అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి 1000 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అసోంకు చెందినవారిగా గుర్తించారు. కొండ ప్రాంతం కావడంతో మృతదేహాల వెలికితీత కష్టంగా మారింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అనిల్ చోక్రా (A49), వెంకటేష్ (A34) కోర్టును ఆశ్రయించారు. విజయవాడ జైల్లో తమకు పడుకోవడానికి మంచం వసతి కల్పించాలని కోరుతూ పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
AP: అనంతపురం కేఎస్ఆర్ కళాశాలలో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సరిగా చదవట్లేదని తల్లిదండ్రులకు వార్డెన్ ఫిర్యాదు చేయడంతో హెయిర్డై రసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. విద్యార్థినులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
AP: కర్నూల్ జిల్లా అదోనిలోని ఎన్డీబీఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటల చెలరేగడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
VZM: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రామభద్రపురంలో జరిగింది. స్దానిక పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని దిగువ హరిజనపేటకు చెందిన రేజేటి మురళి (50) కూలి TBR థియేటర్ పక్కనున్న పొలంలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బాడంగి CHCకి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
VZM: మెంటాడ (M) గుర్ల సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గజపతినగరం నుంచి కోటపర్తివలసకు సిమెంట్ ఇటుకలు ట్రాక్టర్ పై తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. మృతుడు గణేశ్(18) విశాఖ జిల్లా అనంతగిరి(M) మూలవలస వాసిగా సమాచారం. ఈ ఘటనపై పొలీసులు కేసునమోదు చేసారు.
MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం, డబ్బు తరలించకుండా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు చేగుంట మండలం గొల్లపల్లి శివారులో ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రూ. 50 వేలకు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
MDK: ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా మద్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్నికల వ్యయ పరిశీలకులు జుల్ఫికర్ అలీ హెచ్చరించారు. రామాయంపేట గజ్వేల్ చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న 480 క్వార్టర్ సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న కారుతోపాటు మద్యాన్ని సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
AP: అల్లూరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజారావు అనే వ్యక్తి తన భార్య ఎవరితోనో ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతోందని ఆమెను మందలించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకున్న భార్య, అతడు నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసింది. తీవ్ర గాయాలైన అతడిని కుటుంబీకులు విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ తాజాగా మరణించాడు.
MDK: తూప్రాన్ మండలంలో బుధవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అనుమతించిన ఇసుకను అక్రమంగా సేకరించి, రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. తూప్రాన్ వద్ద ఎస్సై శివానందం ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా.. మెదక్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.
MDK: రామాయంపేట మండలం దామర చెరువు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిట్ల సాయితేజ అనే యువకుడు బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూరత్లో టెక్స్టైల్ మార్కెట్లోని భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయంతో బయటకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి పదో తరగతి చదువుతున్న ప్రణవ్(15)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TG: హైదరాబాద్ మైత్రీవనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపు చేస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులను బయటకు పంపించేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.