AP: తిరుపతి SV యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సర్దార్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అలిపిరి రోడ్డులో నిలిపి ఉంచిన కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సర్దార్ నాయక్ మృతదేహం రెండు రోజులుగా కారులోనే ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రిస్మస్ వేళ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెరక్రూజ్ రాష్ట్రంలోని జొంటోకొమట్లాన్పట్టణంలో బస్సు 600 అడుగుల లోతు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా.. మరో 32 మందికి గాయాలయ్యాయి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
AP: గుంటూరు జిల్లా నల్లపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆగి ఉన్న కారును ప్రైవేట్ టావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరగ్గా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మరణించినవారిని తెలంగాణ సూర్యాపేట ప్రాంతవాసులుగా గుర్తించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను.. రాధాకిషన్ రావు బెదిరింపులపై ఆరా తీశారు. తన దగ్గరున్న ఆధారాలన్నీ సిట్కు అందించానని నందకుమార్ తెలిపారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
TG: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శివరాంపల్లిలో కుమార్తెను తల్లిదండ్రులు హతమార్చారు. బాలిక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించడాన్ని ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. బలవంతంగా పురుగుల మందు తాగించి, గొంతునులిమి చంపేశారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వారే కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.
RR: బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. మహేశ్వరం PS పరిధి దెబ్బడిగూడకు చెందిన విక్రమ్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు అలవాటై సుమారు రూ. లక్ష నష్టపోయాడు. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మృతుడి అన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగ్లాదేశ్లో హిందూవులపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాజ్బరి జిల్లాలో అమృత్ మండల్ (29) అనే యువకుడిని అల్లరిమూకలు దారుణంగా కొట్టి చంపాయి. దీపు చంద్ర దాస్ హత్య మరువక ముందే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఇస్లామిక్ మూకలు విచక్షణారహితంగా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వరుస హత్యలతో అక్కడి మైనారిటీలు(హిందూలు) బిక్కుబిక్కుమంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ సీరియస్గా సాగుతోంది. నిందితుడు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఇవాళ్టితో ప్రభాకర్ రావు కస్టడీ ముగియడంతో ఆయన వాంగ్మూలం రికార్డ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్ను కూడా సిట్ విచారించింది. ట్యాపింగ్ వల్లే ఆ వ్యవహారం బయటపడటంతో.. ఆ లింకులపై కూపీ లాగుతున్నారు.
TG: హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డి(D) తెల్లాపూర్ పరిధిలోని జ్యోతిబాపూలే కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తల్లి, కుమారుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు తన గొంతు తానే కోసుకున్నాడు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ జంట హత్యలతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డెక్కన్ కిచెన్ ఓనర్ నందకుమార్ విచారణకు హాజరయ్యారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ను.. ఇప్పుడు ఆ అంశంపైనే సిట్ (SIT) గట్టిగా ప్రశ్నిస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంతో ఎమ్మెల్యేల ఎర కేసుకు ఉన్న లింకులపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
PDPL: మంథని పీఎస్ పరిధిలోని భట్టుపల్లి శివారు మైసమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగలిపల్లి గ్రామానికి చెందిన పిడుగు రాజ్ కుమార్ (33), దామెరకుంట గ్రామానికి చెందిన రాంశెట్టి కిష్టయ్య (39) టీవీఎస్ జూపిటర్ స్కూటీపై మేడారం వెళ్లి, బుధవారం తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఒడిశా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత గణేష్ ఉయికే మరణించాడు. ఇతని తలపై ఏకంగా రూ.1.10 కోట్లు రివార్డు ఉంది. గణేష్ తెలంగాణలోని నల్గొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందినవాడని పోలీసులు వెల్లడించారు. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ దళాలను నడిపిస్తున్న గణేష్ మృతి మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని అధికారులు పేర్కొన్నారు.
టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలి ఐదుగురు మృతి చెందారు. పర్వతంపై ఉన్నవారిని వైద్యచికిత్స కోసం తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు టాంజానియా పౌర విమానయానశాఖ వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులతో పాటు డాక్టర్, టూరిస్ట్ గైడ్, పైలట్ ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు పేర్కొంది.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైదుగురిలో ఉన్న మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. దాదాపు 35 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేకాదు పేలుడు ధాటికి మసీదు ధ్వంసమైంది. ఇది ఉగ్రవాదుల చర్య అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
డిజిల్ ట్యాంకర్ NH48పై డివైడర్ను దాటి రాంగ్ రూట్లో బస్సును ఢీకొట్టడం కారణంగానే కర్ణాటక రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల తర్వాత చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ ఘటన జరగ్గా.. ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దహనమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.