తూ.గో: రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్గా ఎనిమిరెడ్డి మాలకొండయ్య శనివారం నియమితులయ్యారు. ఈయన గతంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడికి తగిన గుర్తింపు రావడంతో ఈ నియామకానికి కోరుకొండ పీఎన్ఎమ్ ఓబీసీ మోర్చ డిస్టిక్ మెంబర్ పచ్ఛారి నరసింహమూర్తి హర్షం వ్యక్తం చేశారు.
E.G: భీమోలులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని కొందరు రైతులు పెద్దపులిని చూసినట్లు సమాచారం ఇవ్వడంతో DFO దావీదురాజు శనివారం వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. 6 ట్రాకింగ్ కెమెరాలు అమర్చామన్నారు. ఒంటరిగా ఎవరు తిరగొద్దని, పోలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాయంత్రం 5 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. రిస్క్ టీం పాల్గొన్నారు.
NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ లో లయోలా గార్డెన్స్ సెంటినీ హాస్పిటల్ పక్క రోడ్డులో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
PPM: సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర నాగవంశం కార్పోరేషన్ డైరెక్టర్ జరజాపు దిలీప్ ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరజాపు దిలీప్కు రాష్ట్ర నాగవంశం కార్పోరేషన్ డైరెక్టర్ బాద్యతలను ఇవ్వడం ద్వారా సాలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ప్రత్యేక గుర్తింపునిచ్చిందన్నారు.
AKP: నర్సీపట్నం మండలంలో శనివారం నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా పరిషత్ హై స్కూల్ మెయిన్, జడ్పీ గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ మూడు పరీక్షా కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగింది. మండలంలో 624 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 487 మంది పరీక్ష రాశారని ఎంఈవో తలుపులు తెలిపారు.
విశాఖ జీవీఎంసీ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ 2.0లో భాగంగా అన్ని జోన్లలో 336 ఆక్రమణలను తొలగించినట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర్ రావు శనివారం తెలిపారు. ఫుట్పాత్లపై ప్రజల సురక్షిత నడకకు, రోడ్లు–జంక్షన్ల వద్ద ట్రాఫిక్కు అడ్డంకులు తొలగించేందుకు పోలీసుల సహకారంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.
EG: ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని బంధపరం గ్రామ సర్పంచ్ కాంట్రగడ్డ పరమేశ్వరరావు శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేవరపల్లి మండలం బంధపురం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ములకాల వెంకటరత్నంతో కలిసి CMRF చెక్కులు అందజేశారు. మొత్తం రూ.3 లక్షల రూపాయలు విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కోనసీమ: వ్యవసాయం ద్వారా పరిశ్రమల కంటే ఎక్కువ ఆదాయం తీసుకువచ్చేలా అధునాతన పద్ధతులు రావాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నూతనంగా నియమితులైన కొత్తపేట బ్లాక్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఆత్మ కమిటీ ఛైర్మన్గా జక్కంపూడి సీతారామకృష్ణ బాలాజీ ప్రమాణ స్వీకారం చేశారు
ELR: ఏలూరు తూర్పు వీధిలో జరుగుతున్న గంగానమ్మ జాతర ఉత్సవాలు ఇవాళ అంబరాన్నంటాయి. జాతర ఘట్టంలో భాగంగా వినుకొండ అంకమ్మ అమ్మవారిని ఆవాహనం చేసి, విచిత్ర వేషధారణలతో నగరంలో అంగరంగ వైభవంగా ఊరేగించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఊరేగింపు ట్రాక్టర్ ను ఆయన స్వయంగా కొంత దూరం నడిపారు
కృష్ణా: మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాదర్బార్లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందజేయాలన్నారు.
VZM: గజపతినగరం కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1215 కేసులను గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం వల్ల డబ్బు సమయం ఆదా అవుతుందన్నారు.
SKLM: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ శ్రీకూర్మం క్షేత్రం పుష్కరిని, పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకూర్మం పుష్కరిని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఏ ఏ ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టాలో క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణా: ముప్పాళ్ళ గ్రామంలో బీసీ, ఎస్సీ కాలనీలకు జిల్లా పరిషత్ హై స్కూల్కు సరఫరా అయ్యే రక్షిత మంచినీటి పైప్లైన్ పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రకాశం: గిద్దలూరు కోర్టు ప్రాంగణంలో బాల్య వివాహాలను అరికట్టడంపై మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ హాజరయ్యారు. బాల్య వివాహాలను అరికట్టడం సమాజంలోని ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. చట్టప్రకారం బాల్య వివాహం నేరమని ఆయన పేర్కొన్నారు.
W.G: నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో మాట్లాడి రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.