CTR: తవణంపల్లె మండలంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఇవాళ పర్యటించనున్నట్టు టీడీపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్వారంగం అభివృద్ధి కోసం మూడు యూనిట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. వీటిని నలిసెట్టిపల్లెలో ఉదయం 10:30 గంటలకు MLA ప్రారంభిస్తారు. ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
TPT: మదనపల్లెకు చెందిన నరసింహులు గత నెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నర్సింహులను అతని స్నేహితుడు నాగరాజు చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హతమార్చి అక్కడే గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని ఇవాళ వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహిస్తారని సమాచారం.
CTR: పలమనేరు మొగిలి ఘాట్ రోడ్డులో మదనపల్లికు వెళుతున్న ఐచర్ వాహనం షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఇవాళ వేకువ జామున చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పలమనేరు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో.. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోతిరెడ్డిపాలేనికి చెందిన అంకెం రాజాపై చాలా కేసులు ఉన్నాయి. పేరుమోసిన రౌడీషీటర్ శ్రీకాంత్ గ్యాంగ్తో ఇతనికి లింకులు ఉన్నాయి. గంజాయి, కొట్లాట కేసుల్లో నిందితుడుడిగా ఉండటంతో పీడీ యాక్ట్ ప్రయోగించాలని ప్రభుత్వం ఆదేశింది. ఈ మేరకు కేసు నమోదు చేసి అతడిని జైలుకు పంపారు.
కడప నగరపాలక సంస్థలో YCPలో ఉన్న కార్పొరేటర్ల సంపూర్ణ మద్దతుతో పాక సురేశ్ను నూతన మేయర్గా నియమించినట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అధిష్టానం సూచనల మేరకు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించామని అందరి అభీష్టం మేరకు పాక సురేశ్ను మేయర్ అభ్యర్థిగా ఎన్నిక చేసినట్లు పేర్కొన్నారు.
ELR: ముసునూరులో బుధవారం రాత్రి మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని స్థానిక హరిజనవాడలో రూ.43 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అనంతరం రూ.20 లక్షలతో యాదవుల కమ్యూనిటీ హాలు నిర్మాణాన్ని ప్రారంభించారు.
తిరుపతి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు DEO కుమార్ తెలిపారు. మొత్తం 10 పరీక్ష కేంద్రాల్లో 1,011 మంది హాజరు కావాల్సి ఉండగా 919మంది పరీక్షలు రాశారు. తొలిరోజు 92 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో CCTV పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు, మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచారు.
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణలో 50 వేల సంతకాలు పూర్తయ్యాయి. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపేందుకు కానూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి మినీ వ్యాన్ను ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
SKLM: పాతపట్నం నీలకంఠేశ్వర స్వామి మార్గశిర మాసం మూడవ గురువారం సప్తమి తిదిన గురుదక్షిణామూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని తెల్లవారుజామునే అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం పుష్పాభిషేకం నిర్వహించారు. పాతపట్నంతోపాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అన్నమయ్య: జిల్లాలో సొంత భూములు కలిగిన భూయజమానులు జాయింట్ ఎల్పిఎం కోసం ఈ నెల 31 లోపు తప్పనిసరిగా సచివాలయాలు లేదా మీ -సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జేసీ ఆదర్శ రాజేంద్రన్ ప్రకటించారు. ప్రస్తుతం డిసెంబర్ 31 వరకు దరఖాస్తు రుసుం రూ. 50 మాత్రమే ఉండగా.. ఆ తర్వాత ఇది రూ. 550కి పెరుగుతుంది. భూ యజమానులు వెంటనే దరఖాస్తులు సమర్పించాలని JC సూచించారు.
KDP: ఉద్యాన రైతులకు బిందు సేద్యం ఒక వరమని, దీనిని ప్రతి రైతు వినియోగించుకొని లబ్ది పొందాలని APMIP PD వెంకటేశ్వర్లు అన్నారు. రైతులు డ్రిప్ పరికరాల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని, బుధవారం వేముల మండలంలో డ్రిప్ పరికరాలు అమర్చిన తోటలను పరిశీలించి, రైతులకు సలహాలు ఇచ్చారు. రైతులు తప్పకుండా రైతు భరోసా కేంద్రంలో డ్రిప్ పరికరాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: లీగల్ మెట్రాలజీ అధికారులు బుధవారం సాయంత్రం పాయకరావుపేటలో పలు రేషన్ డిపోలను తనిఖీ చేశారు. అనధికార తూనిక యంత్రాలతో నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. లింగాల తోట కాలనీ, మంగళవారం రోడ్డులో గల రేషన్ షాపుల డీలర్లు రేషన్ పంపిణీలు అవకతవకలకు పాల్పడుతున్న కారణంగా వారిపై కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ అనురాధ తెలిపారు.
విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం మూడో గురువారం పూజలు అర్ధరాత్రి మొదలయ్యాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు తొలి పూజ చేశారు. అర్ధరాత్రే వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ ప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు.
AKP: మునగపాక మండలం గణపర్తిలో ఈనెల 13వ తేదీన నిర్వహించే గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని ఎటువంటి తగాదాలు పడకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ ధనంజయరావు సూచించారు. ఇవాళ ఎస్సై ప్రసాద్ రావుతో కలిసి గ్రామంలో పర్యటించారు. తగాదాలు కారణంగా ఇప్పటికే గౌరీ పరమేశ్వరుల ఉత్సవం వాయిదా పడుతూ వస్తుందన్నారు. గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు.