KMR: భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో 44వ హైవేపై ఆగి ఉన్న టిప్పర్ను ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ శ్రావణ్ కుమార్ తలకు తీవ్ర గాయాలవడంతో అతన్ని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బస్సు స్టాఫ్ను ఎక్కించుకోవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది.
AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు యాత్రికులు మరణించడం విషాదకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్ఆర్ఎస్ డిపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో హాట్ మెటల్ కింద పడింది. దీంతో ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జపాన్ను భూకంపం మళ్లీ వణికించింది. అయోమోరి తీరంలో ఇవాళ ఉదయం 6.7 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చాయి. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సముద్రం దరిదాపుల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఇటీవల (సోమవారం) ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. వరుస భూకంపాలతో జపాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.
KDP: కడప పట్టణంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. స్వరాజ్ నగర్ వద్ద పల్లెప వెంకటయ్య (27)ను సిమెంటు రాయితో కొట్టి అతి కిరాతకంగా చంపారు. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.
AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో జపాన్ వాతావరణశాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమోరి ప్రిఫెక్చర్ తీరంలో 20 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెట్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
TG: వేములవాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజుపై దాడి జరిగింది. ఇంటి దగ్గర కారు పార్కింగ్ చేస్తుండగా.. దుండగులు కత్తులతో దాడి చేసేందుకు యత్నించగా రాజు కేకలు వేయడంతో పారిపోయారు. రాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో సహాయ చర్యలకు ఆలస్యం అవుతోంది. సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో ఆలస్యంగా 108 అంబులెన్స్లకి ఫోన్లు చేశారు. దట్టమైన పొగమంచుతో దారి కనిపించకే ప్రమాదం జరిగిందా? ఘాట్ రోడ్డులో జర్నీ డ్రైవర్కు కొత్త కావడం వల్లే బస్సు బోల్తా పడిందా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న నెల్లికుదురు ఫీల్డ్ అసిస్టెంట్ ఫిడ్స్ తో కింద పడిపోవడంతో గాయాల పాలయ్యాడు. గమనించిన అధికారులు, ఉద్యోగుల సాయంతో 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
CTR: అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
AP: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
AP: అల్లూరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో ప్రయాణికుల హాహాకారాలు కలిచివేస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి 1000 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అసోంకు చెందినవారిగా గుర్తించారు. కొండ ప్రాంతం కావడంతో మృతదేహాల వెలికితీత కష్టంగా మారింది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అనిల్ చోక్రా (A49), వెంకటేష్ (A34) కోర్టును ఆశ్రయించారు. విజయవాడ జైల్లో తమకు పడుకోవడానికి మంచం వసతి కల్పించాలని కోరుతూ పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.