• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

BREAKING: ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్ టాటానగర్‌లోని ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 28, 2025 / 11:28 AM IST

ఛత్తీస్‌గఢ్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తన్నూరు గ్రామస్థులు ఒక్కసారిగా బొగ్గు నిర్వహణ ప్లాంట్‌లోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహించిన నిరసనకారులు పోలీస్ జీప్, ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సుమారు 10 మంది గ్రామస్థులు, పోలీసులు గాయపడ్డారు.

December 28, 2025 / 09:26 AM IST

BREAKING: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

బీహార్‌లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. టెల్వాబజార్ హాల్ట్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడింది. ఈ ఘటనలో 19 బోగీలు కిందపడ్డాయి. గూడ్స్ రైలు సిమెంట్ లోడుతో అసన్‌సోల్ నుంచి సీతామఢీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

December 28, 2025 / 08:41 AM IST

అప్పు చెల్లించమంటే గొంతు కోశాడు!

AP: అనంతపురంలోని రాంనగర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పవన్ అనే వ్యక్తికి కళ్యాణ్ అనే వ్యక్తి రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే, తన డబ్బు తిరిగి ఇవ్వాలని కళ్యాణ్ అడగడంతో ఆగ్రహానికి గురైన పవన్.. కత్తితో కళ్యాణ్ గొంతు కోశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన కళ్యాణ్‌ను ఆస్ప్రత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

December 27, 2025 / 06:44 PM IST

విషాదం.. AC పేలి కవలలు మృతి

TG: హైదరాబాద్ కాచిగూడలో నిన్న జరిగిన AC పేలుడులో ఓ బాలుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న అతని కవల సోదరుడు కూడా రాత్రి మరణించాడు. రెండేళ్ల ఈ కవలలను రహీం ఖాద్రీ, రహ్మాన్ ఖాద్రీగా గుర్తించిన పోలీసులు.. షార్ట్ సర్వ్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చిన్నారుల మృతిలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

December 27, 2025 / 08:53 AM IST

AC పేలుడు.. మరో చిన్నారి మృతి

TG: హైదరాబాద్ కాచిగూడ AC పేలుడులో మరో చిన్నారి మృతిచెండాదు. నిన్న జరిగిన ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన రెండో చిన్నారి ఉస్మానియాలో చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. రెండేళ్ల ఈ కవలలను రహీం ఖాద్రీ, రహ్మాన్ ఖాద్రీగా గుర్తించిన పోలీసులు.. షార్ట్ సర్వ్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

December 27, 2025 / 08:53 AM IST

ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

AP: ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రాంగ్ రూట్‌లో బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతులు ద్వారకతిరుమలకు చెందిన రఫీ, చరణ్, బన్నీగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 27, 2025 / 08:37 AM IST

కంపగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

BDK: అన్నపురెడ్డిపల్లి మండలం కంపగూడెం గ్రామం వద్ద ఓ బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో వెంకటేశ్వర్లు(60) మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

December 26, 2025 / 07:03 PM IST

ఏసీలో షార్ట్ సర్క్యూట్.. ఒకరు మృతి

TG: HYDలో అగ్నిప్రమాదం జరిగింది. కాచిగూడలోని ఓ ఇంట్లో ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి చనిపోయింది. మరో బాలుడికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 26, 2025 / 07:02 PM IST

కిడ్నీ మార్పిడి పేరుతో మోసం.. వ్యక్తి అరెస్టు

AP: కిడ్నీ మార్పిడి పేరుతో మోసం చేసిన వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమంది జ్యోతి శివశ్రీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితుడిపై వివిధ PSలో 33 కేసులు నమోదయ్యాయి. కిడ్నీ మార్పిడి పేరుతో మోసం చేశారని శ్రీకాకుళం వాసి ఫిర్యాదు చేశారని DCP మణికంఠ తెలిపారు. రూ.లక్ష ఇస్తే కిడ్నీ ఆపరేషన్ చేస్తామని.. డబ్బు అందిన వెంటనే ఫోన్ స్విచాఫ్ చేశారన్నారు.

December 26, 2025 / 06:21 PM IST

ఉరి వేసుకుని గర్భిణీ ఆత్మహత్య

PDPL: ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గురువారం రాత్రి ఐదు నెలల గర్భిణీ అంజలి (21) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 8 నెలల క్రితం వివాహమైన ఆమెను వరకట్నం పేరుతో భర్త, అత్తింటివారు వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేధింపులు భరించలేక పుట్టింట్లో ఉంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

December 26, 2025 / 06:18 PM IST

VIDEO: ఆల్విన్‌కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి

MDCL: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి సాయినగర్ వెస్ట్‌లో ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. రాజేశ్వరి వృద్ధాశ్రమం సమీపంలో నివసించే అరవింద్‌(39)పై అతని భార్య తమ్ముడు, మరో వ్యక్తి కలిసి దాడి చేసి పరారయ్యారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపారు. గాయపడిన అరవింద్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

December 26, 2025 / 06:06 PM IST

అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. ఇద్దరికీ గాయాలు

ఖమ్మం రూరల్ మండలం M.V పాలెం కోల్డ్ స్టోరేజ్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న ఒకరు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

December 26, 2025 / 02:06 PM IST

ప్రొఫెసర్ మృతి.. రెండు రోజులుగా కారులోనే డెడ్‌బాడీ

AP: తిరుపతి SV యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సర్దార్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అలిపిరి రోడ్డులో నిలిపి ఉంచిన కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సర్దార్ నాయక్ మృతదేహం రెండు రోజులుగా కారులోనే ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

December 26, 2025 / 10:23 AM IST

లోయలో పడిపోయిన బస్సు.. 10 మంది మృతి

క్రిస్మస్ వేళ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెరక్రూజ్ రాష్ట్రంలోని జొంటోకొమట్లాన్పట్టణంలో బస్సు 600 అడుగుల లోతు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా.. మరో 32 మందికి గాయాలయ్యాయి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

December 26, 2025 / 10:19 AM IST