• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు మృతి

TG: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు సహా మహిళ మృతి చెందింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు కుంటలో పడగా.. వారికి కాపాడానికి వెళ్లిన మహిళ కుంటలో పడి మరణించింది. మృతులు ఉమాదేవి మాంజి(32), కిరానికుమార్(13), బిర్జు మాంజి(6)గా పోలీసులు గుర్తించారు.

January 11, 2026 / 12:01 AM IST

కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి

అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. క్లే కౌంటీలో జరిగిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మూడు వేర్వేరు ప్రదేశాల్లో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

January 10, 2026 / 10:42 PM IST

చెరువు నీటిలో మునిగి మృతి

MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పిటి) గ్రామానికి చెందిన రావెల్లి దుర్గయ్య చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబీకుల దశదినకర్మ పురస్కరించుకొని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన దుర్గయ్య కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. గజ ఈతగాల్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.

January 10, 2026 / 07:08 PM IST

చెరువు నీటిలో మునిగి వ్యక్తి మృతి

MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పిటి) గ్రామానికి చెందిన రావెల్లి దుర్గయ్య చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబీకుల దశదినకర్మ పురస్కరించుకుని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన దుర్గయ్య కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. గజ ఈతగాల్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.

January 10, 2026 / 07:08 PM IST

గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు.. భారీ స్కాం

బీహార్‌లో భారీ స్కాం బయటపడింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో మహిళలను గర్భవతులను చేస్తే రూ.10L.. ఫెయిలైతే రూ.5L ఇస్తామని సైబర్ నేరగాళ్లు పలువురిని మోసం చేశారు. అందమైన ఆడవాళ్ల ఫొటోలు చూపించి రిజిస్ట్రేషన్‌కు రూ.799, సెక్యూరిటీ డిపాజిట్ కింద 25 వేలు, ఇలా పలు కారణాలతో 100 మంది నుంచి రూ.50 లక్షల వరకు కాజేశారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదైంది.

January 10, 2026 / 05:11 PM IST

సైబర్ నేరగాళ్ల వలలో మాజీ ఐపీఎస్‌ భార్య

TG: పెట్టుబడుల పేరుతో మాజీ IPS భార్యను సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.2.58 కోట్లు మోసం చేశారు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వాట్సాప్‌లో నేరగాళ్లు పంపించిన నకిలీ సెబీ సర్టిఫికేట్లు, ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈనెల 5 వరకు మాజీ IPS భార్య లావాదేవీలు నిర్వహించారు. మొత్తం 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లను పంపించారు.

January 10, 2026 / 04:32 PM IST

కుప్పకూలిన చార్టర్ ఫ్లైట్

ఒడిశా రవుర్కెలాలోం ఓ చార్టర్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో 9 మంది ప్రయాణికులు ఫ్లైట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

January 10, 2026 / 02:45 PM IST

BREAKING: కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్

ఒడిశా రవుర్కెలాలోం ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో 9 మంది ప్రయాణికులు ఫ్లైట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

January 10, 2026 / 02:45 PM IST

చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు

TG: వరంగల్‌లో చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు అయింది. ఈ క్రమంలో ఆరుగురు చిన్నారులను రక్షించిన పోలీసులు ముఠా సభ్యులు నరేష్, యాదగిరిని అరెస్ట్ చేశారు. పిల్లలులేని దంపతులకు చిన్నారులను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కారు, 12 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. చిన్నాలను కొన్న 8 మందిపై కేసు నమోదు చేశారు.

January 10, 2026 / 02:43 PM IST

యువకుడి గొంతు కోసి దారుణ హత్య

TG: హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య జరిగింది. శంషాబాద్ పరిధిలోని మధురానగర్ ప్రాంతంలో దుండగులు ఓ యువకుడిని గొంతు కోసి హతమార్చారు. నడిరోడ్డుపై, జన సంచారం ఉన్న చోట హత్య చేశారు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

January 10, 2026 / 10:50 AM IST

దారుణం.. కర్రలు, రాళ్లతో కొట్టి హత్య

AP: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక చెంచుపేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద షేక్ ఫయాజ్(50) అనే వ్యక్తిపై దుండగులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫయాజ్ AC మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడని తెలిపిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

January 10, 2026 / 10:00 AM IST

డబ్బు తీసుకుని నిందితుడిని వదిలేసిన పోలీసులు

TG: నిందితుడి నుంచి డబ్బులు తీసుకుని వదిలేశారు కర్నూలు జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. HYDకు చెందిన అతణ్ని పట్టుకుని కర్నూలుకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో నలుగురు కానిస్టేబుళ్లు డబ్బులు తీసుకున్నారు. దీనిపై తాను చేయని తప్పుకు బెదిరించి లక్షలు వసూలు చేశారని అతను ఆధారాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నలుగురు కానిస్టేబుళ్లపై వారు చర్యలకు సిద్ధమయ్యారు.

January 10, 2026 / 08:44 AM IST

దివ్యాంగురాలిని హతమార్చిన క్రికెటర్

చిత్తూరులో దివ్యాంగుడైన SBI మేనేజర్ గణేష్, పెళ్లి కోసం ఒత్తిడి చేసిన తన ప్రియురాలు దివ్యాంగురాలైన కవితను దారుణంగా హత్య చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన గణేష్, ఆమెను వంతెన పైనుంచి తోసి చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు పంపిన వాయిస్ సందేశాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

January 10, 2026 / 07:23 AM IST

దారుణం.. నడిరోడ్డుపై మహిళ హత్య

TG: ఖమ్మం నగరంలో నడిరోడ్డుపై ప్రమిళ అనే వివాహితను దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. నగరంలోని కస్బానగర్‌లో ఈ ఘటన జరగ్గా.. మృతురాలిని భద్రాచలం వాసిగా గుర్తించారు. పిల్లలు పుట్టని కారణంతో ఆమె, తన భర్త RMP డాక్టర్ BN రావు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే ఆమెను శ్రావణ్ అనే ఫ్రెండ్ వేధించడంతో.. అతనిపై కేసు పెట్టింది. దీంతో అతనే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

January 10, 2026 / 06:23 AM IST

BREAKING: బస్సు ప్రమాదం.. 8 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడటంతో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సు సిమ్లా నుంచి కుప్వి వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 9, 2026 / 04:53 PM IST