TPT: రాయల చెరువు నుంచి ఇద్దరూ బైక్పై వస్తూ పీవీ పురం దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన కేశవ, దీపిక అనే ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
KKD: అచ్యుతాపురంలో ఈనెల 16న తల్లి షేక్ జహారా బీబీని హత్య చేసిన కొడుకు కమల్ను ఇంద్రపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. SI వీరబాబు వివరాల ప్రకారం.. బీటెక్ మధ్యలో ఆపేసి ఇంటి వద్ద రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న కొడుకును ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి అనడంతో నుదిటిపై బలంగా కొట్టి చంపాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.
KRNL: సి. బెళగల్లో భారీ పేలుడు సంభవించింది. ఖాజా అనే రైతు తనపొలంలో ఉన్న రాతిగుండ్లు పెకలించే క్రమంలో కంప్రెసర్తో పేల్చడంతో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు వీరాంజనేయులు, శ్రీరాములు, మద్దిలేటిగా గుర్తించారు. వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉంది.
కోనసీమ: మాచవరం – రామచంద్రపురం రోడ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్పై వెళ్తుండగా సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
KDP: ముద్దనూరు మండలం ఉప్పలూరులో జరిగిన కారు ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు మేరకు.. ఉప్పలూరుకి చెందిన గోవిందు కీర్తన (6) ఉప్పలూరులోని సచివాలయం వద్ద వారి బంధువుల శుభాకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా కారు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రి తరలించారు.
SKLM: కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలో గురువారం పట్టపగలే దొంగతనం జరిగింది. కృష్ణారావు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పనిమీద బయటికి వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి తాళం తెరచి ఉంది. బీరువాలోని 65 గ్రాముల బంగారం దొంగతనానికి గురైనట్లు గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
CTR: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన కంపేల మానస అనే మహిళ అదృశ్యం అయినట్లు ఎస్ఐ ప్రసాద్ గురువారం ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్న సమయంలో బ్యాంకు పనిమీద బయటికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి రాలేదన్నారు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మానస తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
NGKL: పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన ఓ వివాహిత మహిళను ఓ యువకుడు ఫోన్ లో వేధించడంతో ఆ మహిళ ఇవాళ షీ టీం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు నాగర్ కర్నూల్ జిల్లా షీ టీం అధికారిని విజయలక్ష్మి తెలిపారు. వేధింపులకు పాల్పడిన యువకుడిపై చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
KNR: జిల్లా చిగురుమామిడి (M) ఇందుర్తికి చెందిన మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ ఎల్ఎండీ జలాశయం వద్ద లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించగా సమీపంలో ఒక సంచిలో ఇందుర్తి గ్రామంగా గుర్తింపు కార్డు ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ: సామర్లకోట సమీపంలో రైలు నుంచి దిగుతూ ఒక యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పెద్దాపురంకు చెందిన సిమ్ము సిరి త్రినాథ్ తల్లి విజయలక్ష్మిని విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో ఉన్న త్రినాథ్ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు.
MBNR: తొర్రూరు మండలం వెలికట్టే శివారులో మంగళవారం లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వెలికట్టే శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని, లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామన్నారు.
BDK: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసారు.
NLR: పొదలకూరు రోడ్డులో చింటూ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయపాళెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కృష్ణ సాయి అనే నిందితుడికి మృతుడికి మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 14న చింటూకి ఫోన్ చేసి తన ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిపించి కత్తులతో పొడిచి హత్య చేశారు.
MLG: పురుగుల మందు తాగి ఓ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రామెళ్ల సతీష్ (39) అనే వ్యక్తి మిర్చి సాగు పంటలో పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు అయ్యారు.