TPT: వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ భవనంలో మాజీ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని 25 వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
సత్యసాయి: జిల్లాలో ‘పీ4’ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నిర్వహించనున్న వేడుకలపై కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరపాలని, మార్గదర్శులు, బంగారు కుటుంబాలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
ATP: గుత్తి బీజేపీ పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాయభయాన్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు అంకాల్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కార్యకర్తలు సేవాభావంతో పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
KRNL: ఆలూరులో మార్చి 28, 29 తేదీల్లో జరిగిన ఏఐటీయూసీ 21వ మహాసభలో నక్కి లెనిన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా ఉన్న లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ ద్వారా పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు.
NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం నిర్వహించిన 66వ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డైరెక్టర్ పి.షేక్షావలి రెడ్డి తెలిపారు. శిబిరానికి విచ్చేసిన 1000 మందికిపైగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మెడిసిన్, భోజన వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తండ్రి డా. దస్తగిరి రెడ్డి సహకారంతో ప్రజలకు సేవ చేయడం అదృష్టమన్నారు.
PLD: ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, అధికారం లేని సమయంలో కూడా తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గలేదని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మాచర్లలో ఆయన మాట్లాడుతూ.. రప్పా రప్పా అంటూ కూతలు కూస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
TPT: ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో జరగనున్న శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి TTD 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలను సిద్ధం చేసింది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-1లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు పాల్గొని లడ్డూల ప్యాకింగ్ విజయవంతంగా పూర్తి చేశారు.
KDP: సి.కె దిన్నె పరిధిలోని ఊటుకూరు సర్కిల్ వద్ద సి.ఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
KRNL: అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విమర్శించారు. ఆదివారం రాంపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రకటించిన అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడంలేదని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
సత్యసాయి: లేపాక్షి మండలం చోళ సముద్రం టోల్గేట్ వద్ద రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్ర సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలను పరిశీలించి పత్రాలు చెక్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు. శాంతి భద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
TPT: బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రవీణ్ ఎస్. నాయర్ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
KKD: కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. రౌతులపూడి మండలం, ములగపూడి గ్రామంలోని SC పేటలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నూతన పాఠశాలను ప్రారంభించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు.
ATP: కళ్యాణదుర్గాకి చెందిన శ్రీధర్ కుమార్తె నాగ కౌస్తుభ ఇంజినీరింగ్ చదువు కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం ప్రజావేదికలో స్థానిక కౌన్సిలర్ రాధికా రాణి సమక్షంలో కళాశాల ఫీజు నిమిత్తం ఈ మొత్తాన్ని విద్యార్థినికి అప్పగించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి పేద విద్యార్థులను ఆదుకోవడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
కోనసీమ: జిల్లాలో బెట్టింగ్ కి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ బుకీలు నిర్వాహకులపై ప్రత్యేక పోలీసు బృందాలతో నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ELR: ఉంగుటూరు మండలంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లలో ఆదివారం సెలవు అయినా రాత్రి అయినా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో పంచాయితీ అభివృద్ధి అధికారి కాకర్ల వెంకట గిరిధర్ ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను వసూళ్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సచివాలయ సిబ్బంది ఉన్నారు.