E.G: నిడదవోలులో 61 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 44,80,458 విలువైన చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ సోమవారం పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు CMRF ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
VSP: జిల్లాలో చినగదిలి మండలం ముడసర్లోవ రిజర్వాయర్ చుట్టూ మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన 836.38 ఎకరాల భూమిని పరిరక్షించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు. అక్రమ గుర్రాల పార్కు, బీఆర్టీఎస్ రోడ్డుపై కబ్జాలు తొలగించి తాత్కాలిక లీజులు రద్దు చేయాలని జీవీఎంసీ పీజీఆర్ఎస్లో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
TPT: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైసీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్ ముందు ఖాళీ బిందెలతో వారు నిరసన తెలియజేశారు. తుడా మాజీ ఛైర్మన్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమకు నీళ్లు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఇదే జరిగితే మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం వైకాపా నేతలు, కార్యకర్తల నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.
SKLM: ఆమదాలవలసలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ నవగ్రహ సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర యాగ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, వివిధ హోమాలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. యాగంలో పాల్గొనడం వల్ల కుజ, కాలసర్ప, ఏలినాటి శని దోషాలు నివారించి శుభఫలితాలు కలుగుతాయని పండితులు తెలిపారు.
VZM: పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి బర్రిపేటలో గ్రామంలో గల చర్చ్ యొక్క తాళాలు తీసి, తెరిపించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎస్. జాన్ హెచ్చరించారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. చర్చ్లో కొందరు వేరే ఆరాధన కోసం లేని రచ్చ చేస్తున్నారన్నారు.
ATP: జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి తండ్రి, దివంగత నేత అనంత వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద నివాళులర్పించారు. సోమవారం అనంత వెంకటరెడ్డి ఘాట్ వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషిని పెద్దారెడ్డి స్మరించుకున్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాలు గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయంలో మండల పూజలు చేశారు. 40 రోజులపాటు దీక్షలు పూజలు చేసిన అనంతరం నేడు అమ్మవారికి అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
CTR: శ్రీరంగరాజపురం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. TDP కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ చూపిన పలువురు కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేస్తారని వెల్లడించారు. మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే కార్యక్రమానికి పార్టీ శ్రేణులు హాజరు కావాలని చెప్పారు.
VZM: చీపురుపల్లిలో నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే, స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రూ. 2 కోట్లుతో రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. నాణ్యతతో, నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రకాశం: బేస్తవారిపేటలో స్థానిక ఎంపీడీవో రంగనాయకులు ఆధ్వర్యంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. స్వచ్ఛత చర్యలను ప్రతి ఇంటి నుంచే ప్రారంభించాలని సూచించారు. మండలంలో ప్రజలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
KRNL: అవయవదానం చేసిన కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని ఇవాళ సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. అలాగే, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గతేడాది 93 మంది అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చమన్నారు.
ASR: పెదబయలు మండలంలోని గోమంగి గ్రామానికి రహదారి మంజూరు చేయాలని స్థానికులు కోరారు. ఈమేరకు ఇవాళ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. దశాబ్దాల నుంచి గోమంగికి సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, రవాణాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్పందించిన ఎంపీ రోడ్డు మంజూరుకు కృషి చేస్తానన్నారు.
W.G: భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో “కెరీర్ ఎగ్జిబిషన్” పోటీలను కలెక్టర్ నాగరాణితో కలిసి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సోమవారం ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్ విషయంలో వారికి ఇస్తుందన్నారు.
E.G: పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని ఏపీ నైపుణ్యాభివృద్ధి ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. సోమవారం ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 80 మంది లబ్ధిదారులకు రూ. 49,69,000 విలువ గల చెక్కులు అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మొత్తం 682 మంది లబ్ధిదారులకు రూ. 4 కోట్ల 46 లక్షల చెక్కులు అందజేశామన్నారు.
అన్నమయ్య: వీరబల్లె మండలం ఓదివీడు గ్రామంలో ఇవాళ నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, ఉపాధి హామీ గ్రామసభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ గౌ.చమర్తి జగన్ మోహన్ రాజు హాజరుకానున్నారు. కార్యక్రమం ఓదివీడు గ్రామ సచివాలయంలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతుంది.