• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మందుల షాపులపై విజిలెన్స్ దాడులు

అన్నమయ్య: మందుల షాపులపై విజిలెన్స్, ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలో విస్తృతంగా ఆకస్మిక దాడులు చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.కేశవరెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మకాలు జరిపిన వెంటనే వాటి వివరాలను హెచ్ వన్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

March 22, 2025 / 10:22 AM IST

బద్వేల్ రూరల్ సీఐకి పతకం

KDP: బద్వేల్ రూరల్ సీఐగా పనిచేస్తున్న M.నాగభూషణ్‌కు ఈ ఏడాది తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాలలో రాష్ట్ర పోలీస్ మహాన్నత సేవా పతకాన్ని ప్రకటించినారు. ఈ సేవా పథకాన్ని నవంబరు 1వ తేదీన అమరావతిలో జరిగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో  సీఎం చంద్రబాబు చేతుల మీద ఇవ్వనున్నారు.

March 22, 2025 / 10:14 AM IST

బైక్ బోల్తా.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

TPT: రాయల చెరువు నుంచి ఇద్దరూ బైక్‌పై వస్తూ పీవీ పురం దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన కేశవ, దీపిక అనే ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

March 22, 2025 / 09:37 AM IST

‘యువికా’కు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు: ఈ నెల 23వ తేదీలోపు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇస్రో ఆధ్వర్యంలో యువికా(యువ విజ్ఞాన కార్యక్రమం)కు దరఖాస్తు చేసుకోవాలని సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఎంపికైన వారికి స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్‌పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.

March 22, 2025 / 09:32 AM IST

సోమశిల నీటి వివరాలు

NLR: సోమశిల జలాశయ తాజా నీటి వివరాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడంలేదని జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. జలాశయంలో 54.479 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 330 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 400 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

March 22, 2025 / 08:50 AM IST

తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

KKD: అచ్యుతాపురంలో ఈనెల 16న తల్లి షేక్ జహారా బీబీని హత్య చేసిన కొడుకు కమల్‌ను ఇంద్రపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. SI వీరబాబు వివరాల ప్రకారం.. బీటెక్ మధ్యలో ఆపేసి ఇంటి వద్ద రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న కొడుకును ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి అనడంతో నుదిటిపై బలంగా కొట్టి చంపాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.

March 22, 2025 / 07:42 AM IST

నేటి నుంచి పట్టణంలో మంచినీటికి అంతరాయం

KKD: తుని పట్టణంలో నేటి నుంచి మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు కారణంగా నీటి సరఫరాకి అంతరాయం ఉంటుందని తెలిపారు. తుని పట్టణంలో ఒకటో వార్డు నుంచి 10వ వార్డు వరకు ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు రేఖ వాణి పాలెంలో లైన్ మార్పు కారణంగా మంచినీరు తక్కువగా వస్తాయన్నారు.

March 22, 2025 / 07:30 AM IST

సి బెళగల్లో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

KRNL: సి. బెళగల్లో భారీ పేలుడు సంభవించింది. ఖాజా అనే రైతు తనపొలంలో ఉన్న రాతిగుండ్లు పెకలించే క్రమంలో కంప్రెసర్‌తో పేల్చడంతో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు వీరాంజనేయులు, శ్రీరాములు, మద్దిలేటిగా గుర్తించారు. వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉంది. 

March 22, 2025 / 07:14 AM IST

సైకిల్‌ని ఢీ కొన్న బైక్.. ఒకరు మృతి

కోనసీమ: మాచవరం – రామచంద్రపురం రోడ్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్‌పై వెళ్తుండగా సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

March 22, 2025 / 07:01 AM IST

ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా పాతపట్నం ఎమ్మెల్యే

SKLM: ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా పాతపట్నం నియోజకవర్గం MLA మామిడి గోవిందరావును నియమించారు. ఈ మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించినట్లు పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం తెలిపారు. వెనుకబడిన నియోజకవర్గమే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను గుర్తించి ప్రివిలేజ్ కమిటీలో స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

March 21, 2025 / 08:17 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ప్రకాశం: ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో కంభం పట్టణంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు సయ్యద్ జాకీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించి సమాజానికి మంచి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

March 21, 2025 / 08:13 PM IST

గిరిజన ప్రాంతాలకు బస్సులు నడపాలి

PPM: జిల్లా కేంద్రం నుంచి పలు ప్రాంతాలకు RTC బస్సు సర్వీసులు పెంచాలని CPI జిల్లా కార్యదర్శి తోట జీవన్‌ కోరారు. శుక్రవార స్దానిక ఆర్టీసీ డిపో సిఏ సుమిత్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం కావడంతో పలు ఊర్లకు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కావున ముఖ్య ప్రాంతాలకు సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు.

March 21, 2025 / 08:11 PM IST

కారు ప్రమాదంలో చిన్నారికి గాయాలు

KDP: ముద్దనూరు మండలం ఉప్పలూరులో జరిగిన కారు ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు మేరకు.. ఉప్పలూరుకి చెందిన గోవిందు కీర్తన (6) ఉప్పలూరులోని సచివాలయం వద్ద వారి బంధువుల శుభాకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి  రోడ్డు దాటుతుండగా కారు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రి తరలించారు.

March 21, 2025 / 07:45 PM IST

డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం: ఎక్సైజ్ సీఐ

KDP: డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదామని బద్వేలు ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి సూచించారు. శుక్రవారం డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు, మాదక ద్రవ్యాల వంటి జోలికి వెళ్ళవద్దని, వాటికి దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ నివారణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డీవైఎఫ్ఎ సిబ్బందిని ఆయన అభినందించారు

March 21, 2025 / 07:30 PM IST

గుండెపోటుతో పోలీస్ కానిస్టేబుల్ మృతి

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ముకుంద గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ముకుందకు గుండెపోటు రావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

March 21, 2025 / 07:10 PM IST