ELR: గత నెల నవంబర్ 6న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అటోమేషన్ సిస్టంలో సమస్య ఏర్పడిన విషయాన్ని ఏలూరు ఎంపీ మహేష్ పార్లమెంటులో శుక్రవారం ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న IP-ఆధారిత ఆటోమేటిక్ మెసేజ్ సెర్చింగ్ సిస్టం స్థానంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ ప్రవేశపెడుతున్నామన్నారు.
ELR: వేలేరుపాడు (M) ఇప్పలగుంపులో ఈనెల 16న జరిగే జనరల్ బాడీ సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం వేలేరుపాడు పార్టీ కార్యాలయం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కొరకు సీపీఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందన్నారు.
SKLM: ప్రజలతో మర్యాదగా, నిస్వార్థంగా వ్యవహరించే విధంగా సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలని ఎస్పీ కెవి.మహేశ్వర రెడ్డి అధికారులను సూచనలు చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నూతనంగా నియామకమైన పోలీస్ అభ్యర్థుల శిక్షణపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలియజేశారు.
KDP: వైసీపీ రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా చాపాడు మండలం టీఓపల్లె గ్రామానికి చెందిన లింగిరెడ్డి రవిశంకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఈ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కొత్తవలస వెలుగు మండల కార్యాలయంలో ఏపీఎం.వెంకటరమణ ఆధ్వర్యంలో మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులకు నాలుగు రోజులు విజన్ బిల్డింగ్ పై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రతీ సభ్యురాలు పొదుపు సంఘం, గ్రామ సంఘ కళలను ఎన్.ఆర్.ఎల్.ఎం భారత ప్రభుత్వంచే నిధులు మంజూరు అవుతాయన్నారు.
CTR: సాంకేతిక యుగంలో ప్రతి ఉపాధ్యాయుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోనే నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలో ODiSI కార్యక్రమం అమలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో OSAAT సంస్థ సలహాదారులు, రిటైర్డ్ IAS కేదార్ పాల్గొన్నారు.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అడ్డగింపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు శుక్రవారం ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల అన్ని రకాల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, ఇన్షూరెన్స్ తదితర పత్రాలు పరిశీలించారు.హెల్మెట్ లేనివారికి జరిమానా విధించారు.
NLR: కావలిలోని సీసీ రోడ్లు, 6 లైన్ తారు రోడ్డు, డ్రైన్లు పనులకు రూ.35 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో యానాదిరెడ్డి బొమ్మ వద్ద నుంచి బృందావన కాలనీ వరకు డ్రైన్ టు ట్రైన్ సీసీ రోడ్డు, బృందావన కాలనీ నుంచి ముసునూరు హైవే వరకు 6 లైన్ తారు రోడ్డు నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
VZM: రాజాంలో అభ్యుదయం సైకిల్ యాత్రను అంబేద్కర్ విగ్రహం జంక్షన్ వద్ద చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సిఐ హెచ్.ఉపేంద్ర ప్రారంభించారు. ఈ ర్యాలిలో సుమారు 300 మంది విద్యార్ధులు, ప్రజలు పాల్గొన్నారు. మార్గ మధ్యలో కరపత్రాలు పంచుతూ, ప్లకార్డులు చూపిస్తూ, డ్రగ్స్ పై నినాదాలు చేస్తూ అవగాహన చేపట్టారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
CTR: ఐరాల మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు పూతలపట్టు MLA మురళీ మోహన్ శుక్రవారం CMRF చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరాల తవణంపల్లి మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు, వెంకటేష్ చౌదరి, కాణిపాకం ఆలయం బోర్డ్ ఛైర్మన్ మణినాయుడు పాల్గొన్నారు.
ప్రకాశం: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ అన్నారు. శుక్రవారం కనిగిరి పట్టణంలోని హైవే రోడ్డు నందు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ATP: అనంతపురం నగరపాలక సంస్థకు 62 ఎలక్ట్రికల్ వాహనాలు మంజూరయ్యాయి. వీటి వల్ల ప్రతి ఏటా రూ. 6 కోట్లు ఆదా అవుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, ఎమ్మెల్యే దగ్గుపాటి శానిటరీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 30 ఏళ్ల డంపింగ్ యార్డ్ సమస్యకు త్వరలో పరిష్కారం చూపించబోతున్నామని వారు పేర్కొన్నారు.
కృష్ణా: గుడివాడ ప్రముఖ న్యాయవాది కంభంపాటి రవిని గుడివాడ 11వ జిల్లా అదనపు కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం శుక్రవారం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఈ నెల 11వ తేదీన జీవోను విడుదల చేశారు. గతంలో కంభంపాటి రవి 2015 నుంచి 2021 వరకు ఇదే కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సమర్థవంతంగా సేవలందించారు.
KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే సత్యప్రభ పెదశంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన వారు తమ వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రతి పిర్యాదును సంబంధిత అధికారులతో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
VZM: నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం కోవెల వీధి స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కార్యదర్శి శ్రీదేవికి శుక్రవారం స్థానికులు వినతిపత్రం అందించారు. స్మశాన వాటికలోకి మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి రహదారి లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. మార్గ మధ్యలో లోతైన కాలువ దాటి మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని చెప్పారు.