NDL: అవుకు పట్టణంలో ఇవాళ జనసేన నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రక్తం ఇచ్చిన వారికి మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు.
KDP: వేములలో సోమవారం రైతన్న మీ కోసం నిర్వహిస్తున్నట్లు ఏfy ఓబులేసు ఆదివారం తెలపారు. మండలంలో 6,224 మంది రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకు, 23 నుంచి 25 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
ELR: మెయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు స్టేషన్ బెయిల్ లభించింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయనకు, ప్రియాంక రెడ్డికి నోటీసులు జారీ చేసి బెయిల్ మంజూరు చేశారు. శనివారం రాత్రి ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీని శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
NLR: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమవుతున్న పదవ తరగతి పరీక్షలలో నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ పాఠశాలలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా మేయర్ విద్యార్థులకు ఆశీస్సులను అందజేశారు. విద్యర్థులు ఎంతో కీలకమైన పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.
అన్నమయ్య: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్య క్షుడు రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో వీరబల్లి మండల రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై చర్చించారు. గొడ్డిండ్ల వాండ్లపల్లి గ్రామస్థులు తమ సమస్యలను పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని తెలిపారు.
PPM: నీలకంఠాపురం మండలంలోని పనసబద్ర గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను నీలకంఠాపురం ఎస్సై నీలకంఠారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్విన్పేట సీఐ హరి బాబు, పోలీసు సిబ్బందితో కలిసి టోర్నమెంట్ నిర్వాహకులకు క్రికెట్ బ్యాట్, వికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.
KDP: జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించి వైఎస్సార్ కడప జిల్లా రాష్ట్రంలో తొలి స్థానం సాధించింది. మార్చి 14న నిర్వహించిన లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 1,03,591 కేసులు పరిష్కరించగా రూ. 24.01 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 బెంచీలలో క్రిమినల్, సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించబడ్డాయి.
కర్నూలు: నంద్యాల చెక్పోస్ట్ సమీపంలోని శ్రీకృష్ణ పీఠంలో నిర్వహిస్తున్న 89వ విశ్వశాంతి మహాయాగంలో ఇవాళ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. దేశంలో శాంతి, ప్రజల సౌభాగ్యం కోసం మహాయాగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
VSP: జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ విద్యాధరి ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్నకు రోజువారీ అవసరము 18,184 సిలిండర్లు కాగా 37,920 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుకింగ్ చేసుకోవాలనన్నారు
W.G: భీమవరం కలెక్టరేట్తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1,100 కాల్ సెంటర్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.
ఏలూరు: జిల్లాను డ్రగ్స్ రహితంగా మారుస్తానని చెప్పిన ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా మారడం సిగ్గుచేటని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఇవాళ ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ డ్రగ్స్ పార్టీగా మారిపోయిందని తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికి చెడ్డపేరు తెస్తున్నాయని అన్నారు.
CTR: మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం పుత్తూరు, నగరి, విజయపురం మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం నేసనూరులో శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో రుద్రాభిషేకంలో పాల్గొని, అనంతరం పలు గ్రామాల్లో కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం నగరిలో కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొనగా, సాయంత్రం విజయపురం మండలంలో YCP నాయకుల కుటుంబాలను పరామర్శిస్తారు.
VSP: పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ అవసరమని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడారు. జూన్ నాటికి రాష్ట్రంలో 2.60 లక్షల గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రోపై సాంకేతిక ప్రక్రియలు రెండు నెలల్లో పూర్తవుతాయని, మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ క్షేత్రములో వెలసి ఉన్న శ్రీ కామాక్షితాయి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవార్లకు విశేష పూజా కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం 7.30 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం, సాయంత్రం 8 గంటలకు వెండి నంది సేవ నిర్వహిస్తామని అన్నారు.
కృష్ణా: ఉయ్యూరు 18వ వార్డులో అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన 50 మంది పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ చీరలు, రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదర, సోదరీమణులు రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షను చేపట్టి ఎంతో పవిత్రంగా ఉంటారిని, నెలంతా సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు సహాయం చేస్తుంటారని తెలిపారు.