• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇంట్లోకి దూరిన నాగుపాము

ప్రకాశం: మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని మహమ్మద్ నగర్‌లో గురువారం రాత్రి ఓ ఇంట్లోకి నాగుపాము దూరింది. బుసలు కొడుతున్న నాగుపామును చూసి కుటుంబీకులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిగా వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

March 13, 2026 / 07:13 AM IST

నేడు ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం: ఏవో

W.G: మొగల్తూరులో శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏవో అడబాల జ్యోషిలా తెలిపారు. నరసాపురం మండలంలో 7982 రైతులకు, రూ.4.52 కోట్లు రైతుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హాజరవుతరన్నారు. గ్రామాల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.

March 13, 2026 / 07:10 AM IST

ఈనెల 17న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 17న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బీ.శేషన్న తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదల, పన్నుల వసూళ్లు, ప్రజా సమస్యలు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు.

March 13, 2026 / 07:03 AM IST

జీడీపీలో జిల్లాకు 21వ ర్యాంకు

కోనసీమ: కలెక్టర్లు ప్రతినెలా కనీసం 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పర్యటించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుతాయని స్పష్టం చేశారు. జీడీపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా 21వ ర్యాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు.

March 13, 2026 / 07:00 AM IST

ఉత్తమ సేవా పతకాలకు 27 మంది పోలీసుల ఎంపిక

KRNL: జిల్లా పోలీసు శాఖలో విశిష్ఠ సేవలు అందించిన 27 మంది అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్తో పాటు వివిధ సేవల్లో ప్రతిభ చూపినందుకు పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వీరికి పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

March 13, 2026 / 07:00 AM IST

అనంతలో చీనీ, టమాటా ధరలు ఇలా..!

అనంతపురం జిల్లాలో చీనీ ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ టమాటా ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. అనంతపురం మార్కెట్ యార్డులో చీనీ కాయలు టన్ను గరిష్ట ధర రూ.22,000, కనిష్ట ధర రూ.8 వేలు పలికింది. కక్కలపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా ధర రూ.6, కనిష్ట ధర రూ.3, ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయి. దీంతో టమాటా పండించిన రైతులు ధరల తగ్గింపుతో వాపోతున్నారు.

March 13, 2026 / 07:00 AM IST

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: జేసీ

ఏలూరు జిల్లాలో గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జేసీ అభిషేక్ గౌడ్ తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదని, అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన స్పష్టం చేశారు.

March 13, 2026 / 07:00 AM IST

నేడు రైతుల ఖాతాల్లోకి ‘అన్నదాత సుఖీభవ’ నిధులు

సత్యసాయి: జిల్లా రైతులకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడో విడత నిధులు శుక్రవారం జమ కానున్నాయి. జిల్లాలోని 2,65,262 మంది రైతుల ఖాతాల్లో రూ.155.27 కోట్లు జమ చేయనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్రం రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

March 13, 2026 / 06:50 AM IST

జిల్లాకు రూ.87.50 కోట్లు మంజూరు

ప్రకాశం: పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. మార్కాపురం జిల్లాలోని 1,52,190 రైతులకు రూ.87.50 కోట్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ తెలిపారు. నగదు రైతుల ఖాతాలో జమ కానుందన్నారు. గిద్దలూరు-రూ.21.71 కోట్లు, కనిగిరి-రూ.24.30 కోట్లు, మార్కాపురం-రూ.19.05 కోట్లు, ఎర్రగొండపాలెం-రూ.22.45 కోట్లు మంజూరయ్యాయన్నారు.

March 13, 2026 / 06:40 AM IST

అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

ELR: పోలవరం మండలం గాజులగొందిలో ఐదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. 2018 ఏప్రిల్లో ఆడుకుంటున్న చిన్నారిని మభ్యపెట్టి అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో, ఉమ్మడి జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి వాణి గురువారం తీర్పు వెలువరించారు.

March 13, 2026 / 06:34 AM IST

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీ దినోత్సవం

కడప నగర పరిధిలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం కిడ్నీ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కిడ్నీ విభాగాధిపతి డాక్టర్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం మన శరీరానికి ఎంతో అవసరం తెలిపారు. కిడ్నీ శరీరంలోని వ్యర్ధాలు తొలగించడం, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

March 13, 2026 / 06:30 AM IST

విశాఖ పోర్టులో సరకు రవాణా రికార్డు

VSP: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) సరకు రవాణా చేసి చరిత్రాత్మక మైలురాయి అందుకుంది. 92 ఏళ్ల పోర్టు చరిత్రలో ఇదే అత్యధిక సరకు రవాణా అని అధికారులు తెలిపారు. ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియడానికి 90 రోజులు ఉండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

March 13, 2026 / 06:30 AM IST

పదో తరగతి పరీక్షలకు అధికారుల నియామకం

ATP: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు 162 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 164 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. వీరితో పాటు 9 మంది అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులు, 1941 మంది ఇన్విజిలేటర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.

March 13, 2026 / 06:30 AM IST

మహిళల భద్రతకు జీరో టాలరెన్స్ విధానం

AKP: మహిళల భద్రతకు జీరో టాలరెన్స్ విధానాం ద్వారా నేరగాళ్లలో భయం పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండు రోజులు పాటు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో హోంమంత్రి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జీరో యాక్సిడెంట్ లక్ష్యంతో పని చేయాలని సీఎం సూచించారన్నారు.

March 13, 2026 / 06:29 AM IST

నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ప్రకాశం: చీమకుర్తి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఇవాళ జరుగుతుందని ఎంపీడీవో రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయి అధికారులు అందరూ సమావేశానికి వచ్చేటప్పుడు వారివారి ప్రగతి నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని అయన పేర్కొన్నారు.

March 13, 2026 / 06:27 AM IST