ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందగా.. మిగతావారికి గాయాలయ్యాయి. బస్సులో ఏపీలోని నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
TG: హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా గుర్గావ్లో అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఫేక్ ఆధార్తో గుర్గావ్లో ఉన్నట్లు గుర్తించామని, నౌహీరాను త్వరలో HYDకి తరలించనున్నట్లు తెలిపారు. కాగా, అధిక లాభాలు ఆశ చూపి రూ. 5,000 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి పరారైంది. దీంతో ఆమెపై 60కి పైగా కేసులు నమోదయ్యాయి.
థాయ్లాండ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టాయాలోని హోటల్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి-కొండూరు సత్రం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి నెల్లూరు బయల్దేరిన ఆర్టీసీ బస్సు, మార్గమధ్యంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ATP: గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో గురువారం ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న GRP పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై GRP పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై హరిచందన తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40-45 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుడు ఎత్తు 5.4 అడుగులు కలిగి, బులుగు రంగు గీతల ఫుల్ హాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆనవాళ్లు లభించలేదని… ఎవరికైనా ఆచూకీ తెలిస్తే స్టేషన్ లో సంప్రదించాలన్నారు.
TG: మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో కంటైనర్లో మంటలు చెలరేగాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటైనర్లో తరలిస్తున్న 10 కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 24 గ్రాముల బంగారం, మూడు బైకులు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లోని దుండిగల్లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అంతేకాకుండా వీడియోలు తీసి బాలికను బెదిరించి శివకుమార్, రాము పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో వారిపై పోలీసులు పోక్సో కేసు పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: మాజీ IPL అధికారి భార్య తనూజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య, బంగారం చోరీలో ఏడుగురు పాల్గొన్నారని నిర్థారించారు. ప్రధాన నిందితుడు ముంబై క్యాబ్ డ్రైవర్ నేపాలీ సునీల్గా గుర్తించారు. చోరీ చేసిన బంగారాన్ని జ్యువెలరీ షాపులో విక్రయించారు. బంగారం కొనుగోలు చేసిన షాప్ యాజమానిని అరెస్ట్ చేశారు.
TG: ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడింది. 2026 మే 20వ తేదీన హంతకునికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది వరంగల్ జిల్లా కోర్టు. 2024 జులైలో తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రియురాలి తల్లిదండ్రులను ప్రేమోన్మాది నాగరాజు నరికి చంపిన విషయం తెలిసిందే. 16 చింతలతండాలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.
AP: కడప జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంగడివీధికి చెందిన ప్రధాన విక్రయదారులు మాధవ, సాకే శంకర్లతో పాటు మనోజ్ కుమార్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
రాజస్థాన్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. అక్కాచెల్లెళ్లు ఆడుకుంటూ వెళ్లి సర్వీస్ సెంటర్లో నిలిపిన కారులో చిక్కుకుపోయారు. కారు డోర్లు లాక్ కావడంతో బయటకు రాలేకపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఈ క్రమంలో కారులో అపస్మారక స్థితిలో బాలికలను గుర్తించారు. అప్పటికే ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
AP: విజయనగరం రాజాం మండలం గెడ్డవలసలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పిడుగుపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మృతులు సత్తెమ్మ, రాజు, నర్సమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చైనా హునాన్ ప్రావిన్స్లోని బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా.. 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.