E.G: బీజేపీ ఎస్సీ మోర్చా తూ.గో జిల్లా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వోబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్య సాయిరాం పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలు, మెమెంటోలు పంపిణీ చేశారు. సాయిరాం మాట్లాడుతూ.. కార్మికులుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు పాల్గొన్నారు.
సత్యసాయి: జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్యాస్ డీలర్లను బుధవారం ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజులకు ఒకసారిగా నిర్ణయించినట్లు తెలిపారు.
NTR: గంపలగూడెం మండలం కనుమూరు గ్రామంలో అత్తునూరి నాగలక్ష్మికి రూ. 47 వేలు, కొమ్ము రాజేష్ కి రూ.50 వేలు విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటి వద్ద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాశం: ఇష్టపడి చదివి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని APUWJ రాష్ట్ర అధ్యక్షులు IV సుబ్బారావు విద్యార్థులకు సూచించారు. బుధవారం మార్కాపురంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల మహోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను ప్రారంభించారు. రోజురోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎంతో అవసరమన్నారు.
TPT: రాపూరు చెరువును రిజర్వాయర్గా అభివృద్ధి చేసి సోమశిల జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. ఈ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. అలాగే అర్హులైన పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అందిస్తున్నామని చెప్పారు.
KRNL: కోడుమూరు(మం) గోరంట్లలో శ్రీ లక్ష్మీ మాధవస్వామి తిరుణాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృశభాల బల ప్రదర్శన, ఎద్దుల బండలాగుడు కార్యక్రమాలను కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి ఇవాళ ప్రారంభించారు. గ్రామీణ సంప్రదాయాలను నిలబెట్టే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని MLA తెలిపారు. వృషభ యజమానులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలని సూచించారు.
విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సుస్థిర రసాయన శాస్త్రం-2026” అంశంపై జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో సుస్థిర రసాయన పరిశోధనల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై పలువురు శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
NDL: డోన్ పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. వైద్యాధికారి గ్రేసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, చర్మం, జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులను వైద్యులు పరీక్షించారు. రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ప్రజలు ఆయుర్వేద వైద్యం వినియోగించుకోవాలని సూచించారు.
NLR: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 22వ విడతగా రూ.18,640 కోట్లను ఈ నెల 13న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు శాస్త్రవేత్త డా. ప్రసాద్ బాబు బుధవారం తెలిపారు. చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
ATP: అనంతపురంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ 6వ రాష్ట్ర మహాసభలు కరపత్రాలను ఆవిష్కరించారు. మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రిలో మార్చి 16,17 తేదీలలో జరిగే ఈ మహాసభలు జరుగుతాయన్నారు. కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకునేందుకుగాను తలపెట్టిన ఈ మహాసభలు జయప్రదం చేయాలన్నారు.
E.G: ప్రతి రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు MLA, జిల్లా టీడీపీ అధ్యక్షుడు రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.
ELR: ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని MLC గోపిమూర్తి అన్నారు. బుధవారం నారాయణపురంలో యూటీఎఫ్ మండల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం అనే గోడపత్రికలను ఆవిష్కరించారు.
KRNL: అన్నదాత సుఖీభవ—పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సహాయం ఈ నెల 13న విడుదల కానుందని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన రైతులకు రూ.6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,72,757 మంది లబ్ధిదారులకు రూ.154.94 కోట్లు అందుతాయని వ్యవసాయ అధికారి వివరించారు.
KDP: పోరుమామిళ్ల(మం) తిరువెంగళాపురంలో సుజాత అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త గురుశేఖర్తో పాటు అత్తమామలు కలిసి హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడు రాజమండ్రిలో ఓ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.