AP: తిరుపతిలోనే కాకుండా గన్నవరం, రాజమండ్రి, విశాఖ ఎయిర్ పోర్టుల్లోనూ శ్రీవారి దర్శనం శ్రీవాణి టికెట్లు జారీ చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వాటిని 3 నెలలకోసారి ఆన్లైన్లో రోజుకు 500 చొప్పున జారీ చేస్తున్నారు. వీటితో పాటు కరెంట్ బుకింగ్లో రూ.10,500 చెల్లించి, టికెట్లు పొందే 800 మంది భక్తులకు అదేరోజు సాయంత్రం దర్శనం కల్పిస్తున్నారు.