GNTR: భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇకపై ప్రకృతి వ్యవసాయాన్ని తప్పనిసరి బోధనాంశంగా చేర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తు తరాలకు మరియు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ASR: మెనూ ప్రకారం విద్యార్ధులకు ఆహారం అందేలా చూడాలని అడ్డతీగల ఎంపీడీవో ఏవివి కుమార్ అన్నారు. సోమవారం అడ్డతీగల లోని జీటీడబ్ల్యూఏ (బాలికలు) పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఎంపీడీవో మాట్లాడారు. పుడ్ మెటీరియల్ రికార్డులు అప్డేట్గా ఉంచుకోవాలని వార్డెన్కు సూచించారు. అందుతున్న ఆహారం గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు.
PLD: వినుకొండ మండలంలోని విఠంరాజుపల్లి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కారు, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి వాహనంపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
KRNL: ఆదోనీని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రజా డిమాండును MLC బీటీ నాయుడు ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. స్థానికంగా జరుగుతున్న ఉద్యమాలు, దీక్షలు, సంఘాల పోరాటాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన, భౌగోళిక-పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆదోనీ జిల్లా హోదా ఇవ్వాలని అభ్యర్థించారు. ఆదోనీకి జిల్లా హోదాకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు.
KDP: వైసీపీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని వైసీపీ జిల్లా జనరల్ సెక్రెటరీ రాఘవ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని త్రిపురవరంలో పంచాయితీ కమిటీలు, అనుబంధ కమిటీల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మురళి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
TPT: సూళ్లూరుపేట పట్టణంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాఘవయ్య పేటకు చెందిన బాబు అనే వ్యక్తి తన సెల్ ఫోన్లో మాట్లాడుతూ గేటు దాటే క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. 108 సహాయంతో సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యా శాలకు తరలించి చికిత్స అందించారు.
E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెం బేతస్థ చర్చ్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ సోమవారం పాల్గొన్నారు. దైవజనులు ఆశీర్వాదాలు మంత్రికి అందించారు. ప్రతి ఒక్కరూ, పరస్పర ప్రేమ, సహనంతో ముందుకు సాగితేనే నిజమైన సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. 2024 ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏసు ప్రభువు చల్లని దయతోనే మంత్రి అయ్యానన్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు యువకులు భారత సైన్యంలో చేరిన సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి హాజరై మహేష్, సందీప్, ఫణి కుమార్ అనే యువ సైనిక అభ్యర్థులను అభినందించారు. దేశ రక్షణలో యువత ముందుకు రావడం రాయదుర్గం ప్రాంతానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.
VZM: జిల్లాలో ఉపాద్యాయ అర్హత పరీక్ష అక్టోబర్-2025కు సంబంధించి(ఏపీ టెట్) ఈనెల 10 నుండి 21 వరకు జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు సోమవారం తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12 గంటల వరకు, తిరిగి 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్ విధానం ద్వారా జరుగుతుందన్నారు. హాల్ టికెట్ తత్సాసంబంధమైన పత్రాలు ఉండాలన్నారు.
GNTR: జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో కలెక్టర్ స్క్రబ్ టైఫస్ నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, గ్రామ వార్డు సచివాలయాల సేవలతో సహా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ATP: కళ్యాణదుర్గంలో ఈ నెల 13న నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే స్వగృహానికి వచ్చిన హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు, పద్మావతి గోవిందరాజుల కల్యాణ మంటపంలో జరిగే సమ్మేళనానికి హాజరు కావాలని కోరారు.
TPT: శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్గా ఎన్నికైన రంగినేని చెంచయ్య నాయుడు శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రేణిగుంట టీడీపీ నాయకులను సోమవారం స్వయంగా రేణిగుంట వచ్చి ఆహ్వానించారు. మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చెంచయ్య నాయుడుకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ELR: పెదవేగి పరిధిలో ప్రమాదకర ప్రాంతమైన రాట్నాల కుంట మలుపు కేంద్రం వద్ద ఇవాళ కుంభాకార అద్దాలను సీఐ రాజశేఖర్ ఏర్పాటు చేశారు. సీఐ మాట్లాడుతూ.. ప్రమాదకరమైన మలుపుల వద్ద వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలను సులభంగా చూసేందుకు ఈ అద్దాలను ఏర్పాటు చేశామన్నారు. అతివేగంగా వస్తున్న వాహనాలను అంచనా వేయడానికి, తద్వారా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చన్నారు.
ASR: అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ధర, అత్యుత్తమ గుర్తింపు లభించేలా జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కాఫీ రైతులు, వ్యాపారులు, ఎఫ్పీఓలు, ఎన్జీవోలతో సోమవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. జిల్లాలో కాఫీ ట్రేడర్స్ అందరూ కలిసి ట్రేడర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తే, దానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు.
KRNL: కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో PGRS, స్వామిత్వ పథకం అమలు, వీధికుక్కల నియంత్రణ వంటి కీలక అంశాలపై జిల్లా కలెక్టర్ ఏ.సిరి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులు, సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.