KRNL: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ, అంజి బాబు అన్నారు. శనివారం ఎమ్మిగనూరులో సుందరయ్య భవన్లో జరిగిన CPM సమావేశంలో కేంద్రం చట్టానికి కొత్త పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) వినతుల స్వీకరణను మరింత వేగవంతం చేసేందుకు ఇకపై మండల స్థాయిలోనే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాలను సందర్శించి, ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, సత్వరం పరిష్కారం చేయనున్నట్లు చెప్పారు.
PPM: కురుపాం మండలంలో జీలుగలు సేవించి ఆస్వస్థతకు గురైన పలువురికి తక్షణమే చికిత్స అందించినట్లు కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జీలుగల్లు సేవించి తీవ్రమైన విరేచనాలతో బాధపడుతున్న నలుగురు వ్యక్తులను స్థానిక పీహెచ్సీకి తరలించడం జరిగిందన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ సత్వరం స్పందించి సంబంధిత వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచనలు చేశారని స్పష్టం చేశారు.
చిత్తూరు 12వ వార్డు రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఏ.వాసుదేవ నాయుడు మృతికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ASR: కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలోని బాలరేవుల గ్రామ శివారులలో కోడిపందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని మంప ఎస్సై సీదరి శ్రీనివాస్ శనివారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి కోడిపందాలు శిబిరంపై దాడులు నిర్వహించగా, నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారన్నారు. రూ.300నగదు, 4 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గంలోని మండలాలకు అధ్యక్షులను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియమించామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కొత్త అధ్యక్షులను సన్మానిస్తూ, రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపును సీఎంకు కానుకగా అందిద్దామని తెలిపారు.
SKLM: కవిటి మండలం పుక్కలపాలెం తీరంలో ఇవాళ నిర్వహించిన సంక్రాంతి వనభోజన మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఉన్నత మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. ఆత్మీయ కలయికలతోనే ఐకమత్యం సాధ్యం అవుతుందన్నారు.
ELR: కొయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనికెల్లో భాగంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాల యజమానులను అదుపులకు తీసుకుని వారికి నెంబర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు.
పార్వతీపురం మండలం జిమ్మిడివలస గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. ఈ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపును తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కృష్ణా: ఉయ్యూరు పరిధిలోని గండిగుంటలో భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన లక్ష్మీ సందీప్ కుటుంబంతో కలిసి ఈ నెల 14న ఊరు వెళ్లారు. దింతో ఇంట్లో ఎవరూ లేరన్న విషయం దొంగలకు ఎలా తెలిసిందనే కోణంలో, SM అప్డేట్స్పై కూడా విచారణ సాగుతోంది. వ్యక్తిగత వివరాలు SMలో పంచుకోవద్దని, భద్రత చర్యలు తీసుకోవాలని CI టీవీవీ రామారావు సూచించారు.
KRNL: ఆదోనిలో ప్రధాన రవాణా మార్గమైన పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యపై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ ఇవాళ ఎంపీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. రోజూ వేలాది మంది ప్రయాణించే బ్రిడ్జిపై గోతులు,ఇనుప రాడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
VZM: అపరిచిత వ్యక్తులకు OTP చెప్పవద్దని, నకిలీ లింక్లు క్లిక్ చేయవద్దని గరివిడి ఎస్సై లోకేశ్వరరావు హెచ్చరించారు. శనివారం స్దానిక గొట్నందిలో నేరాలు, సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సామాజిక రుగ్మతలకు దూరంగా ఉంటూ నేరరహిత గ్రామాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
VSP: ఆనందపురం పరిధిలోని వెల్లంకి గ్రామంలో పేకాడుతున్న 16 మందిని సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.37,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఆనందపురం పోలీసులకు అప్పగించారు. అసాంఘిక కార్యకలాపాలపై వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలను కోరారు.
భూములు రీ సర్వే పక్కాగా జరగాలని రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీ పాతమేఘవరంలో జరుగుతున్న భూ రీ సర్వే పరిస్థితులను ఆయన శనివారం పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న సర్వేపై తహసీల్దార్ హేమసుందరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన డేటాను సరి చూశారు.
అనంతపురం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కంభం పట్టణానికి విచ్చేసిన కారణంగా, మార్కాపురం జిల్లా నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మార్కాపురం జిల్లా ఉపాధ్యక్షులు కిషోర్, కందులాపురం జడ్పీటీస కొత్తపల్లి శ్రీను శనివారం సాయంత్రం ఆయనను కలిసి మర్యాదపూర్వక గౌరవం చాటారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.