రష్యాలోని ఖేర్సన్ రీజియన్లో ఒక కేఫ్ అండ్ హోటల్పై ఉక్రెయిన్ దళాలు డ్రోన్తో దాడి చేశాయి. ఈ ఘటనలో 24 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం. పౌరులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా ఈ దాడి జరిగినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంతో, రష్యా ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.
జమ్ముకశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం రేపింది. నియంత్రణ రేఖ(LoC) వెంబడి భారత గగనతలంలోకి చొరబడిన ఈ డ్రోన్.. ఐఈడీలు, మాదకద్రవ్యాలను జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 5 నిమిషాల పాటు ఇది భారత గగనతలంలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు.. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఏడుగురు మరణించగా, దాదాపు 150 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఒక టాయిలెట్ కింద ఉన్న ప్రధాన వాటర్ లైన్ లీక్ అవ్వడమే ఈ ఘోరానికి కారణమని అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులుగా ఒక అధికారిని ఉద్యోగం నుంచి తొలగించి, మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి 10 మంది మరణించగా, దాదాపు 150 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఒక టాయిలెట్ కింద ఉన్న ప్రధాన వాటర్ లైన్ లీక్ అవ్వడమే ఈ ఘోరానికి కారణమని అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులుగా ఒక అధికారిని ఉద్యోగం నుంచి తొలగించి, మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.
స్విట్జర్లాండ్లోని ప్రముఖ స్కీ రిసార్ట్ క్రాన్స్-మొంటానాలో న్యూ ఇయర్ వేడుకలు విషాదం చోటుచేసుకుంది. ‘లీ కానిస్టెలేషన్’ అనే బార్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
TG: నూతన సంవత్సర వేడుకల్లో బిర్యానీ తిని ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్లో జరిగింది. మద్యం తాగి.. బిర్యానీ తిన్న 16 మంది అస్వస్థతకు గురి కాగా.. పాండు(53) అనే వ్యక్తి మృతి చెందాడు. వారిలో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుములదిన్నెలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో వేములపాటి సురేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్(IIMC) 51 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. ఆసక్తి గలవారు ఈ నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 19లోపు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్లో పంపాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
జపాన్ ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు సునామీ హెచ్చరికలు గానీ, ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు గానీ తెలియరాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
TG: హైదరాబాద్లో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నగరంలోని ఇల్యూషన్ పబ్లో DJ ఆర్టిస్ట్కి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. నార్సింగిలో రాజేంద్రనగర్ SOT పోలీసులు చేసిన దాడుల్లో 5g కొకైన్ పట్టుబడింది. కూకట్పల్లిలోని షెర్లాక్ DJకి కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: ప్రముఖ సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం నెలకొంది. అనంతపురం హార్మొనీ సిటీలో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకల్లో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని వేణుగోపాల్ నగర్కు చెందిన షౌకత్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: యూట్యూబర్ అన్వేష్పై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. దేవతలను దూషించడంపై నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో త్వరలో అన్వేష్కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అన్వేష్పై హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ షాబునగర్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మురికి కాలువలో గర్భస్థ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. గర్భస్థ ఆడశిశువు వయసు సుమారు ఆరునెలలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాలువలు శుభ్రం చేస్తుండగా శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు.
AP: అమరావతి-అనంతపురం హైవేపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వెర్రిస్వామి, క్షతగాత్రుడు జయరామి రెడ్డిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరాఖండ్ పిప్పల్కోటిలోని జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అంతర్గత రవాణా రైళ్లు ఢీకొని సుమారు 60 మందికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టారు.