SKLM: ఎచ్చెర్ల మండలం పెయ్యలవానిపేట గ్రామంలో రోడ్డు పక్కనే పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సోమవారం జెసిబి సహాయంతో స్థానిక యువకులు తొలగించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో తమ సొంత నిధులతో ఈ పనులు చేపట్టడం జరిగిందని యువకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ASR: కొయ్యూరు మండలంలో ఆదివారం రాత్రి గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం పలకజీడి గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని చిన్నాభిన్నం చేసింది. వసతి గృహంలో ఇనుప రాడ్స్ అన్నీ విరిగిపోయి, పైకప్పు మొత్తం ఎగిరి పోయి, చెల్లాచెదురు అయ్యాయని వార్డెన్ రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగుమిల్లి, లక్ష్మీపురం, కొయ్యలగూడెం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు. అనంతరం కొయ్యలగూడెంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో బాలరాజు పాల్గొంటారన్నారు.
PPM: సీతంపేట మండలం దోనుబాయి పోలీస్ స్టేషన్లో మెగా వాలీబాల్ టోర్నీను ఆదివారం పాలకొండ డీఎస్పీ రాంబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి బహుమతి విజేతలకు రూ.5,000, 8 డ్రస్సులు, షీల్డ్ ఇవ్వడం జరుగుతుందని ఎస్సై ఎస్కే మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సీఐ చంద్రమౌళి, సీతంపేట ఎస్సై, అమ్మన్న రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ELR: టి.నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. శ్రీనును అరెస్ట్ చేసి, అతని వద్ద ఉన్న 6 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ చేసినా విక్రయించినా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ అశోక్ హెచ్చరించారు.
KRNL: డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.
కృష్ణా: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ కోరారు. వివిధ కారణాల దృష్ట్యా అంబేద్కర్ జయంతి వేడుకల ర్యాలీలకు గుడివాడ డివిజన్తో పాటు జిల్లావ్యాప్తంగా అనుమతులు లేవన్నారు. డీజేలు, మైక్ సెట్లను అనుమతించబోమని స్పష్టం చేశారు.
ATP: పామిడిలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ కంటి వైద్య చికిత్స శిబిరంలో ఆపరేషన్ చేయడానికి 106మందిని ఎంపిక చేశారు. బెంగుళూరు శంకర కంటి అస్పత్రి Dr.చిన 190మంది కళ్ళను పరీక్షించారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు Dr.తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో వాసవి కల్యాణ మండపంలో పరీక్షలు నిర్వహించారు. వీరికి బెంగుళూరు శంకర అస్పత్రి అన్ని వసతులు సమాకూర్చి ఆపరేషన్లు చేస్తారు.
NDL: జూపాడు బంగ్లా మండలం, తర్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వార్లను నంది కోట్కూరు మున్సిపల్ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకోని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సాయి కుమార్, పూజారులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమలో నాయకులు, కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.
VZM: విజయనగరం జమ్ము పడాల పేట, బేతని మిషన్ చర్చ్లో ఆదివారం ప్రసిద్ధ ఆధ్యాత్మిక బోధకులు డా.పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టల పండుగ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు హర్షాతిరేకాలతో హోసన్నా పాటలతో ర్యాలీ నిర్వహించి, ప్రభువైన యేసయ్య జయ ప్రవేశాన్ని స్మరించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థన నిర్వహించి దేశంలో శాంతి, సామరస్యం మరియు సమృద్ధి కోసం ప్రార్థించారు.
VSP: రాజ్యాంగ పరిరక్షణ మన లక్ష్యం అని సినీ నటుల ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రజానాట్య మండలి కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో త్యాగాలు చేసి మనకు రాజ్యాంగం తెచ్చిపెట్టారని, దాన్ని కాపాడుకోవాలని అన్నారు.
TPT: తిరుమల శ్రీవారిని అప్పట్లో నల్లరాయితో పోల్చిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు. ఆదివారం ఆయన టీటీడీ గోశాలను సందర్శించారు. నాస్తికుడైన భూమనకు గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేశారన్నారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలతో రాజకీయం చేయడం తగదన్నారు.
NDL: అవుకు మండలం కంబగిరి స్వామి ఫార్వేట ఉత్సవాలను ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. అవుకు మండలంలోని కునుకుంట్ల ఉప్పలపాడు గ్రామాలలో పారువేట ఉత్సవాలను గ్రామ పెద్దలు గూడాల మురళీధర్ రెడ్డి, ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేశారు. శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి విగ్రహాన్ని ఆయా గ్రామాలలో ఊరేగింపు నిర్వహించారు.
NDL: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవిలో శైలేశ్వరం జాతర, ఆదివారం సెలవు కావడంతో క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై బారులు తీరారు. ఉచిత దర్శనానికి 5 గంటలు, టికెట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
NDL: నందికోట్కూరు పట్టణంలోని ప్యారడైజ్ పంక్షన్ హాల్ నందు సోమవారం ఉదయం 10.00 గం.లకు అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఎమ్మెల్యే జయసూర్య అద్యక్షత నిర్వహించబడును. ఈ మేరకు అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రభుత్వ అధికారులు పాల్గొనాలని విజయవతం చేయాలని సమాచార ప్రతి నిధులు ఆదివారం పిలుపునిచ్చారు.