• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

మే 04: సోమవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖ మాసం, బహుళ పక్షం తదియ: రా. 2-50 తదుపరి చవితి అనూరాధ: ఉ. 8-04 తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: మ. 2-16 నుంచి 4-03 వరకు అమృత ఘడియలు: రా. 12-55 నుంచి 2-42 వరకు దుర్ముహూర్తం: మ. 12-21 నుంచి 1-12 వరకు తిరిగి 2-53 నుంచి 3-44 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5.37; సూర్యాస్తమయం: సా.6.16

May 4, 2026 / 01:30 AM IST

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,980 మంది భక్తులు దర్శించుకోగా.. 26,511 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లుగా వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

April 29, 2026 / 07:58 AM IST

ఏప్రిల్ 29: బుధవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం త్రయోదశి: రా.7:43 తదుపరి చతుర్దశి హస్త: రా.12:14 తదుపరి చిత్త వర్జ్యం: ఉ.8:03 నుంచి 9:43 వరకు అమృత ఘడియలు: సా.6:00 నుంచి 7:40 వరకు దుర్ముహూర్తం: ఉ.11:31 నుంచి 12:22 వరకు రాహుకాలం: మ.12:00 నుంచి 1:30 వరకు సూర్యోదయం: ఉ.5:40; సూర్యాస్తమయం: సా.6:14.

April 29, 2026 / 02:43 AM IST

ఏప్రిల్ 28: మంగళవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం ద్వాదశి: రా.7:35 తదుపరి త్రయోదశి; ఉత్తర: రా.11:21 తదుపరి హస్త; వర్జ్యం: ఉ.6:17 నుంచి 7:55 వరకు; అమృత ఘడియలు: సా.4:02 నుంచి 5:40 వరకు; దుర్ముహూర్తం: ఉ.8:10 నుంచి 9:01 వరకు; తిరిగి రా.10:48 నుంచి 11:34 వరకు రాహుకాలం: సా.3:00 నుంచి 4:30 వరకు సూర్యోదయం: ఉ.5:40; సూర్యాస్తమయం: సా.6:14.

April 28, 2026 / 01:54 AM IST

ఏప్రిల్ 27: సోమవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం ఏకాదశి: రా.7:59 తదుపరి ద్వాదశి పుబ్బ: రా.10:58 తదుపరి ఉత్తర వర్జ్యం: ఉ.7:02 నుంచి 8-37 వరకు అమృత ఘడియలు: సా.4:36 నుంచి 6:11 వరకు దుర్ముహూర్తం: మ.12:21 నుంచి 1:11 వరకు తిరిగి 2:52 నుంచి 3:42 వరకు రాహుకాలం: ఉ.7:30 నుంచి 9:00 వరకు సూర్యోదయం: ఉ.5:40; సూర్యాస్తమయం: సా.6:13 గంటలకు.

April 27, 2026 / 01:29 AM IST

నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు 

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఐదు రోజులపాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఇవాళ స్వస్తి వాచనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఐదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు.

April 26, 2026 / 09:42 AM IST

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి శిలా తోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న 80,350 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,597 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

April 26, 2026 / 08:49 AM IST

కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్న 3 రోజుల్లోనే 90 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తొలిరోజే రికార్డు స్థాయిలో 38 వేల మంది దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు, NDRF బృందాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రయాణ వివరాల కోసం కేవలం ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే సంప్రదించాలని జిల్లా ఎస్పీ నిహారికా తోమర్ సూచించారు.

April 25, 2026 / 11:45 AM IST

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,270 మంది దర్శించుకున్నారు. 33,180 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

April 25, 2026 / 08:20 AM IST

నేటి నుంచి పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు

తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండోరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడ వాహనంపై విహరించనున్నారు. స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు, పూలబంతి ఆట, వస్త్రధారణ వంటి సాంప్రదాయ ఆచారాలు జరిపిస్తారు.

April 25, 2026 / 06:58 AM IST

శ్రీవారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండి ఆదాయం రూ.3.46 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

April 24, 2026 / 07:48 AM IST

ఏప్రిల్ 24: శుక్రవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం అష్టమి: రా.11:45 తదుపరి నవమి; పుష్యమి: రా.12:29 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: ఉ.9:16 నుంచి 10:47 వరకు; అమృత ఘడియలు: సా.6:24 నుంచి 7:55 వరకు; దుర్ముహూర్తం: ఉ.8:12 నుంచి 9:02 వరకు తిరిగి మ.12:22 నుంచి 1:12 వరకు; రాహుకాలం: మ:10:30 నుంచి 12 వరకు; సూర్యోదయం: ఉ.5.42 గంటలకు; సూర్యాస్తమయం: సా.6.13 గంటలకు.

April 24, 2026 / 01:40 AM IST

కాశీని ‘మహా స్మశానం’ అంటారెందుకు?

కాశీలో మరణించిన వారి శరీరాలే కాదు.. ఆత్మలు కూడా ఆ పరమాత్మలో కలిసిపోతాయని అంటారు. వాళ్లు మళ్లీ జన్మించరు.. జీవులు శాశ్వతంగా లయమయ్యే చోటు అని చెబుతారు. అందుకే ఆ పుణ్యస్థలిని మహా స్మశానం అని అంటారు. ప్రళయకాలంలో ప్రపంచమంతా నశించినా మహా స్మశానమైన కాశీ మాత్రం స్థిరంగా ఉంటుందని పురణాలు పేర్కొన్నాయి. అందుకే కాశీకి క్రాంతి క్షేత్రమని పేరు.

April 23, 2026 / 08:58 AM IST

నేటి నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ ఆలయం ఇవాళ ఉదయం 8 గంటలకు తెరుచుకోనుంది. 6 నెలల తర్వాత అక్షయ తృతీయ శుభ ఘడియల్లో తెరచుకుంటోంది. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా డోలీ (ఉత్సవమూర్తి) ఇప్పటికే కేదార్‌నాథ్‌ ధామ్‌కు చేరుకున్నారు. ఇప్పటివరకు 14.5 లక్షల మందికి పైగా భక్తులు చార్‌ధామ్‌ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు.

April 22, 2026 / 06:56 AM IST

కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేధం

కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను అధికారులు పూర్తిగా నిషేధించారు. అక్కడ ఫొటోలు, వీడియోలు తీయడం లేదా రీల్స్ చేయడంపై కఠిన ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

April 21, 2026 / 04:12 PM IST