• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీతారామ్

W.G: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అంకెం సీతారామ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న సీతారాంను జిల్లా పగ్గాలు వరించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

January 4, 2026 / 06:31 AM IST

నేడు APTF జిల్లా కార్యవర్గ సమావేశం

PPM: APTF జిల్లా కార్యవర్గ సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు స్థానిక పెన్షన్‌ దారుల భవనంలో జరుగుతుందని APTF జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల బాలకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు మర్రాపు మహేష్‌ అధ్యక్షతన నూతన కార్యవర్గ ఎన్నిక జరుగుతుందని, ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గుంపస్వామి ,ఉపాధ్యక్షుడు రామారావు హాజరవుతారని ఆయన తెలియజేశారు.

January 4, 2026 / 06:31 AM IST

నేడు భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

VZM: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గగన విహార ముహూర్తం ఖరారైంది. ఇవాళ ట్రయల్ రన్‌గా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ట్రయల్ విజయవంతమైతే మే నెల నుంచే సాధారణ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

January 4, 2026 / 06:26 AM IST

దుద్దుకూరులో CM సహాయనిధి చెక్కుల పంపిణీ

E.G: దేవరపల్లి (M) దుద్దుకూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూటమి నాయకులు శనివారం పంపిణీ చేశారు. మోకాళ్ల శస్త్రచికిత్స నిమిత్తం మంజూరైన రూ.70 వేల చెక్కును ఆంజనేయులుకు, రూ.50 వేల చెక్కును హేమావతికి TDP నేత తాతారావు అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్నహస్తంలా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

January 4, 2026 / 06:25 AM IST

వెస్ట్ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VSP: ఎన్‌ఏ‌డీలో ఏర్పాటు చేసిన వెస్ట్‌జోన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గణబాబు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం ప్రారంభించారు. నగర ప్రజలకు మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు చేరువలో రాజకీయ నాయకులు, అధికారులు ఉంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఫలాలు అందరికీ అందుతాయిని తెలిపారు.

January 4, 2026 / 06:23 AM IST

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి

GNTR: కొల్లిపర మండలం చిలుమూరు వద్ద శనివారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చక్రాయపాలెం వైపు వెళ్తున్న ఈ వాహనాలపై కేసు నమోదు చేసి, నిందితులపై క్రిమినల్ చర్యలు చేపట్టారు. అక్రమ రవాణా చేసే వారిని వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు.

January 4, 2026 / 06:18 AM IST

కారు ఢీకోని మహిళకు తీవ్ర గాయాలు

VZM: దత్తిరాజేరు మండలం కోమటి పల్లి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద మేడపల్లికి చెందిన రెడ్డి శ్యామలకు తీవ్ర గాయాలయ్యాయి. స్దానికుల వివరాల ప్రకారం.. మానాపురం నుంచి వస్తున్న ఆమె స్కూటీని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో జరిగిందన్నారు. గాయపడిన మహిళను 108 వాహనంలో గజపతినగరం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

January 4, 2026 / 06:16 AM IST

జిల్లాలో గ్రామాలపై ప్రత్యేక నిఘా

NLR: పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

January 4, 2026 / 06:12 AM IST

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు

కోనసీమ: భూ సమస్యల పరిష్కారానికి జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. ఇవి సింగిల్ విండో విధానం ద్వారా పనిచేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రమంతా వీటిని మోడల్‌గా చేయనున్నట్లు తెలిపారు. ప్రజా దర్బార్ విధానం లాగానే ఇవి కూడా త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

January 4, 2026 / 06:10 AM IST

ఫ్లెక్సీ వివాదంలో ఓ వ్యక్తి అరెస్టు

AKP: పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో జరిగిన ఫ్లెక్సీ వివాదం కేసులో శనివారం ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అప్పన్న తెలిపారు. గ్రామంలో ఇటీవల ఫ్లెక్సీ ఏర్పాటుపై గ్రామంలో 2 వర్గాలు మధ్య జరిగిన గొడవ కొట్లాటకు దారితీసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. గ్రామానికి చెందిన డీ. రమణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

January 4, 2026 / 06:08 AM IST

సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా చేయండి: కలెక్టర్

కృష్ణా: సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు స్థానిక చింతగుంటపాలెంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. అవయవాలు ఉన్నంత వరకు యోగాసనాలు వేయాలని, ప్రాణాలు ఉన్నంత వరకు యోగా చేయాలని కోరారు.

January 4, 2026 / 05:47 AM IST

అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు: ఎమ్మెల్యే

E.G: టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు ఉంటుందని MLA మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. శనివారం నల్లజర్ల (M) ప్రకాశరావుపాలెంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జ్‌లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన 76 మందికి CMRF సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చేస్తున్న కృషి అమూల్యమని ఆయన కొనియాడారు.

January 4, 2026 / 05:40 AM IST

గ్యాస్ సిలిండర్ పేలి భారి అగ్నిప్రమాదం

ATP: తాడిపత్రిలోని చేనేత కాలనీలో గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించే క్రమంలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఫైర్ అధికారి వెంకటరమణ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

January 4, 2026 / 05:12 AM IST

కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా క్రాంతి నాయుడు

KRNL: కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ క్రాంతి నాయుడు నియమితులయ్యారు. ఏపీలోని జిల్లా డీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఆమోదం తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగినట్లు క్రాంతి నాయుడు పేర్కొన్నారు.

January 4, 2026 / 04:44 AM IST

తిరుమలలో ముస్తాబవుతున్న రథసప్తమి ఏర్పాట్లు

తిరుమలలో ఈ నెల 25న నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి రోజున ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు జరిగే నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు మాడవీధులలో షెడ్లు ఏర్పాటు చేసిదర్శన ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

January 3, 2026 / 09:30 PM IST