ప్రకాశం: ఒంగోలులో నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కార్యక్రమానికి సంబంధించి ఆవిష్కరించిన శిలాఫలకం శుక్రవారం తెల్లవారుజామున నేలకొరిగినట్లు స్థానికులు గుర్తించారు. శిలాఫలకం సహజ కారణాలతో కూలిందా, లేక ఎవరో కావాలనే పడగొట్టారా అన్న అంశంపై టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ శ్రీనివాసరావు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు.
KDP: వైఎస్ వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడైన సునీల్ యాదవ్ భార్య ధనలక్ష్మి, తమ్ముడు కిరణ్లను బెదిరించిన ఘటనపై పులివెందుల CI సీతారామరెడ్డి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గురువారం రాత్రి తన వదినను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వైట్ కలర్ బైక్పై వచ్చి, మీ వదిన, అన్నను చంపితే మీకు దిక్కెవరంటూ’ బెదిరించారని కిరణ్ ఫిర్యాదు చేశాడు.
KDP: పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు భారవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీ శనివారం ఉదయం 5 గంటలకు పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పవిత్ర పాదరాయి వద్ద ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.అధిక సంఖ్యలో పాల్గొని హరిహరుల కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఇవాళ క్యాంపు కార్యాలయంలో ఏపీ నిరుద్యోగ పోరాట సమితి (APNPS) న్యూ ఇయర్ క్యాలండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి ఉత్తరాంధ్ర అధ్యక్షులు కిలారి శ్రీనివాసరావు,TDP మండల అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ క్యాలెండర్ నిరుద్యోగుల సమస్యలపై దృష్టీ సారించేలా రూపొందించబడిందని ఎమ్మెల్యే అన్నారు.
KRNL: మంత్రాలయం (మం) సుంకేశ్వరిలో విద్యుత్ శాఖ అధికారి గోవిందు ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ ఇవాళ నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారుల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని ,నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నాని భరోసా ఇచ్చారు.
PPM: అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే డ్రైడే-ఫ్రైడే తప్పనిసరిగా పాటించాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పి.ఎల్. రఘు అన్నారు. సీతానగరం మండలం లచ్చయ్య పేట గ్రామంలో డ్రై డే-ఫ్రైడే నిర్వహణ తీరును శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యర్థాలు కాలువల్లో, రోడ్లపై వేయరాదని సూచించారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా ఉంచి వీధుల్లో చెత్త సేకరిస్తున్న వారికి అందించాలన్నారు.
W.G: తణుకు పట్టణ పరిధిలోని ఉదయం 10:30 గంటలు దాటినప్పటికీ సచివాలయం తెరుచుకోకపోవడంతో సచివాలయానికి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఏడవ వార్డు ఎన్జీవోస్ కాలనీలో సచివాలయం ఎప్పటికీ తెరచుకోకపోవడంతో స్థానికులు పడిగాపులు కాస్తున్నారు. సమయానికి సచివాలయం తెరవకపోవడంతో గతం నుంచి ఇక్కడ సిబ్బందిపై పలు ఆరోపణలు ఉన్నాయి.
VSP: మధురవాడలోని కార్ షెడ్ బస్టాప్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొనటంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.
PLD: నరసరావుపేట జిల్లా కేంద్రమయ్యాక వాహనాల రద్దీ పెరిగింది. సరైన పార్కింగ్ లేక ప్రజలు అల్లాడుతున్నారు. మల్లమ్మ సెంటర్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. పనుల నిమిత్తం వచ్చే వారు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
KDP: వేముల మండలం పెండ్లూరులో రీసర్వేలో తలెత్తిన భూ సంబంధిత సమస్యలు,పొరపాట్లను సరిదిద్దిన అనంతరం రైతులకు నూతన భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ శుక్రవారం పంపిణీ చేశారు. సందర్భంగా తహసీల్దార్ రెడ్డి లక్ష్మీ మాట్లాడుతూ గతంలో మంజూరైన పాత పాసు పుస్తకాల స్థానంలో తప్పులు లేకుండా కొత్త పాసు పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
ASR: రాజవొమ్మంగి గ్రామం మీదుగా వెళ్లే పంట కాలువ వ్యర్ధాలతో ముసుకుపోయింది. వట్టిగెడ్డ రిజర్వాయర్ నుంచి సుమారు 10 గ్రామాలలో పొలాలకు నీరందించే పంట కాలువలో కొందరు వ్యర్ధాలు వేస్తున్నారని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజవొమ్మంగి పోస్ట్ ఆఫీస్ పక్కన కాలువలో స్థానికులు ఎక్కువగా వ్యర్ధాలు వేస్తున్నారని, అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు వెల్లువెత్తాయి. డిసెంబర్ నెలలో గుంటూరులో రూ.254.51 కోట్లు, పల్నాడులో రూ.105.12 కోట్ల వ్యాపారం జరగ్గా, చివరి 10 రోజుల్లోనే రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.114 కోట్లు అమ్ముడయ్యాయి. ఇక డిసెంబర్ 31 ఒక్కరోజే గుంటూరులో రూ.12.96 కోట్లు, పల్నాడులో రూ. 5.72 కోట్ల ఆదాయం రావడం గమనార్హం.
ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురాన్ని నూతన జిల్లాగా ప్రకటించడంతో పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కంభం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలపై ‘ప్రకాశం జిల్లా అనే పేరును తొలగించి,దాని స్థానంలో మార్కాపురం జిల్లా అనే పేరును అధికారికంగా అమలు చేశారు. కంభం మండల తహసీల్దార్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ మార్పులు చేపట్టారు.
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని తిరుపతి ఎంపీ గురుమూర్తి దర్శించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.