• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మైదుకూరులో రోడ్డు ప్రమాదం

KDP: మైదుకూరు పట్టణానికి చెందిన సూర్యనారాయణ (42) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం సాయంత్రం తన కుమారుడు నారాయణను పాఠశాలలో వదిలేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా, కుమారుడు గాయపడి చికిత్స పొందుతున్నాడు.

March 27, 2026 / 03:19 PM IST

‘రదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత’

PPM: పార్వతీపురం నుంచి వల్లరిగుడబ వరకు రూ.2 కోట్ల నాబార్డు నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు సైతం రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

March 27, 2026 / 03:15 PM IST

ఏప్రిల్ 1 నుంచి ‘శబల భోజనాల పండుగ’

VSP: సింహాచలం దేవస్థాన గోశాలలో ‘శబల భోజనాల పండుగ’ను ఏప్రిల్ 1 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ నర్సరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల చలపతి రావు తెలిపారు. ప్రకృతి ఆధారిత పంటలతో ఆరోగ్యకరమైన వంటలను ప్రోత్సహించడం లక్ష్యమని చెప్పారు. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగలలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వంటలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.

March 27, 2026 / 03:15 PM IST

శ్రీ కనకదుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే

SKLM: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమదాలవలస నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

March 27, 2026 / 03:14 PM IST

తిరుపతి మహిళ నేతకు ఎమ్మెల్యే సూచనలు

TPT: తిరుమల దర్శనార్థం జనసేన ఎమ్మెల్సీ హరి ప్రసాద్ వచ్చారు. ఆయనకు తిరుపతిలో జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆ పార్టీ మహిళా నేత అకేపాటి సుభాషిణి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఇదే విషయమై ఆమెతో ఆయన మాట్లాడారు. వైసీపీపై ధైర్యంగా స్పందించినందుకు అభినందించారు. భష్యత్తులో ఘాటు వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. తమ అధినేత పవన్ ఇలాంటివి సహించరని హితవు పలికారు.

March 27, 2026 / 03:09 PM IST

‘గాలి కుంటు పట్ల అప్రమత్తంగా ఉండాలి’

SKLM: గాలి కుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమదాలవలస పశు వైద్య అధికారి డాక్టర్ జ్యోత్స్న అన్నారు. శుక్రవారం ఆమదాలవలస మండలం చింతలపేట గ్రామంలో పశువులకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు.

March 27, 2026 / 02:57 PM IST

రైలు కింద పడబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

కడప తాలూకా సీఐ టీ. రెడ్డెప్ప ఆధ్వర్యంలోని పోలీస్ సిబ్బంది సమయోచితంగా స్పందించి ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అక్కాయపల్లికి చెందిన గగ్గుటూరి బాబు (50) మద్యం మత్తులో చౌటపల్లి రైల్వే గేట్ వద్ద పట్టాలపై పడుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, సమాచారం అందుకున్న పోలీసులు కేవలం 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుని అతన్ని రక్షించారు.

March 27, 2026 / 02:55 PM IST

లోక్‌సభలో ఎంపీ బైరెడ్డి శబరి ఆందోళన

NDL: భారతదేశంలోని గ్రామీణ ఆరోగ్య రంగ సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తోందని లోక్‌సభ‌లో ఎంపీ శబరి ఇవాళ ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ.. దేశంలో బీస్సీ నర్సింగ్ కాలేజీలు 2500లకు పైగా పెరిగిన ప్రోత్సాహంలేని కారణంగా నర్సులు విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతోందన్నారు. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వసతులు కల్పించాలని ఆరోగ్య మంత్రిని కోరారు.

March 27, 2026 / 02:46 PM IST

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్‌కి గాయాలు

ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో లారీ వెనుక బైక్‌పై ప్రయాణిస్తున్న టంగుటూరు ఎస్సై వాహనం ఒక్కసారిగా లారీ ఆగడంతో వెనకవైపు నుంచి ఢీకొన్నారు. దీంతో ఎస్సైతో పాటు డ్రైవర్‌కు, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. వీరిని వెంటనే ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.

March 27, 2026 / 02:35 PM IST

రోడ్డుపై అగ్నిప్రమాదం.. పశుగ్రాసం దగ్ధం

ATP: పాల్తూరు నుంచి గాజుల మల్లాపురం వెళ్లే రహదారిలో అగ్నిప్రమాదం నెలకొంది.  శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుపై భారీ మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి సుమారు 20 గడ్డివాములు కాలి పోయాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనతో పశువుల మేతను కోల్పోయిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

March 27, 2026 / 02:34 PM IST

శ్రీరామనవమి: ప్రత్యేక పూజలు చేసిన సీఎం సతీమణి

CTR: శ్రీరామనవమి సందర్భంగా కుప్పంలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆమె స్వయంగా ఫలహారాలు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది.

March 27, 2026 / 02:30 PM IST

కలెక్టరేట్‌లో రేపు గ్రీవెన్స్ డే

W.G: విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో రేపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా ఉపాధి, విద్య, ఆరోగ్యం, పింఛన్లు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించి అర్జీలను స్వీకరించడమే ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు.

March 27, 2026 / 02:22 PM IST

ఘనంగా సీతారాముల కల్యాణం

సత్యసాయి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్ల సింగయ్య గారి పల్లెలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అపర్ణరెడ్డి దంపతులు సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకక్షేమం, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఈ వేడుకను భక్తిశ్రద్ధలతో జరిపించారు. స్వామి వారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

March 27, 2026 / 02:20 PM IST

రాముడు గొప్ప పాలకుడు: నగరి ఎమ్మెల్యే

TPT: పుత్తూరు(M) పరమేశ్వర మంగళంలోని రామాలయంలో నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వహకులు, స్థానికులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పాలకుడు శ్రీరాముడు అని కొనియాడారు.

March 27, 2026 / 02:20 PM IST

శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం

PPM: కురుపాం మండలం పి.లేవిడిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని శ్రీరామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు కలిసి భక్తులకు అన్నదానం నిర్వహించగా, గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.

March 27, 2026 / 02:19 PM IST