BPT: పేద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాపట్లలో వివిధ ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.
VSP: గాజువాకలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూటమి బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యాలపై నాయకులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు.
TPT: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గజవాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందుకు సాగుతుండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతూ ఉత్సవాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దాయి.
VZM: దేహదారుఢ్యంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఆదివారం రింగ్ రోడ్లో విశాల్ మార్ట్ పై అంతస్తులో నూతనంగా అత్యాధునికమైన పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
CTR: సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె ఎంపీపీ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో నిర్వాహకులు 100 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్కు రూ.1,00,000 విరాళాన్ని నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన దాత రాజశేఖర్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతకు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
AKP: జిల్లాలో రేపు పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఈ కారణంగా వీటిని రద్దు చేస్తున్నామన్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 14.7 లక్షలతో రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనను సమావేశం ఆమోదించడం జరిగిందని ఉమ్మడి ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ఆదివారం తెలిపారు. ఏలూరులో జడ్పీ సమావేశం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12.23 లక్షలతో సవరించిన బడ్జెట్ను ఆమోదించారు.
KRNL: ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల క్యాలెండరు టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి స్వాగతించారు. ఇవాళ మాట్లాడుతూ.. CM చంద్రబాబు, యువనేత లోకేశ్ నాయకత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఉద్యోగాల క్యాలెండర్ విడుదలతో నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు నెలకొన్నాయని పేర్కొన్నారు.
KDP: బద్వేల్ మండలం బయనపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి యువత సమావేశం జరిగింది. జిల్లా సేవాదళం అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు.
ASR: డుంబ్రిగూడ(M) అమలగూడలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం మండల నాయకులు, గసబ పంచాయతీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి మాట్లాడుతూ.. సొవ్వ పంచాయతీ దేముడు వలస జంక్షన్ నుంచి అమలగూడ వరకు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. గతంలో కొంత మేర రోడ్డు నిర్మించి మిగతా భాగం వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
CTR: గత ప్రభుత్వ హయాంలో కరోనా కాలాన్ని మినహాయిస్తే మూడేళ్ల పాటు నగరిని ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి రోజా చెప్పారు. తన నివాసంలో పుత్తూరు మున్సిపల్ కార్యవర్గ సభ్యులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు నగరిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
TPT: జిల్లా కలెక్టరేట్లో ఈనెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ అర్జీలను సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని కోరారు. Meekosam వెబ్సైట్,1100 ద్వారా కూడా ఫిర్యాదుల స్థితి తెలుసుకోవచ్చన్నారు.
కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అమలాపురం పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఎస్సైలు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
NTR: చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వరకుమార్ ఆధ్వర్యంలో సీఎస్ఐ చర్చిలో నిర్మించిన నూతన షెడ్డును ఆదివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో అభినందనీయమని అన్నారు.