కృష్ణా: గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన గోపి నాగబాబుని పార్టీ నేతలు శాలువాతో గురువారం సన్మానించారు.ఈ సందర్భంగా గోపి నాగబాబు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని రాజేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొల్లా రాజేష్, జనసేన పార్టీ నాయకులు వన్నెంరెడ్డి సాయి కిరణ్, బొల్లా యశ్వంత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
NTR: విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ గురువారం వత్సవాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, శాంతిభద్రతల పరిరక్షణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, పనితీరుపై వారితో ముఖాముఖి చర్చించారు.
VZM: పలు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న పఠాన్ బాషా అలీ (31)పై కఠినమైన పిట్ ఎన్డిపిఎస్ చట్టం ప్రయోగించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో 4 గంజాయి కేసుల్లో అరెస్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్భంద ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. గురువారం అతడిని నిర్భందించి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించినట్లు వెల్లడించారు.
అన్నమయ్య: రామసముద్రం నూతన ఎస్సైగా ఉమామహేశ్వర్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
VZM: బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి చీకటి మానవేంద్ర రాయ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన స్వయంగా ఆహ్వానించి, దగ్గరుండి ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి బబిత తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామాన్ని ఎన్నారై దత్తత తీసుకున్నారని ఆ గ్రామ సర్పంచ్ మార్గాని కరుణ ఏసు, గ్రామ పెద్దలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్నారై సౌజన్యంతో సమకూర్చిన డస్ట్ బిన్లను గ్రామ వీధుల్లో ఏర్పాటు చేశారు. దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ.. ఒక డస్ట్ బిన్ సుమారు 4,500 రూపాయలు విలువ చేస్తుందన్నారు. ఇలాంటివి 30ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
AKP: అచ్యుతాపురంలో వంతెన నిర్మాణ పనులను రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బొందల శ్యామ్ గురువారం పరిశీలించారు. అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. రాకపోకలకు ఇబ్బందులు కలక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
కృష్ణా: ఉమామహేశ్వరపురం శివారు ప్రాంతంలో రహస్యంగా జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు వీరవల్లి ఎస్సై శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో కలిసి శిబిరంపై గురువారం దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 11,700, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.
కోనసీమ: తెలుగుదేశంపార్టీ అమలాపురం పార్లమెంట్ ప్రధాన కమిటీ అధికార ప్రతినిధిగా దేవు వెంకట్రాజు నియమితులైన విషయం తెలిసిందే. గురువారం మండపేట తెలుగు దేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి పూలమా వేసి శాలువాతో సత్కరించారు.
W.G: నరసాపురం టీ.డీ.పీ కార్యాలయంలో రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీ.డీ.పీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాత్తూరి రామరాజు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు అందజేయవచ్చని తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆయన విజ్ఞప్తి చేశారు.
VSP: క్రిస్మస్ సెలవు సందర్భంగా గురువారం ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరిగింది. సాగర్నగర్ బీచ్, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, బావికొండ, తోట్లకొండ, మంగమారిపేట బీచ్, ఎర్రమట్టిదిబ్బలు, భీమిలి బీచ్ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబాలతో పర్యాటకులు సందడి చేశారు.
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును రాష్ట్ర రజక కార్పొరేషన్ ఛైర్మన్ సావిత్రి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కర్నూలు నగరంలోని ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆమె శాలువాతో ఎంపీని సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 28న నంద్యాలలో నిర్వహించే రజక ఆకాంక్ష సభకు హాజరుకావాలని ఎంపీ నాగరాజును ఛైర్మన్ సావిత్రి ఆహ్వానించారు.
NLR: ఇందుకూరుపేట మండలం ఆరో మైలు వద్ద వరుస ప్రమాదాలపై కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తున్నట్లు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకోళ్లు పవన్ రెడ్డి గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమైందన్నారు. అయితే MLA సమస్యను తొలిదశలోనే గుర్తించి సమస్యను పరిష్కరింస్తుదన్నారు.
KRNL: జిల్లా TDP పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మను సీఎం చంద్రబాబు నాయుడు నియమించిన సందర్భంగా, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులును ఆమె ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సంక్షిప్తంగా చర్చ జరిగింది. జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న సంకల్పం-మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం కార్యక్రమం పెదకాకానిలో గురువారం నిర్వహించారు. పెదకాకాని CI నారాయణస్వామి ఉత్తర్వుల మేరకు SI రామకృష్ణ నంబూరు సెంటర్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ చేపట్టారు.