• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్

KDP: చెన్నూరు మండలం రామనపల్లిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. రైతులు దళారులకు కాకుండా, ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలని ఆయన సూచించారు. వరి సాగులో యూరియా వాడకం తగ్గించి, సమపాళ్ళలో పోషకాలు అందిస్తే అధిక దిగుబడి వస్తుందని తెలిపారు.

December 23, 2025 / 08:56 PM IST

మెదరమెట్ల హైస్కూల్లో పార్లమెంట్ ఎన్నికలు

బాపట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం చిల్డ్రన్స్ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులే ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహించి ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల్లో నిలబడిన విద్యార్థులకు తోటి విద్యార్థులు ఓట్లు వేసి పార్లమెంట్ అభ్యర్థిని ఎన్నుకున్నారు.

December 23, 2025 / 08:51 PM IST

డేగలహల్ గంజాయి తోట గుర్తింపు.. ఎస్పీ అభినందన

కర్నూలు: చిప్పగిరి మండలంలోని డేగలహల్ గ్రామంలో భారీగా సాగు చేస్తున్న గంజాయి తోటను గుర్తించిన పోలీసులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్సై సతీశ్ కుమార్‌తో పాటు సిబ్బంది ఖాదర్ బాషా, షబ్బీర్, శంకర్లకు ప్రశంసా పత్రాలు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుస్సేన్ పీరా, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఉన్నారు.

December 23, 2025 / 08:46 PM IST

బీపీసీఎల్ ప్లాంట్‌కి కేటాయించిన భూములను రద్దు చేయాలి’

VSP: బీపీసీఎల్ ప్లాంట్‌కి కేటాయించిన భూములను రద్దు చేయాలని కార్పొరేటర్ వెంకటసాయి అనూష డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను మంగళవారం కలిసి ఆమె వినతి పత్రం అందించారు. “ఉక్కు వాడ”గా పేరుగాంచిన గాజువాక ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బాట్లింగ్ ప్లాంట్‌కి కేటాయించిన భూములను రద్దు చేయాలన్నారు.

December 23, 2025 / 08:46 PM IST

క్రీస్తు సందేశం శాంతికి మార్గం: ఎమ్మెల్యే నరేంద్ర

BPP: బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలనీలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రేమ, కరుణ, సహనమే క్రైస్తవ మత సారాంశమని ఆయన పేర్కొంటూ, యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడతాయని అన్నారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

December 23, 2025 / 08:45 PM IST

ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ యాన్యువల్ మీట్ ముగింపు

ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ యాన్యువల్ మీట్ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఐదు రోజులుగా విజయవంతంగా జరిగిన క్రీడా పోటీలకు సహకరించిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు.

December 23, 2025 / 08:43 PM IST

ఎంఈవోకు వినతి పత్రం అందజేసిన ఎస్‌టీయూ నాయకులు

NTR: జగ్గయ్యపేట‌లోని ఉపాధ్యాయుల జీతాల బిల్లులు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డీ.ఈ.వో, ఎన్.టీ.ఆర్ వారి ఉత్తర్వుల మేరకు ఎమ్.ఆర్.సీ‌లోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో మాత్రమే చేయించాలని ఎస్‌టీయు నాయకులు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయులతో లేదా ఏ సంఘ సభ్యులతో కానీ బిల్లులు చేయించకూడదన్నారు. ఈ మేరకు STU నాయకులు MEO చిట్టిబాబుకు ఈరోజు వినతిపత్రం అందజేశారు.

December 23, 2025 / 08:43 PM IST

మహిళ మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో పాత కేసులను రీ-ఓపెన్ చేసిన పోలీసులు ఓ మిస్సింగ్ కేసును ఛేదించారు. 2012లో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుక్క కుమారి అదృశ్యమయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేసి సాంకేతిక ఆధారాలతో ఆమెను తెలంగాణలో గుర్తించారు. 13 ఏళ్ల తర్వాత ఆమెను క్షేమంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ టీ.కామేశ్వరరావు తెలిపారు.

December 23, 2025 / 08:42 PM IST

మహిళా భద్రతపై గ్రామాల్లో అవగాహన

సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామాలు, కాలనీల్లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణకు సంబంధించిన నూతన చట్టాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై వివరించారు. అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

December 23, 2025 / 08:41 PM IST

ఆర్ట్స్ పెయింటింగ్లను తిలకించిన మాజీ మంత్రి

NTR: విజయవాడలో ఫెవిక్రిట్, గాయత్రీ ఆర్ట్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ పొందిన మహిళలు రూపొందించిన ఆర్ట్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్లను మంగళవారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తిలకించారు. మహిళలచే రూపొందించబడిన ఈ  పెయింటింగ్లను అయన ఆసక్తిగా తిలకించి వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

December 23, 2025 / 08:39 PM IST

అదుపుతప్పిన బైక్ మహిళకు గాయాలు

W.G. ఆకివీడు మండలం అజ్జమురు అజ్జమూరు 100 ఎకరాల తూము వద్ద ఇవాళ రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి అద్వానంగా తయారవడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ అదుపుతప్పి కింద పడడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళాను స్థానిక ఆకివీడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు తరలించారు.

December 23, 2025 / 08:38 PM IST

బాలికల హైస్కూల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

NLR: మనుబోలు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో ఉన్నట్టుండి మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. పెద్ద శబ్దంతో స్విచ్ బోర్డులు పేలడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలోని అన్ని గదులకు విద్యుత్ సరఫరా ఉంది. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

December 23, 2025 / 08:35 PM IST

పొన్నూరులో ఎరువుల డీలర్లకు ADA హెచ్చరిక

గుంటూరు: ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు ADA వి.రామకోటేశ్వరి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ADA కార్యాలయంలో మండల పరిధిలోని ఎరువులు, పురుగు మందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాలని ఆదేశించారు.

December 23, 2025 / 08:34 PM IST

గుడివాడ‌లో పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు

కృష్ణా: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా గుడివాడ మార్కెట్ సెంటర్‌లోనే విగ్రహానికి పట్టణ ప్రముఖులు మంగళవారం పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన నేతగా పీవీ నరసింహారావు చిరస్థాయిలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్ రావు, ప్రసాద్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

December 23, 2025 / 08:32 PM IST

ఏలూరులో తాళం వేసిన ఇంట్లో దొంగతనం

ELR: ఏలూరు నగరంలోని చోడిదిబ్బ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి 20 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలు చింతల విజయలక్ష్మి రెండు రోజుల క్రితం విశాఖలోని కుమార్తె వద్దకు వెళ్లగా, ఇవాళ తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని నగలు మాయమైనట్లు గుర్తించి ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

December 23, 2025 / 08:23 PM IST