KKD: జిల్లా పరిధిలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు జాతీయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ షాన్ మోహన్ శనివారం తెలిపారు.నాణ్యమైన అభివృద్ధికి తోడ్పడే పారిశ్రామికవేత్తలను గౌరవించడం, నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ఇస్తుందన్నారు. https://dashbord d.msme.gov.in/na/Ent_ NA_Admin/Ent_ind ex.as px ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలన్నారు.
ATP: ఎల్లనూరు మండలం జంగంపల్లి గ్రామంలో నేడు సినీ నటుడు విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. ఆయన నటిస్తున్న ‘రణబలి’ చిత్ర షూటింగ్ జంగంపల్లి కోట వద్ద నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నేపథ్యంలో షూటింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నెల్లూరు: విడవలూరు మండలంలోని అన్నా రెడ్డిపాలెం శ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం వేకువ జామున గజ వాహనంపై శ్రీ కోదండరామ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
NLR: కోవూరులోని P-4 కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈవో ఎల్ శ్రీధర్ శనివారం పరిశీలించారు. కార్యాలయం సిబ్బంది పనితీరుపై ఆరా తీసి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 30న నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి అందరూ సన్నద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
కాకినాడ: పెద్దాపురం మండలం తొలి తిరుపతి క్షేత్రంలో శృంగారం వల్లభ స్వామి దివ్య కళ్యాణ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేపట్టినట్టు ఈవో వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు స్వామి కళ్యాణ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొంటారన్నారు.
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించింది. ఉదయం 9గంటలకు కొత్తపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొంటారు.10 గంటలకు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద జరిగే టీడీపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వాడపల్లి రథోత్సవంలో పాల్గొంటారు.
కోనసీమ: అమలాపురంలో మాంసం ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ఎండల తీవ్రతతో కోళ్ల పెంపకం తగ్గడంతో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.300 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. ఫారం కోడి కిలో రూ.200, మటన్ రూ.800లుగా ఉంది. చేపలు రకాన్ని బట్టి రూ.120-130 మధ్య అమ్ముడవుతున్నాయి. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారులంటున్నారు.
అన్నమయ్య: ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో గాలివీడు ఎస్సై నరసింహారెడ్డి యువతకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్ను వినోదంగా మాత్రమే ఆస్వాదించాలని, బెట్టింగుల మోజులో పడకూడదని సూచించారు. ఇటీవల బెట్టింగుల వల్ల యువత ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
VZM: జిల్లాలోని వివిధ మండలాల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమ నిల్వలు చేసి పట్టుబడిన 15 మందిపై 6ఏ కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు జే.సీ. సేధు మాధవన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే రేషన్ కార్డులురద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను దారులకు 50% వడ్డీ రాయితీ పొందే గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమేనని కమిషనర్ హెచ్. కూర్మారావు తెలిపారు. ఆదివారం సెలవు రోజున కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. పన్నులు చెల్లించేందుకు ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు.
AKP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రతీ టీడీపీ కార్యకర్త ఇంటిపైన ఉదయం ఎనిమిది గంటలలోపు పార్టీ జెండా ఎగరాలని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సబ్బవరంలో ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలన్నారు.
SS: జిల్లాకు చెందిన మహిళా నేతలు మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, శ్రావణి, సింధూరరెడ్డి CM చంద్రబాబు నాయుడిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ (FCRA) విదేశీ నిధుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేసిన కృషిపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు.
CTR: బంగారుపాళ్యం స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు రౌడీ షీటర్లను పిలిపించి, భవిష్యత్తులో ఎలాంటి నేర కార్యకలాపాలలో పాల్గొనకూడదని హెచ్చరించారు. సమాజ శాంతి, భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
NDL: బండి ఆత్మకూరు మండలం వెంగలరెడ్డి పేటలో శనివారం ఎస్సై జగన్మోహన్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, బాల్యవివాహాల నివారణ, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని SI హెచ్చరించారు.
నంద్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. బనగానపల్లెలో 66, డోన్లో 21, ఆత్మకూరులో 172, నంద్యాలలో 227 మ్యుటేషన్లు SLA గడువు దాటి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆమె సూచించారు.