RR: ఫ్లై ఓవర్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ పైనుంచి దూకి ఎండీ అజీమ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి మానసిక సమస్యలు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.
ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలోని హైవేపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఐచర్ వాహనం ఢీకొనడంతో బైక్ మీద వెళ్తున్న మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: సౌదీ బస్సు ప్రమాదంలో HYD విద్యానగర్లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. వీరంతా రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతుడి కుటుంబంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మక్కాలోనే అంత్యక్రియలు చేసేందుకు రేపు బాధిత కుటుంబాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
E.G: కడియం మండలంలోని దుళ్ల గ్రామంలో ముసునూరి వెంకట సూర్యనారాయణమూర్తి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని సుమారు 6 కేజీల వెండి, 40 కాసుల బంగారం, సుమారు రూ.1,50,000 నగదు చోరీకి గురైనట్లు బాధితులు కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఏ. వెంకటేశ్వర్లు, క్లూస్ టీం పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని 60 ఫీట్ రోడ్డులో సోమవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 6 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్యాస్ సిలిండర్ లీకైన దానిపై విచారణ చేపట్టారు.
TPT: పాకాల మండలం దామలచెరువులో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పాకాల సీఐ సుదర్శన ప్రసాద్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం చెరువు మధ్యలో ఉండటంతో బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్లో ఇటీవల అరెస్టు చేసిన ఉగ్ర అనుమానితుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘మేడమ్ సర్జన్’ అనే కోడ్తో ఉగ్ర డాక్టర్లు దేశంలో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు 6న దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ‘ఆపరేషన్ డీ-6’ పేరుతో వీరు కుట్ర పన్నినట్లు తేలింది.
‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 71 ఏళ్ల వృద్ధురాలిని నకిలీ కోర్టు ఉత్తర్వులతో బెదిరించి రూ.49 లక్షలు దోచుకున్న ఒక పెద్ద గ్యాంగ్ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పట్టుకుంది. వ్యక్తిగత వివరాలు మోసాల్లో వాడబడ్డాయని భయపెట్టి, పిల్లలను అరెస్ట్ చేస్తామని బెదిరించి ఈ మోసానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ కేసులో లక్నోలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.
GDWL: జమ్మిచేడు శివారులోని రిజర్వాయర్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చని, నాలుగు రోజుల కిందట చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. పసుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా గుర్తిస్తే స్థానిక పీఎస్కి సంప్రదించాలన్నారు.
నెల్లూరులోని నర్తకి సెంటర్ ఐకాన్ ప్లాజాలో ఉన్న ‘ది క్రిమి స్పాట్’ రెస్టారెంట్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెస్టారెంట్లోని ఫర్నిచర్, ఇతర వస్తువులు కాలిపోయాయి. బాధితుల అంచనా ప్రకారం.. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుంతకల్లు రైల్వే కాలనీలో పట్ట పగలే చోరి జరిగింది. రైల్వే ఉద్యోగి లింగన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 15 తులాల బంగారు, 2 కేజీల వెండి, రూ. 20,000 వేలు నగదును ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేస్తున్న దృశ్యాలన్ని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NZB: నవీపేట్(M) నాలేశ్వర్లో గోదావరిలో మునిగి వ్యక్తి మృతి చెందినట్లు నవీపేట్ ఎస్సై తిరుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. ముత్యంపల్లి గ్రామానికి చెందిన చిన్న సాయిలు తల్వేదలో శుక్రవారం పెళ్లికి వెళ్లాడు. శనివారం ఉదయం లేచి కాలకృత్యాలకు గోదావరి వైపు వెళ్లి కాలుజారి పడి నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు.
కోనసీమ: ఐ.పోలవరం మండలం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా భద్రతా ప్రమాణాలను పాటించని రెండు ట్రావెల్స్ బస్సులను శనివారం సాయంత్రం రవాణా అధికారులు సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించడంతో వాటి ఫిట్ నెస్ను రద్దు చేశామని డీటీవో శ్రీనివాసరావు తెలిపారు. యానం నుంచి అమలాపురం మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సులు కచ్చితంగా నిబంధనలను పాటించాలని సూచించారు.
TG: ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహకుడు రవి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ను ప్రమోట్ చేసినట్లు తేలింది. సైట్లో 1XBet వంటి యాప్ల ప్రకటనలు పెట్టి.. సినిమా చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించేందుకు ప్లాన్ చేశాడు. ఆ కంపెనీల నుంచి ఆన్లైన్ లింక్ల ద్వారా భారీగా నిధులు అందుకున్నాడు. ఈ లింక్ల ఆధారంగానే పోలీసులు రవిని ట్రేస్ చేసి పట్టుకున్నారు.
TG: ఐ-బొమ్మ రవి అరెస్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ను ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ సైట్లో 1XBet, ఇతర యాప్స్ ప్రకటనలు వేశాడు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. బెట్టింగ్ కంపెనీలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నుంచి భారీగా డబ్బలు అందినట్లు విచారణలో తేలింది.