KNR: కరీంనగర్ రేకుర్తి ఈద్గాలో బక్రీద్ ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.