GNTR: పెదకాకాని హైవేపై శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించగా, శరీరం నుజ్జునుజ్జై భయంకరంగా మారింది. మృతదేహం ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా మారింది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు.
KDP: ఆర్జెడి హయాంలో ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, టీచర్ల బదిలీలు, ఎయిడెడ్ పోస్టుల భర్తీలో భారీగా అవినీతి జరుగుతోందని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ ఆరోపించారు. ఈ అవినీతిని ప్రశ్నించిన PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, మరో ముగ్గురిపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన శుక్రవారం కడపలో డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
కృష్ణా: ఒద్దులమెరక గ్రామంలో ఎస్.ఎస్ ట్యాంక్ను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందిన ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్), డీఈ (డిప్యూటీ ఇంజినీర్) శుక్రవారం సందర్శించారు. ట్యాంక్ ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వ సామర్థ్యం, మరమ్మతుల అవసరం తదితర అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.ట్యాంక్కు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
VSP: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను డిసెంబర్ 31న ముందుగానే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఆ రోజు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తారని చెప్పారు. పంపిణీ సజావుగా జరిగేందుకు డిసెంబర్ 30న నగదు డ్రా చేసేందుకు ఆదేశించినట్లు తెలిపారు.
విశాఖ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ-2026 శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “జర్నలిస్టులు వాస్తవ కథనాలు రాయాలి, కలం బలాన్ని సద్వినియోగం చేయాలి” అన్నారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, శిక్షణ, రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ తెలిపారు.
VSP: పర్యావరణహిత జీవనానికి పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ ఎంతో ఉపయోగకరమని నగర మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో గ్రీన్ క్లైమేట్ టీం రూపొందించిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను అన్ని విద్యా సంస్థలకు ఉచితంగా అందించి, పర్యావరణ దినోత్సవాల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు.
CTR: PGRS ఫిర్యాదుల పరిష్కారం త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో కే.మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన ఛాంబర్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా PGRS వినతుల పరిష్కారం, వివిధ కోర్టులకు సంబంధించిన కేసులపై, రిట్ పిటిషన్లపై జిల్లా అధికారులు, MROలతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు పాల్గొన్నారు.
CTR: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ ఐటీ వింగ్ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చేపడుతున్న కార్యక్రమాలను వివరించగా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ వింగ్ నాయకులు పాల్గొన్నారు.
W.G: తణుకు భాష్యం జోనల్ బాలికల స్పోర్ట్స్ మీట్ శుక్రవారం జడ్పీ హైస్కూలు ఆవరణలో ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. కార్యక్రమంలో భాష్యం జోన్ ఇన్ఛార్జి శ్రీమన్నారాయణ రెడ్డి, పాల్గొన్నారు.
W.G: నరసాపురం టీ.డీ.పీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను టీ.డీ.పీ నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, మత్స్య కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు, టీ.డీ.పీ కార్యనిర్వాహాక కార్యదర్శి కొవ్వలి మోహన్ నాయుడు సమస్యలు విని ఆర్జీలు స్వీకరించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ ప్రజలకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యే కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ATP: జిల్లాలో రాబోయే ఆరు నెలల్లో తక్కువ బరువు, ఎత్తు లేని పిల్లలు ఉండకూడదని కలెక్టర్ ఆనంద్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యంపై పర్యవేక్షణ పెంచాలని, తప్పుడు గణాంకాలు నమోదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ‘బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్’ పోస్టర్లను ఆవిష్కరించారు.
WG: టీ.డీ.పీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా తణుకు పట్టణానికి చెందిన బసవ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఇతర నాయకులు రామకృష్ణను అభినందించారు. గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తణుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు.
ప్రకాశం: సీపీఐ శత జయంతి వేడుకలను మార్కాపురం సీపీఐ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే.కాసిం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. దేశ అభ్యున్నతిలో సీపీఐ పాత్ర కీలకమని, అట్టడుగు వర్గాల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈగల్ విభాగం సంయుక్తంగా NDPS యాక్ట్ గురించి శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ రైటర్లకు,కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ అందించారు. NDPS కేసులో సమాచారం అందించినప్పటి నుంచి చార్జిషీట్ దాఖలు చేసే వరకు ఎస్సై నుండి పై అధికారి పాటించాల్సిన విధివిధానాల గురించి వివరించారు.