సత్యసాయి: లేపాక్షి మండలంలోని కంచి సముద్రం నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితితో వాహనదారులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
PLD: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. TDP కేంద్ర కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
KKD: మహిళలపై అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసుల నియంత్రణకు ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు SP బిందు మాధవ్ తెలిపారు. మంగళవారం SP కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మహిళలపై జరిగే నేరాల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేయడం, సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చూస్తామన్నారు.
E.G: గోదావరి పుష్కరాలు-2027ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఖాళీ స్థలాల గుర్తింపు, 16 పుష్కర్ నగర్ల లేఅవుట్లు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాల ప్రణాళికలను తక్షణం సిద్ధం చేయాలన్నారు.
ATP: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు పెండింగ్ అభివృద్ధి పనుల పురోగతిని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాప్తాడు పరిధిలో సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆమె సీఎంకు వినతిపత్రం సమర్పించారు.
CTR: జిల్లాలో మాత, శిశు మరణాలను పూర్తిగా నివారించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వైద్య అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మాత, శిశు మరణాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటంపై అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు.
ASR: ఓటరు జాబితాలో పెండింగ్లో ఉన్న ఎలెక్టోరల్ మ్యాపింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని కొయ్యూరు మండల తహసీల్దార్ పీ.మురళీ బాబు ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా SIRను వేగవంతం చేయాలని సూచించారు.
AKP: మలేరియా మహోత్సవాల్లో భాగంగా నాతవరంలో మంగళవారం పీహెచ్సీ నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా నివారణ, నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. జ్వరం, చలి, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ సూచించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.
ATP: మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్షాప్లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెల్యే భూమ అఖిల ప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తోటి మహిళా ఎమ్మెల్యేలతో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
KKD: రాజమహేంద్రవరం నారాయణపురం ప్రాంతానికి చెందిన గుత్తుల అప్పయ్యమ్మ (70) రెండు రోజులుగా బయట తిరుగుతున్నారు. దీంతో స్థానికులు తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్కు, అనంతరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈమె ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు.
SKLM: ఖరీఫ్ నాటికి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యూరియా కొరత రాకుండ ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించాలని దీని వలన రసాయన ఎరువులను తగ్గించు కోవచ్చన్నారు.
VZM: గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ శివార్లలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న 11మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి బెట్టింగులకు వినియోగిస్తున్న రూ.1,73,830/- ల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
కోనసీమ: మైనర్లు వాహనాలు నడుపుతూ తనిఖీలలో పట్టుబడితే వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్కు హాజరు కావాల్సిందేనని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం 17 సంవత్సరాల యువకుడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ పట్టు బడ్డ కేసులో మైనర్ తండ్రికి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాక్టర్కు రూ.40 వేలు అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు.
KDP: ప్రొద్దుటూరులో 6 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.20 లక్షల నగదు, ల్యాప్ టాప్, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితులకు చెందిన 16 బ్యాంకు అకౌంట్లలోని రూ.4.14 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు.
ATP: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థ భవనాల కింద నిలబడవద్దని హెచ్చరించారు.