అన్నమయ్య: మైసూరు వారిపల్లి సమీపంలో కడప-రేణిగుంట జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తున్న ఇద్దరు, ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. SVS కెమికల్స్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో కార్మికులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు.
TG: మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్ల కోసం ఈగల్ టీమ్ గాలింపు చేపట్టింది. నీతు భాయ్ కుమారుల కోసం నానక్రామ్గూడ IT కారిడార్లో నీతుభాయ్ డెన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఖాలు సింగ్, గౌతమ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నీతూ భాయ్ గతంలో పీడీ యాక్ట్లో అరెస్టయి విడుదలయ్యాడు. అతడిపై ఇప్పటికే 12 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
AP: BJP ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలోనూ సుధీర్ రెడ్డి రెండుసార్లు డ్రగ్స్ కేసులో దొరికినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని డీ అడిక్షన్ సెంటర్కు తరలించారు. ఆయనతో పాటు మరోకరిని కూడా అరెస్ట్ చేసినట్లు ఈగల్ టీమ్ పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AP: BJP ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలోనూ సుధీర్ రెడ్డి రెండుసార్లు డ్రగ్స్ కేసులో దొరికినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని డీ అడిక్షన్ సెంటర్కు తరలించారు. ఆయనతో పాటు మరోకరిని కూడా అరెస్ట్ చేసినట్లు ఈగల్ టీమ్ పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. దాముద్యా ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల ఖోకన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు ఆయన చెరువులో దూకినప్పటికీ, తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్తోపాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
AP: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. జెట్టీ వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు పెరుగుతుండటంతో మత్స్యకారులు బోటులో నుంచి కిందకు దూకేశారు. అగ్నిప్రమాదంలో బోటు, వలలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేపాల్లో పెను విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఓ విమానం అదుపు తప్పి రన్వే పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రన్వే జారిపోవడమే దీనికి కారణమని ప్రాథమిక సమాచారం.
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. దుండగులు ఓ వ్యాపారి కారుపై ఏకంగా 12 రౌండ్ల కాల్పులు జరిపారు. అంతర్జాతీయ నంబర్ నుంచి ఫోన్ చేసి తనను రూ.3 కోట్లు డిమాండ్ చేశారని బాధితుడు పోలీసులకు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TPT: తొట్టంబేడు పరిధిలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. వరదయ్య పాలెం వైపు బైకుపై చందు (21) వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏరియా హాస్పిటల్కు తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
అన్నమయ్య: రాజంపేట మండలం నూనెవారి పల్లెలో సాయంత్రం 6:30 గంటలకు బీవీఎన్ పాఠశాల సమీపంలోని రాములవారి ఆలయం వద్ద మహిళ మెడలోని సరుడును ఎర్ర చొక్కా ధరించిన దొంగ పల్సర్ బైక్పై వచ్చి లాక్కెళ్లాడు. సరుడులో రూ.1.50 లక్షల విలువైన బంగారు పుస్తెలు ఉన్నాయి. ఘటనలో మహిళకు మెడ గాయం కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
VSP: మద్దిలపాలెం ఆటోమోటివ్ సమీపంలో ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో వృద్ధురాలు శుక్రవారం తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆమెను కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: పట్టపగలే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన సోమలలో చోటుచేసుకుంది. బాధితురాలు రెడ్డమ్మ వివరాల మేరకు.. పిండి మిషన్కు వెళ్లేందుకు సాయిబాబా ఆలయం పక్కన ఉన్న దారిలో వెళ్తుండగా, బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 24 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది.
TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. కాలువలో నీళ్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.