KDP: వల్లూరు మండలం పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై చరిత్రకారులు బొమ్మిశెట్టి రమేష్ అరుదైన త్రిమూర్తుల కుడ్య శిల్పాన్ని కనుగొన్నారు. ఒకే శిలాఫలకంపై పార్వతీ పరమేశ్వరులు, విష్ణువు, బ్రహ్మ అర్ధపద్మాసనంలో కొలువై ఉండటం ఈ శిల్పం యొక్క ప్రత్యేకత. దీంతోపాటు శైవ ద్వారపాలకులు, ఐదుగురు నాట్యకారిణుల భంగిమలను కూడా శిల్పి అద్భుతంగా రూపొందించినట్లు తెలిపారు.
GNTR: పెదకాకానిలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ‘సంకల్పం’ అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్ఐలు రామకృష్ణ, మీరజ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. సమాజ శ్రేయస్సు కోసం డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
BPT: బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ ఫేస్బుక్ ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. సైబర్ నేరగాళ్లు కలెక్టర్ ఫోటోను వాడుతూ, మెసేజ్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆ ఖాతాల నుండి వచ్చే సందేశాలను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
GNTR: కొల్లిపర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 25న హల్చల్ చేసిన నిందితులు సాయి, అబ్దుల్ కరీం, శ్రీనులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యనారాయణ అనే వ్యక్తిపై దాడికి దిగిన నిందితులు, అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డులు తిరుపతిరావు, రమాదేవిలను చితకబాదారు. అలాగే ఆసుపత్రి అద్దాలను పగులగొట్టి విధ్వంసం సృష్టించారు. ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేశారు.
KDP: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తైనట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు.
ELR: జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
CTR: పుంగనూరు గూడూరు పల్లి గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు (మంగళవారం) నిర్వహించే ముక్కోటి ఏకాదశికి సర్వం సిద్ధమైనట్లు ఆలయ అర్చకులు సురేష్ ఆచార్యులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆలయంలో ఉదయం 3 గంటలకు స్వామి వారి మూలవిరాటు అభిషేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది అని చెప్పారు.
ATP: రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్లో చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమానమే తన ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో జరిగే ధర్నాకు తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు.
VZM: విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్లతో నిఘా పెట్టి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 5 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం తెలిపారు. అయ్యన్నపేట శివారు ప్రాంతం, కలెక్టర్ కార్యాలయం, పీజీఆర్ ఆసుపత్రి పరిసరాల్లో డ్రోన్ల సహాయంతో రైడ్స్ నిర్వహించామని చెప్పారు.
W.G: పెంటపాడు గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో రామానుజరావు రాష్ట్ర కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరవాసరానికి చెందిన ఆయన ప్రస్తుతం బంటుమిల్లి మోడల్ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా విధి నిర్వహణలో ఉన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
KRNL: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిందని టీబీ అధికారులు తెలిపారు. ఆదివారం ఎలాంటి ఇన్ ఫ్లో కొనసాగలేదన్నారు. ప్రస్తుతం జలాశయం నుంచి వివిధ కాల్వలకు, నదికి కలిపి 8,999 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయ నీటిమట్టం 1,611.15 అడుగులకు గాను 39.89 TMCల నీటి నిల్వ ఉందన్నారు. జనవరి 10న కాల్వలకు నీరు నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
SKLM: సోంపేట(M) మామిడిపల్లి పంచాయతీ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రామకృష్ణ ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ ఆర్. కోదండ కృష్ణ కోరారు. ఆదివారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి సామాజిక భవనం, గ్రంథాలయంలో వోల్టేజీ సమస్య పరిష్కరించాలని విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
BPT: అద్దంకి మండలంలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. చక్రాయపాలెం, గోపాలపురం గ్రామాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ అంతరాయం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ మస్తాన్ తెలిపారు. కావున వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
NTR: విజయవాడ రూరల్ ఎనికేపాడులో VCS & TA ఆధ్వర్యంలో ఆదివారం 12వ బాలోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై, నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలని, విద్య, కళలు, క్రీడలు వారి సమగ్ర అభివృద్ధికి కీలకమని తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
TPT: గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో హర్ష టయోటా షోరూమ్ పక్కన రోడ్ విస్తరణ పనుల సమయంలో క్రేన్ గ్యాస్ పైప్లైన్ను తాకడంతో లీకేజ్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని పరిసరాలను ఖాళీ చేసి ట్రాఫిక్ నియంత్రించి లీకేజ్ను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.