• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గంటలోపే బ్యాగ్ రికవరీ.. పోలీసుల చాకచక్యం

VSP: ఆర్కే బీచ్ వద్ద పోగొట్టుకున్న నాలుగు తులాల బంగారు హారం, సెల్‌ఫోన్ ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను 3 టౌన్ పోలీసులు గంటలోపే గుర్తించారు. పాలకొండకు చెందిన మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ ఎక్స్‌పో ప్రాంతంలో బ్యాగ్‌ను పోలీసులు గుర్తించి యజమానికి అప్పగించారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞత తెలిపారు.

March 17, 2026 / 06:49 AM IST

ఘనంగా తిమ్మగురుడు స్వామి ఉత్సవాలు

KRNL: మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఊరు కొండపై వెలసిన శ్రీశ్రీ తిమ్మగురుడు స్వామి ఉత్సవాలు జరగనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ నెల 19న గ్రామ దేవుళ్లకు నైవేద్యం సమర్పణ, 20న ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం కుందేలు పారి వేట, సాంస్కృతిక కార్యక్రమం, 21న వసంతోత్సవం జరుగునున్నట్లు చెప్పారు.

March 17, 2026 / 06:43 AM IST

పోరంకిలో యాక్సిడెంట్.. వృద్ధురాలు మృతి

కృష్ణా: పోరంకిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిగడప నుంచి పోరంకి వైపు వెళుతున్న కారు త్రినేత్ర హాస్పటల్ వద్ద పోరంకి గ్రామానికి చెందిన అలివేలు మంగమ్మ (79), కుమార్తె నాగ శిరోమణిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కాగా, వారిని వెంటనే స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అలివేలు మంగమ్మ మృతి చెందారు. నాగ శిరోమణి ఆరోగ్యం నిలకడగా ఉంది.

March 17, 2026 / 06:42 AM IST

బార్ అసోసియేషన్ నామినేషన్లు ఎన్ని అంటే..!

అన్నమయ్య: రాయచోటి న్యాయవాదుల సంఘం 2026-27 సంవత్సరానికి ఈనెల 28న జరగనున్న ఎన్నికల కోసం సోమవారం 11 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి పి. రెడ్డయ్య తెలిపారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన నిర్వహించి, బుధవారం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళా న్యాయవాదులకు 30% రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు.

March 17, 2026 / 06:39 AM IST

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

NTR: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి ఆచ్చెంనాయుడు నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం వద్దకు ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తానని అన్నారు. మే 15వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

March 17, 2026 / 06:39 AM IST

నిర్దోషిగా బయటకు వస్తా: MP

ELR: హైదరాబాద్‌లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, ఎంపీగా గెలిపించిన ప్రజలకు, పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘విచారణలో నేను నిర్దోషిగా బయటకు వస్తా’ అని పేర్కొన్నారు.

March 17, 2026 / 06:36 AM IST

నేడు LSDGపై శిక్షణా కార్యక్రమం: MPDO

VZM: మెరకముడిదాంలోని 17మండల పరిషత్‌ ప్రాదేశిక సభ్యులకు, 274 వార్డు మెంబర్లకు LSDG పై ఇవాళ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నట్ల స్థానిక MPDO భాస్కరరావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సమ్మిళిత ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలపై సభ్యులందరూ ఆవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ శిక్షణకు సభ్యులందరూ హాజరుకావలసిందిగా కోరారు.

March 17, 2026 / 06:36 AM IST

జిల్లాలో పేకాట రాయళ్ళు అరెస్ట్..!

W.G: పాలకోడేరు మండలంలోని కొండేపూడి శివారు వరి పొలాల్లో సోమవారం పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొండేపూడి శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి 8 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4,200 నగదు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్సై రవి వర్మ తెలిపారు.

March 17, 2026 / 06:33 AM IST

టీడీపీలోకి చేరిన మరో కార్పొరేటర్..!

కడప: నగరంలోని 12వ డివిజన్ కార్పొరేటర్ సానపు రెడ్డి శివకోటి రెడ్డి సోమవారం రాత్రి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారు. దీంతో వైసీపీ అక్కడ డైలమాలో పడింది.

March 17, 2026 / 06:31 AM IST

నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభం

కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడప ఆర్టీసీ కాలనీలో రూ.1.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరంకి ప్రజలు నన్ను నమ్మి మీ బిడ్డగా ప్రతి ఎన్నికలలో అండగా నిలబడి, గెలిపించినందుకు మీరు గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.

March 17, 2026 / 06:26 AM IST

‘విలువైన డాక్యుమెంట్స్ ఉన్న పట్టించుకోవట్లేదు’

ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలోని ZP హై స్కూల్‌లో 3 దశాబ్దాల విద్యార్థులకు చెందిన విలువైన డాక్యుమెంట్స్ ఉన్న ఎలాంటి సెక్యూరిటీ లేదని విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి మండిపడ్డారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో జేసీకి వినతి పత్రం ఇచ్చారు. స్కూలుకు సంబంధం లేని వ్యక్తులు పాఠశాలలో సంచరిస్తున్నారన్నారు.

March 17, 2026 / 06:26 AM IST

శ్రీశైలం ఉత్సవాలు.. భృంగి వాహనంపై ఆది దంపతులు

NDL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు శ్రీస్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేక పూజలు అందుకున్న ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవాన్ని జరిపించారు. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది.

March 17, 2026 / 06:25 AM IST

డ్రైవర్లతో ఫేస్ వాష్ చేయించిన సీఐ

NLR: బుచ్చి( M)లో రోడ్డు ప్రమాదాల నివారణకు సీఐ శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. పట్టణంలోని టోల్ ప్లాజా వద్ద దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లతో ఫేస్ వాష్ చేయించారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో డ్రైవర్లకు నిద్రమత్తు వచ్చినట్లుగా అనిపిస్తే వాహనాలను పక్కన నిలిపి విశ్రాంతి తీసుకుని బయలుదేరి వెళ్లాలన్నారు.

March 17, 2026 / 06:18 AM IST

18న క్రికెట్ అంపైరింగ్ పరీక్షలు

ATP: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంపైరింగ్ పరీక్షలు ఈ నెల 18న నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలని కార్యదర్శి యుగంధర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉత్తీర్ణులైన ఐదుగురిని రాష్ట్రస్థాయి పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఏసీఏ నిర్వహించే పోటీలకు అంపైర్లుగా పనిచేసే అవకాశం వీరికి దక్కుతుంది.

March 17, 2026 / 06:18 AM IST

వీరభద్రుని ఆలయంలో వైభవంగా పల్లకి సేవ

అన్నమయ్య: రాయచోటిలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో సోమవారం పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అర్చనలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

March 17, 2026 / 06:17 AM IST