్లు చెప్పారు. అన్ని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
BPT: ఉప్పుటూరు గ్రామంలో టీడీపీ మైనారిటీ సెల్ సీనియర్ నాయకుడు హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి, రంజాన్ నెల యొక్క పవిత్రతను వివరించారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు.
కోనసీమ: రేపు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు వాడపాలెంలో మారెమ్మ అమ్మ వారి జాతర మహోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 9:30 గంటలకు వానపల్లి శ్రీ పళ్ళాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన వెంట కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.
VSP: విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ (VER) నీటి భద్రత ప్రణాళికపై మంగళవారం ఓ హోటల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ముఖ్యమంత్రి, పలువురు మంత్రుల మార్గదర్శకత్వంలో సింగపూర్, ఆస్ట్రేలియా సంస్థల సహకారంతో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.పెరుగుతున్న నీటి అవసరాలు, అంతర్జాతీయ నిర్వహణ పద్ధతులపై నిపుణులు చర్చించనున్నారన్నారు.
CTR: పలమనేరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 10 గంటలకు పట్టణం, మండల లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథ రెడ్డి చేతుల మీదుగా సైకిళ్లు అందజేయనున్నారు. కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, గాయపడిన వారిని అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో మార్చి 11వ తేదీన (బుధవారం) ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలు నిరుద్యోగులకు ఇంటర్వ్యూల నిర్వహిస్తాయని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
TPT: దివ్యాంగులు, వయోవృద్ధులకు జీవన పరికరాల పంపిణీ కోసం ఈ నెల 12న పిచ్చాటూరు, కేవీబీ పురం, సత్యవేడు ప్రాంతాల్లో నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నారు. పిచ్చాటూరు, కేవీబీ పురం శిబిరాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొననున్నారని ఎమ్మెల్యే కార్యలయం తెలిపింది. సంబంధిత పత్రాలతో దివ్యాంగులు, వయోవృద్ధులు హాజరుకావాలని కోరారు.
PLD: రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీవీ పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు.
E.G: తాళ్లపూడి మండలం పైడిమెట్ట లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి స్టేజ్ దగ్గర ఇటీవల జరిగిన షార్ట్ సర్క్యూట్ తో ట్రాన్స్ ఫార్మర్ దగ్ధమైంది. ఈ మేరకు నూతన ట్రాన్సఫర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.9 లక్షల 75 వేల చెక్కును కమిటీ సభ్యులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, రామకృష్ణ పాల్గొన్నారు.
PPM: ఎల్విన్పేట చెక్పోస్ట్ వద్ద సోమవారం ఎస్ఐ శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి వాహనాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి, నిబంధనలు పాటించని వాహనదారులకు చలానాలు విధించారు.
KRNL: నందవరం మండలం రాయచోటి గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్బుక్స్ పంపిణీ గ్రామ సభలో ఇవాళ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రైతులతో కలిసి భూమి సర్వే, సరిహద్దులను పరిశీలించి పట్టాదారు పాస్బుక్స్ను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు.