• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ఓ నిరుపేద కుటుంబాన్ని విషాదంలో ముంచిన అగ్ని ప్రమాదం

BDK: సుజాతనగర్ రూప్ల తండాలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదం ఓ నిరుపేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొనసాగుతున్న సమయంలో తాత్కాలికంగా ముందు భాగంలో వేసుకున్న రేకుల షెడ్డులో కరెంట్ షాక్ కారణంగా గ్యాస్ అంటుకుని మంటలు చెలరేగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో షెడ్డులో దాచుకున్న నగదు కాలి బూడిద అయినట్లు పేర్కొన్నారు.

December 24, 2025 / 06:20 PM IST

పెన్సిల్ ఛాతీలో గుచ్చుకుని విద్యార్థి మృతి

KMM: పెన్సిల్ ఛాతిలో గుచ్చుకుని విద్యార్థి మృతి చెందిన ఘటన కూసుమంచి మండల పరిధిలోని, నాయక్ గూడెం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం జరిగింది. యూకేజీ చదువుతున్న విద్యార్థి మేడారపు విహార్ మధ్యాహ్న సమయంలో ఆడుకుంటుండగా జేబులో ఉన్న పెన్సిల్ ఛాతిలో గుచ్చుకుంది. దీనిని గమనించిన పాఠశాల సిబ్బంది 108 సహాయంతో హాస్పిటల్‌కి తరలిస్తుండగా మృతి చెందాడు.

December 24, 2025 / 05:25 PM IST

మహిళపై కౌలు రైతు దాడి

VKB: బషీరాబాద్ మండలంలో దారుణం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మైల్వార్ గ్రామానికి చెందిన దానం సాయిలు, రేణుక తమ పెదనాన్న దేవప్ప పొలంలో ఇసుక తవ్వుతున్నారు. ఈ క్రమంలో కౌలు రైతు అశోక్, కృష్ణ ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో రేణుక గాయపడ్డారు. ఆమెను తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

December 24, 2025 / 04:27 PM IST

ట్రైన్ ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

SKLM: శ్రీకాకుళం జీఆర్‌పీ పరిధిలోని రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఈరోజు తిరుచునాపల్లి నుండి హౌరా వెళ్లే ట్రైన్ వస్తున్న సమయంలో సదరు వ్యక్తి రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. వివరాలకు 9493474582, 9110305494 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

December 24, 2025 / 03:11 PM IST

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం

కేరళలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. తప్పతాగి ఓ ఆటో డ్రైవర్ రైలుపట్టాలపై ఆటోను నిలిపివేశాడు. ఈ క్రమంలో అదే ట్రాక్‌పై వస్తున్న కాసర్‌గోడ్-తిరువనంతపురం రైలు ప్రమాదానికి గురైంది. అయితే, లోకోపైలట్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

December 24, 2025 / 11:50 AM IST

ఎమ్మార్వోను కొట్టి.. నిర్బంధించిన గిరిజనులు

AP: ఏలూరు జిల్లా ఇనుమూరులో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గిరిజనులంతా కలిసి ఎమ్మార్వో కల్లల్లో కారం కొట్టి నిర్బంధించారు. దీంతో అక్కడున్న అధికారులంతా పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని గిరిజనులతో మాట్లాడి ఎమ్మార్వోను విడిపించారు. అనంతరం గిరిజనులపై కేసు నమోదు చేశారు.

December 24, 2025 / 11:14 AM IST

దారుణం.. ఒక్కో చిన్నారిని రూ.4-5 లక్షలు

TG: అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి HYD, మంచిర్యాలలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితులు బెయిల్‌పై వచ్చి ఈ అక్రమాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో చిన్నారిని రూ.4-5 లక్షలకు అమ్ముతున్నట్లు తెలిసింది.

December 24, 2025 / 11:07 AM IST

కెనడాలో భారతీయురాలి హత్య

కెనడాలో భారతీయురాలు హిమాన్షి ఖురాన హత్యకు గురయ్యారు. ఈ కేసులో అనుమానితుడు అబ్దుల్ గఫూరీ కోసం టొరెంటో పోలీసులు గాలిస్తున్నారు. స్థానిక అధికారులు, బాధితురాలి కుటుంబీకులతో సంప్రదింపులు చేస్తున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

December 24, 2025 / 08:25 AM IST

BREAKING: విమాన ప్రమాదం.. ఆర్మీ చీఫ్ మృతి

టర్కీ రాజధాని అంకారాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడు అలీ, నలుగురు అధికారులు సహా మొత్తం 8 మంది మృతి చెందారు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వార్తతో లిబియా సైన్యంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

December 24, 2025 / 06:08 AM IST

DTC కిషన్ అరెస్ట్.. 12 కోట్ల ఆస్తులు జప్తు

TG: మహబూబ్‌నగర్ DTC కిషన్‌ను అరెస్ట్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. కిషన్‌కు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పాట్ మార్కెట్‌లోని గోల్డ్ షాపు నుంచి బంగారం తెచ్చి జప్తు చేశామని అన్నారు. నారాయణఖేడ్‌లోని 30 ఎకరాల భూమితో పాటు నిజామాబాద్‌లో 10 ఎకరాల్లో ఉన్న హోటల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

December 23, 2025 / 07:45 PM IST

డ్రైనేజీ శుభ్రం చేసేందుకు వెళ్లి ఇద్దరు మృతి

TG: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు వెళ్లి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కొల్లూరులోని అపార్ట్‌మెంట్ వద్ద డ్రైనేజీ శుభ్రం చేసేందుకు కార్మికులు వెళ్లారు. మృతులు హరీష్ సింగ్ (25), సోమిత్ (22)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన కొల్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

December 23, 2025 / 07:10 PM IST

ACB సోదాలు.. రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులు

TG: ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలింది. పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, స్థిర, చరాస్తులు, బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారం ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు.

December 23, 2025 / 07:10 PM IST

గోదావరి సమీపంలో గుర్తు తెలియని శవం లభ్యం

BDK: పినపాక మండలం టి కొత్తగూడెం గోదావరి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానికులు అటుగా వెళుతుండగా శవాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 23, 2025 / 04:41 PM IST

రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

TG: హైదరాబాద్ ఉప్పరపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు. డీసీఎం ఢీకొని అబ్దుల్ సత్తార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కొల్పోయాడు. అయినా డీసీఎం ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రోడ్డు ప్రమాద ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 23, 2025 / 04:08 PM IST

భార్యపై అనుమానం.. కుమార్తెలను ఏం చేశాడంటే

AP: అనంతపురం జిల్లాలో ఓ తండ్రి ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇద్దరు కుమార్తెలను LLC కాలువలోకి తోసి చంపాడు. భార్యపై అనుమానంతో తండ్రి కల్లప్ప కుమార్తెలను చంపేశాడు. గుడికి వెళ్దామని చెప్పి కుమార్తెలను తీసుకెళ్లి కాలువలోకి తోశాడు. ఈ క్రమంలో ఒక చిన్నారి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

December 23, 2025 / 03:32 PM IST