AP: విశాఖపట్నంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గాజువాకలోని ఓం జ్యూవెలరీ, పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యూవెలరీలో చోరీకి ముఠా సభ్యులు పథకం రూపొందించారు. కస్టమర్లుగా వచ్చి ఆభరణాలను కొప్పులో, చీరల్లో దాచి పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులకు అరెస్ట్ చేశారు.
AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, దస్త్రాలు ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో చలిమంట నుంచి వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చలిమంట, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, కావాలనే చేశారా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు ఆర్డోవో బాలకృష్ణ వెల్లడించారు.
AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. మంటల తీవ్రత తగ్గినా పూర్తి నియంత్రణకు ఓఎన్జీసీ ముమ్మర చర్యలు చేపట్టింది. గూడపల్లి నుంచి నీటిని వినియోగించుకుని అగ్నికీలలను సిబ్బంది చల్లారుస్తున్నారు. బ్లో అవుట్తో సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు.
TG: సినిమా షూటింగ్కు వెళ్లొస్తున్న బస్సు హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుజామున ఫ్లైఓవర్ స్టార్టింగ్లో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా.. మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. విశాఖ నుంచి HYD మణికొండకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: కాచిగూడలోని ‘సీఎంకే ల్యాబ్’లో డీసీఏ అధికారులు 1000 మేక రక్తాన్ని సీజ్ చేశారు. మనిషి రక్త బ్యాగుల్లో దీన్ని నింపి హర్యానాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆటోక్లేవ్, లామినార్ ఎయిర్ ఫ్లో వంటి పరికరాలను ఇక్కడ వినియోగిస్తున్నారు. టీకాలు, కాస్మెటిక్స్ తయారీ కోసం ఈ రక్తాన్ని వాడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు నికేష్ పరారీలో ఉన్నాడు.
TG: బస్సు ఢీకొనడంతో జెప్టో డెలవరీ ఏజెంట్ మృతి చెందిన ఘటన HYDలో జరిగింది. బస్సు పక్కనే వెళ్తున్న రైడర్ బైక్ అదుపుతప్పి బస్సు కిందపడిపోయినట్లు CC TV కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర గిగ్ అండ్ ఫ్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్.. బాధిత కుటుంబానికి తక్షణ సాయం, ప్రమాద బీమా అందించాలని డిమాండ్ చేశారు.
AP: ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటన విశాఖలో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి వసంత రావు అనే వ్యక్తితో భార్య రమ్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భార్త నాగరాజును ప్రియుడు వసంతరావుతో పాటు అతడి స్నేహితులు బాలకృష్ణ, మండులా సాయంతో హత్య చేయించింది. విచారణ చేపట్టిన పోలీసులకు భార్యే హత్య చేయించిందని తెలియడంతో రమ్య, ప్రియుడితో పాటు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అమెరికాలోని ఇండియానాలో భారీగా కొకైన్ తరలిస్తున్న ఇద్దరు భారతీయులను అధికారులు అరెస్టు చేశారు. ట్రక్కుల స్లీపర్ బెర్త్ల నుంచి 309 పౌండ్ల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30)గా గుర్తించారు. వీరిద్దరూ గతంలోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విచారణలో తేలింది.
TG: సంగారెడ్డి ఇస్నాపూర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరుపుల గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: మనుబోలు మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. YSR కూడలి వద్ద పెంచలయ్యకు చెందిన బట్టల గోడౌన్ గ్రిల్స్ తొలగించి రూ.లక్ష విలువైన వస్తువులను, బీసీ కాలనీలోని మరో ఇంట్లో తలుపులు పగులగొట్టి రూ. 50 వేల నగదు, 5 ఉంగరాలు, వెండి వస్తువులను అపహరించారు. క్లూస్ టీంతో పోలీసులు వేలిముద్రలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పొన్నమాకులపల్లిలో ఈ ప్రమాదం జరగ్గా.. ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. అందరినీ వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అటు జిల్లా కేంద్రం చిత్తూరులోనే కరెంట్ తీగలు అంటుకుని ఓ టిప్పర్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో టిప్పర్ క్లీనర్ పీతాంబరం శెట్టి మృతి చెందాడు.
ATP: రాప్తాడులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడు చిన్న ఉజ్జనప్ప కుటుంబం బుధవారం పొలం పనులకు వెళ్లిన సమయంలో దొంగలు కిటికీ ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ శ్రీహర్ష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
HYD: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్పూర్ న్యూ భాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లలతో మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
తమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఊటీకి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి 100 అడుగులు ఎత్తు నుంచి కిందపడింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రయాణీకులంతా తీవ్రంగా గాయపడగా వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
SRD: ఆందోల్ మండలంలోని సంగుపేట గ్రామ శివారులో ట్రాక్టర్పై వెళ్తున్న ఓ మహిళ జారీ కింద పడి మృతి చెందింది. పెద్ద శంకరంపేట నుంచి సంగారెడ్డికి గ్రానైట్ రాళ్లను ట్రాక్టర్లో తరలిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతురాలిని శంకరంపేట గ్రామానికి చెందిన మల్లమ్మ (40)గా గుర్తించారు. సంఘటన స్థలానికి జోగిపేట్ పోలీసులు చేరుకొని ఘటనపై విచారణ ప్రారంభించారు.