• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

TG: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా ఫర్దిపూర్ వాసులుగా తెలుస్తోంది. ఉజ్జయిని పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 7, 2026 / 10:26 AM IST

పీఎస్ నుంచి పరారైన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి PS నుంచి పరారైన అంతర్రాష్ట్ర దొంగ తెలుగు నాగిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. పలు చోరీల్లో నిందితుడిగా ఉన్నాడు. కల్వకుర్తి పీఎస్‌లోనూ కేసులు ఉండటంతో నాగిరెడ్డిని గతేడాది నవంబర్ 11న కల్వకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే నెల 13న రాత్రి పరారయ్యాడు. నిన్న రాత్రి నాగిరెడ్డిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు.

January 7, 2026 / 10:07 AM IST

బస్సు ప్రమాదం.. 10 మంది మృతి

జెరూసలెంలో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ప్రజలకు నిర్బంధ సైనిక విధులు కేటాయించడంపై ఆందోళనకారులు నిరసనలు చేపట్టగా.. వారి పైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఆ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

January 7, 2026 / 09:41 AM IST

జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య

KDP: మైలవరం మండలంలో మంగళవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వద్దిరాలలో దేవ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అలాగే దొమ్మర నంద్యాలకు చెందిన షేక్ నూర్జహాన్ (20) అనే వివాహిత కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

January 7, 2026 / 09:13 AM IST

మరో ట్రావెల్స్ బస్సు దగ్ధం

AP: ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తూ.గో.జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై పూర్తిగా దగ్ధమైంది. వేకువజామున ట్రావెల్స్ బస్సులోని సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులోని ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

January 7, 2026 / 04:34 AM IST

దారుణం.. తండ్రిని కొట్టి చంపిన తనయుడు

TG: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రిని ఓ కుమారుడు కర్రతో కొట్టి చంపాడు. శ్రీకాంత్ అనే యువకుడు జులాయిగా తిరుగుతూ అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్రతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 6, 2026 / 12:20 PM IST

అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి

KDP: బైక్ అదుపు తప్పి కింద పడటంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దన పాడు వద్ద జరిగింది. వీరపునాయునిపల్లె మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మునిశేఖర్(58)గా స్థానికులు తెలిపారు. వ్యక్తిగత పని నిమిత్తం ఎర్రగుంట్లకు బైక్‌పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

January 6, 2026 / 11:30 AM IST

ఎద్దుల బండి, బైకు ఢీ.. ఇద్దరు మృతి

AP: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్.రంగాపురంలో పొంగమంచుతో కనపడక ఎద్దులబండిని బైకు ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరు మృతిచెందగా.. మరో యువకుడికి గాయాలయ్యాయి. వీరు స్థానిక పరిశ్రమలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని.. విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడిని సమీప ఆస్పత్రికి తరలించారు.

January 6, 2026 / 11:17 AM IST

మారణహోమం.. 35 మంది మృతి?

ఇరాన్‌లో ఆందోళనలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అల్లర్లను అణచివేసే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, సుమారు 1200 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ‘హ్యూమన్‌రైట్స్‌ యాక్టివిస్ట్స్‌ న్యూస్‌ ఏజెన్సీ’ వెల్లడించింది. దేశంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది.

January 6, 2026 / 10:45 AM IST

మహిళను చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు

AP: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని సోమశేఖర్ అనే వ్యక్తి.. ఓ మహిళను గొంతు కోసి హతమార్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక కోర్లగుంట మారుతీనగర్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉందని.. ఇటీవల మహిళ ఈ బంధాన్ని నిరాకరించడంతో సోమశేఖర్ ఈ హత్య చేశాడని గుర్తించారు.

January 6, 2026 / 10:32 AM IST

ఆగని రక్తపాతం.. 12 మంది హిందువుల బలి

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. గత నెల రోజుల్లో రాడికల్స్ చేతిలో 12 మంది హిందువులు బలయ్యారు. మృతుల జాబితాలో ప్రాంతోస్ కర్మాకర్, ఉత్పల్ సర్కార్, జోగేష్ రాయ్, సుబోర్నో రాయ్, శాంతో దాస్, దీపు చంద్ర దాస్, పింటు ఆకండ, అమృత్ మోండల్, బజేంద్ర బిస్వాస్, ఖోకాన్ చంద్ర దాస్, రాణా ప్రతాప్, చక్రవర్తి ఉన్నారు. ఈ వరుస హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

January 6, 2026 / 10:24 AM IST

పాక్ ఏజెంట్‌గా 15 ఏళ్ల బాలుడు

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పంజాబ్‌లోని పఠాన్‌కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జమ్మూలోని సాంబా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.

January 6, 2026 / 10:07 AM IST

గిద్దలూరులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దంతేరపల్లి గ్రామంలో సారమేకల హరి(53) అనే వ్యక్తి మంగళవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి శరీరంపై గాయాలు ఉండడంతో ఎవరో కొట్టి చంపారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. వ్యక్తి మృతికి గల కారణాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

January 6, 2026 / 09:38 AM IST

జపాన్‌లో భూకంపం.. 6.2గా నమోదైన తీవ్రత

జపాన్‌లో తాజాగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు కూడా లేదని స్పష్టం చేశారు.

January 6, 2026 / 09:36 AM IST

భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

TPT: వడమాలపేట టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 450 బస్తాలు (25 టన్నులు) రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై హరీష్ తెలిపారు. పుత్తూరు నుంచి రేణిగుంట వైపు వెళుతుండగా వడమాలపేట టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

January 6, 2026 / 07:30 AM IST