TG: ఖమ్మం బురాన్పురంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. దీంతో నారాయణరావు దంపతులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, స్థానికులు మంటలను అదుపు చేశారు. గ్యాస్ లీకేజ్ వల్ల పేలుడు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ఇళ్లలోని తలుపులు, కిటికీలు పగిలిపోయాయి.
TG: హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రశాంతినగర్లో అగ్నిప్రమాదం జరిగింది. రెండు దుకాణాల్లో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. ఈ ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వాపురం మండలం మొండికుంటలో KLR ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
స్విట్జర్లాండ్లో న్యూ ఇయర్ వేడుకల్లో ఘోర విషాదం జరిగింది. క్రాన్స్-మోంటానా రిసార్ట్లోని బార్లో జరిగిన అగ్నిప్రమాదంలో 47 మంది సజీవదహనమయ్యారు. మరో 115 మందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. పరిమిత స్థలంలో మండే పదార్థాల వల్లే ‘ఫ్లాష్ ఓవర్’ జరిగి మంటలు వ్యాపించాయి. దేశ చరిత్రలోనే ఇది భారీ విషాదం.
TG: హైదరాబాద్ ముసారాంబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. మృతులు తిరుమల రావు, వెంకటమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. అన్నంలో పరుగులమందు కలిపి ఆమె తిని, పిల్లలకు తినిపించింది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె చనిపోగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు తల్లి ప్రసన్న(40), కుమార్తె మేఘన(13)గా పోలీసులు గుర్తించారు. 2 నెలల కిందట ప్రసన్న భర్త గుండెపోటుతో చనిపోయాడు.
AP: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో తుడుములదిన్నెలో సురేంద్ర అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం సురేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పిల్లలను కావ్య(7), రాజేశ్వరి(4), సూర్యగగన్(2)గా పోలీసులు గుర్తించారు. అయితే, 8 నెలల క్రితమే సురేంద్ర భార్య చనిపోయింది.
రష్యాలోని ఖేర్సన్ రీజియన్లో ఒక కేఫ్ అండ్ హోటల్పై ఉక్రెయిన్ దళాలు డ్రోన్తో దాడి చేశాయి. ఈ ఘటనలో 24 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం. పౌరులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా ఈ దాడి జరిగినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంతో, రష్యా ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.
జమ్ముకశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం రేపింది. నియంత్రణ రేఖ(LoC) వెంబడి భారత గగనతలంలోకి చొరబడిన ఈ డ్రోన్.. ఐఈడీలు, మాదకద్రవ్యాలను జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 5 నిమిషాల పాటు ఇది భారత గగనతలంలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి 10 మంది మరణించగా, దాదాపు 150 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఒక టాయిలెట్ కింద ఉన్న ప్రధాన వాటర్ లైన్ లీక్ అవ్వడమే ఈ ఘోరానికి కారణమని అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులుగా ఒక అధికారిని ఉద్యోగం నుంచి తొలగించి, మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఏడుగురు మరణించగా, దాదాపు 150 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఒక టాయిలెట్ కింద ఉన్న ప్రధాన వాటర్ లైన్ లీక్ అవ్వడమే ఈ ఘోరానికి కారణమని అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులుగా ఒక అధికారిని ఉద్యోగం నుంచి తొలగించి, మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.
స్విట్జర్లాండ్లోని ప్రముఖ స్కీ రిసార్ట్ క్రాన్స్-మొంటానాలో న్యూ ఇయర్ వేడుకలు విషాదం చోటుచేసుకుంది. ‘లీ కానిస్టెలేషన్’ అనే బార్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
TG: నూతన సంవత్సర వేడుకల్లో బిర్యానీ తిని ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్లో జరిగింది. మద్యం తాగి.. బిర్యానీ తిన్న 16 మంది అస్వస్థతకు గురి కాగా.. పాండు(53) అనే వ్యక్తి మృతి చెందాడు. వారిలో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుములదిన్నెలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో వేములపాటి సురేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.