• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గోల్డ్ చైన్ దొంగతనాల ముఠా అరెస్ట్

KDP: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు మంగళసూత్ర చైన్ దొంగతనానికి సంబంధించిన కేసును ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి దొంగసొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసిన నిందితులుకు 14 రోజుల రిమాండ్ విధించారు.

January 10, 2026 / 09:35 PM IST

గుప్తనిధుల కోసం ప్రాచీన దేవాలయంలో రాతి తొలగింపు

అన్నమయ్య: వీరబల్లి మండలం మట్లి పంచాయతీ పరిధిలోని తొగటపల్లె మాండవ్య నదీ తీరంలో ఉన్న ప్రాచీన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో గుప్తనిధుల కోసం దుండగులు చోరబడ్డారు. దేవుని పాదాలు, శంఖు, చక్రాలకు సంబంధించిన రాతిని తొలగించారు. ఈ ఘటనపై సర్పంచ్ సోమారపు నాగార్జునచారి స్థానిక ఎస్ఐ సుస్మితకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

January 10, 2026 / 09:32 PM IST

ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

NTR: విజయవాడ విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ శనివారం లాంచనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ నగరవాసులకు ఏ విధమైన లాభా పేక్ష లేకుండా ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ఎగ్జిబిషన్ నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపారు.

January 10, 2026 / 09:04 PM IST

స్థలం యజమానులపై కూడా కేసులు: సీఐ

ASR: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొయ్యూరు సీఐ బీ. శ్రీనివాసరావు శనివారం హెచ్చరించారు. సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. పండుగ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. కోడిపందాలు జరిపితే, నిర్వాహకులు, పందెగాళ్లు, స్థలం యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

January 10, 2026 / 09:03 PM IST

‘పార్టీలకు అతీతంగా ఐక్య పోరాటంతో రాయచోటి జిల్లా సాధించాలి’

అన్నమయ్య: రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమం చేపట్టాలని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు టి. ఈశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం రాయచోటిలోని అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద జేఏసీ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు JACలో భాగస్వాములై ప్రత్యేక జిల్లా సాధించాలన్నారు.

January 10, 2026 / 09:02 PM IST

ప్రభల తీర్థాల బందోబస్తు‌పై ఎస్పీ సమీక్ష

కోనసీమ: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగ్గన్న తోట, కొత్తపేట ప్రభల తీర్థం బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ రాహుల్ మీనా శనివారం పర్యవేక్షించారు. ఆయన ఉత్సవ ప్రదేశాలను సందర్శించి, అక్కడ చేపట్టవలసిన భద్రతా చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్థాలకు లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

January 10, 2026 / 08:56 PM IST

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా సాంబశివరావు

GNTR: పొన్నూరు మండలం దండమూడికి చెందిన గుంజేరుపల్లి సాంబశివరావును బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా శనివారం జిల్లా అధ్యక్షుడు తురకా రామారావు నియమించారు. నియామక పత్రం అందుకున్న సాంబశివరావు, తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలని తెలిపారు.

January 10, 2026 / 08:54 PM IST

గంజాయితో పట్టుబడ్డ ముగ్గురు నిందితులు

SKLM: ఇచ్చాపురం మండలం ఎం.తోటూరు జంక్షన్, రైల్వే క్రాసింగ్ గేటు సమీపంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను రూరల్ ఎస్సై జనార్ధనరావు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11.370 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నం నాయుడు ఇవాళ మీడియాకు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.

January 10, 2026 / 08:53 PM IST

గ్రామీణ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణలు

GNTR: యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (RSETI) కొత్తపేట–గుంటూరులో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు, మహిళల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ టీ. సందీప్ బాబు తెలిపారు. దీనిలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, రిఫ్రిజరేషన్ & ఏసీ సర్వీసింగ్ కోర్సులు నిర్వహిస్తారు. శిక్షణ కార్యక్రమంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి అందిస్తారు.

January 10, 2026 / 08:50 PM IST

వంతెన వద్ద గుర్తుతెలియని మృతదేహం

గుంటూరు కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్-కృష్ణానది వంతెన మధ్య శనివారం రైలు ప్రమాదంలో సుమారు 75 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. తెల్ల చొక్కా, తెల్ల లుంగీ ధరించిన మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే జీ.ఆర్.పీ (GRP) ఎస్సైని సంప్రదించాలని పోలీసులు కోరారు.

January 10, 2026 / 08:46 PM IST

జూలో 14 వన్యప్రాణులు జననం

విశాఖ ఇందిరా గాంధీ జూలో సంరక్షణ–బ్రీడింగ్ కార్యక్రమాల ఫలితంగా 14 వన్యప్రాణులు జన్మించాయి. కృత్రిమ ఇన్క్యూబేటర్లలో 6 ఈము పిల్లలు, 1 బ్లాక్ స్వాన్ పుట్టగా, 2 సాంబార్ జింకలు, 2 నిలగాయిలు, 3 బ్లాక్ బక్ జింక పిల్లలు జన్మించాయి. అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని జూ క్యూరేటర్ జె.మంగమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

January 10, 2026 / 08:46 PM IST

‘మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలి’

SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామానికి చెందిన చీకటి శ్రీరాములు జిల్లా మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావును మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

January 10, 2026 / 08:44 PM IST

భీమడోలులో ‘మన పల్లెకు మన ఎంపీ ప్రోగ్రాం’

ELR: భీమడోలులో మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అదేవిధంగా పలు రోడ్లకు అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఒకే ప్రభుత్వం 20- 30 ఏళ్ళు ఉంటే గుజరాత్ తరహా అభివృద్ధి జరుగుతుందన్నరు.

January 10, 2026 / 08:42 PM IST

బాలికలకు రక్షణ కల్పించాలి: సిస్టర్ విద్యా

GNTR: ఆడబిడ్డలను పుట్టనివ్వాలని, స్వేచ్ఛగా ఎదగనివ్వాలని గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్యా అన్నారు. తాడేపల్లి పరిధి గుండిమెడలో సరోజిని నాయుడు బాలల పార్లమెంట్ గ్రూప్‌లో శనివారం బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై అవగాహన కల్పించారు. దేశంలో 53.22% మంది బాలలు లైంగిక అత్యాచారాలకు గురౌతున్నారని ఆమె అన్నారు.

January 10, 2026 / 08:41 PM IST

అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి: మంత్రి

W.G: అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇవాళ రాత్రి తాడేపల్లిగూడెంలో అభివృద్ధి చేసిన విజయవాడ – విశాఖపట్నం రహదారిని ఆయన పరిశీలించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి రూ.31కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోట అభివృద్ధి తప్ప వేరే మాట రాదన్నారు.

January 10, 2026 / 08:40 PM IST