KRNL: కాలుష్యాన్ని నియంత్రించడానికి జిల్లాకు 50 విద్యుత్ బస్సులను RTC కేటాయించింది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్గాల్లో నడుస్తాయన్నారు. రూ.10 కోట్లతో డిపోల్లో ఛార్జింగ్ కేంద్రాలు, ప్రత్యేక వర్క్షాప్లు అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 KM ప్రయాణించగల బస్సుల టెండర్లు ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలిపారు.
GNTR: కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి సవిత అన్నారు. శుక్రవారం ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత స్పందించారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు.
W.G: జాతీయ మానవ హక్కులు యాంటీ క్రైమ్ కౌన్సిల్ జిల్లా ప్రొటెక్షన్ ఛైర్మన్గా తనను నియమించినట్లు పాస్టర్ తిమోతిరాజు ఇవాళ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు జే. రాజు ఇటీవల విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు, మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టేందుకు కృషి చేస్తానని అన్నారు.
VZM: కొత్తవలస మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు పెరటికోళ్ళు పెంపకం కోసం 45 యూనిట్లు మండలానికి మంజూరు చేసినట్లు ఏపీఎం వెంకటరమణ తెలిపారు. మంజూరైన ఒక్కో యూనిట్ రూ 4,500 విలువైన కోళ్ళు మహిళలకు ఇచ్చారు. వాటిని ఇంటి వద్ద పెంచుకుని, తద్వారా ఉత్పత్తి అయ్యే గుడ్లు తినడం, అమ్మకం వలన మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.
VZM: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు. అందులో భాగంగా గురువారం ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధి విశాఖ-అరకు ప్రధాన రహదారిలో సిబ్బందితో కలిసి వాహన తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు కళ్ళెం వేయడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విధిగా శిరస్త్రాణం ధరించాలని సూచించారు.
అన్నమయ్య: తంబళ్లపల్లె RTC బస్టాండ్ వెనక వైపున డ్రైనేజీ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. డ్వామా PD వెంకటరత్నం ఆధ్వర్యంలో అధికారులు, కూటమి నాయకులు ఇవాళ భూమిపూజ చేశారు. రూ. 30 లక్షలతో పనులు చేస్తున్నామని ప్రత్యేక అధికారి రెడ్డెప్ప, PR డీఈ మునిరాజు కుమార్ తెలిపారు. నెలాఖరుకల్లా పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో APO అంజనప్ప, AE వెంకటరమణ, పాల్గొన్నారు.
BPT: అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి పనులపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మంత్రి వినతిపత్రం అందజేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.
KRNL: వైసీపీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దకడబూరుకు చెందిన గ్రామ సర్పంచ్ ఎం. రామాంజినేయులు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసింది. తనపై నమ్మకంతో చేతివృత్తుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వైసీపీ అధినేత జగన్కు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
NDL: గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలో ఇవాళ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. గ్రామ వైసీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి ఆహ్వానం మేరకు గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గ్రామ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ATP: అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడును ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల మెటీరియల్ అందుబాటులోకి తేవాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించి నిధుల కేటాయింపునకు హామీ ఇచ్చారు.
VZM: విజయనగరంలోని అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఇవాళ శ్రీ సుదర్శన నరసింహస్వామి విగ్రహా ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి దేవనాధ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అర్చకులు వేద మంత్రాల నడుమ పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమా దేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.
TPT: సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, రాగిగుంట, కాలంగి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల బృందం ప్రతిభ కనబరచిన విద్యార్థులను అభినందించారు.
ఏలూరు: ఆర్టీవో కార్యాలయంలో బ్రోకర్ల వ్యవస్థను సహించబోమని ఇంఛార్జ్ ఉప రవాణా కమిషనర్ కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు తెలిపారు. శుక్రవారం కైకలూరులో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు బ్రోకర్లను ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు.
E.G: కోరుకొండ మండలం గాదరాడలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవాలలో భాగంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన గరగల నృత్యాలు, కోలాటం, బోనాల ముత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ప్రకాశం: పొదిలిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ శంకర్ రావు తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి తిరిగి వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. కండక్టర్కు హాల్ టికెట్ చూపిస్తే సరిపొతుందన్నారు.