• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌ సజీవ దహనం

AP: ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెంచికలపాడు వద్ద ఆయిల్ ట్యాంకర్, అరటి పండ్ల లోడ్ లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 8, 2025 / 07:14 PM IST

పెళ్లికి ఒప్పుకోలేదని దారుణ హత్య

HYD: వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బాపూజీ నగర్‌లో పవిత్ర(18) అనే యువతిని సమీప బంధువైన ఉమాశంకర్ ఇంట్లోకి చోరబడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఉమాశంకర్ తాగుబోతు కావడంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి పవిత్ర నిరాకరించింది. దీంతో కక్షతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 8, 2025 / 04:20 PM IST

కాంట్రాక్టర్‌ను హతమార్చిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యూపీకి చెందిన కాంట్రాక్టర్ ఇంతియాజ్‌ను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఇరపల్లి గ్రామంలో ఇంతియాజ్ రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. అయితే, రహదారి పనులు నిలిపివేయాలని మావోయిస్టులు అతడికి వార్నింగ్ ఇచ్చారు. అయినా పట్టించుకోకుండా పనులు చేపడుతుండటంతో అతడిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చారు.

December 8, 2025 / 10:39 AM IST

BREAKING: రాష్ట్రంలో దారుణ హత్య

TG: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై రియల్టర్‌ వెంకట రత్నంను దుండగులు కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

December 8, 2025 / 09:40 AM IST

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో కారు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. సప్తశృంగి మాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను లోయలోనుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.

December 7, 2025 / 09:00 PM IST

ప్రమాదంలో యువకుడి మృతి

VKB: కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనాపూర్ ఎక్స్-రోడ్ వద్ద జరిగిన సెల్ఫ్-రోడ్ ప్రమాదంలో ఒక యువకుడు మరణించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. కుల్కచర్ల నుంచి నంచర్ల వైపు వేగంగా వెళ్తున్న బైక్ నియంత్రణ కోల్పోయి రాయిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

December 7, 2025 / 08:01 PM IST

గంజాయి కలకలం.. ఇద్దరు మహిళలు అరెస్ట్

TG: హైదరాబాద్‌లో గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 532 గంజాయి పాకెట్లుగా ఉన్న 2.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పరిధిలోని బస్తీల్లో గంజాయి అమ్ముతుండగా పట్టుబడ్డారు. బాలువబాయి ఉపాధ్యాయ, గలన్‌బాయి కాంబ్లే అనే ఇద్దరు మహిళలు అరెస్టైనట్లు వెల్లడించారు.

December 7, 2025 / 07:07 PM IST

పెందుర్తిలో మహిళ దారుణ హత్య

VSP: పెందుర్తిలోని సుజాతనగర్లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 7, 2025 / 06:51 PM IST

ఆరుగురు అయ్యప్ప భక్తులకు గాయాలు

AP: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలంలోని అగరాలలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. శబరిమల నుంచి కోడూరు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

December 7, 2025 / 05:31 PM IST

యువకులపై కుక్కల దాడి

RR: జిల్లాలో రోజురోజుకు కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీలో బైక్‌పై వెళ్తున్న యువకులపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఒక యువకునికి గాయాలు కాగా, ప్రథమ చికిత్స కోసం ఆమనగలు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు.

December 7, 2025 / 04:52 PM IST

నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

AP: ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్‌లో నివాసం ఉంటున్న నరేంద్ర, చరణ్ మామిడితోటలో పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తమ్ముడు చరణ్ కాలుజారి నీటిలో పడగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన అన్న కూడా మునిగిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.

December 7, 2025 / 04:37 PM IST

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

AP: విశాఖపట్నం స్లీట్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాటరీ-3 ఏరియాలోని ఓ ఛార్జింగ్ కారు మంటల్లో కాలిపోయింది. 305 నంబర్ ఓవెన్‌కు ఛార్జింగ్ పూర్తైన తర్వాత లిఫ్ట్ అవ్వకపోవడంతో ఓవెన్‌ నుంచి వచ్చిన మంటలు ఛార్జింగ్ కారుకు అంటుకున్నాయి. దీంతో ఛార్జింగ్ కారు సహా ఎంసీసీ పూర్తిగా కాలిపోయాయి.

December 7, 2025 / 02:35 PM IST

నట్స్ అండ్ బోల్డ్ షాప్‌లో దొంగతనం

BDK: పాల్వంచ మండలం దమ్మపేట సెంటర్‌లోని ఫ్రెండ్స్ నట్స్ అండ్ బోట్స్ షాపులో రాత్రి దొంగతనం జరిగినట్లు షాప్ యజమాని భద్రం ఇవాళ తెలిపారు. సుమారు రూ. 27 వేలు దుండగులు దోచుకెళ్లినట్లు బాదితుడు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందించగా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

December 7, 2025 / 02:16 PM IST

గోవా ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

గోవా అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. సిలిండర్ పేలిన సెకన్లలోనే మంటలు వ్యాపించడం, ఎగ్జిట్ పాయింట్ చిన్నగా ఉండటంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 22 మంది ఊపిరాడక చనిపోగా ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు 2 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

December 7, 2025 / 11:26 AM IST

కాల్పుల కలకలం.. 11 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతంలో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోగా.. మరో 14 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

December 7, 2025 / 11:01 AM IST