GNTR: ఫిరంగిపురం మండలం వేములూరుపాడు వద్ద మంగళవారం బైక్ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఒక యువతికి తీవ్ర గాయాలయ్యాయి. నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్తుండగా బైక్కు కుక్క అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. కిందపడి అస్వస్థతకు గురైన బాధితురాలిని స్థానికులు 108 ద్వారా చికిత్స నిమిత్తం గుంటూరు GGHకి తరలించారు. ఈ ప్రమాదనికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: మెరకముడిదాం మండలంలో న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకుందాం అని మంగళవారం ఎస్సై లోకేష్ కుమార్ కోరారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని తెలిపారు.
VSP: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం విశాఖ జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అల్లిపురం, మెయిన్ రోడ్డు, పోర్టు ఏరియా, కంచర వీధి, పెదవాల్తేరు, బీచ్ రోడ్, పెందుర్తి, ఋషికొండ ప్రాంతాల్లోని వెంకటేశ్వర, జగన్నాథ, పాండురంగ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో రాత్రి నుంచే భక్తుల రద్దీ కనిపించింది.
పల్నాడు జిల్లాలో నేరాలు 13% తగ్గాయని ఎస్పీ కృష్ణారావు ఇవాళ తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గినప్పటికీ, రోడ్డు ప్రమాద మరణాలు 5% పెరగడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 9,078 కేసులు పరిష్కరించామని ఆయన వెల్లడించారు.
VZM: సబ్ ట్రెజరీలలో పెన్షన్దారుల సౌకర్యార్థం తగు ఏర్పాట్లు చేశామని జిల్లా ఖజానా అధికారి వి.నాగ మహేష్ మంగళవారం తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు, కుటుంబ పింఛనుదార్లు తమ లైఫ్ సర్టిఫికెట్లని జనవరి నుంచి ఫిబ్రవరి 28లోగా సమర్పించాలన్నారు.
CTR: కూటమి ప్రభుత్వంతో ఏపీ ట్రెండ్ మారిందని.. ఈ ఏడాదిలో గొప్ప విజయాలను సాధించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూటమి పాలనలో ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతంగా ఉందని మూలధన వ్యయం కూడా పెరిగిందన్నారు.
E.G: తిరువనంతపురంలో జరిగిన ‘మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ’లో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి మంగళవారం పాల్గొన్నారు. SBI, UBI, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్వయం సహాయక సంఘాలు (SHGs), ఆర్థిక మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల పనితీరుపై సమగ్ర సమీక్షతో పాటు ఆర్థిక -సామాజిక పరిస్థితిలను వివరించారు.
ASR: కొయ్యూరు సర్కిల్ కార్యాలయం, పోలీసు స్టేషన్, మంప పోలీస్ స్టేషన్లను చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులు గురించి ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న కేసులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సీఐ బీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మంగళవా ప్రారంభించారు. సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఐక్యతతో పనిచేసి రవాణా రంగ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కార్మికుల సంక్షేమం, ఉపాధి పెంపులో అసోసియేషన్ పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి దర్శనం ఏర్పాట్లు కల్పించి, స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలోని నూతన క్యూలైన్లను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. 300 పూల కుండీలు ఏర్పాటు చేయాలని, మనమిత్ర వాట్సాప్ సేవలను విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.
SKLM: పాలన సౌలభ్యం కోసమే పునర్వ్యవస్థీకరణ చేపట్టడం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నందిగాం మండలాన్ని టెక్కలి రెవెన్యూ డివిజన్లో కలిపినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. YCP ప్రభుత్వ హయాంలో అనాలోచిత కారణాలవలన నిపుణుల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
VSP: పాత గాజువాక జంక్షన్ వద్ద పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి జరిమానాలు విధించారు. హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బస్ స్టాప్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
VZM: బొబ్బిలి ఆలయ ప్రాంగణంలో శ్రీ వేణుగోపాలస్వామి రథం కోసం విరాళాలు అందించాలని ఎమ్మెల్యే బేబీ నాయన మంగళవారం దాతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్పందించిన బొబ్బిలి పట్టణం, చీపురుపల్లి వీధికి చెందిన నంది హరి ప్రకాష్ రూ.30,001, పాత బొబ్బిలికి చెందిన బెవర సురేష్ రూ3,337 విరాళం అందజేశారు.
W.G: నరసాపురంలో ప్రథమ శ్రేణి గ్రంథాలయాన్ని ఉమ్మడి ప.గో. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యలో నిలిచిపోయిన నూతన భవన నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఆర్డీవో దాసి రాజును కలిసి, గ్రంథాలయ నిర్వహణకు తాత్కాలికంగా అద్దె భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
NLR: బుచ్చిలోని స్థానిక KLR ఫంక్షన్ హాల్లో రేపు ఉదయం 10:30 గంటలకు పురపాలక సంఘ మాస్టర్ ప్లాన్పై అవగాహన సదస్సును ఏర్పాటు చేయనున్నామని కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడాతూ.. మాస్టర్ ప్లాన్ ద్వారా బుచ్చిరెడ్డిపాలెంకు అనేక లాభాలు చేకూరుతాయని చెప్పారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో పట్టణంలోని మేధావులు సదస్సులో పాల్గొని సూచనలు ఇవ్వాలని కోరారు.