KRNL: 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో నిర్వహిస్తున్న అతిరుద్ర హోమంలో కుటుంబసమేతంగా MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి పూజా కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులకు నాయకులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
CTR: చిత్తూరు అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, ఆర్ముడ్ రిజర్వ్ ఏఎస్సై గౌస్ బాషా, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బొబ్బిలి రాజు ఈ నెలలో పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ గెస్ట్ హౌస్లో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో వారిని శుక్రవారం సన్మానించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆయన సూచించారు. అనంతరం ఏ సమస్య వచ్చినా పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
CTR: వెదురుకుప్ప మండలం పచ్చికాపల్లంలోని అరుణగిరి క్షేత్ర జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 5న కార్తీక పౌర్ణమి పురస్కరించుకIని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం, దీపోత్సవం, జ్వాలా తోరణం, గిరి ప్రదక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
CTR: సదుం మండలంలోని జాండ్రపేటలో మహాగణపతి, సీతారామ, సాయిబాబా ఆలయం నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా శుక్రవారం మహా కుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. నాగభూషణం, విక్రమ్, దేవేంద్ర, ధరణి శ్రీకాంత్ పాల్గొన్నారు.
E.G: మొంథా తుఫాన్ ప్రభావిత రైతులు, మత్స్యకారులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తున్నదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలో 251 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేసినట్లు చెప్పారు. అదనంగా రాజమండ్రి రూరల్ పరిధిలో మరో 173 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, రూ.1.55 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
KDP: నవంబర్ 8న కడపకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రఖ్యాత ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. దర్గా ప్రతినిధులు ఉరుసు ఉత్సవాలకు రావాలని ఆహ్వానించడంతో తప్పకుండా వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, 8వతేదీన జరిగే ఉరుసు, ముషాయిరా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని సమాచారం.
VZM: కూటమి ప్రభుత్వానిది పని తక్కువ, ప్రచారం ఎక్కువ అని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒకవైపున ప్రభుత్వ పెద్దలందరూ టెక్నాలజీని ఉపయోగించి తుఫాన్ని ఎదుర్కొన్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, వాస్తవ పరిస్థితులు చూస్తే ఎంత మేర పంట నష్టం జరిగిందనే వివరాలను అడిగిన అంచనా వేయలేదంటున్నారని తెలిపారు.
W.G: పాలకొల్లులో ఆకుకూరలకు డిమాండ్ ఏర్పడింది. ఇటీవల వారం రోజుల పాటు వరుసగా కురిసిన వర్షాలకు భీమవరం ప్రాంతంలో పండించే ఆకుకూర పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. దీంతో గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, పొన్నగంటి వంటి ఆకుకూరల ఉత్పత్తి తగ్గి డిమాండ్ ఏర్పడింది. దీంతో శాఖాహార ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క కాయగూరల ఉత్పత్తి తగ్గి ధరలు అందుబాటులో లేవు.
SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో చాకిపల్లి గ్రామానికి చెందిన బి. సుహాషిణి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. లక్ష చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.
KDP: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ఈ మేరకు పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయరన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వేంపల్లిలో నత్తనడకగా సాగుతున్న సిమెంట్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జల జీవన్ మిషన్ కింద డిసెంబర్కు వేంపల్లి మండల ప్రజలకు తాగునీరు అందించాలని అధికారులకు తెలిపారు.
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ విజిలెన్స్ వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ మధు మాట్లాడుతూ.. అవినీతి రహిత సమాజం మనందరి బాధ్యత అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను, పలువురు అధ్యాపకులు తమ ప్రసంగాల ద్వారా తెలియజేశారు.
KRNL: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.సిరి ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆమె స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువలిటీ, ఎమర్జెన్సీ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల విధానం, ఆసుపత్రిలోని శుభ్రత వంటి అంశాలను ఆమె పరిశీలించి రోగులకు సమయానికి చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
NDL: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవమే సీఎo చంద్రబాబు నైజం అని ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రిలీఫ్ ఫండ్ రూ. 12,57,504/-, విలువైన చెక్కులు ఆత్మకూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 32 మంది లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
VSP: చల్లని వాతావరణం.. పచ్చని లోయలు, జలపాతాలతో అరకులోయ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఈ సీజన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే అరకు యెలహంకా మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనుంది. దీంతో రాయలసీమ నుంచి నేరుగా అనకాపల్లి, దువ్వాడ మీదుగా అరకు చెరుకునే అవకాశం ఏర్పడింది. ఈ రైళ్లు నవంబర్ 13, 17, 23, 24న మధ్యహ్నం 12కి అరకు నుంచి బయలుదేరుతాయి.
ప్రకాశం: జిల్లాలో దెబ్బతిన్న రహదారుల అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి స్వామి అన్నారు. ఇందులో భాగంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, R&B అధికారులతో తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్ల పరిస్థితులపై మంత్రి స్వామి సమీక్షించారు. అనంతరం ఎక్కడెక్కడ రహదారులు దెబ్బ తిన్నాయో నివేదిక తయారు చేసి వెంటనే వాటి మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.