• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

BREAKING: బస్సు ప్రమాదం.. 8 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడటంతో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సు సిమ్లా నుంచి కుప్వి వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 9, 2026 / 04:53 PM IST

బాలల అక్రమ రవాణా గుట్టురట్టు

AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా గుట్టురట్టు అయింది. ముగ్గురు బాలలకు పోలీసులు విముక్తి కల్పించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నారు. సంచార జాతుల పిల్లలే లక్ష్యంగా బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

January 9, 2026 / 04:21 PM IST

పర్వతగిరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల బిక్షాటన చేసే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ శంకర్, పోలీస్ అధికారులు శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పర్వతగిరి పోలీస్ స్టేషన్, ఎస్సై ప్రవీణ్ (8712685028, 8712685242)ను సంప్రదించాలని కోరారు.

January 9, 2026 / 03:39 PM IST

అంతర్రాష్ట్ర మహిళా ముఠా అరెస్ట్

AP: విశాఖపట్నంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గాజువాకలోని ఓం జ్యూవెలరీ, పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యూవెలరీలో చోరీకి ముఠా సభ్యులు పథకం రూపొందించారు. కస్టమర్లుగా వచ్చి ఆభరణాలను కొప్పులో, చీరల్లో దాచి పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులకు అరెస్ట్ చేశారు.

January 9, 2026 / 01:56 PM IST

తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, దస్త్రాలు ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో చలిమంట నుంచి వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చలిమంట, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, కావాలనే చేశారా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు ఆర్డోవో బాలకృష్ణ వెల్లడించారు.

January 9, 2026 / 11:50 AM IST

ఇరుసుమండలో కొనసాగుతున్న బ్లోఅవుట్

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. మంటల తీవ్రత తగ్గినా పూర్తి నియంత్రణకు ఓఎన్జీసీ ముమ్మర చర్యలు చేపట్టింది. గూడపల్లి నుంచి నీటిని వినియోగించుకుని అగ్నికీలలను సిబ్బంది చల్లారుస్తున్నారు. బ్లో అవుట్‌తో సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు.

January 9, 2026 / 10:20 AM IST

సినిమా షూటింగ్ బస్సు బోల్తా

TG: సినిమా షూటింగ్‌కు వెళ్లొస్తున్న బస్సు హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుజామున ఫ్లైఓవర్ స్టార్టింగ్‌లో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా.. మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. విశాఖ నుంచి HYD మణికొండకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 9, 2026 / 09:39 AM IST

భారీ స్కామ్.. మనిషి రక్త బ్యాగుల్లో మేక రక్తం

TG: కాచిగూడలోని ‘సీఎంకే ల్యాబ్’లో డీసీఏ అధికారులు 1000 మేక రక్తాన్ని సీజ్ చేశారు. మనిషి రక్త బ్యాగుల్లో దీన్ని నింపి హర్యానాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆటోక్లేవ్, లామినార్ ఎయిర్ ఫ్లో వంటి పరికరాలను ఇక్కడ వినియోగిస్తున్నారు. టీకాలు, కాస్మెటిక్స్ తయారీ కోసం ఈ రక్తాన్ని వాడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు నికేష్ పరారీలో ఉన్నాడు.

January 9, 2026 / 06:52 AM IST

బస్సు ఢీ.. డెలివరీ బాయ్ మృతి

TG: బస్సు ఢీకొనడంతో జెప్టో డెలవరీ ఏజెంట్ మృతి చెందిన ఘటన HYDలో జరిగింది. బస్సు పక్కనే వెళ్తున్న రైడర్ బైక్ అదుపుతప్పి బస్సు కిందపడిపోయినట్లు CC TV కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర గిగ్ అండ్ ఫ్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్.. బాధిత కుటుంబానికి తక్షణ సాయం, ప్రమాద బీమా అందించాలని డిమాండ్ చేశారు.

January 8, 2026 / 03:12 PM IST

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

AP: ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటన విశాఖలో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి వసంత రావు అనే వ్యక్తితో భార్య రమ్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భార్త నాగరాజును ప్రియుడు వసంతరావుతో పాటు అతడి స్నేహితులు బాలకృష్ణ, మండులా సాయంతో హత్య చేయించింది. విచారణ చేపట్టిన పోలీసులకు భార్యే హత్య చేయించిందని తెలియడంతో రమ్య, ప్రియుడితో పాటు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశారు.

January 8, 2026 / 02:42 PM IST

అమెరికాలో ఇద్దరు భారతీయులు అరెస్ట్

అమెరికాలోని ఇండియానాలో భారీగా కొకైన్ తరలిస్తున్న ఇద్దరు భారతీయులను అధికారులు అరెస్టు చేశారు. ట్రక్కుల స్లీపర్ బెర్త్‌ల నుంచి 309 పౌండ్ల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్‌ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30)గా గుర్తించారు. వీరిద్దరూ గతంలోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విచారణలో తేలింది.

January 8, 2026 / 12:42 PM IST

BREAKING: సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం

TG: సంగారెడ్డి ఇస్నాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరుపుల గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 8, 2026 / 12:29 PM IST

మనుబోలులో దొంగల బీభత్సం

NLR: మనుబోలు మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. YSR కూడలి వద్ద పెంచలయ్యకు చెందిన బట్టల గోడౌన్ గ్రిల్స్ తొలగించి రూ.లక్ష విలువైన వస్తువులను, బీసీ కాలనీలోని మరో ఇంట్లో తలుపులు పగులగొట్టి రూ. 50 వేల నగదు, 5 ఉంగరాలు, వెండి వస్తువులను అపహరించారు. క్లూస్ టీంతో పోలీసులు వేలిముద్రలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

January 8, 2026 / 12:00 PM IST

ఒకరు మృతి.. విద్యార్థుల పరిస్థితి విషమం!

AP: స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పొన్నమాకులపల్లిలో ఈ ప్రమాదం జరగ్గా.. ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. అందరినీ వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అటు జిల్లా కేంద్రం చిత్తూరులోనే కరెంట్ తీగలు అంటుకుని ఓ టిప్పర్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో టిప్పర్ క్లీనర్ పీతాంబరం శెట్టి మృతి చెందాడు.

January 8, 2026 / 09:07 AM IST

రాప్తాడులో భారీ చోరీ.. కేసు నమోదు

ATP: రాప్తాడులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడు చిన్న ఉజ్జనప్ప కుటుంబం బుధవారం పొలం పనులకు వెళ్లిన సమయంలో దొంగలు కిటికీ ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ శ్రీహర్ష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

January 8, 2026 / 06:20 AM IST