అన్నమయ్య: ప్రజల ఆకాంక్షల మేరకు మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన నూతన అన్నమయ్య జిల్లా అన్ని రకాల అభివృద్ధికి దారితీస్తుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అన్నమయ్య: జిల్లా పోలీస్ శాఖలో 37 ఏళ్ల నిర్దోష సేవల అనంతరం ఏఏవో త్రినాథ్ సత్యం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా రాయచోటిలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు.
KRNL: స్వతంత్ర సమరయోధుడు ముత్తుకూరు గౌడప్ప చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్లో బ్రిటిష్ గౌడప్పను ఉరితీసిన ఈరోజు రాత్రి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకుంటూ, వారి అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు.
NDL: ఎన్టీఆర్ భరోసా పథకం కింద బుధవారం నంద్యాల జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగిసింది. ఉదయం 7 నుంచే పంపిణీ ప్రారంభం కాగా, జిల్లాలో 94.13% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 2,13,630 మందికి గానూ 2,01,085 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.
W.G: కొత్త ఏడాది, కొత్త లక్ష్యాలు, కొత్త ఆశయాలతో ప్రజలంతా. కలకాలం ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. 2026లో ప్రతి ఇంటింటా ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలన్నారు.
విశాఖలో నూతన సంవత్సర వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, ఈవెంట్లలో అశ్లీలత, మాదకద్రవ్యాలకు తావులేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, 45 డెసిబెల్స్ లోపు శబ్దం, మైనర్లకు నో ఎంట్రీ వంటి నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. డ్రగ్స్ కనిపిస్తే 7995095799 ఫిర్యాదు చేయాలన్నారు.
KDP: సిద్ధవటం మండలంలోని కడప-చెన్నై జాతీయ రహదారి భాకరాపేట మలినేని పట్నం వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తికి బలమైన గాయాలు కాగా.. మెరుగైన వైద్య సేవల కోసం 108లో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి స్థానిక మండల పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మండపేట నియోజకవర్గ ప్రజలకుఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుటుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
SKLM: హిరమండలం మండలం తంప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ పరిశీలించారు. ఈ మేరకు పాఠశాల మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలపై ఉపాధ్యాయులతో వివరంగా చర్చించారు. విద్య సమాజ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుని విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తామని అన్నారు.
W.G: పేరుపాలెం బీచ్లో బుధవారం స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్లీన్-అప్ డ్రైవ్ కార్యక్రమాన్ని వైఎన్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నిర్వహించారు. ఎంపీడీవో త్రిశులపాణి, స్వచ్ఛాంద్ర జిల్లా కోఆర్డినేటర్ రోహిత్ విద్యానంద్ పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది చివరి రోజున సమాజానికి, పర్యావరణానికి తమ వంతుగా ఇతరులకు స్ఫూర్తి నింపుతూ క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.
CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వీకోట మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు బుధవారం సాయంత్రం తిరుపతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు రెడ్డప్ప, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, తదితరులు ఉన్నారు.
KDP: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరును అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం పార్టీ నాయకులు వరదరాజు రెడ్డితో ముందస్తుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేయించారు. నియోజకవర్గంలో ప్రధాన రోడ్ల విస్తరణ, తాగునీటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
AKP: నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత పరీక్షల మెటీరియల్ పంపిణీ చేశారు. ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తలుపులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాత ఇచ్చిన విరాళంతో మెటీరియల్ అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
GNTR: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు మల్లయ్య లింగం భవన్లో ఆత్మీయ సమావేశం జరిగింది. నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని, విస్తృత ప్రజా ఉద్యమాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో తాత్కాలిక అనౌన్సర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కనీసం ఏదైనా డిగ్రీతోపాటు స్వర మాధుర్యం, ఉచ్చారణలో స్పష్టత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి 21-50 ఏళ్ల మధ్య వారు అర్హులు. రాత పరీక్ష, స్వర పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 15వ తేదీలోగా వివరాలు పంపించాలన్నారు.