SKLM: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాను నిర్వహిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని ప్రైవేట్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రకాశం: పొదిలి పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అధికారులు, నాయకులతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు.
NDL: ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బహిరంగ సభ జరిగింది. మండల అధ్యక్షురాలు బుడ్డా భాగ్యమ్మ అధ్యక్షతన డ్వామా పీడీ సూర్యనారాయణ, విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు పాల్గొన్నారు. 20 పంచాయతీల ఖర్చులపై చర్చించి, డీఆర్పీలు చేసిన సర్వే నివేదికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.
E.G: గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో పండిట్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ -2026 కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మండల ప్రశిక్షణలో కార్యపద్దతి కాలాంశం వక్తగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు కాలేపు సత్య సాయిరాం పాల్గొని మాట్లాడారు. పార్టీ కార్యాచరణ అంశాలు, దేశభక్తి, సాంస్కృతిక జాతీయ భావజాలాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలన్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన నగర కమిషనర్ బాలకృష్ణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 19 అజెండాలను ప్రవేశపెట్టారు. కౌన్సిల్ సభ్యులు 19 అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
PPM: గుమ్మలక్ష్మీపురంలో బెందాలం అశోక్ గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆదివాసి సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండించింది. మార్చి 26న జరిగిన ఘటనలో గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని పేర్కొంటూ, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే తదుపరి చర్యలు చేపడతామని హెచ్చరించింది.
ATP: కంబదూరు మండలం రాళ్ల అనంతపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులను క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.
గుంటూరు మహిళా ప్రాంగణానికి బ్యాంకు ఆఫ్ ఇండియా మహిళ ఉద్యోగులు రూ. 94 వేల విలువైన సామగ్రిని అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమకూర్చిన నిధులతో సీ.ఎస్.ఆర్ కార్యక్రమం క్రింద ఈ వితరణ జరిగింది. కుర్చీలు, మంచాలు, పడకలు, వాటర్ ప్యూరిఫైయర్లు వంటి అవసరమైన సామగ్రిని ప్రాంగణానికి అందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అదనపు ఎస్పీ సుప్రజ తెలిపారు.
KDP: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఉష్ణోగ్రతల పట్ల జాగ్రత్త వహించాలని డాక్టర్ శివకుమార్ తెలిపారు. సిద్ధవటం మండలం మాధవరం PHCలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీతారాముని కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులు అధిక ఉష్ణోగ్రత దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు, మజ్జిగ తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు. వడదెబ్బ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
SKLM: పాతపట్నం మండలంలోని లాభర గ్రామంలో ఉన్న రామాలయాన్ని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి మంగళవారం సందర్శించారు. ఈ మేరకు స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కమిటీ సభ్యులు దుశ్శాలువతో సత్కరించారు.
PDL: నకరికల్లు (మం) గుండ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దేవల్ల కోటేశ్వరరావు ఇటీవలె మృతి చెందారు. ఆయన కుటుంబానికి రూ. 5. లక్షల చెక్కును మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. కోటేశ్వరరావుకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో మంజూరైన రూ.5 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్లుగా కన్నా పేర్కొన్నారు.
PDL: నకరికల్లు (మం) గుండ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దేవల్ల కోటేశ్వరరావు ఇటీవలె మృతి చెందారు. ఆయన కుటుంబానికి రూ. 5.లక్షల చెక్కును మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. కోటేశ్వరరావుకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో మంజూరైన రూ.5 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్లుగా కన్నా పేర్కొన్నారు.
W.G: ఏప్రిల్ 7 నుంచి 16 తేదీ వరకు పెనుగొండ మండల వ్యాప్తంగా నిషేధిత భూముల జాబితాపై గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ జి. అనిత కుమారి తెలిపారు. 7న ఇలపర్రు, నడిపూడి, 8 న చిన్నమల్లం, వెంకట రామపురం, 9న మునమర్రు, దేవ, 10న తామరాడ, కొటాలపర్రు, 13 ములపర్రు, రామన్నపాలెం 15న వడలి, సిద్ధాంతం, 16న చెరుకువాడ, పెనుగొండ గ్రామాల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
TPT: తిరుపతి అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఖండించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో తిరుపతి వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భూముల కేటాయింపులు పారదర్శకంగా జరుగుతున్నాయని, హోటళ్ల నిర్మాణంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
NDL: ఏప్రిల్ 6, 7 తేదీల్లో నందికొట్కూరులో జరగనున్న ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పట్టణ కార్యదర్శి ధనుంజయ్ పిలుపునిచ్చారు. మంగళవారం నంద్యాలలోని జ్ఞానపురం, మూలసాగరం ప్రాంతాల్లో శానిటేషన్ కార్మికులతో సమావేశమై మహాసభలకు హాజరు కావాలని కోరారు. కార్మిక హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యత అవసరమని ఆయన పేర్కొన్నారు.