ELR: జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని ఇంఛార్జ్ జిల్లా ఉపరవణ కమిషనర్ కృష్ణారావు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తనిఖీలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం వంటి అంశాలపై ఈ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధిలోని 937 సర్వే నంబర్లో జరుగుతున్న భూ ఆక్రమణల పనులను సంబంధిత అధికారులు అడ్డుకోవాలని ఆ గ్రామ పరిధిలోని ఎస్.కే.ఆర్ నగర్ దళితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 13 ఏళ్ల కిందట అసైన్మెంట్ కమిటీ ద్వారా 937 లోని ప్రభుత్వ భూములను తమకు కేటాయించారన్నారు. కొందరు అన్యాయంగా భూమి చదును పనులు చేశారన్నారు.
ATP: గుంతకల్లు 29వ వార్డుకు చెందిన ఓసీ అనే మహిళ గత కొన్ని రోజులుగా నరాల వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దృష్టికి వార్డ్ ఇంఛార్జ్ అంజి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే బాధితురాలి చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ పథకం కింద రూ. 3,00,557 మంజూరు చేసి, బాధిత కుటుంబానికి అందజేశారు.
GNTR: తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్(52) హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగులు ఫయాజ్ను కొట్టి చంపి పడవేశారు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ఆప్రాన్ పనులు 2021 వరదల్లో దెబ్బతిన్నా ఇప్పటికీ పూర్తికాలేదు. నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రాజెక్టు వద్ద రక్షణ చర్యలకు సిబ్బంది కూడా లేరు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షిస్తున్నా కూడా పనుల్లో పురోగతి లేదని, 8 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టుపై నిర్లక్ష్యం తగదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ATP: తాడిపత్రి మండలంలో చిరుత పులి సంచరిస్తోందన్న సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతంతో పాటు సమీప పొలాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. చిరుత అడుగుజాడల కోసం నిశితంగా పరిశీలిస్తూ పరిసర గ్రామస్థులను అప్రమత్తం చేశారు. పొలాలకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
VSP: ప్రధాని మోదీ నేటి నుంచి 3 రోజులపాటు స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన సోమనాథ్ ఆలయానికి చేరుకుని రాత్రి 8 గంటలకు ఓంకార మంత్ర పఠనం చేస్తారు. రేపు ఆలయ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ శౌర్య యాత్ర, ఆపై బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన ట్రేడ్ షోను ప్రారంభిస్తారు.
KDP: మూడు రోజులక్రితం కడప జిల్లాలో 18 మంది SIలు ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలిసిందే. వారు బదిలీ అయిన స్టేషన్లో రిపోర్ట్ చేయకమునుపే వారిలో కొందరిని మళ్లీ బదిలీ చేశారు. మొదట ప్రొద్దుటూరు రూరల్ స్టేషన్ SIగా అరుణ్రెడ్డిని మైదుకూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన అక్కడ సీట్లో కూర్చోకమునుపే కడప వీఆర్కి బదిలీ అయ్యారు.
ATP: తాడిపత్రిలోని ప్రసిద్ధ శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
SKLM: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పొరుగు సేవల కింద ఖాళీలు భర్తీ చేయడానికి దరఖాస్తు గడువు పొడిగించామని సమగ్ర శిక్షా ఏపీసీ పి. వేణుగోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శని, ఆదివారాలు సెలవు కారణంగా ఈ నెల 12, 13 తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
TPT: తిరుపతి రూరల్ తనపల్లి జంక్షన్ దగ్గర ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బాదితుడిని రుయా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
VZB: కదిలే రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒడిస్సా రాష్ట్రం టిట్లాగర్కు చెందిన పాపుసేథ విజయనగరం జీఆర్పీ, ఎస్సై బాలాజీరావు, రైల్వే రక్షక దళం ఎస్సై రమణ నిందితుడిని పట్టుకొన్నారు. ప్రయాణికుల నుంచి దొంగతనం చేసిన సుమారు రూ. 2 లక్షల విలువైన ఆరు చరవాణులు స్వాధీనం చేసుకుని, రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టులో ప్రవేశిపెట్టినట్లు చెప్పారు.
కడప జిల్లాలో 81,345 విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. కడప డివిజన్లో 23,250, మైదుకూరులో 14,305, ప్రొద్దుటూరులో 30,304, పులివెందులలో 13,486 సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని పారదర్శకంగా చూపిస్తాయని ఎస్ఈ రమణ తెలిపారు. బిల్లులు ఆటోమేటిక్గా రూపొందుతాయన్నారు.
ప్రకాశం: చైనా మాంజా వాడకం ప్రభుత్వం నిషేధించిందని మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ అయినా చైనా మాంజాలు వాడకం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రాణాంతకమైన చైనా మాంజాతో పతంగులు ఎగరవేయకూడదని, వ్యాపారులు చైనా మాంజాలు అమ్మడం చట్టారీత్యా నేరమని చెప్పారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం డి. హీరేహల్ మండలం మురడి గ్రామంలో వెలసిన ప్రసిద్ద ఆంజనేయుడు శనివారం విశేష పూజలు అందుకున్నాడు. ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి మూల విరాట్ను పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.