• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కేక్ కట్ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన మనవరాలు దక్ష జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తాడిపత్రిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులకు కేక్ తినిపించి మనవరాలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించారు.

December 10, 2025 / 01:31 PM IST

రిటైర్డ్ IAS తీరుపై గ్రామస్థుల ఆగ్రహం

NLR: కొవడలూరు (M) వెంకన్నపురంలో ఓ రిటైర్డ్ IAS అధికారి తీరు వివాదంగా మారింది. గ్రామంలో మహిళా సంక్షేమ, SC, BC, TTD భవనాలను ఆయన ప్రైవేటు వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామానికి వచ్చిన కలెక్టర్ హిమాన్షు శుక్లా వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు.

December 10, 2025 / 01:08 PM IST

పవిత్ర గోదావరి నది ఒడ్డున” సినీ సంగీత విభావరి” కార్యక్రమం.

E.G: సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ 8వ వార్షికోత్సవం డిసెంబర్ 14న రాజమండ్రి పవిత్ర గోదావరి నది ఒడ్డున ఆదివారం” సినీ సంగీత విభావరి “నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దొండపాటి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదురు విక్రమహాల్లో జరుగునుంది. ప్రముఖ పేరుగాంచిన గాయకులతో “త్రీస్వ రాగ సుధా తరంగణి “కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

December 10, 2025 / 01:06 PM IST

‘ఎన్నికలకు సమాయత్తం కండి’

SKLM: సరుబుజ్జిలి మండలం జనసేన కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలతో ఆమదాలవలస ఇన్‌ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీలలో సమస్యల పరిస్కారం దిశగా చర్యలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికలు, జనసేన సభ్యత్వ నమోదు వంటి వాటిపై చర్చించారు. సరుబుజ్జిలి మండలం జనసేన అధ్యక్షులు పైడి మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

December 10, 2025 / 01:06 PM IST

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉయ్యాలవాడ విద్యార్థి ఎంపిక

నంద్యాల: జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉయ్యాలవాడ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి దేవేంద్ర గౌడ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల చివరిలో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయన పాల్గొంటారని చెప్పారు. పీఈటీ ప్రతాప్, ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థిని అభినందించారు.

December 10, 2025 / 01:03 PM IST

చీరకు నిప్పు.. గాయాలతో చికిత్స పొందుతూ మృతి

NLR: ఇనుకూరుపేట మండలం, కొత్తూరులో వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన యనమల మస్తానమ్మ(70) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఈ నెల 5న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కాగా తీవ్ర గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మరణించింది.

December 10, 2025 / 01:02 PM IST

బస్టాండ్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

KRNL: బస్టాండ్‌ను కలెక్టర్ ఏ. సిరి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రిజర్వేషన్ కౌంటర్లు, టాయిలెట్లు, డార్మిటరీ, ఉచిత త్రాగునీటి కేంద్రం, షాపులు, హోటళ్లుతో పాటు భద్రతా విభాగాల పనితీరును ఆమె దగ్గరగా పరిశీలించారు. ప్రయాణీకులతో స్వయంగా మాట్లాడి సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బస్టాండ్‌లో శుభ్రత, సేవల నాణ్యత, భద్రతపై అధికారులకు సూచించారు.

December 10, 2025 / 12:58 PM IST

‘అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి’

కృష్ణా: ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు సీఐటీయూ అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ మహా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ, మొవ్వలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు దేవామణి, కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

December 10, 2025 / 12:56 PM IST

ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన MLA ధూళిపాళ్ల

GNTR: పెదకాకాని మండల పరిధిలోని పార్టీ కార్యాలయం వద్ద బుధవారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పలువురు అధికారులను పిలిపించి అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు.

December 10, 2025 / 12:53 PM IST

పేదల ఆరోగ్యంపై ప్రబుత్వానికి చిన్న చూపు తగదు

PPM: పేదల ఆరోగ్యంపై కూటమి ప్రబుత్వానికి చిన్న చూపు తగదని పాలకొండ మాజీ MLA కళావతి హితవు పలికారు. ఇవాళ పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేసిందని, ఈ ప్రబుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచించడం సరైన విధానం కాదన్నారు.

December 10, 2025 / 12:49 PM IST

‘రైతులకు అన్యాయం జరుగుతోంది’

PPM: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. బుధవారం సబ్ కలెక్టర్ పవర్కు వినతిపత్రం అందజేశారు. రైతులు పండించిన పంట దళారుల పాలవుతోందని వాపోయారు. ఈ మేరకు ఈ నెల 12న కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి నిరసన తెలియజేస్తామని తెలిపారు.

December 10, 2025 / 12:48 PM IST

టెక్కలిలో వైసీపీ ప్రజా ఉద్యమం

SKLM: టెక్కలిలో బుధవారం వైసీపీ ప్రజా ఉద్యమం జరిగింది. టెక్కలి ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్ తెలిపారు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో టెక్కలి ప్రజలు 50 వేల స్వచ్ఛంద సంతకాలు అందించారు. ప్రతులను జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు అందిస్తామని పేర్కొన్నారు.

December 10, 2025 / 12:44 PM IST

కావలిలో ఏపీ ఎన్జీఓల ఎన్నికలకు 11న నామినేషన్ల

NLR: AP నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కావలి తాలూకా యూనిట్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల కార్యక్రమం జరుగుతుందని ఎన్నికల అధికారి మల్లికార్జునరావు తెలిపారు. ఉద్యోగులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

December 10, 2025 / 12:43 PM IST

మైనారిటీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా లలిత జైన్ ఎంపిక

E.G: భారతీయ జనతా మైనారిటీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా లలిత్ జైన్ బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా బీజెపీ అధ్యక్షుడు పీక్కి నాగేంద్ర నుంచి ఉత్తర్వులు జైన్ అందుకున్నారు. ఈయన రాజమండ్రి వాసిగా మైనారిటీ విభాగంలో వివిధ విభాగాల్లో పనిచేసి పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఈ నియామకం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

December 10, 2025 / 12:42 PM IST

గుత్తిలో ఈ నెల 12న మండల సర్వసభ్య సమావేశం

ATP: గుత్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 12న సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ బుధవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 12న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని కావున సర్పంచులు, ఎంపీటీసీలు,తమ సమస్యలను ఈ సభ దృష్టిలో తీసుకురావాలని సూచించారు. అధికారులు, సిబ్బంది తప్పక హాజరు కావాలన్నారు.

December 10, 2025 / 12:40 PM IST