• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KKD: రైతు అభ్యన్నతితో పాటు వారి భూములకు పూర్తి రక్షణ కల్పన కోసమే రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు రూపొందించడం జరిగిందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తుని మండలం నందివంపులో తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల దివ్య హాజరైయ్యారు. ఇక్కడ 185 మంది రైతులకు డిజిటల్ పాసు పుస్తకాలను అందజేశారు.

April 2, 2026 / 06:16 PM IST

నియోజకవర్గానికి రూ.255 కోట్లతో బడ్జెట్: ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు నియోజకవర్గానికి రానున్న 2026 -27 ఆర్థిక సంవత్సరానికి రూ.255 కోట్లతో బడ్జెట్ అంచనాలను తయారుచేసి ప్రభుత్వానికి పంపినట్లు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సాజా నాయక్, జిల్లా గృహ ఎంపీడీవో మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

April 2, 2026 / 06:15 PM IST

ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి

కోనసీమ: ఉండూరులో శ్రీ మార్కండేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. రూ.1.35 కోట్లతో ఆలయాన్ని సుందరీకరించనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ చంద్రశేఖర్, సత్యం, ఏఎంసీ ఛైర్మన్ రిశ్వంత్ రాయ్ పాల్గొన్నారు.

April 2, 2026 / 06:12 PM IST

‘సర్వేపల్లిలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలి’

NLR: పార్లమెంట్లో అమరావతిని AP రాష్ట్ర రాజధానిగా ప్రకటించే బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ నాయకుల ఆదేశాల మేరకు బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించి, Dr. BR అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద ముగింపు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

April 2, 2026 / 06:06 PM IST

‘లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి’

GNTR: పెదకాకాని సీపీఐ కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గం ఏఐటీయూసీ నూతన బాధ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడిగా ఎంపికైన కేతినేని అగస్టీన్, మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, పని గంటలను పెంచే నిర్ణయాలను వ్యతిరేకించాలన్నారు.

April 2, 2026 / 06:05 PM IST

హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

మార్కాపురంలో అత్తను హత్య చేసిన ఘటనలో యర్రగొండపాలెంకి చెందిన నిందితుడు వెంకటేశ్వర్లకు జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ గురువారం మార్కాపురం కోర్టు తీర్పు ఇచ్చింది. 2024వ సంవత్సరంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేశ్వర్లు అత్తను హత్య చేసినట్లుగా పోలీసులు సాక్షదారులతో కోర్టులో నిరూపించారు.

April 2, 2026 / 06:02 PM IST

రాజధాని రాష్ట్రానికి హృదయం లాంటిది: ప్రిన్సిపాల్

TPT: రాజధాని రాష్ట్రానికి హృదయం లాంటిదని ప్రిన్సిపాల్ డా. బి. చంద్రమౌళి అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా నిర్ణయించడం ఆనందకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో రాజధాని ప్రాముఖ్యతపై చర్చించారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

April 2, 2026 / 06:02 PM IST

రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

KRNL: పసుపుల గ్రామంలో షేర్ సుల్తాన్ దర్గా వద్ద ‘వీబీ జీ రామ్‌జీ’ పథకాల కింద రూ.15 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ ఈ పనులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, గ్రామ సర్పంచ్ శీలమ్మ, భూమి పూజ చేసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం చేపట్టాక గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో DEE కరెన్న, MPDO పాల్గొన్నారు.

April 2, 2026 / 06:00 PM IST

శ్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం

W.G: ఆచంట -పాలకొల్లు ప్రధాన రహదారిలోని ఎస్సీ శ్మశాన వాటికలో రూ.10 లక్షల పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్ కోట సరోజినీ వెంకటేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ప్రహరీ గోడతో పాటు రెండు కల్వర్టులను నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణంతో అటు ప్రయాణికులకు, ఇటు స్థానికులకు ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు.

April 2, 2026 / 06:00 PM IST

గండి అంజన్న సేవలో అనంతపురం ప్రధాన న్యాయమూర్తి

KDP: ప్రసిద్ధ గండి ఆంజనేయస్వామి క్షేత్రానికి విచ్చేసిన అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవికి వేంపల్లె టీడీపీ ఇన్‌ఛార్జ్ రఘునాథరెడ్డి స్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు గండి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. న్యాయమూర్తికి స్వామి వారి ఆశీర్వాదం అందించారు.

April 2, 2026 / 06:00 PM IST

జిల్లాలో భారీగా పెరిగిన మద్యం విక్రయాలు

ATP: జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో మద్యం అమ్మకాలు 16 శాతం వృద్ధి చెందాయి. గతేడాది రూ. 1040.68 కోట్ల విలువైన విక్రయాలు జరగగా, ఈసారి అది రూ. 1207.01 కోట్లకు చేరింది. ఐఎంఎల్ కేసులు 33 శాతం, బీర్ల అమ్మకాలు 79 శాతం మేర పెరిగాయి. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

April 2, 2026 / 05:54 PM IST

‘సర్దార్ పాపన్న గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి’

E.G: కొవ్వూరులో సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, బీసీ సోదరులు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. సర్దార్ పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు అని అన్నారు.

April 2, 2026 / 05:51 PM IST

ప్రధాని మోదీని కలిసిన మాగుంట బృందం

ప్రకాశం: న్యూ ఢిల్లీ పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కూటమి ఎంపీల బృందంతో పాల్గొన్నారు.

April 2, 2026 / 05:48 PM IST

కలెక్టర్ వీడ్కోలులో భాగంగా భారీ ర్యాలీ

ASR: జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బదిలీ అయిన విషయం తెలిసిందే. జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌కు గురువారం పాడేరులో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా అధికారులు, సిబ్బంది పాడేరులోని అంబేద్కర్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

April 2, 2026 / 05:48 PM IST

గంగవరం పాఠశాలలో పల్లా ఆకస్మిక తనిఖీ

విశాఖ గంగవరం ప్రభుత్వ పాఠశాలను గురువారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సరిగా లేకపోతే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ భోజనం తనిఖీ చేయాలని ఆదేశించారు.

April 2, 2026 / 05:42 PM IST