AKP: పాయకరావుపేట పట్టణం శాంతి నగర్లో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ మహేశ్వర రావు మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా అందరూ సోదర భావంతో ఉండాలన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
VZM: ప్రత్యేక ఉప కలెక్టర్ నూకరాజు సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి కొనియాడారు. మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన నూకరాజును, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నూకరాజు సేవలను ప్రశంసించారు.
SKLM: గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయి తనిఖీల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీసీలో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన సచివాలయాలను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు.
ASR: ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పాడేరులో పర్యటిస్తారని ఎమ్మెల్సీ కార్యాలయం వర్గాలు మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ గ్రీష్మ పర్యటనలో భాగంగా బుధవారం పాడేరు మండలంలోని గుత్తులపుట్టు గ్రామంలో జరగనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఏఎంసీ ఛైర్మన్లు, ఇన్ఛార్జులు పాల్గొనాలన్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురంలో హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఓ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన పెట్రోల్ బంక్ సిబ్బంది నీటితో మంటలను ఆర్పీ ప్రమాదాన్ని నివారించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సేవలను ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశంసించారు. మంగళవారం ఆయనను దుశ్సాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత 20 నెలల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు.
PLD: జిల్లా గురజాల ఆర్డీవో కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ మేరకు గురజాల వీఆర్ఏలకు పే స్కేలు జీతాలు అమలు చేయాలని, 1టైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వో, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు బందగీ సాహెబ్ పాల్గొని ఆర్డీవోకి వినతిపత్రం అందించారు.
VSP: ఏపీ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు సాధించడం గర్వకారణమని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు ప్రథమ, ఒక ద్వితీయ, రెండు తృతీయ బహుమతులు దక్కడం శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. ‘రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్’, ‘జల్ సంచయ్-జన్ భాగీదారి’ విభాగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.
KRNL: రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో మరల ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే పనులలో పురోగతిని తీసుకొని రావడంతో పాటు, గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు.
విశాఖ జీఆర్పీ లైన్స్ సీఐ ఏ. రవికుమార్ మంగళవారం విజయనగరం జీఆర్పీ పోలీసు స్టేషన్ను సందర్శించారు. ముందుగా సిబ్బంది యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో నమోదు అవుతున్న రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని ఆదేశిస్తూ, రాత్రి విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో మండల అధ్యక్షుడు మట్టా శివకుమార్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రశిక్షణా కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు, చాట్రాతి రాంబాబు, గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు విశేష కృషి చేయాలని సూచించారు.
W.G: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం ఎల్ఎన్ పురం, మాలవానితిప్ప, కోమటిగుంట గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను సైతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.
NDL: విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు ఇవాళ ఆదేశించారు. మూడు నెలల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఫీడర్ ఛానల్స్ శుభ్రపరిచే పనులు, పూడికతీత పూర్తి చేయాలని తెలిపారు. చెరువుల కట్టల్లో గండ్లు, ఇతర నష్టాలను వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
PPM: టీడీపీ పార్వతీపురం పట్టణ అధ్యక్షుడుగా కోలా మధుసూదన్ రావు ఎంపిక చేసినట్లు పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర తెలిపారు. ఇప్పటివరకు పార్వతీపురం టౌన్ ప్రెసిడెంట్ జి. రవికుమార్ పనిచేశారు. అనంతరం మధుసూదన్ రావు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీని 30 వార్డుల్లో గెలిపిస్తానని హామీని ఎమ్మెల్యేకి ఇచ్చారు.
అనకాపల్లి జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23 వరకు ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించనున్నట్లు డీఐఈఓ వినోద్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు జరుగుతాయని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థులు జాయినింగ్స్కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.