• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

SKLM: కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.

December 13, 2025 / 09:07 AM IST

గజపతినగరం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్

VZM: గజపతినగరం టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై వినతులు అందజేశారు. ప్రధానంగా కాలనీల్లో రోడ్లు కాలువలు ఏర్పాటుతో పాటు తాగునీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, లెంక చిన్నం నాయుడు పాల్గొన్నారు.

December 13, 2025 / 09:02 AM IST

ఈతకోటలో భారీ బీసీ బహిరంగ సభకు ఆహ్వానం

EG: బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 28న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈతకోట సెంటర్‌లో భారీ బీసీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు రావాలని రాష్ట్ర బీసీ నాయకుడు శ్రీరెడ్డి సుబ్రహ్మణ్యంని స్వగృహంలో కలిసి ఆహ్వానం అందించారు. పార్టీలకు అతీతంగా అన్ని బీసీ వర్గాలు, మహిళలు, యువత పాల్గొని ఐక్యతను చాటాలని వేదిక పిలుపునిచ్చింది.

December 13, 2025 / 08:44 AM IST

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు

సత్యసాయి: జిల్లా ఎస్పీ S.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి పరిగి మండలంలోని శాసనకోట గ్రామ సమీపంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పరిగి ఎస్సై రంగడు, సిబ్బంది కలిసి ఏడుగురు పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 34,500 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

December 13, 2025 / 08:40 AM IST

కన్న కూతురుపై లైంగిక దాడి.. యావజ్జీవ కారాగార శిక్ష

NLR: కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరం రుజువుకావడంతో నిందితుడు చల్లా దశరథకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై తెలిపారు. 2020లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురిని బైకుపై తీసుకెళ్లి నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలోని నిమ్మ తోటలో అత్యాచారం చేసినట్లు తెలిపారు.

December 13, 2025 / 08:40 AM IST

డాగ్ స్క్వాడ్‌‌తో ముమ్మర తనిఖీలు

SKLM: పలాస-కాశీబుగ్గలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, దుకాణాలు, పలు ప్రాంతాల్లో పోలీసులు జాగిలాల తో శుక్రవారం సాయంత్రం సీఐ రామకృష్ణ పర్యవేక్షణలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు తదితర మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి అన్నారు.

December 13, 2025 / 08:34 AM IST

వైసిపి రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా గోవిందు

AKP: వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నక్కపల్లి మండలానికి చెందిన సురకాసుల గోవిందు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. రైతు సమస్యలపై పోరాటం చేస్తానని గోవిందు ప్రకటించారు అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

December 13, 2025 / 08:34 AM IST

ఔరంగాబాద్‌లో సెల్ ఫోన్‌ల చోరీ నిందితుడు అరెస్ట్

EG: ఔరంగాబాద్‌ ఇసుక ర్యాంపులో శుక్రవారం మూడు సెల్‌ఫోన్లు దొంగిలించిన నిందితుడిని స్థానికులు పట్టుకున్నారు. వాడపల్లికి చెందిన పోలుమాటి సురేష్, అక్కడ నిద్రిస్తున్న యూపీకి చెందిన ఇసుక కార్మికుల ఫోన్లు చోరీ చేసి పారిపోతుండగా ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పాకా శ్యామ్‌ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు.

December 13, 2025 / 08:28 AM IST

‘ప్రజా దర్బార్‌ను గ్రామాల్లో నిర్వహించాలని యోచిస్తున్నాం’

కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. పెద్ద ఆవుటపల్లి గ్రామంలో నిన్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రస్తుతం క్లస్టర్ స్థాయికి తీసుకొచ్చామని అన్నారు.

December 13, 2025 / 08:28 AM IST

మదనపల్లెను వణికిస్తున్న చలి.!

అన్నమయ్య: మదనపల్లిను చలి వణికిస్తోంది. శుక్రవారం సాయంత్రం 3:30 గంటల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాత్రి 8:30 గంటలకే చలి ప్రజలను భయపెడుతోంది. మఫ్లర్లు, స్వెటర్లు, తలకు కుళ్లాయిలను వేసుకోకుండా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు 24°C ఉండగా రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 12°C ఉన్నయాని తెలిపారు.

December 13, 2025 / 08:27 AM IST

జిల్లాకు సంక్రాంతికి స్పెషల్ ట్రైన్

W.G: సంక్రాంతికి సొంత ఊర్లలకు వెళ్లాలనుకున్నా.. ఇప్పటికే పలు ట్రైన్ల సీట్లు ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైల్ సర్వీసులను జనవరిలో నడుపునున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-అనకాపల్లి-సికింద్రాబాద్‌కు 07041-42 నంబర్ గల ట్రైన్ ప్రతి ఆదివారం రాకపోకలు సాగిస్తాయని చెప్పారు.

December 13, 2025 / 08:25 AM IST

నేడు రామగిరి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి మండల కేంద్రంలో శనివారం పర్యటించనున్నట్లు టీడీపీ మండం నాయకులు తెలిపారు. శనివారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు చెప్పారు. కూటమి శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

December 13, 2025 / 08:24 AM IST

అజ్మీర్ దర్గాలో YCP నాయకులు ప్రత్యేక ప్రార్థనలు

ATP: గుత్తి YCP నాయకులు శుక్రవారం రాత్రి అజ్మీర్‌లోని హజరత్ ఖాజా గరీఫ్ నవాజ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. YCP ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు కటిక అన్వర్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మళ్ళీ సీఎం కావాలని, రాబోయే ఎన్నికలలో గుంతకల్లు ఎమ్మెల్యేగా వెంకటరామిరెడ్డి విజయం సాధించాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, దువాను చేశామన్నారు.

December 13, 2025 / 08:24 AM IST

YCP జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవుటాల రమణారెడ్డి

సత్యసాయి: YCP జిల్లా ప్రధాన కార్యదర్శిగా పుట్టపర్తి అసెంబ్లీకి చెందిన సీనియర్ నేత అవుటాల రమణారెడ్డి ఎంపిక అయ్యారు. ఆయనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం తాజాగా ప్రకటించింది. రమణారెడ్డి ఎంపిక పట్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

December 13, 2025 / 08:16 AM IST

రేపు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికలు

SKLM: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారుల ఎంపికలు ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ అధ్యక్షుడు చిట్టి నాగభూషణం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగానికి డిసెంబరు 31 నాటికి 18 ఏళ్ళు లోపు వయసుండే బాలబాలికలు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9441914214కు ఫోన్ చేయాలని సూచించారు.

December 13, 2025 / 08:15 AM IST