సత్యసాయి: కువైట్లో అకాల మరణం చెందిన కదిరి వాసి మౌలాలి పార్థివదేహం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చొరవతో స్వగ్రామానికి చేరింది. మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ప్రభుత్వం, ఎంబసీ అధికారులతో మాట్లాడి కేవలం రెండు రోజుల్లోనే మృతదేహాన్ని ఇండియాకు తెప్పించారు. కడసారి చూపుకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.
అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ. 23 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్డీవో శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు.
KDP: పులివెందుల పట్టణంలోని నగరిగుట్ట, బాకరాపురం అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో బుధవారం సఖీ సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ సురేశ్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సఖీ సురక్ష ప్రయోజనాలు, లక్ష్యాలు, దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు, అలాగే మహిళలకు 3 రకాల ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా అందుతాయన్నారు.
VSP: బిగ్ బాస్ సీజన్-9 విజేత, విజయనగరం జిల్లా వాసి కళ్యాణ్ పడాల మంగళవారం మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంవీపీకాలనీలో గంటా నివాసంలో భేటీ అయ్యారు. బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచిన మొట్టమొదటి కామనర్గా కళ్యాణ్ రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందని గంటా పేర్కొన్నారు.
SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను ఇవాళ అమరావతిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అత్యంత వైభవంగా జరగనున్న రథసప్తమి వేడుకలకు మంత్రిని ఆహ్వానించారు. ఈ వేడుకలకు మంత్రి రూ. 2 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు మంత్రి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
KDP: కడపలో సంక్రాంతి పండుగ ముగిసినా సంబరాలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు. కడపలోని ఆమె నివాసంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మెగా చెక్కును ఆమె తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. దాదాపు 105 మంది లబ్ధిదారులకు రూ.1.13 కోట్ల చెక్కులను అందించినట్లు తెలిపారు.
PLD: చిలకలూరిపేట కొమ్మినేని ఆసుపత్రి డాక్టర్ వీరశంకర రావుకు టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం దక్కింది. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మంగళవారం ఆయన్ను ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందిస్తున్నందుకు ఈ గుర్తింపు వచ్చిందన్నారు. ఇది పల్నాడుకు గర్వకారణమని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందని డాక్టర్ తెలిపారు.
KDP: కమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయ ఛైర్మన్ కామిశెట్టి వెంకటరమణయ్య, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు.
ATP: శింగనమల నియోజకవర్గ వైసీపీ పరిశీలకుల సమావేశం ఇవాళ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇంఛార్జ్ సాకే శైలజానాథ్ పాల్గొని, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
VZM: నగర రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 40 ఏళ్లు, ఎత్తు 5 అడుగులు 4 అంగుళాలు ఉంటుందని సీఐ ఆర్వీఆర్కే.చౌదరి మంగళవారం తెలిపారు. మృతదేహంపై వైట్ బనియన్, నీలం షర్ట్ ఉన్నాయని చెప్పారు. కుడి నుదిటి, ఎడమ మోచేతిపై పుట్టుమచ్చలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
PLD: చేబ్రోలు మండలానికి చెందిన వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న ఐదుగురు అర్జిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 3,05,513 విలువైన చెక్కులను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. ప్రభుత్వ సహకారంతో లబ్ధిదారులు సకాలంలో వైద్య చికిత్సలు పొందగలుగుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
PPM: ప్రజలంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి కోరారు. మంగళవారం మొండెంఖల్లులో వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు. ప్రజలంతా తమ ఆరోగ్య పరీక్షలను ఈ శిబిరాలకు వచ్చి చేయించుకోవాలని సూచించారు.
E.G: దేవరపల్లి రోడ్డు రవాణా శాఖ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు రోడ్డు ప్రమాదాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు తక్షణం స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు.
ATP: నిరుపేదలకు విద్య, వైద్యం అందించే లక్ష్యంతో కళ్యాణదుర్గంలో ‘ఆరా ఇగ్నైట్స్’ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ సంస్థ లోగోను జిల్లా ఎస్పీ జగదీష్ కుమార్ ఆవిష్కరించారు. యూనియన్ బ్యాంక్ ఉద్యోగి లోకేష్ నెలకొల్పిన ఈ ట్రస్ట్ సేవలను ఎస్పీ అభినందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు, నిరుపేద రోగులకు అండగా నిలవడమే తమ ప్రధాన ఉద్దేశమని చైర్మన్ లోకేష్ తెలిపారు.
ATP: విధి నిర్వహణలో రెవెన్యూ, సర్వే ఉద్యోగులు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని అలాంటి వారికోసం ఆరోగ్య సంరక్షణ ప్రధానమని భావించి, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇంఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రారంభంలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు.