• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టి బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

AP: ఏలూరు జిల్లా వెలగలపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతలపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

July 13, 2025 / 11:28 AM IST

రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి

SKLM: జిల్లా‌లో జిఆర్‌పి పరిధికి చెందిన విజయనగరం వైయస్సార్ నగర్ సమీపంలో రైల్వే పట్టాలపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు శ్రీకాకుళం జి.ఆర్.పి ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే 9493474582, 9110305494 నెంబర్‌లను సంప్రదించాలని కోరారు.

July 13, 2025 / 11:15 AM IST

తుంగభద్ర నదిలో ముగ్గురు గల్లంతు

KRNL: మంత్రాలయం సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో కర్ణాటకకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారి మిత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన ప్రమోద్, సచిన్, అజిత్ నది స్నానానికి వెళ్లగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం ఎస్సై శివాంజల్, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.

July 12, 2025 / 07:41 PM IST

అదుపుతప్పి బోల్తా పడిన టిప్పర్

MHBD: టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మహబూబాబాద్ మండలంలో శనివారం ఉదయం జరిగింది. తాళ్లపూసలపల్లి మీదుగా వెళుతున్న కంకర రవాణా చేస్తున్న టిప్పర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

July 12, 2025 / 10:42 AM IST

నీటి కుంటలో మృతదేహం కలకలం

KRNL: హోళగుంద మండలం హెబ్బటం గ్రామంలోని కుంటలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన రైతులు చూసి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనతో గ్రామంలో కలకలం రేగింది. మృతుడి వివరాలు గుర్తించాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

July 12, 2025 / 09:46 AM IST

ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

KRNL: దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో ఫోన్ కొనివ్వలేదన్న కారణంతో 16 ఏళ్ల శ్రీనాథ్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 9న ఈ ఘటన జరగగా.. కుటుంబ సభ్యులు శ్రీనాథ్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. నెలరోజుల పాటు చికిత్స పొందిన శ్రీనాథ్ గురువారం రాత్రి మృతిచెందాడు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన శ్రీనాథ్ మృతిపై గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

July 12, 2025 / 08:24 AM IST

మయన్మార్‌లో మఠంపై దాడి.. 23 మంది మృతి

మయన్మార్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం క్రమంలో ఓ మఠంపై జరిగిన దాడిలో 23 మంది మృతి చెందారు. మయన్మార్ పాలకుల సైనిక జుంటా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ వైమానిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది గాయపడినట్లు స్థానిక నివాసితులు తెలిపారు. కాగా, గత కొంతకాలంలో మయన్మార్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది.

July 11, 2025 / 08:20 PM IST

స్కూల్ వ్యాన్ బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

MNCL: జైపూర్ మండలం నర్వ గ్రామ సమీపంలో శ్రీరాంపూర్2లోని ఓ పబ్లిక్ స్కూల్ టాటా ఎస్ వ్యాన్ బోల్తా పడింది. 23 మంది విద్యార్థులలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ.. అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం జరిగిందని విద్యార్థులు తెలిపారు. గాయపడినవారిని మెడిలైఫ్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

July 11, 2025 / 02:15 PM IST

ప్రమాదంలో దగ్ధమైన గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణం సీతారామపురంనకు చెందిన గంధం పద్మ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఇల్లు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అగ్ని ప్రమాదంలో దగ్ధమైన గృహాన్ని పరిశీలించి, బాధిత కుటుంబానికి తగిన సాయం అందించేందుకు తక్షణం అధికారులను ఆదేశించారు.

July 11, 2025 / 01:57 PM IST

ఆ పాఠశాలపై చర్యలు: MEO

MDK: తూప్రాన్ హైవే బైపాస్ లో అనుమతి లేకుండా తరగతి నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మండల విద్యాధికారి డాక్టర్ పర్వతి సత్యనారాయణ తెలిపారు. అనుమతి లేకుండా తొమ్మిదవ తరగతి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్ అమ్మకం చేస్తుండడంతో యూనిఫామ్ అమ్మకం గదిని సీజ్ చేసినట్లు తెలిపారు

July 10, 2025 / 07:48 PM IST

పొగాకు విక్రయ దుకాణాలపై డ్రైవ్

కృష్ణా: కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలలు, కాలేజీల సమీపాల్లోని పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై ప్రత్యేక డ్రైవ్ గురువారం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదేశాలతో ఎస్సై పైడిబాబు నేతృత్వంలో చేపట్టిన ఈ చర్యలో COTPA-2003 చట్ట ఉల్లంఘనలపై జరిమానాలు వేసారు. వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసి, నిషేధ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

July 10, 2025 / 05:19 PM IST

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

VZM: భోగాపురం మండలం దలిపేట గ్రామానికి చెందిన దల్లి అప్పలరెడ్డి(40) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ వివాదాలతో మనస్తాపానికి గురై బుధవారం చెట్టుకు ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి భోగాపురం పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

July 10, 2025 / 08:04 AM IST

దారుణం.. భర్తను చంపిన భార్యలు

TG: ఇద్దరు భార్యలు కలిసి భర్తను చంపిన దారుణ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పిట్టలగూడెంకు చెందిన కనకయ్య మద్యం మత్తులో తన ఇద్దరు భార్యలపై గొడ్డలితో దాడికి యత్నించాడు. ఈ క్రమంలో వారిద్దరు కలిసి కనకయ్యను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, కనకయ్య ఇటీవల తన అత్తను చంపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

July 8, 2025 / 11:28 AM IST

కొల్లిపరలో స్కూల్ బస్సును ఢీట్టిన లారీ

GNTR: కొల్లిపర మండలం తూములూరు పాల కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం ఇసుక లారీ అదుపుతప్పి ప్రైవేట్ స్కూలు బస్సును వెనుక నుంచి ఢీకొని, పక్కనే ఉన్న ప్రహరీ గోడను ఢీకొట్టింది. బస్సులోని పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని స్టేషన్‌కు తరలించారు.

July 7, 2025 / 08:10 PM IST

ఉరేసుకొని 16ఏళ్ల యువతి ఆత్మహత్య

KRNL: జిల్లాలో విషాదం నెలకొంది. తిరుపతి జిల్లా చింతవరానికి చెందిన యువతి(16) ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల బాలికల jr. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక్కడ చదువడం ఆమెకు ఇష్టం లేదని సమాచారం. ఈ క్రమంలోనే బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుందని తెలుస్తోంది. బాలిక మృతదేహాన్ని MLA BV జయనాగేశ్వర్ రెడ్డి, సబ్ కలెక్టర్ సందర్శించి నివాళులు అర్పించారు.

July 7, 2025 / 06:43 AM IST