KRNL: ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 124వ రోజుకు చేరాయి. ఈరోజు క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు పాలక, ప్రతిపక్ష నేతలు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.