చిత్తూరులో గురువారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని 47వ డివిజన్లో వెంకట రెడ్డి(50)ని ఆయన కుమారుడే హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
AKP: నర్సీపట్నం పట్టణం 6వ వార్డులో ట్రాన్స్ఫార్మర్ పేలుడు సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వస్తున్నా, విద్యుత్ శాఖ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. ఈ రోజు రాత్రి ఆ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి.
KRNL: కోడుమూరులో నూతనవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎస్సై ఎర్రిస్వామి వివరాల ప్రకారం.. వర్కూరుకు చెందిన శృతిని కోడుమూరుకు చెందిన నాగరాజు వివాహం చేసుకున్నాడు. చెప్పులు కొనుక్కోవడానికి భర్తను డబ్బులు అడగగా ఇవ్వలేదు. దీంతో తీవ్రమనస్తాపం చెంది వాస్మోయిల్ తాగడంతో కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
BPT: బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం గ్రామంలో గత వారం భార్యపై అనుమానంతో ఆమె నిద్రిస్తుండగా భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. బంధువులు హుటాహుటిన ఆమె వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. భార్యను హతమార్చిన ఘటనలో నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడుని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు మీడియా ముందు హాజరు పరిచారు.
కోనసీమ: ఉప్పులగుప్తం మండలం ఎస్.యానాం బీచ్లో మంగళవారం సాయంత్రం గల్లంతైన నేదునూరుకి చెందిన జస్వంత్ మృతదేహం ఇవాళ వాసాల తిప్పతీర ప్రాంతంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న జస్వంత్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
కోనసీమ: మద్యం అలవాటు మానుకోమని తల్లిదండ్రులు మందలించడంతో ఉప్పలగుప్తం(M) వాడపర్రుకు చెందిన సురేశ్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 7న యువకుడు విషం తాగగా కుటుంబీకులు అమలాపురంలో కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.
SRPT: ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలైన ఘటన సూర్యాపేట మండల తాళ్ళఖమ్మంపహాడ్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సైదులు తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు జారీ పడి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కోనసీమ: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి మండపేటలో వాటర్ ట్యాంక్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన మోర్త సూరిబాబు మంగళవారం బురుగుంటచెరువు దగ్గర వాటర్ ట్యాంక్పై నుంచి దూకాడు. స్థానికులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై టౌన్ ఎస్సై జి.చంటి కేసు నమోదు చేశారు.
HYD: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్య పేస్ -2 లో జరిగిన డబుల్ మర్డర్ను పోలీసులు ఛేదించారు. ఈరోజు రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.. హత్యకు గురైన దంపతులు షేక్ అబ్దుల్లా, రిజ్వానా బేగంల వద్ద గతంలో మహమ్మద్ షకీల్ సల్మాన్ (33) డ్రైవర్గా పని చేశాడు. అతనిని తీసివేయడంతో హత్య చేసినట్లు తెలిపారు.
కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన మోటుపల్లి స్వామినాయుడు(36) సోమవారం బహిర్భూమికి వెళ్లి గోదావరిలో పడి మృతి చెందాడు. హైదరాబాద్లో టైలరింగ్ చేస్తూ జీవనోపాధి పొందే స్వామినాయుడు శనివారం స్వగ్రామం వచ్చాడని స్థానికులు తెలిపారు. వేసవి సెలవులకు స్వగ్రామం వచ్చిన అతనికి ప్రమాదం జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
HYD: మహారాష్ట్రకు చెందిన యువతి(22) రాత్రి సమయంలో జూబ్లీహిల్స్లో ఒంటరిగా నిల్చొని ఉండగా మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి ఆమెకు ఆశ్రయమిస్తానని నమ్మించాడు. కమలాపురికాలనీలోని గదికి తీసుకెళ్లి భోజనం పెట్టి ఆకలితీర్చాడు. అనంతరం లైంగిక దాడికి యత్నించగా యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వారి సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు.
KDP: చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. కవల పిల్లలైన రామ్, లక్ష్మణ్ నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వీరు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందినవారు. చిన్నప్పుడే వీరి తండ్రి చనిపోవడం, తల్లి మరొకరితో వెళ్లిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: పిఠాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. దుర్గాడకు చెందిన మమత కాకినాడ వెళ్తుండగా.. రాపర్తి రోడ్డు వద్ద గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె చెల్లి కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KKD: పిఠాపురంలో బొజ్జ రాంప్రసాద్, బొజ్జ వీరబాబు అనే వ్యక్తులు ఆదివారం తనపై దాడి చేశారని జనసేన నాయకుడు, పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమళ్ రాంబాబు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటిక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో తాను పాపిడి దొడ్డి చెరువు వద్దకు వెళ్లగా.. తనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మణిపాల్ స్కూల్ వెనుక విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని పెట్రోల్ పోసి దుండగులు తగలబెట్టారు. వారం ముందు విద్యార్థిని అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కాగా వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.