• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో స్పందించిన అధికారులు

PPM: కొమరాడ మండలం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని డీ.సీ.హెచ్.ఎస్.సూపరింటెండెంట్‌కు ఆదేశించారు. తీవ్రగాయాలైన ఇద్దరు క్షతగాత్రులను విశాఖ కే.జీ.హెచ్‌కు తరలించారు.

January 15, 2026 / 09:01 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

ప్రకాశం: కొత్తపట్నం వెళ్లే దారిలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అల్లూరు నుంచి కొత్తపట్నం వెళ్లే దారివైపు తొట్టెంపూడి కోటేశ్వరరావు అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో కోటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందారని, పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

January 15, 2026 / 08:53 PM IST

పార్టీ బలోపేతమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే

NDL: గ్రామ వార్డు కమిటీలతో పాటు అనుబంధ విభాగాల కమిటీ నియామకాలను త్వరితగతిన పూర్తి చేసి వైసీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూరులో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం అందరూ ఐకమత్యంతో పని చేయాలని ఆయన కోరారు.

January 15, 2026 / 08:45 PM IST

‘జర్నలిస్టుల అక్రమ అరెస్టు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం’

EG: హైదరాబాద్‌లో జర్నలిస్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలను జర్నలిస్టు డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (JDRF) తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన రాజమండ్రిలో మాట్లాడారు. జర్నలిస్టులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి తీవ్రవాదులా అరెస్ట్ చేశారని అన్నారు.

January 15, 2026 / 08:41 PM IST

పమిడిముక్కలలో హైటెక్ కోడిపందాల బరులు

కృష్ణా: పమిడిముక్కల (M) హనుమంతపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైటెక్ అంగులతో కోడిపందేల బరులు నిర్వహించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కుర్చీల ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానుల కోసం రెండు కార్వాన్ వాహనాలు, ఏసీ గుడారాలు, ఎల్సీడీ తెరలు ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీల సౌలభ్యం కోసం యూపీఐ సెంటర్‌ను  ఏర్పాటు చేశారు.

January 15, 2026 / 08:39 PM IST

నగరంలో యువకుడి కిడ్నాప్ కలకలం

GNTR: నగరంలోని పట్టాభిపురం పరిధిలో ఓ మైనారిటీ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. హైమ హాస్పిటల్ వద్ద దుండగులు యువకుడిని బలవంతంగా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సంక్రాంతి పండుగ వేళ ఈ ఘటన వెలుగుచూసింది. యువకుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

January 15, 2026 / 08:33 PM IST

NH 216పై వాహన తనిఖీలు

BPT: పిట్టలవానిపాలెం NH 216 రహదారిపై గురువారం చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహన పత్రాలను పరిశీలించి, సరైన ధ్రువపత్రాలు లేని వారికి చలానాలు విధించారు. హెల్మెట్ ఆవశ్యకత, రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.

January 15, 2026 / 08:30 PM IST

ఎడ్లబండిలో వెళ్లి సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్యే

CTR: విజయపురం మండలం పన్నూరు గ్రామం నందు సంక్రాంతి వేడుకలో నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కార్యకర్తల కోరిక మేరకు ఎడ్లబండిలో వెళ్లి ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకను గ్రామప్రజలు, కార్యకర్తలు విజయవంతం చేశారు.

January 15, 2026 / 08:15 PM IST

‘సంక్రాంతిని ఆసరాగా చేసుకుని సైబర్ మోసాలు’

KDP: సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారని రాజంపేట పట్టణ సీఐ నాగార్జున హెచ్చరించారు. ఫోన్ పే ద్వారా రూ.5,000 నగదు బహుమతి వచ్చింది అంటూ వచ్చే లింకులు పూర్తిగా నకిలీవని తెలిపారు. ఇలాంటి లింకులు క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవడం, బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు.

January 15, 2026 / 08:10 PM IST

వాట్సాప్ లింకులపై జాగ్రత్తగా ఉండండి: CI

KRNL: ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో “నాకు రూ.5 వేలు వచ్చాయి” వంటి ఆకర్షణీయమైన లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి లింకుల ద్వారా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని ప్రజలను అప్రమత్తం చేశారు.

January 15, 2026 / 08:10 PM IST

కమిషనర్‌కి ఘనంగా అభినందన సభ

GNTR: గుంటూరు నగర అభివృద్ధిలో కమిషనర్ పులి శ్రీనివాసులు తనదైన ముద్ర వేశారని తూర్పు ఎమ్మెల్యే నసీర్, మేయర్ రవీంద్రప్ర శంసించారు .మున్సిపల్ కమిషనర్ బదిలీ అయిన నేపథ్యంలో గురువారం బృందావన్ గార్డెన్స్‌లోని క్యాపిటల్ హోటల్‌లో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. కమిషనర్ సమర్థత, దూరదృష్టి వల్ల నగరంలో అనేక పెండింగ్ పనులు వేగవంతం అయ్యాయని ఆయన కొనియాడారు.

January 15, 2026 / 08:10 PM IST

‘డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం ‘

KDP: 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు ప్రజలను కోరారు.

January 15, 2026 / 08:07 PM IST

‘కర్ణాటక, మైసూర్‌కి సూపర్ లగ్జరీ బస్సు’

EG: రాజమండ్రి నుంచి కర్ణాటక, మైసూర్‌కి ఈనెల 20వ తారీకున సూపర్ లగ్జరీబస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మాధవ్ శుక్రవారం తెలిపారు. శ్రీశైలంమల్లికార్జున, మహానంది నందీశ్వర, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, హంపి విరుపాక్ష, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, హార్నాడు, ధర్మస్థలం, కుక్కే శ్రీరంగపట్నం, మైసూరు 14 ఆలయాలు 9 రోజులు రూ. 11,500గా ధర నిర్ణయించామన్నారు.

January 15, 2026 / 08:05 PM IST

ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి 17 కుటుంబాలు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఎమ్మెల్యే వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు.

January 15, 2026 / 08:03 PM IST

పోలీసుల మెరుపు దాడి.. 9 మంది అరెస్ట్

TPT: రేణిగుంట మండలం కొట్ర మంగళం సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ముళ్లపొదల్లో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో రూరల్ సీఐ మంజునాథ రెడ్డి, ఎస్సై నాగరాజు సిబ్బందితో కలిసి డ్రోన్ సహాయంతో మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకుని 52 పేక ముక్కలు, రూ. 12,400 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

January 15, 2026 / 08:03 PM IST