AP: పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ కుడికాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మాచర్లకు చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి వివాహానికి ఇరుకుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇద్దరూ నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి కోసం గాలిస్తున్నారు.
TG: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీహార్కి చెందిన ఓ కార్మికుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇవాళ అతను భోజనం కోసం ఇంటికి రాగా.. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో తలుపులు పగలకొట్టి.. లోపలికి వెళ్లాడు. ఆ గదిలో కుమార్తెతో పాటు మరో గుర్తుతెలియని యువకుడి మృతదేహాలు కనిపించాయి.
AP: తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. కపిలతీర్థం వద్ద రెండు హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేశారు.
ఇండోనేషియా భారీ వరదలతో అతలాకుతలమైంది. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సుమత్రా ప్రావిన్స్లో నదులు పొంగిపొర్లాయి. దీంతో వందలాది ఇళ్లు నీటమునిగాయి. ఈ వరదల వల్ల దాదాపు 502 మంది మృతి చెందారు. మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వందమందికిపైగా గల్లంతయ్యారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
టికెట్ గొడవ ప్రాణం తీసింది. యూపీలో ఓ TTE కిరాతకానికి నేవీ ఆఫీసర్ భార్య ఆర్తి(30) బలయ్యారు. ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్తూ ఆమె పొరపాటున తప్పుడు ట్రైన్ ఎక్కారు. దీనిపై గొడవ జరగడంతో.. TTE ఆమెను లగేజీతో పాటు కదులుతున్న రైలు నుంచి బయటకి తోసేశాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఆమె స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
AP: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు వెళ్తుండగా మధుగిరి వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దంపతులు మృతి చెందారు. మృతులు మడకశిర మండలం గుడ్డంపల్లికి చెందిన కృష్ణారెడ్డి, జ్యోతికగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రంలో ఐదుగురు వ్యక్తులు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని, సీపీఆర్ చేయడంతో ముగ్గురికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. మృతులు దేవయ్య, విజయ్ కుమార్గా గుర్తించారు.
ATP: బుక్కరాయసముద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గత నెల 26న భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ శ్రీధర్ మూర్తి అంబేద్కర్ సర్కిల్గా నామకరణం చేసి బోర్డును ఏర్పాటు చేశారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి నామకరణం చేసిన బోర్డును ఎత్తుకెళ్లారు. బోర్డు ఎత్తుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
E.G: సీతానగరం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొందరు దేవీపట్నం మండలంలోని పోచమ్మ తల్లి గుడికి వెళ్లి తిరిగి వస్తున్న టాటాఎస్ పురుషోత్తపట్నం గ్రామం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా… ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డ్రైవర్ మద్యం తాగి డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.
BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మన్నపాలెం గ్రామంలో రఘురామరెడ్డి 10 షవర్ల బంగారం చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈనెల 29న త్రోవగుంట వెళ్లి ఇవాళ ఉదయం 7 గంటల వచ్చి చూసేసరికి ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉంది. దీంతో మెదరమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బడి తండాలో గృహ హింస కేసు వెలుగుచూసింది. తన భర్త సురేష్ అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని మౌనిక ఆరోపించింది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆమె పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స కొనసాగుతుంది.
తమిళనాడు శివగంగైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం రూరల్ మండలం పుక్కళ్ళవానిపేట గ్రామానికి చెందిన గనగళ్ళ తోటయ్య ఆదివారం సముద్రంలోకి వేటకువెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. తోటిమత్స్యకారులతో యథావిధిగా వేటకువెళ్లిన సమయంలో సముద్రంలో తెప్ప బోల్తా పడింది. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక ఎంపీటీసీ ఆమోజీరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
NZB: జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లో గర్భస్థ పిండం లభ్యమైంది. ఈమేరకు పిండాన్ని కుక్కలు తింటుండగా గమనించిన స్థానికలు పోలీస్లకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి పిండం వయసు మూడు నుంచి నాలుగు నెలలు ఉంటుందని గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లోని రాయదుర్గంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.