AKP: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కసింకోటలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్ను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలని ఆదేశించారు. వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. సమస్యలు ఉంటే తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో అప్పారావు ఉన్నారు.
కృష్ణా: రంజాన్ మాసం సందర్భంగా గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు సామాజిక సేవకుడు మున్నా భాయ్ 100 మంది పేద ముస్లిం కుటుంబాలకు 11 రకాలతో కూడిన నిత్యవసర సరుకులతో రంజాన్ తోఫాను ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసం అనేది దానం, సహాయం, మానవతా విలువలను పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు.
TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ క్యార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో సోమవారం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 6 కంపెనీల ప్రతినిధులు పాల్గొని పదొవ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దాదాపు 650 ఉద్యోగాలకు భర్తీ చేపట్టనున్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.
VZM: చీపురుపల్లి మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు MEO బూసి నాయుడు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 7.45 నుంచి 12:30 వరకు తరగతులు నిర్వహించి, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. టెన్త్ పరిక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు.
GNTR: కొల్లిపర మండలంలోని కొల్లిపర, అత్తోట, వల్లభాపురం పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని SI ఎన్.సి. ప్రసాద్ వెల్లడించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షల దృష్ట్యా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
PPM: చీపురుపల్లి గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం పారిశుద్ధ్య పనులను కార్మికులు చేపట్టారు. విజయనగరం,రాజాం, లావేరు రోడ్లతో పాటు సంత మార్కెట్, విజయ కాలనీలో చెత్తని ఊడ్చి ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. ఈ పనులను జూనియర్ సహాయకులు రామ్మోహన్ రావు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరు డస్ట్ బిన్ వాడుకోవాలని సూచించారు.
E.G: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాసాలు భక్తిశ్రద్ధలతో చేసే ముస్లింలకు అల్లా ఆనందం, ఆరోగ్యం కల్పించాలని ప్రార్థించారు.
W.G: పదవ తరగతి విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి పరీక్షా కేంద్రాలకు పంపవద్దని టౌన్ సీఐ బి.యాదగిరి తల్లిదండ్రులకు సూచించారు. మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చివరి నిమిషంలో హడావుడి పడకుండా విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీకి చెందిన మాజీ ZPTC చెన్నకేశవులు సతీమణి సుబ్బమ్మ ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వెంటనే వారి నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోనసీమ: రహదారి ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న చర్యలు చేపట్టింది. SP ఆదేశాలతో అమలాపురంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై అర్ధరాత్రి, సోమవారం తెల్లవారుజామున వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. వారితో కాసేపు మాట్లాడి.. నిద్రమత్తు వల్ల కలిగే ముప్పును వివరిస్తూ లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు నందీశ్వరునికి ప్రదోష పూజలు నిర్వహించనున్నారు. ప్రదోష అభిషేక పూజకు అవసరమైన పూజా సామగ్రిని భక్తులు కానుకలుగా సమర్పించవచ్చు. పూజలో పాల్గొనాలనుకునే భక్తులు రూ.500 టికెట్ తీసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు.
ప్రకాశం: వంటగ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి టంగుటూరు మండలం పొందూరులో సీపీఎం నాయకుడు మోజస్ స్థానికులతో కలసి నిరసన చేపట్టారు. ఇరాన్ చమురుపై పెత్తనం కోసం అమెరికా యుద్ధం చేస్తుందని దానివల్ల భారతలో ధరలు పెంచి సామాన్యలును ఇబ్బంది పెడుతున్నారుని విమర్శించారు. రైతులకు వ్యతిరేకమైన అమెరికా- భారత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు.
AKP: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ సోమవారం అనకాపల్లి వస్తున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో జరిగే పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొంటారు. ఈనెల 23న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించనున్నారు.
ATP: జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ప్రతిభావంతులైన యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లకు అవార్డులు అందజేశారు. సోషల్ మీడియా ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని ఎంపీ పిలుపునిచ్చారు.
NLR: పొదలకూరు మండలం మరుపూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ (14) అనే బాలుడు ఆదివారం రాత్రి ఈత కొట్టడానికి వెళ్లి పాత తాగునీటి బావిలో మునిగి మృతి చెందాడు. సుమారు 25 అడుగుల లోతు ఉన్న బావిలో డైవింగ్ చేసిన తర్వాత పైకి రాకపోవడంతో గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు.