WG: మాగంటి అన్నపూర్ణా దేవి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహార కిట్లను గురువారం మధ్యాహ్నం పంపిణీ చేశారు. సుమారు 90 మంది విద్యార్థినులకు క్లబ్ నాయకులు అందచేశారు. క్లబ్ నెలా వారీ కార్యక్రమంలో భాగంగా ఈకార్యక్రమాలు చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు, ఉపాధ్యక్షులు పేరిచర్ల మురళి తెలిపారు.
KRNL: కర్నూలులో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో ఆదోని విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఫరూక్ గోల్డ్ మెడల్ సాధించగా, ఉదయ్ సిల్వర్ మెడల్, లోకేశ్ బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థుల ప్రతిభను అభినందించిన స్కూల్ కరస్పాండెంట్ బీసీ దుర్గేశ్.. కోచ్ల కృషిని ప్రశంసించారు.
ATP: గుత్తి మండలం చర్లపల్లి గ్రామంలోని చెన్రాయని బ్యాలెన్సీ రిజర్వాయర్ నుంచి గురువారం కాలువలకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నీటిని విడుదల చేశారు. ముందుగా అధికారులు, రైతులతో కలిసి రిజర్వాయర్లో గంగపూజ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు చేరే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు చొరవతో కొండేపి మండలానికి చెందిన ఓ వృద్ధుడి సమస్య పరిష్కార దిశగా పయనించింది. కొండేపి మండలంకు చెందిన హరి నారాయణ (65) ఎస్పీ మీకోసం కార్యక్రమంలో సమస్యను విన్నవించుకున్నాడు. సమీప బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలపగా.. ఎస్పీ ఆదేశాలతో కొండేపి ఎస్సై ప్రేమ్ కుమార్ వృద్ధుడి ఇంటికెళ్లి మాట్లాడారు.
ATP: యల్లనూరులో రేపు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. మండల సమస్యలు, వ్యక్తిగత సమస్యలను ప్రజలు అర్జీ రూపంలో సమర్పించి పరిష్కారం చేసుకోవచ్చని ఎమ్మెల్యే సిబ్బంది తెలిపారు. ఈ ప్రజా దర్బార్కు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రకాశం జిల్లా మెడికల్ ఆఫీసర్గా రేణుక గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు జిల్లా ఆరోగ్య కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఈ పదవిలో ఉన్న వెంకటేశ్వర్లు స్థానంలో రేణుక బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచడానికి కృషి చేస్తానన్నారు.
కోససీమ: విద్యార్థినిల రక్షణపై మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ సూచించారు. అమలాపురం సత్యసాయి కళ్యాణ మండపంలో గురువారం అమలాపురం డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఒంటరిగా ఉండే మహిళల రక్షణ, స్కూల్స్కి వెళ్లే ఆడపిల్లల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన వంటి అంశాల పట్ల శ్రద్ధ చూపాలన్నారు.
GNTR: బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. బాల్యవివాహాల అనర్థాలు తల్లిదండ్రులు గుర్తించాలని, బాల్యవివాహాలు లేని సమాజమే పురోగతికి దారి తీస్తుందని చెప్పారు. బాల్య వివాహ ముక్త్ భారత్ (BVM B) వంద రోజుల ప్రచారంపై కలెక్టరేట్లో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
KRNL: హలహార్వి మండలం గుళ్యం గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించే గాదిలింగప్ప తాత పూల తేరు ఉత్సవం కోసం TDP ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి రూ.10,000 విరాళాన్ని గురువారం అందించారు. గ్రామ ప్రజల ఆచార–సంస్కృతులను కాపాడే ఇటువంటి ఉత్సవాలు సామాజిక సమైక్యతకు దారితీస్తాయని పేర్కొన్నారు. ఉత్సవం విజయవంతంగా జరిగేలా అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు.
ELR: ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ డార్మిటరీ భవనాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. నిర్మాణంలో చేపట్టవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సంబంధిత కాంట్రాక్టర్కు, అధికారులకు తగిన సూచనలు చేసారు
ATP: బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజి మాల దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం చిన్నారుల హాజరు పట్టికను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు మోను ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గురువారం నగరంలో పలు ఆలయాల్లో జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరింపేటలోని శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని ఉదయం దర్శించుకున్నారు. శ్రీ దక్షిణామూర్తి ఆలయ 21వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రముఖ ప్రవచన కర్త రాధా మనోహర్ దాస్ను స్థానిక ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
KKD: ప్రత్తిపాడు మండలం వొమ్మంగిలో గ్రామంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2025 గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, దైవజనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
KRNL: ఆదోని పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షక ఫ్యూయల్ పెట్రోల్ బంకును గురువారం DIG ప్రవీణ్ కుమార్, SP విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వినియోగదారులకు కల్తీ లేని, నాణ్యమైన పెట్రోల్ అందించడమే లక్ష్యంగా బంక్ ఏర్పాటు చేశామన్నారు. ఈ పెట్రోల్ బంక్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పోలీస్ సంక్షేమ నిధికి వినియోగిస్తున్నామని వెల్లడించారు.
WG: యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరల్ జూబిలీ సావనీరు కలక్టరేట్లో గురువారం కలెక్టర్ నాగరాణి ఆవిష్కరించారు. భీమవరం యూనిట్ దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద యూనిట్గా అభివృద్ధి చేసినందుకు కార్యవర్గాన్ని అభినందించారు. ట్రెక్కింగ్, రాఫ్టింగ్, హైకింగ్, పారా గ్రైండింగ్, రాఖ్ క్లైమ్బింగ్ వంటి అడ్వెంచర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని యూనిట్ ఛైర్మన్ తెలిపారు.