• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రోడ్డు పక్కన మృతదేహం కలకలం

TG: మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు పక్కన మృతదేహం కలకలం రేపింది. మృతుడిని శామీర్‌పేట మండలం ఆలియాబాద్‌కు చెందిన శ్యామ్‌గా గుర్తించారు. శ్యామ్ వృత్తి రిత్యా ఫంక్షన్లలో వంటలు చేస్తూ జీవనం సాగించేవాడని సమాచారం. అయితే, ఎక్కడైనా చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా.. ఎవరు చంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2025 / 12:38 PM IST

దారుణం.. డెడ్ బాడీతో పోలీసుల ముందుకు

AP: ఉ.గుంటూరు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన భార్య మహాలక్ష్మిని గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సంతమాగలూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల తరచూ గొడవలు అవుతుండగా విడిపోయారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆమె దగ్గరకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఉదయం హత్య చేశాడు.

December 14, 2025 / 12:17 PM IST

కుప్పకూలిన ఆలయం..భారత సంతతి వ్యక్తి మృతి

దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో  నిర్మిస్తున్న నాలుగంతస్తుల అహోబిలం ఆలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 52ఏళ్ల భారత సంతతి వ్యక్తి, ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు విక్కీ జైరాజ్ పాండేతో సహా నలుగురు చనిపోయారు. ప్రమాద సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయంపై క్లారిటీ రాలేదు.   

December 14, 2025 / 11:42 AM IST

భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

AP: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెహ్రూచౌక్ సెంటర్‌లోని వస్త్రదుకాణాల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటలు పక్కనే ఉన్న దుకాణాలకూ వ్యాపిస్తుండటంతో భారీ ఆస్తినష్టం జరిగే అవకాశముంది. ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 14, 2025 / 07:55 AM IST

బ్రౌన్‌ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి

అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బ్రౌన్ విశ్వవిద్యాలయం రోడ్ ఐలాండ్‌లోని క్యాంపస్‌లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో ఫోన్లను సైలంట్‌గా ఉంచుకోవాలని, డోర్లను లాక్ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

December 14, 2025 / 06:45 AM IST

రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మృతి

RR: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ కృష్ణ(60) మృతి చెందారు. ఆరాంఘర్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా, TG 5T 5229 నంబర్ గల ఇటుక లారీ వేగంగా వచ్చి కృష్ణను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

December 13, 2025 / 09:27 PM IST

BREAKING: ఒకే కుటుంబంలో నలుగురు మృతి

TG: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేట జాతీయ రహదారిపై ఓ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబసభ్యులు మృతిచెందారు. ప్రమాదంలో భార్యభర్తలతో పాటు కుమారుడు, కుమార్తె మరణించారు. మృతులను కామారెడ్డి జిల్లా నిజాం సాగర్‌ మండలం మాగీ గ్రామవాసులుగా గుర్తించారు.

December 13, 2025 / 08:40 PM IST

దారుణం.. బంగారం కోసం వృద్ధురాలి హత్య

AP: బంగారు కోసం వృద్ధురాలిని హతమార్చిన అమానవీయ ఘటన విజయనగరం జిల్లా ముడసర్లపేటలో జరిగింది. ముడసర్ల అప్పాయమ్మ(70) హత్య చేసి రెండు తులాల బంగారం దోచుకున్న దుండగులు.. ఆమె మృతదేహాన్ని గ్రామ శివార్లలో పడేశారు. కుటుంబసభ్యులు విజయవాడ వెళ్లడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దారుణం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

December 13, 2025 / 04:54 PM IST

హైవేపై ప్రమాదం.. బైక్ దగ్ధం

AP: కృష్ణాజిల్లాలో కంకిపాడు-మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ బైక్ అక్కడికక్కడే దగ్ధమయ్యింది. పెట్రోల్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా బైక్‌లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వాహనదారుడు వెంటనే బైక్‌పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. 

December 13, 2025 / 04:33 PM IST

చర్ల: రైఫిల్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

BDK: చర్ల సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్, ఒడిసా సరిహద్దుల్లో గల సోనాబేడా సమీపంలో ఉన్న దేకున్ పానీ సీఆర్పీఎఫ్ శిబిరంలో శనివారం ఒక జవాన్ ఏకే 47 రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిసా రాష్ట్రంలోని ఖర్దారా గ్రామానికి చెందిన గోపీనాథ్ సబర్‌గా అధికారులు గుర్తించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అయితే ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

December 13, 2025 / 04:29 PM IST

స్పృహ తప్పి పడిపోయి విద్యార్థిని.. కాసేపటికే మృతి

AP: కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయిన కాసేపటికే మృతి చెందింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. గమనించిన స్కూల్ సిబ్బంది వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ విద్యార్థిని చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 13, 2025 / 03:30 PM IST

డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్, లంగర్‌హౌస్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.70 లక్షల విలువైన 5 కిలోల హాష్‌ఆయిల్, 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు విజయనగరం వాసి వియజ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

December 13, 2025 / 02:46 PM IST

తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య

KDP: తల్లి మందలించడంతో కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. స్థానిక 1-టౌన్ పోలీసుల సమాచారం మేరకు.. శ్రీరాం నగర్‌కు చెందిన వేదవతి (20)కి 4 నెలల క్రితం వివాహ నిశ్చితార్థం అయ్యింది. ఇంటి పనులు చేయాలని శుక్రవారం తల్లి భాగ్యలక్ష్మి, కుమార్తెను మందలించింది. దీంతో వేదవతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

December 13, 2025 / 09:13 AM IST

BREAKING: అగ్నిప్రమాదం.. వృద్ధురాలు సజీవదహనం

AP: విజయనగరం తెర్లాం మండలం గొలుగువలసలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి వృద్ధురాలు సజీవదహనం అయింది. ఈ క్రమంలో మంటలు వ్యాపించి 10 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 13, 2025 / 08:59 AM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటరిస్ట్ మృతి

TPT: గూడూరు మండల పరిధిలోని పురిటిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని మణి అనే స్కూటరిస్ట్ మృతి చెందారు. నెల్లూరు నుండి ఓడూరుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో తలకు గాయాలయ్యాయి. ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 13, 2025 / 06:21 AM IST