GNTR: బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంటాయని, ఈ సమయంలో భక్తులకు దర్శనం ఉండదని పేర్కొన్నారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరిగి దర్శనానికి అనుమతిస్తామన్నారు.
E.G: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా చందన నాగేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా పనిచేసిన నాగేశ్వర్కు పార్టీ బలోపేతంలో భాగంగా ఈ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు రాజానగరం నియోజకవర్గ పరిశీలకుడిగా కూడా ఆయన వ్యవహరించనున్నారు.
NLR: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్టులను రాష్ట్ర ప్రభుత్వంప్రకటించింది. ఈశ్వరమ్మ కందుకూరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం చంద్రబాబు నాయుడు, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు అవసరం విద్యార్థులకు నిరంతరం ఉంటుందని తెలిపారు.
W.G: నరసాపురంలోని వీరభవాని ఆలయ సమీపం వద్ద శనివారం రాత్రి పోలీసులు గంజాయి కలిగి ఉన్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నరసాపురానికి చెందిన పృథ్వి సాయి, శివకుమార్, పిచ్చుక ఉదయ్ కిరణ్, ఉండికి చెందిన కాలుకరస యేసు రాజును అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 1900 గ్రాముల గంజాయి, మూడు బైక్లు, రూ.4,000 నగదు, 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
VZM: ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి శనివారం చీపురుపల్లి డిగ్రీ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా త్వరలో విడుదల కానున్న తను నటించిన యూనివర్సిటీ సినిమాను ఆదరించాలని విద్యార్థులను, అధ్యాపకులను కోరారు. ఈ సినిమాలో విద్య పేద బడుగు, బలహీన వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందోనని ఆయన వివరించారు.
NLR: కందుకూరు సబ్ కలెక్టరేట్లో శనివారం గిరిజనుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కరేడు భూ సేకరణ పై నిరసనలు ప్రతిధ్వనించాయి. కరేడు లోని రామకృష్ణాపురం గిరిజన కాలనీని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమని స్థానికులు స్పష్టం చేశారు. 30 పోలీస్ యాక్ట్ నిర్బంధాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల అభ్యర్థనను పట్టించుకోవడం లేదని తెలిపారు.
SKLM: తీరప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులకు రాయితీపై 25 ఇంజన్లు, వలలు, ఇతర వేట పరికరాలు పంపిణీ చేశారు. రాయితీపై పరికరాలు అందజేసిన కూటమి ప్రభుత్వానికి మత్స్యకార ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: గుంటూరులో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్తో అయితే రూ.220కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.950 – 1020 మధ్య కొనసాగుతుంది. చేపల్లో బొచ్చ రూ.200, రాగండి రూ.180గా విక్రయిస్తున్నారు.
NLR: ఇండియా సిల్క్స్ కాంపిటేషన్ 2025 పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి 16 సంవత్సరాల 25 ఏళ్ల యువత అర్హులని తెలియజేశారు. ఈనెల 30వ తేదీ లోపు ఈ కేవైసీ, ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని. సిల్క్ ఇండియా డిజిటల్ హబ్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
PLD: జిల్లా ఆట్యా-పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ జట్ల ఎంపిక పోటీలు నేడు నకరికల్లులో జరుగుతాయని జిల్లా కార్యదర్శి రోహిత్ జోయల్ తెలిపారు. స్థానిక వంగ వెంకట్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎంపికైన జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు.
GNTR: తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలు జరుగునుంది. ఛైర్మన్ అభ్యర్థిగా కూటమి తరపున హరిప్రసాద్ పేరు ఖరారు అయింది. మొత్తం 11 డైరెక్టర్ స్థానాలకు టీడీపీ 6, జనసేన 4, బీజేపీ 1 స్థానానికి పోటీ చేయనున్నట్లు ఒప్పందం కుదిరింది. ఆదివారం ఉదయం టీడీపీ, జనసేన కార్యాలయాల నుంచి అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ATR: శెట్టూరు మండలంలోని ముద్దలాపురం గ్రామానికి చెందిన కురుబ ఈశ్వరప్ప (65) అనే వృద్ధుడు తన భార్య అంజినమ్మతో 25 ఏళ్లుగా మనస్పర్థలతో వేరుగా ఉంటున్నాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని ఈశ్వరప్ప, శనివారం ఉదయం తన పొలంలోని చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని అన్న కోడలు జ్యోతి గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చింది.
VSP: మద్యం సేవించి కారులో కూర్చున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖలోని మర్రిపాలెంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడిని హిందుస్తాన్ షిప్యార్డులో పనిచేస్తున్న సుఖదేవ్ స్వయిన్ (50)గా పోలీసులు గుర్తించారు. సుఖదేవ్ మర్రిపాలెంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్కు రోజూ వస్తుంటాడని స్థానికులు తెలిపారు.
VSP: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 3.75 కేజీల బంగారు ఆభరణాలు, రూ. 13.12 లక్షల నగదును రైల్వే పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగు తనిఖీ చేయగా బంగారం, నగదు బయటపడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రకాశం: జిల్లాలో గతవారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.220 ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 230 పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ. 10-20 వరకు పెరగడం గమనార్హం. అయితే, దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.