TPT: టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఐపీఎస్ అధికారి K.V. మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విశాఖ 16వ బెటాలియన్ ఎస్పీగా ఉన్న మురళీకృష్ణ బదిలీపై ఇక్కడికి రానున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును రిలీవ్ చేశారు.
TPT: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( TUDA ) పరిధిలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో నూతన లేఔట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సూళ్లూరుపేటలో ఏర్పాటు చేయనున్న లే అవుట్ స్థలాన్ని కమిషనర్ మౌర్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు.
ASR: కొయ్యూరు మండలంలోని మూలపేట పంచాయతీ జాజులబంధ గ్రామంలో మంగళవారం వైద్య ఏర్పాటు చేశామని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. గ్రామంలో పలువురు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఓ చిన్నారి మృతి చెందింది. దీంతో పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, డౌనూరు పీహెచ్సీ, సచివాలయ వైద్య సిబ్బంది హుటాహుటిన జాజులబంధ గ్రామాన్ని సందర్శించారు. పలువురికి వైద్య సేవలు అందించామన్నారు.
అన్నమయ్య: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం కడప-చెన్నై రహదారిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. కారులో వెళ్లేవారు సీటు బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.
NTR: విలువిద్యలో క్రీడాకాకులకు మరింత నైపుణ్యాలను తందించాలని జిల్లా కలెక్టర్ అక్ష్మీశ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వోల్గా ఆర్చరీ అకాడమీకి రూ. 1.16 లక్షల విలువైన ఆర్చరీ ఉపరణాలను అమరావతి బోటింగ్ క్లబ్ ప్రతినిధులు కలెక్టర్ చేతులమీదుగా అందించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఒలింపిక్ పతకం సాధనే లక్ష్యం చేసుకుని విలువిద్య నేర్చుకోవాలన్నారు.
ASR: భూముల రీసర్వే ప్రక్రియ జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ అభిషేక్ మంగళవారం ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని చెప్పారు. గ్రామసభలు నిర్వహించిన తర్వాత అందిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు మంగళవారం బీ.క్యాంపు 56వ, అరోర నగర్ 57వ సచివాలయాల్లో అకస్మిక తనిఖీ నిర్వహించారు. 56వ సచివాలయంలో వీఆర్ఏ, ప్లానింగ్ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం, ఎక్కడికి వెళ్ళారో మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయకపోవడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమయపాలన పాటించాలంటూ ఆదేశిస్తూ, ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు.
VSP: సమస్యల పరిష్కారం కోసమే మహానాడు నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ నెల 27 నుంచి కడప జిల్లాలో జరగనున్న మహానాడుకు ముందు, విశాఖ దక్షిణ నియోజకవర్గ మినీ మహానాడు మంగళవారం ఘనంగా జరిగింది. నియోజకవర్గం ఇంఛార్జ్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామన్నారు.
ATP: శింగనమల వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి శైలజానాథ్ పుట్లూరు మండలంలో మంగళవారం పర్యటించారు. మండల కేంద్రంలో వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
KRNL: మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో రిసర్వే ప్రాజెక్టుపై సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎన్నికైన సుంకేశ్వరి గ్రామంలోని గ్రామ సచివాలయంలో రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోన్న తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో కలిసి సమీక్షించారు. వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
KRNL: ఎమ్మిగనూరులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మంత్రి సత్య కుమార్ యాదవ్ అథిగా పాల్గొని రేపు ప్రారంభిస్తారని వైద్యాధికారులు తెలిపారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరవుతారని సబ్ కలెక్టర్ తెలిపారు.
KRNL: ఎమ్మిగనూరులో మంగళవారం మినీ మహానాడు నిర్వహించారు. MLA జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో KUDA ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా TDP అధ్యక్షుడు తిక్కారెడ్డి, MP నాగరాజు పాల్గొన్నారు. పలు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించారు. పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో కడపలో జరిగే మహానాడుకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ATP: శింగనమల మండలం కల్లుమడిలో మంగళవారం రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు, కార్మికుల పట్ల అత్యంత కర్కషంగా వ్యవహరిస్తున్నారన్నారు.
KRNL: పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్లో మంగళవారం టీడీపీ మహానాడు ఉత్సాహభరితంగా జరిగింది. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలోని మండలాలనుండి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. రైతు నాగయ్యకు నష్టపరిహారంగా ఆర్థిక సహాయం అందజేశారు.
VZM: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుండే యోగా పై పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు JC సేతు మాధవన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖపట్నంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమం లైవ్ ద్వారా ప్రసారం జరుగుతుందన్నారు.