TG: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు గర్భిణీలు మృతిచెందారు. ఆసిఫాబాద్(D) గెర్రెలో గర్భిణీ అయిన తన కోడలిని ఓ వ్యక్తి నరికి చంపాడు. కొడుకు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతోనే అతను ఈ హత్య చేసినట్లు సమాచారం. అటు కామారెడ్డి(D) తిమ్మాపూర్ గ్రామంలో వరకట్న వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లల ముందే నాగరాణి(25) అనే గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ తీరంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోటు మునిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆ బోటు 14 మంది భారతీయులతో వెళ్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: తుగ్గలి మండలం గిరిగట్ల సమీపంలోని లింగాల బ్రిడ్జి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి గుజరాత్ వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామ సమీపంలోని 67 హైవే శనివారం రెండు బైకులుగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మారుతి, శివ గంగయ్య, తిరుమలేష్ అనే ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TPT: వరదయ్య పాలెం (M) చిన్నపాండు పంచాయతీ అపోలో పరిశ్రమ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అపోలో టైర్స్ పరిశ్రమ నుంచి వెళ్తున్న బస్సు నాగనందాపురం నుంచి ఓ పరిశ్రమకు మహిళలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ఉన్న మహిళలకు గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: కామవరపుకోట మండలం అంకాలంపాడుకు చెందిన టీడీపీ నాయకుడు బొప్పన మురళి శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మురళి మృతి పార్టీకి తీరని లోటని కూటమి నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పంజాబ్ గరీబ్రథ్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిర్హింద్ స్టేషన్ సమీపంలో రైలులో మంటలు చెలరేగాయి. కోచ్ నెంబర్ 19లో షార్ట్సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన లోకో ఫైలట్ రైలును ఆపివేశారు. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రైలు లూథియానా నుంచి ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.
PLD: నరసరావుపేటలో గాడిపర్తి ఎఫ్రాన్ (31) అనే కాటికాపరి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్వర్గపురిలో పనిచేస్తున్న ఎఫ్రాన్ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. క్రిస్టియన్పాలెం వాసి అయిన ఇతని హత్యకు పాత కక్షలే కారణమని బంధువులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: చంద్రగిరి (M) మామండూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షంలో రోడ్డు దాటుతున్న రుద్ర ప్రసాద్ (31) అనే ఒడిశాకు చెందిన వ్యక్తిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,000లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
HYD: దోమలగూడలోని హెరిటేజ్ అపార్ట్మెంట్స్లో వృద్ధ దంపతులపై దాడిచేసి బంగారం దొంగిలించినకేసులో కేర్ టేకర్ గోవర్ధన్ను అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ DCP శిల్పవల్లి తెలిపారు. గోవర్ధన్ ఆన్లైన్ బెట్టింగ్, చెడు వ్యసనాలకు అలవాటై డబ్బు కోసం దంపతులపై రోకలి బండతో దాడిచేసి బంగారాన్ని ముత్తూట్లో పెట్టి రూ.3లక్షలు తీసుకున్నాడన్నారు. తాజాగా కృష్ణ జిల్లాలో నిందితుడిని అరెస్టు చేశామన్నార...
MNCL: బెల్లంపల్లిలోని పలు బార్ & రెస్టారెంట్లలో మున్సిపల్ కమిషనర్ రమేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అతిథి, శ్రావణ్ గ్రాండ్, రాయల్ & బార్ రెస్టారెంట్లలో కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు. కల్తీ ఆహారం విక్రయించిన బార్ & హోటల్ యజమానులకు రూ.10వేల జరిమానా విధించారు. కల్తీ ఆహారం విక్రయించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు
అన్నమయ్య: కలకడ మండలంలోని ఝరికోన ప్రాజెక్టు వద్ద శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ మేరకు స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రామాంజులు పరిశీలించారు. మృతుడు నాలుగు నుండి ఐదు రోజుల క్రితం మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
SKLM: పాతపట్నంలో ఆల్ ఆంధ్ర రోడ్డు ప్రక్కనగల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి దొంగలు చొరబడి ఆలయ హుండీని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారని ఆలయ పురోహితులు, కమిటీ సభ్యులు తెలిపారు. పాతపట్నం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశామన్నారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు.
ADB: తలమడుగు మండలం దహెగాంలో అత్తగారి ఊర్లో నివాసం ఉంటున్న మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కుమార్తె అదృశ్యమైనట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 13న భార్యాభర్తలు కూలీ పనులకు వెళ్లగా వారి కూతురు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో, వారి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.