SKLM: మొదటి రోజే శత శాతం పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాలు వయసుగల పిల్లలు 1.55 లక్షల మంది ఉన్నారని వివరించారు.
కృష్ణా: తాడిగడపలో 432 మంది ఇంటి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అందజేసిన రూ. 2,50,000 సబ్సిడీ ధ్రువపత్రాలను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రజల ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
NLR: తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతులు సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని పీ. సత్యవాణి అన్నారు. బుధవారం పొదలకూరు మండల పరిధిలోని మరుపూరు గ్రామంలో జిల్లా దిత్వా తుఫాన్కు దెబ్బ తిన్న నారుమడి రైతులకు 80% సబ్సిడీపై వరి విత్తనాలను అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ కరప గ్రామంలో వాడ్రేవు నూకరాజు గుండుపోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రెసిడెంట్ పోలిశెట్టి తాతీలు ఆసరా చారిటబుల్ ట్రస్ట్కి తెలియజేశారు. వారు స్పందించి మరణించిన వ్యక్తి కుటుంబానికి రైసు 3000 రూపాయలు అందజేశారు. ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
W.G: పెనుగొండ టీటీడీ కళ్యాణ మండపం వద్ద బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 4వరకు విశాఖలో జరిగే సీఐటీయూ మహాసభల గోడ పత్రికలను కార్మికులు ఆవిష్కరించారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడారు. విశాఖ వేధికగా జరిగే సమావేశాలను కార్మికులు విజయవంతం చేయాలన్నారు.
SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాలలో 6 రహదారుల అభివృద్ధికి రూ.9.69 కోట్ల మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి సహకరించిన సీఎం చంద్రబాబు, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని GVJ ZPHS బాయ్స్ హైస్కూల్లో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలచైతన్య స్ఫూర్తి క్రీడల పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు ఉత్సాహంగా సాగిన ఈ పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. విజేతలకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే తాతయ్య తదితరులు బహుమతులు అందజేశారు.
ELR: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటూనే సమయం దొరికినప్పుడల్లా వివిధ శాఖల మంత్రులను కలుస్తూ ఏలూరు పరిధిలోని పెండింగ్ పనులను, అర్జీలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పనుల సాధనకు కృషి చేస్తున్నారు.
కృష్ణా: పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 44 మందికి CMRF ద్వారా వైద్య ఖర్చులకు రూ.40 లక్షలు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చెక్కులు అందచేశారు.
SKLM: రాష్ట్ర టాక్స్ ప్రాక్టీషనర్ కన్స్టెంట్ సంఘం (ఏపీ టీసీసీఏ) అధ్యక్షునిగా ఆమదాలవలస పట్టణానికి చెందిన బుడుమూరు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుధవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులు ఆయనను శాలువతో సత్కరించారు.
కోనసీమ: అల్లవరం పోలీస్ స్టేషన్ను అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులను పరిశీలించి, రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
SKLM: ప్రస్తుత సీజన్లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విశ్వనాధ్ గంగాధర్ అన్నారు. బుధవారం కాకరాపల్లి గ్రామంలో ఉచిత ఆరోగ్యశిభిరం నిర్వహించారు. తనిఖీలు చేసి మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు ఇంటికి వెళ్లి వ్యాధికి గల కారణాలను తెలుసుకున్నారు.
VSP: మధురవాడ వాంబే కాలనీ 5ఏ బ్లాక్ ఎస్ఎఫ్-4లో నివసించే జగదీష్ బుధవారం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మద్యపాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు విచారణ ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక సిరి సినిమా హాల్ సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రాంగణంలోని మరుగుదొడ్లు, ఇతర నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.
PPM: జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామ సమీపంలో గొర్రెపోతు పందేలు ఆడుతున్న 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై అనిష్ బుధవారం తెలిపారు. పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో స్పెషల్ బ్రాంచ్, సివిల్ పోలీసులు రైడ్స్ చేపట్టామని వారి వద్ద నుండి రెండు గొర్రెపోతులు, 1025 రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.