సత్యసాయి: గత వైసీపీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని మంత్రి సవిత విమర్శించారు. శుక్రవారం సోమందేపల్లి టీడీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉగాది సందర్భంగా మంత్రి లోకేశ్ 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
E.G: యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ చేసినట్లు రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు.
E.G: ఉగాది సందర్భంగా సీతానగరంలోని శివాలయంలో గురువారం సాంస్కృతిక నృత్యాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్న పాఠశాలలను గ్రామస్థులు అభినందించారు. ఆలయ ప్రాంగణం భక్తులు, విద్యార్థులతో సందడిగా మారింది.
PPM: బలిజిపేట మండలం శివరాంపురం పంచాయతి చెల్లింపేట బీసీ కాలనీలో రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు నిర్మించినప్పటికీ సీసీ రోడ్డు వేయకపోవడంతో వర్షం పడితే నీరు నిలిచిపోయి బురదలో నడవడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్ధానికులు కోరుతున్నారు.
ATP: గుత్తిలో శుక్రవారం ఒక్కసారిగా చికెన్, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఎన్నడు లేని విధంగా కేజీ చికెన్ ధర రూ.280 నుంచి రూ. 300, కేజీ మటన్ ధర రూ.750-రూ.800 వరకు ధర పలుకుతుందని చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో కోళ్లు దొరకడం లేదని, అందుకే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు పెరిగాయి అన్నారు. దీంతో ప్రజలు అయోమయంలో పడ్డారు.
కోనసీమ: ఈ నెల 22 వ తేదీన విజయవాడ లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆద్వర్యంలో జరిగే ‘శాలివాహన చక్రవర్తి-కవయిత్రి మొల్ల’ సాంస్కృతిక వైభవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు కోరారు. అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో కుమ్మరి కులస్తులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
NLR: బైకును కంటైనర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మనుబోలు హైవేపై చోటుచేసుకుంది. ఎస్ఐ శివ రాకేశ్ కథనం మేరకు.. కలువాయికి చెందిన చిట్టేపల్లి రమేశ్ (40) బైక్పై మల్లాంలో జరగబోయే వివాహానికి వెళుతుండగా.. చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. రమేశ్ అక్కడక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ATP: తాడిపత్రి పట్టణంలోని జీవీపీ కాలనీలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతుల ప్రదర్శన కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేకే పూజలు, పల్లకీ సేవ చేసి జ్యోతులను ఊరేగిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ASR: బొర్రా గుహల ప్రధాన రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. కల్వర్టుల లేమితో ములియగుడ నుంచి బొర్రా గుహల వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రహదారి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు మృతి పట్ల ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ పడమటిలంకలోని స్వగృహంలో పూర్ణ భౌతిక కాయానికి ఎమ్మెల్యే రాము శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పూర్ణచంద్రరావు మృతి విచారకరమని అన్నారు.
CTR: పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న రాజన్ (108) ఇవాళ ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు.
గుంటూరు మిర్చి యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహం చేయి విరిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటనకు కారణం వర్షమా లేక కావాలనే ధ్వంసమా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ సంఘటనపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించి, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్ధాపురం గ్రామంలో శుక్రవారం జరగనున్న శ్రీ కొల్లాపూరమ్మ స్వామి ఆరో ఉగాది బోనాల జాతరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు పెద్దశివయ్య, సుబ్బయ్య, కటేశ్వరయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల: చీరాల వైకుంఠపురానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బుధవారం చివరి పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు ప్రారంభించారు. విద్యార్థిని ఆచూకీ కోసం విచారణ కొనసాగుతోంది.
KDP: RTPP ప్లాంట్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్లాంట్ అటెండెంట్ త్యాగరాజు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న త్యాగరాజు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.