VZM: హరిత రాయబారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తవలస ఇన్ఛార్జి ఎంపీడీవో బొజ్జా నాగేంద్ర ప్రసాద్కు సీఐటీయు యూనియన్ జిల్లా కార్యదర్శి రమణ గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆరోగ్య రక్షణపై పారిశుధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. వారికి సకాలంలో జీతాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం నిర్లక్షం వహిస్తుందన్నారు.
విశాఖ: రైతు బజార్లలో ఇవాళ కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. ఉల్లిపాయలు రూ. 22, టమాటా రూ.16, బంగాళదుంప రూ.14, వంకాయ రూ. 22 నుంచి 30, క్యారెట్ రూ.28, మిర్చి రూ.50 పలికాయి. బీరకాయ రూ. 36, కాలిఫ్లవర్ రూ.12, దొండకాయ రూ.46, బరబాటి రూ.28, క్యాబేజీ రూ.16గా నమోదయ్యాయి. అల్లం రూ. 68, బీట్రూట్ రూ. 22, గ్రీన్ పీస్ రూ. 36, బెండకాయ రూ.38, పెన్సిల్ బీన్స్ రూ. 40 ఉన్నాయి.
NLR: సంగం మండలం దువ్వూరు గ్రామం సమీపంలో ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు నుంచి సంగం వైపు వెళ్తున్న లారీ దువ్వూరు సమీపంలో బ్యారికెట్ల వద్దా స్లో చేయడంతో అదే వైపు వస్తున్న ద్విచక్ర వాహనం లారీ వెనుక వైపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడుని బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే పశువులు, శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే క్రమంలో భాగంగా బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పొదలకూరు రోడ్డు, ప్రాంతాలలో 10 వీధి శునకాలను పట్టి స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎ.బి.సి సెంటర్కు తరలించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే పశువులు, శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే క్రమంలో భాగంగా బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పొదలకూరు రోడ్డు, ప్రాంతాలలో 10 వీధి శునకాలను పట్టి స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎ.బి.సి సెంటర్కు తరలించారు.
కాకినాడలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తొలి అడుగు పడింది. రూరల్ సర్పవరంలోని భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన 16.55 ఎకరాల భూమిని లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ, ఏపీ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ ప్రత్యేక కృషితో ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీంతో క్రికెట్ క్రీడాకారుల కల ఎట్టకేలకు సాకారం కానుంది.
కాకినాడలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తొలి అడుగు పడింది. రూరల్ సర్పవరంలోని భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన 16.55 ఎకరాల భూమిని లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ, ఏపీ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ ప్రత్యేక కృషితో ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీంతో క్రికెట్ క్రీడాకారుల కల ఎట్టకేలకు సాకారం కానుంది.
తిరుపతి: వడమాలపేట మండలం పాదిరేడు రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని సుమారు 60 ఏళ్ల వ్యక్తి పట్టాలపై మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందడంతో రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు వైట్ డాట్స్ ఉన్న షర్ట్, కాఫీ రంగు ప్యాంటు ధరించి ఉండగా, ఎడమ కన్నుపై రెండు పుట్టుమచ్చలు ఉన్నాయి. వివరాలు తెలిసిన వారు 8142626205ను సంప్రదించండి.
కోనసీమ: అయినవిల్లి మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సీ డాక్టర్ సంతోష్ బుధవారం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చలి తీవ్రత వల్ల ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధులు ఉబ్బసం, పిల్లి కూతలు, గుండెకు సంబంధించిన వ్యాధులు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏమైనా సమస్య ఎదురైతే వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.
కడప: బద్వేల్ అర్బన్ ఎస్సైగా తాహిర్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో అన్నమయ్య జిల్లా, వై.ఎస్.ఆర్ కడప జిల్లాల్లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్తో గుర్తింపు పొందారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. నేర నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.
కడప: బద్వేల్ అర్బన్ ఎస్సైగా తాహిర్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో అన్నమయ్య జిల్లా, వై.ఎస్.ఆర్ కడప జిల్లాల్లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్తో గుర్తింపు పొందారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. నేర నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.
KKD: పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఈ నెల 29న నిర్వహించనున్నట్లు కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఛైర్పర్సన్ తులసీమంగ తాయారు, వైస్ ఛైర్మన్ సాయి ప్రసాద్ అధ్యక్షతన 19 అంశాలపై చర్చించనున్నారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యలే అజెండాగా సాగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కమిషనర్ కోరారు.
కడప: మైదుకూరులోని APTWRS(బాలురు) పాఠశాలను స్థానిక సిఐ రమణారెడ్డి సందర్శించారు. విద్యార్థులకు నైతిక విలువలను వివరించిన ఆయన, పాఠశాల ప్రిన్సిపాల్ దోమల బెడద ఎక్కువగా ఉందని, కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో మానవతా దృక్పథంతో నూతన మెష్లను ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
కడప: మైదుకూరులోని APTWRS(బాలురు) పాఠశాలను స్థానిక సిఐ రమణారెడ్డి సందర్శించారు. విద్యార్థులకు నైతిక విలువలను వివరించిన ఆయన, పాఠశాల ప్రిన్సిపాల్ దోమల బెడద ఎక్కువగా ఉందని, కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో మానవతా దృక్పథంతో నూతన మెష్లను ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
E.G: రైతులు ప్రకృతి సాగు విధానాన్ని అవలంబించాలని జిల్లా ప్రకృతి సాగు విభాగం మేనేజర్ బొర్రా తాతారావు కోరారు. మురమండలో మంగళవారం వ్యవసాయ శాఖ, ఆత్మ, జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. రసాయనిక ఎరువులు మాని ప్రకృతి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు జయరామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

