• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

వివాహానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా.. ఇద్దరు మృతి

TG: నిర్మల్ జిల్లాలోని ఇచ్చోడ మండలం సోంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 18 మందికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

March 12, 2026 / 12:35 PM IST

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను బిక్యాసింగ్, సూరజ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 10:40 AM IST

కల్తీపాల ఘటన.. మరొకరు మృతి

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. చికిత్స పొందుతూ స్వరూప్ నగర్‌కు చెందిన బండారు వీరలక్ష్మీ(60) మృతి చెందారు. కాగా వీరంతా కల్తీ పాలు తాగడం వల్ల కిడ్నీతో పాటు ఇతర శరీర భాగాలు దెబ్బతిని చనిపోతున్న సంగతి తెలిసిందే.

March 12, 2026 / 10:29 AM IST

ఆటోలో నుంచి దూకి యువకుడు మృతి

NLR: ఆటోలో ప్రయాణిస్తూ కిందకు దూకగా డివైడర్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నెల్లూరు నుంచి కోవూరు వైపు వెళుతున్న ఆటోలో ఎక్కిన యువకుడు ఫ్లైఓవర్పైకి రాగానే ఆటోలో నుంచి దూకాడు. డివైడర్ ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అయితే యువకుడు ఎందుకు దూకాడో కారణాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 09:24 AM IST

ఘోర అగ్నిప్రమాదం.. వందలాది పూరిళ్లు దగ్ధం

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలాది పూరిళ్లు అగ్నికి ఆహుతై కాలిబూడిదయ్యాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగి వేగంగా విస్తరించడంతో బస్తీ నివాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.

March 12, 2026 / 07:52 AM IST

కాంగ్రెస్ నేత దారుణ హత్య

TG: నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత ఇమ్మడి గోపి హత్యకు గురయ్యాడు. ఇందల్‌వాయి శివారులో గోపి కారుపై దాడి జరిగింది. ఈ క్రమంలో అతన్ని కారులో నుంచి బయటకు తీసుకొచ్చి చంపేశాడు. అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇందల్‌వాయి మాజీ ఎంపీపీగా గోపీ పనిచేశాడు.

March 12, 2026 / 07:40 AM IST

రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

కోనసీమ: రావులపాలెం మండలంలోని ఈతకోట టోల్ గేట్ వద్ద తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులెవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 07:08 AM IST

కల్తీపాల ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మూడేళ్ల బాలుడు జయకృత్ మృతి చెందాడు. 25 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కల్తీ పాల వల్ల కిడ్నీతో పాటు వివిధ శరీర భాగాలు ఫెయిల్యూర్ అవడం వల్ల మృతి చెందాడని తెలిపారు.

March 11, 2026 / 09:13 PM IST

అగ్నిప్రమాదం.. విచారణ చేపట్టిన పోలీసులు

AP: వెలగపూడి సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల్లో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని ఆరా తీస్తున్నారు. సమీప పొలంలో నిప్పు పెట్టడంతోనే మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.

March 11, 2026 / 07:58 PM IST

రాష్ట్రంలో మరో అగ్నిప్రమాదం

AP: అమరావతిలోని వెలగపూడి N9 జంక్షన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ అండ్ టీ స్టాక్ పాయింట్‌ సంస్థలో భారీగా ప్లాస్టిక్ పైపులు తగలబడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పైపులు తగలబడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

March 11, 2026 / 04:17 PM IST

శివాలయంలో నగదు మాయం.. విచారణ

కృష్ణా జిల్లా శివాలయంలో నగదు మాయంపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ ఈవో, అర్చకులు కలిసి రూ.10 లక్షలకుపైగా నగదు మాయం చేసినట్లు తెలుస్తోంది. అంతరాలయం హుండీ మారుతాళం తయారుచేసి భారీగా నగదు చోరీకి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు పూజారులతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 11, 2026 / 03:31 PM IST

ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

TG: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ దెబ్బతింది. దీంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. ఈ ఘటన ఫుకెట్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు కొంతసేపు రన్‌వేను మూసేశారు. విమానంలోని 133 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

March 11, 2026 / 01:58 PM IST

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. నలుగురి పరిస్థితి విషమం

AP: విజయనగరం జిల్లా రామభద్రపురంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొబ్బిలి కూడలి మలుపు వద్ద సాలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

March 11, 2026 / 12:21 PM IST

విషాద ఘటన.. కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

VSP: జిల్లా కేంద్రంలో విషాద ఘటన జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన గుర్తుతెలియని వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. నేవీ సిబ్బంది దిగిపోమని హెచ్చరించినప్పటికీ అతడు మరింత పైకి ఎక్కడంతో వైర్లు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

March 11, 2026 / 10:50 AM IST

విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి

AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందింది. జాయేషా(4) ఆడుకుంటూ నీటి సంపులో పడింది. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

March 11, 2026 / 10:49 AM IST