• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు

TG: యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దేవతలను దూషించడంపై నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో త్వరలో అన్వేష్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అన్వేష్‌పై హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

December 31, 2025 / 11:52 AM IST

BREAKING: గర్భస్థ ఆడశిశువు మృతదేహం లభ్యం

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ షాబునగర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మురికి కాలువలో గర్భస్థ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. గర్భస్థ ఆడశిశువు వయసు సుమారు ఆరునెలలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాలువలు శుభ్రం చేస్తుండగా శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు.

December 31, 2025 / 10:51 AM IST

అమరావతి-అనంతపురం హైవేపై ప్రమాదం

AP: అమరావతి-అనంతపురం హైవేపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వెర్రిస్వామి, క్షతగాత్రుడు జయరామి రెడ్డిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

December 31, 2025 / 07:56 AM IST

BREAKING: రెండు రైళ్లు ఢీ

ఉత్తరాఖండ్ పిప్పల్కోటిలోని జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అంతర్గత రవాణా రైళ్లు ఢీకొని సుమారు 60 మందికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయ చర్యలు చేపట్టారు.

December 31, 2025 / 07:37 AM IST

బ్యాంక్ దోపిడీ.. రూ.316 కోట్లు చోరీ

జర్మనీలోని ఓ బ్యాంకులో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. గెల్సెన్‌కిర్చెన్ నగరంలో బ్యాంకులోని 3,200 సేఫ్టీ డిపాజిట్లను దొంగలు పగలగొట్టారు. ఇందులోని నగదు, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ 30 మిలియన్ యూరోలు (రూ.316 కోట్లు) పైన ఉంటుందని అంచనా వేశారు. దాదాపు 2,500 మంది ఖాతాదారుల సొమ్ము చోరీకి గురైనట్లు గుర్తించారు.

December 31, 2025 / 06:54 AM IST

దారుణం.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని!

TG: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో దారుణం జరిగింది. తల్లిని కుమారుడు బండరాయితో కొట్టి చంపాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి హనుమమ్మ(75)ను ఆంజనేయులు(45) అనే కొడుకు బండరాయితో కొట్టాడు. దీంతో ఆ వృద్ధురాలు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలింది.

December 30, 2025 / 06:44 PM IST

గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

తిరుపతి గరుడ వారధిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా.. భర్తకు గాయాలయ్యాయి. జీవకోన రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన చంద్రకళ తన భర్త నాగరాజుతో కలిసి అప్పలాయగుంట దైవ దర్శనానికి వెళ్లారు. బైకుపై తిరిగి ప్రయాణమవ్వగా గరుడ వారధి ఫ్లైఓవర్ పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

December 30, 2025 / 06:21 PM IST

BREAKING: మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో హిందూవులపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. భజేంద్ర బిశ్వాస్ అనే యువకుడిని నూమన్ మియా అనే వ్యక్తి కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నూమన్ మియాను అరెస్ట్ చేశారు. కాగా.. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యలు మరువక ముందే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.

December 30, 2025 / 04:16 PM IST

బెంజి కారులో డ్రగ్స్ కలకలం

బెంజి కారులో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివారులో ఓ కారు నుంచి రూ.15 లక్షల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం పలు ఫామ్‌హౌజ్‌లకు ఈ డ్రగ్స్ తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడు అగర్వాల్ కోసం గాలింపు కొనసాగుతోంది.

December 30, 2025 / 03:32 PM IST

SRBCలో రెండు మృతదేహాలు లభ్యం

AP: నంద్యాల జిల్లాలో ఈనెల 28న కుటుంబకలహాలతో పిల్లలను కాల్వలోకి తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు SRBCలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గడివేముల మండలం మంచాలకట్ట SRBCలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. లక్ష్మి (23), వైష్ణవి (3) మృతదేహాలను NDRF బృందం వెలికి తీశాయి. మరో చిన్నారి సంగీత కోసం గాలింపు కొనసాగుతోంది.

December 30, 2025 / 03:10 PM IST

బంగారం కోసం యజమానురాలును చంపేశారు!

TG: HYDలోని నాచారంలో దారుణం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ముగ్గురు యువకులు నాచారంలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో బంగారం కోసం యజమానురాలు సుజాతను హత్య చేశారు. అనంతరం డెడె బాడీని సూట్‌కేసులో తీసుకెళ్లి గోదావరిలో పడేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు సహకరించిన మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

December 30, 2025 / 11:40 AM IST

బస్సు ఢీకొని నలుగురు మృతి

ముంబైలో కొద్దిసేపటి క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. భండూప్ వెస్టులో రివర్స్ తీసుకుంటున్న బస్సు.. అటుగా వచ్చిన ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

December 29, 2025 / 11:43 PM IST

వాటర్ ట్యాంకులో పడి బాలుడు మృతి

SRD: వాటర్ ట్యాంకులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతి చెందిన ఘటన కంగ్టి మండలం సర్దార్ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తాండకు చెందిన రకియా సంతోష్ దంపతుల ఐదేళ్ల బాలుడు శ్యాంసుందర్ సోమవారం సాయంత్రం బడి వదలగానే ఆడుకుంటూ వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి, పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతి చెందాడు. 

December 29, 2025 / 08:25 PM IST

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. కేసు నమోదు

RR: తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన దొంగలు 3 తులాల బంగారం, రూ.40 వేలు దోచుకెళ్లిన ఘటన తలకొండపల్లి PS పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. చంద్రధన గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ ఆదివారం తన బంధువుల ఇంట్లో పూజకు వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

December 29, 2025 / 07:44 PM IST

మాజీ సీజేఐ పేరుతో డిజిటల్ అరెస్ట్

డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ముంబైలోని ఓ వృద్ధురాలి నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ CJI, CBI అధికారులుగా నమ్మిస్తూ.. పోలీసుల త‌న‌పై చ‌ర్య తీసుకునే అవ‌కాశం ఉంద‌ని బెదిరించారు. సుమారు 3.71 కోట్లు పంపింది. మ‌ళ్లీ మ‌ళ్లీ డ‌బ్బులు అడ‌గడంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

December 29, 2025 / 06:08 PM IST