VZM: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కింద రూ. 20 వేలు అందిస్తున్నాయి. జిల్లాలో అర్హులైన రైతులకు మూడవ విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నిధులను శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
VSP: జీవీఎంసీ 30వ వార్డు అఫీషియల్ కాలనీలో రూ.38 లక్షలతో బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేజీహెచ్ పెడియాట్రిక్స్ వార్డులో పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన రూ.80 లక్షల విలువైన ఐసీయూ పరికరాలను ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు
ELR: గత ఆర్ధిక ఏడాది వివిధ శాఖల ద్వారా రూ.18.45 కోట్ల విలువ గల 1013 ఉపాధి హామీ పనులు చేపట్టామని భీమడోలు ఎంపీడీవో పద్మావతి దేవి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రజా వేదిక పేర నిర్వహించారు. తనిఖీ కార్యక్రమాలను ఉపాధి హామీ పథకం సహాయ పధక సంచాలకులు శ్రీనివాస్ నిర్వహించారు.
E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం గురువారం విజయవంతంగా జరిగింది. స్థానిక GNR కళ్యాణ మండపంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ చిక్కాల సూరిబాబు, ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ, కార్యదర్శిగా ఏ.సూర్యచంద్ర రావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
KDP: చాపాడు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో రూ.2.40 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. స్కూల్ అభివృద్ధికి మినీ ట్రాన్స్ఫార్మర్, ఆటస్థలం అభివృద్ధి, స్టేజ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
అన్నమయ్య: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నూతన స్కౌట్ యూనిట్లను ప్రారంభించేందుకు మార్చి 31 వరకు గడువు ఉందని జిల్లా సెక్రటరీ M. నరసింహారెడ్డి తెలిపారు. కొత్తగా చేరాలనుకునే పాఠశాలల ప్రతినిధులు ఈనెల 13న మధ్యాహ్నం 1 గంటకు రాయచోటిలోని డైట్ (DIET) నందు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలి. రూ.381 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని పొందవచ్చన్నారు.
W.G: తాడేపల్లిగూడెం పుర దేవత బలుసులమ్మవారి జాతర ఉత్సవాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. తొలుత అమ్మవారికి కుంకుమ అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు కుటుంబ సభ్యులు జాతరకు రూ.5 లక్షలు తొలుత విరాళంగా ప్రకటించారు.
KRNL: ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తుడు నందవరం(మం) పెద్ద కొత్తలి సమీపంలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యాడు. అటుగా వెళ్తున్న ముగ్గురు పాత్రికేయులు గోవిందు, కుమార్, భీమన్న స్పందించి సీపీఆర్ చేయడంతో కొద్దిసేపటికి అతను స్పృహలోకి వచ్చాడు. అనంతరం తన పాదయాత్రను కొనసాగించాడు. పాత్రికేయులను స్థానికులు అభినందించారు.
ATP: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర కామర్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సెట్-I ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 5,223 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,937 మంది హాజరు కాగా, 286 మంది గైర్హాజరయ్యారని ఆయన వివరించారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం వీరంకిలాకులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను పామర్రు MLA వర్ల కుమార్ రాజా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHC సిబ్బంది పనితీరు, ల్యాబ్ పరికరాలు, రిజిస్టర్లు, సిబ్బందికి ఉన్న సౌకర్యాలను సమీక్షించారు. వైద్యులు రోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. రోగుల అభిప్రాయాలు తెలుసుకుని సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని చెప్పారు.
NLR: మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనలో భాగంగా బోగోలు మండలం కప్పరాల తిప్ప జాతీయ రహదారి వద్ద జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ శంకుస్థాపనకు బయలుదేరి వెళ్లారు.
BPT: సంతమగుళూరు మండలంలోని చవిటిపాలెంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మండల పార్టీ అధ్యక్షుడు చేవూరు వాసిరెడ్డి, మండల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తేలప్రోలు రమేష్తో కలిసి ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రకాశం: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మార్కాపురం జేసీ పి. శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో RWS, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, వాటి పరిష్కారం మార్గాల గురించి అధికారులను ఆరా తీశారు. సమస్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ATP: జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈ నెల 17న ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం కంప్యూటర్లపై పని చేయడం వల్ల జర్నలిస్టులకు కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.