AP: వేర్వేరు ప్రమాద ఘటనల్లో సీమకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు హైవే గోడ్డావుల కోట వల్ల బొలేరో వాహనాన్ని కారు ఢీకొనగా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అటు కర్ణాటక బళ్లారి సమీపంలో ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు-కారు ఢీకొనగా.. కర్నూలు జిల్లా అదోనికి చెందిన అనురాగ్-ఐశ్వర్య దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TG: కామారెడ్డిలో మరో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. బాలసదన్ భవన్ నుంచి ఉదయం 6 గంటల సమయంలో కనిపించకుండాపోయారు. ఈ క్రమంలో బాలసదన్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇది మూడో ఘటన.
AP: శ్రీశైలంలో వాహన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు గాయపడ్డారు. ఆలయ టోల్గేట్ వద్ద వాహనం బ్రేక్ ఫెయిలై కూడలి వద్ద కొందరు కన్నడ భక్తులను ఢీకొడుతూ ముందుకు దూసుకెళ్లింది. గాయపడిన వారిని స్థానికులు శ్రీశైలం దేవస్థానం ఆస్ప్రతికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో కల్తీ పాలు తాగి మరణించివారి సంఖ్య 15కు చేరింది. కల్తీ పాల వల్ల కిడ్నీతో పాటు ఇతర శరీర భాగాలు దెబ్బతిని చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
AP: NTR జిల్లాలో పోలీసులు భారీగా అల్ఫ్రాజోలంను సీజ్ చేశారు. కొండపల్లిలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బొల్లారానికి చెందిన సాయి త్రిభువన్ వర్మ, సౌరబ్ కుమార్ను అరెస్ట్ చేసి 200 కేజీల అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు.
TG: భద్రాద్రి కొత్తగూడెంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దమ్మపేట మండలం గండుగలపల్లి ఏకలవ్య హాస్టల్లో ఈ ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం విద్యార్థులు చికెన్ తినగా అర్ధరాత్రి నుంచి 27 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. అయితే సిబ్బంది ఈ విషయాన్ని దాచి పెట్టి వైద్యం చేయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్ అంబర్పేట్లోని రహత్నగర్లో పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 2,500 కేజీల కల్తీ పెరుగుతో పాటు.. పెరుగు తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు సీజ్ చేశారు. NR ఎంటర్ప్రైజెస్ పేరుతో 6 నెలలుగా కల్తీ పెరుగు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
TG: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి- గన్నారం మధ్య ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ATP: శెట్టూరు మండలం తిప్పనపల్లిలో 2022లో జరిగిన బాలుడి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భూ తగాదాల నేపథ్యంలో విష్ణువర్ధన్ అనే 11 ఏళ్ల బాలుడిని చిత్తప్ప, ఈరన్న, మురుకుందప్ప కలిసి హత్య చేశారు. కేసును విచారించిన జిల్లా జడ్జి భీమారావు నిందితులకు జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పు ఇచ్చారు.
TG: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్లలో ఘోరం జరిగింది. రెండో బోరు వేసే విషయంలో భర్తతో జరిగిన వివాదంతో ఆవేశానికి గురైన జంగమ్మ.. తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు జ్యోతి, శైలజ ప్రాణాలు కోల్పోయారు. అయితే, కుమారుడు జస్వంత్ చాకచక్యంగా బావి అంచును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
ATP: గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ వుంచిన రేషన్ బియ్యం స్థావరంపై పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడులు చేశారు. ఎస్సై సురేష్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. సుమారు 130 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
TG: నిర్మల్ జిల్లాలోని ఇచ్చోడ మండలం సోంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 18 మందికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
TG: హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను బిక్యాసింగ్, సూరజ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. చికిత్స పొందుతూ స్వరూప్ నగర్కు చెందిన బండారు వీరలక్ష్మీ(60) మృతి చెందారు. కాగా వీరంతా కల్తీ పాలు తాగడం వల్ల కిడ్నీతో పాటు ఇతర శరీర భాగాలు దెబ్బతిని చనిపోతున్న సంగతి తెలిసిందే.
NLR: ఆటోలో ప్రయాణిస్తూ కిందకు దూకగా డివైడర్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నెల్లూరు నుంచి కోవూరు వైపు వెళుతున్న ఆటోలో ఎక్కిన యువకుడు ఫ్లైఓవర్పైకి రాగానే ఆటోలో నుంచి దూకాడు. డివైడర్ ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అయితే యువకుడు ఎందుకు దూకాడో కారణాలు తెలియాల్సి ఉంది.