CTR: మన బలం బలగం జగనన్న అంటూ మాజీ మంత్రి ఆర్కేరోజా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణులతో తన నివాస కార్యాలయంలో ఆమె సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. YCP మనం తలదాచుకునే చెట్టులాంటిదన్నారు. ఆ చెట్టు పటిష్టంగా ఉంటేనే మనందరినీ రక్షించడంతో పాటు మనకు ఫలాలు అందిస్తుందన్నారు.
కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్, జాయింట్ అధితి సింగ్తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.
WG: తణుకులో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం సంచారశకటం ద్వారా ఇంటింటికి వైద్యం కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు డాక్టర్ హుస్సేస్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సిబ్బందితో కలిసి తణుకు, ముక్కామల, పైడిపర్రు ప్రాంతాల్లో పర్యటించి మంచానికే పరిమితమైన వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించ...
SKLM: పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఆదివారం కాశీబుగ్గ ట్రైనీ ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మహిళ తమ సెల్ఫోన్లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.
VSP: ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లాల ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, రమేష్బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు అందజేశారు.
CTR: వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 15న చేపట్టనున్న చలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి ఒక ప్రకటనలో ఆదివారం కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సేకరించిన కోటి సంతకాల దస్త్రాలను జిల్లా కేంద్రం నుంచి తిరుపతికి తరలించనున్నట్టు ఆయన చెప్పారు.ఉ 8 గంటలకు అయ్యప్ప గార్డెన్లో ర్యాలీ ప్రారంభమవుతుంది.
అర్ధవీడు మండలం గన్నేపల్లిలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బీడు పొలాల్లో పోట్లాడుతున్న రెండు ఎద్దులను విడదీయడానికి ప్రయత్నించిన యాజమాని షేక్ పెద్ద మహబూ (60)పై అవి దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BPT: జిల్లా ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
KRNL: కోడుమూరులోని గ్రంథాలయ సంస్థ స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదని వక్తలు హెచ్చరించారు. ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కబ్జాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ పట్టాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఉద్యమం తప్పదని తెలిపారు. గ్రామ పంచాయతీ, సంబంధిత అధికారులు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు.
PLD: నరసరావుపేటలో మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆదివారం అసిస్టెంట్ ఇంజనీర్ తెలిపారు. మహాత్మా గాంధీ హాస్పిటల్, పనసతోట, కుమ్మరి బజారు, పెద్ద మార్కెట్ ఏరియాలలో రేపు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంటు ఉండదు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో సీపీఐ సభ్యత నమోదుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సీపీఐ కార్యదర్శి సయ్యద్ యాసిన్ అన్నారు. ఆదివారం స్థానిక స్థానిక దర్శి చెంచయ్య భవనంలో సీపీఐ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న మార్కాపురంలో సీపీఐ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరగబోవు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
ATP: గుంతకల్లు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం భక్తుల దాతృత్వంతో మరింత శోభిల్లుతోంది. స్వామి వారి ఉత్సవమూర్తికి నిత్యం అభిషేకం నిర్వహించడానికి వీలుగా ఉపయోగపడే అభిషేక పీఠాన్ని దేవస్థానానికి సమర్పించారు. కసాపురం గ్రామానికి చెందిన దాతలు కొత్తకోట రామానుజ సుభాష్, శ్రీమతి పూర్ణ హరిణి కానుకను ఆలయ అధికారులకు సమర్పించారు.
BPT: మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్ ఛిద్రమవుతుందని చందోలు ఎస్సై శివకుమార్ చెప్పారు. ఆదివారం చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులు డ్రగ్స్ వినియోగంపై ఆయన అవగాహన కల్పించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్మిన, అక్రమంగా రవాణా చేసిన చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయన్నారు.
NLR: కావలి మండలం అల్లిగుంట పాలెం క్రాస్ రోడ్డు సమీపంలోని NH 16 పక్కన సుమారు 70-75 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధుడు మరణించాడు. దీంతో సర్వాయిపాలెం వీఆర్వో శ్రావణి గమనించి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేరకు ఎస్సై తిరుమల రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆకలి, దప్పిక లేదా అనారోగ్యంతో మరణించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
KDP: వల్లూరు మండలం పుష్పగిరిలోని చెన్నకేశవ ఆలయ గోడపై వామన, నరసింహ, వరాహ స్వాముల అరుదైన కుడ్య శిల్పాన్ని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ కనుగొన్నారు. దశావతారాల్లోని మూడు రూపాలను ఒకే చోట సూక్ష్మంగా చెక్కడం ఆనాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనమని ఆయన ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ శిల్పం ఎంతో విశిష్టమైనదని ఆయన కొనియాడారు.