• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్టలో మహిళ హత్య

KDP: ఒంటిమిట్ట మండలం గుటికాడిపల్లి గ్రామ శివారులోని మామిడి తోటలో మహిళ హత్యకు గురైంది. నాలుగు రోజులుగా తోటకు కాపలాగా ఉంటున్నానని చెప్పిన రాజంపేటకు చెందిన యానాది రమణ, అతని భార్య గుడిసెలో నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం గుడిసెలో రమణ భార్య తీవ్ర గాయాలతో, బట్టలు లేకుండా మృతిచెందినట్లు గుర్తించారు. నిందితుడిగా అనుమానిస్తున్న రమణ పరారీలో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 21, 2025 / 09:40 PM IST

కూచిపూడిలో వీరవాసరం చిన్నారుల రికార్డు

WG: గుడివాడలో నిర్వహించిన సనాతనభారతీయం నృత్యోత్సవం 2025 ప్రదర్శనలో వీరవాసరం చిన్నారులు సత్తా చాటారు. ఆదివారం నాట్యాచార్యుడు వినయ్ కృష్ణ వివరాలు వెల్లడించారు. కూచిపూడి ప్రదర్శనలో ప్రతిభ చూపి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారని తెలిపారు. విజేతలు కావ్య శ్రీనంద, దివ్యశ్రీ, లక్ష్య, డింపుల్కు నిర్వాహకులు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

December 21, 2025 / 09:14 PM IST

తవణంపల్లిలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

CTR: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తవణంపల్లి మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతి మధు కుమార్ పాల్గొని జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దిగువ తడకర గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

December 21, 2025 / 09:02 PM IST

విశాఖ నగరంలో ఫ్లెక్సీల వార్

విశాఖ నగరంలోని ఆదివారం ఫ్లెక్సీల వార్ చోటుచేసుకుంది. పోర్ట్ స్టేడియం ఎదురుగా వైసీపీకి చెందిన ఫ్లెక్సీలును రంగానాడు బృందం సభ్యులు తొలగించి తగలబెట్టారు. ఈనెల 26న బీచ్ రోడ్లో లక్ష మందితో రంగనాడు బహిరంగ సభ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రంగనాడుకు సంబంధించిన ఫ్లెక్సీలును వైసీపీ వర్గీయులు తొలగించడంతో తాము కుడా వైసీపీ ఫ్లెక్సీలు తొలగించామన్నారు.

December 21, 2025 / 08:55 PM IST

2,050 పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు

KDP: మైలవరం మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం అయినట్లు మైలవరం PHC వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో 2,803 పిల్లలకు గాను 2,050 (73.13 శాతం) పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు డాక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో CHO శ్రీనివాస్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

December 21, 2025 / 08:55 PM IST

రక్తదానం చేసిన వైసీపీ ఇంఛార్జ్

VZM: మాజీ సీఎం YS జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ డా.రాజేష్ తలే ఆధ్వ‌ర్యంలో అనాధాశ్రమాల్లో, హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు స్వయంగా తానే రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు.

December 21, 2025 / 08:48 PM IST

ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి ప్రథమ స్థానం

VZM: వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 20న విజయనగరంలో జిల్లా స్థాయిలో వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ఆర్ధన్నపాలెం ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పి.కీర్తిక ప్రథమ స్థానంలో నిలిచి రూ5 వేలు నగదు బహుమతిగా పొందినట్లు ప్రిన్సిపాల్ జీ.ప్రసన్నలక్ష్మి ఆదివారం తెలిపారు. అలాగే విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో విజయం పొందాలని ఆకాంక్షించారు.

December 21, 2025 / 08:46 PM IST

తాడేపల్లిగూడెంకు చేరిన యూరియా నిల్వలు

WG: తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు నాలుగు జిల్లాల అవసరాల కోసం ఆదివారం 2,600 టన్నుల యూరియా దిగుమతి అయిందని ఏడీఏ గంగాధర్ తెలిపారు. ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రైవేట్ డీలర్లకు 550 టన్నులు, మార్కెట్‌కు 300 టన్నులు కేటాయించినట్లు వివరించారు. మరో 255 టన్నుల యూరియాను ఇండియన్ పాటాష్ లిమిటెడ్ విడుదల చేసిందన్నారు.

December 21, 2025 / 08:45 PM IST

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జబీవుల్లా

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జబీవుల్లాను టీడీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. దీంతో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తల కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

December 21, 2025 / 08:42 PM IST

తెనాలిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

GNTR: తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం CI సాంబశివరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మసులుకోవాలని, ఎటువంటి నేరాల్లో పాల్గొన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతీ వారం జరిగే కౌన్సిలింగ్‌కు తప్పని సరిగా హాజరు కావాలని చెప్పారు. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండాలని ఆయన హెచ్చరించారు.

December 21, 2025 / 08:39 PM IST

రాఘవేంద్ర మఠం మాజీ ఉద్యోగి మృతి

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మాజీ ఉద్యోగి గురు ఆదివారం మృతి చెందారు. ఆయన మఠంలో ఎలక్ట్రిషియన్‌గా శాశ్వత ఉద్యోగిగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందారు. సేవలను గుర్తించిన మఠం యాజమాన్యం విరమణ అనంతరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మళ్లీ విధుల్లోకి తీసుకుంది. ఆయన మృతికి శ్రీ మఠం అధికారులు సంతాపం తెలిపారు.

December 21, 2025 / 08:38 PM IST

పుట్టపర్తిలో న్యూజిలాండ్ భక్తుల సందడి

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ భక్తులు ‘త్వమేవాహం’ అనే నాటకాన్ని ప్రదర్శించారు. ‘నీవు నేను ఒకటే’ అనే ప్రధానాంశంతో సాగిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయి కుల్వంత్ హాల్‌లో జరిగిన ఈ నాటకాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

December 21, 2025 / 08:37 PM IST

‘మహిళలు ఆత్మవిశ్వాసంతో రాణించాలి’

ATP: అనంతపురంలోని లలితకళా పరిషత్ వేదికగా నిర్వహించిన డిజిటల్ మహిళా సంఘం కార్యక్రమం మహిళా సాధికారతకు దిక్సూచిగా నిలిచింది. ఈ వేదికలో మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొని ప్రసంగించారు. డిజిటల్ యుగంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించే ఈ కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు.

December 21, 2025 / 08:37 PM IST

ఆపదలో ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయనిధి: MLA

కోనసీమ: అనారోగ్యంతో బాధపడే వారికి CMRF ఒక ఆపన్న హస్తమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఇటీవల ప్రైవేట్ హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 13 మందికి రూ.10,12,311 మంజూరు అయ్యాయి. ఆ చెక్కులను ఆదివారం సాయంత్రం బాధిత కుటుంబాలకు MLA అందజేశారు.

December 21, 2025 / 08:36 PM IST

‘సిటిజెన్ హ్యాక్’ విజేతలకు ఘన సన్మానం

VZM: విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత, సమస్య పరిష్కార దృక్పథమే భవిష్యత్తు భారత టెక్నాలజీకి బలమైన పునాదిగా మారుతుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. డిజిటల్ సమ్మిట్ 2025లో భాగంగా ముంజేరు క్యాంపస్‌లో నిర్వహించిన ‘సిటిజెన్ హ్యాక్’ హ్యాకథాన్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ హ్యాకథాన్లో ప్రతిభ కనబరిచి, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

December 21, 2025 / 08:33 PM IST