W.G: పాలకొల్లులోని శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ I, II, రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఇయర్ విద్యార్థినీ, విద్యార్ధులకు 2 రోజులు బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ టి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో రక్తదానం పట్ల అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితిల్లో బ్లడ్ గ్రూప్ సమాచారం ఎంత ముఖ్యమో వివరించారు.
ప్రకాశం: దర్శిలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఎస్ఎఫ్ఎ నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, P3 విధానాన్ని రద్దుచేసి మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వమే పూర్తి చేయాలని, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు డిమాండ్ చేశారు
W.G. భీమవరం మండలం గూట్లపాడు లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 3.O కి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనాగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలన్నారు.
ATP: గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రైల్వే కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 31న చలో విశాఖ పోస్టర్స్ ఆవిష్కరించారు. సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ.. రైల్వేలను ప్రైవేటీకరించొద్దు, రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి, రైల్వే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కోనసీమ: ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో బేతెస్థా ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ మొదటి శుక్రవారం క్రిస్మస్ పర్వదినాలు, వేడుకలు బేతెస్థాలో నిర్వహించుకోవడం సంతోషదాయకమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రపంచానికి ఏసు ప్రభువు ప్రేమ మార్గం చూపారన్నారు.
NLR: అల్లూరు మండలం నార్త్ మోపూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్- టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గొప్పతనం గురించి వివరించారు. ఇలాంటి సమావేశాల వల్ల విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు మధ్య బంధం ఏర్పడుతుందన్నారు.
KDP: పోరుమామిళ్ల (M) యరసాలలో మెగా PTM నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరచూ వచ్చే పిల్లల నడవడిక గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ MPTC రామభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఉపాధ్యాయుల అభ్యర్థన RO వాటర్ ఫిల్టర్ను బహూకరించారు. ఆయన సేవా కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
W.G: ఆకివీడు రైల్వేక్వార్టర్స్ సమీపంలో వాలీబాల్ ఆడుకుంటున్న ఐదవ తరగతి బాలుడు నమ్మి హర్ష ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైనట్లు స్థానికులు తెలిపారు. వాలీబాల్ ట్రాన్సఫార్మర్ పై పడటంతో దానిని తీసుకోవడానికి వెళ్లి పట్టుకోవడంతో ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్తో కాలిన గాయాలైన హర్షను చికిత్స నిమిత్తం వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: మార్కాపురం మండల పరిషత్ సమావేశపు హాల్లో శుక్రవారం డివిజనల్ లెవెల్ శిక్షణ తరగతుల కార్యక్రమం జరిగింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రజా ప్రతినిధులకు DLDO బాలు నాయక్ అవగాహన కల్పించారు. పంచాయతీ అధికారులు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు.
AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత మహిళా క్యాంటీన్ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. కేఎల్ పురం గ్రామానికి చెందిన ఓం సాయి డ్వాక్రా గ్రూపు సభ్యులు నిర్వహిస్తున్న క్యాంటీన్ అందరికీ ఉపయోగపడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రోగులు సహాయకులకు ఉపయోగపడే విధంగా క్యాంటీన్ నిర్వహణ ఉండాలన్నారు.
VZM: జిల్లాలోని వివిధ కోర్టు కాంప్లెక్సుల్లో 178 వాష్రూమ్ల వార్షిక శుభ్రత నిర్వహణకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత శుక్రవారం తెలిపారు. 18 మంది క్లీనింగ్ సిబ్బందితో ఈ కాంట్రాక్ట్ ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన వారు తమ కొటేషన్లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందించాలన్నారు.
NLR: గుడ్లూరు మండలం చేవూరు ZP హైస్కూల్లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్డే కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల పాల్గొన్నారు. హైస్కూల్లో జరుగుతున్న విద్యాబోధనపై విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలలో సానుకూల దృక్పథం కలిగేందుకు, పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఆయన అన్నారు.
VSP: మధురవాడ సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యమైంది. శుక్రవారం ఉదయం డి-మార్ట్ దగ్గర ప్రారంభమైన రద్దీ మొత్తం సర్వీస్ రోడ్డు పొడవునా వ్యాపించింది. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాని నగరవాసులు కోరుతున్నారు.
VZM: గంట్యాడ మండలంలోని కోటారబిల్లి జంక్షన్లో గల అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విమల రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం భవన పరిసరాలు పరిశీలించడంతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఆహార పదార్థాలు రుచి చూశారు. అంగన్వాడీ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో ఉమాభారతి, సిబ్బంది పాల్గొన్నారు.
W.G: నరసాపురం మహిళ సంఘం భవనంలో ఓ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత ఆక్యు పంక్చర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే జానకీ రామ్, డా. CH సత్యనారాయణ, శిరిగినీడి రాజ్యలక్ష్మి, జక్కం బాజ్జి ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల ఆక్యు పంక్చర్ వైద్యానికి ఆదరణ పెరుగుతుందన్నారు. ఎన్నో దీర్ఘకాలిక రోగాల నుంచి ఈ వైద్యంతో ఉపశమనం లభిస్తుందన్నారు