ప్రకాశం: ఓ నిరుపేద కుటుంబాన్ని పీ – 4 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ శుక్రవారం దత్తత తీసుకున్నారు. మద్దిపాడు మండలం మల్లవరంకి చెందిన మరియమ్మ కుటుంబాన్ని కలెక్టర్ దత్తత తీసుకున్నారు. వారి గృహానికి వెళ్లిన కలెక్టర్ కింద కూర్చొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తర్లుపాడు మండలం మీర్జాపేటలో ఎమ్మార్వో కిషోర్ కుమార్ శుక్రవారం రెవిన్యూ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవిన్యూకు సంబందించిన భూ సమస్యలు ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అన్నమయ్య: రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామం మన్నేరు వాండ్లపల్లెలో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త మన్నేరు వెంకటేశ్వర్లు కోడలు లత కుటుంబాన్ని శుక్రవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని మంత్రి ముందుకొచ్చి రూ. లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
CTR: పారదర్శక ఓటరు జాబితా రూపొందించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ఖచ్చితంగా ఉండేలా అన్ని దశల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అభ్యంతరాలపై వేగంగా స్పందించాలన్నారు. DRO మోహన్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.
KRNL: పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అన్నారు. శుక్రవారం చిప్పగిరి వైసీపీ కార్యాలయంలో వివిధ విభాగాల మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారు MLAను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
PPM: నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి శుక్రవారం కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బంది సమస్యలను విని ఎస్పీ సత్వర పరిష్కారంకు అవకాశం వున్న సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి హమీ ఇచ్చారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో ఆషాడ మాసం శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆషాడం సారే సమర్పించి, ప్రత్యేక పుష్పాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళలు వారి శక్తి కొలది అమ్మవారికి పసుపు, పూలు, కుంకుమ, పండ్లు,తదితర వస్తువులను అందజేశారు.
KRNL: హోళగుంద ఎంఈవో -2గా కబీర్ సాబ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుతం హోళగుంద జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా స్టేట్ టీచర్ యూనియన్ సభ్యులు స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో కబీర్ సాబ్ను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారం, సమన్వయంతో మండల విద్యా శాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
అన్నమయ్య: శ్రీ సౌమ్య నాధుని కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం వేద పండితులు వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజు శ్రీ దేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి కళ్యాణం చూడ ముచ్చటగా సాగింది. కళ్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులతో ఆలయంకిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కళ్యాణవేదికను అలంకరించారు.
NLR: వెంకటాచలం మండలంలోని కంటేపల్లి గ్రామంలో శుక్రవారం సుపరిపాలన పై తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు. అనంతరం ప్రతి గడపకు తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. సంక్షేమ పథక వివరాలను స్థానిక ప్రజలకు వివరించారు.
ELR: జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో రాములునాయక్ పర్యటించారు. లచ్చిగూడెం, గొమ్ముగూడెంలో గ్రామస్థులతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. దాచారం ఆర్అండ్ ఆర్కాలనీల్లో పునరావాస కేంద్రానికి తరలిరావాలని తెలియజేశారు. ఆయన వెంట కుక్కునూరు తహసీల్దారు కె.రమేశ్ బాబు తదితరులు ఉన్నారు.
KDP: దిక్కు మొక్కులేని అనాథలను ఆదుకుని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వివేకానంద సేవాశ్రమాన్నికి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డీ విజయ జ్యోతి 22 వేల రూపాయల విలువగల 18 రేకులను వితరణ చేశారు. సేవాశ్రమం వార్షికోత్సవం పురస్కరించుకుని చేపట్టిన పనుల్లో భాగంగా తన వంతు సాయం చేశానని శుక్రవారం సాయంత్రం విజయ జ్యోతి పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా పుటకలమర్రి ఏపీ మోడల్ స్కూల్ను ఎంపీ బస్తిపాటి నాగరాజు తనిఖీ చేశారు. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆయన దృష్టికి తెచ్చారు. బస్సు సౌకర్యం, ప్రహరీ గోడ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని ప్రిన్సిపల్ను కోరారు.
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో PUC ఛైర్మన్ కూన రవికుమార్ అద్యక్షతన ప్రారంభమైన PUC (పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల వార్షిక నివేదికలు, కార్యకలాపాలను గురించి సమీక్షించారు.
NTR: వివిధ పంటలకు బీమా పరిహారం పొందేందుకు అందుబాటులో ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ భూమి కలిగిన యజమా...