HYD: శంషాబాద్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాలమాకుల వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రయాణికులు కొద్ది సేపు ఇబ్బంది పడ్డారు.
కృష్ణా: కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లి రోడ్లో కోమటి గుంట లాకులు దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం శుక్రవారం జరిగింది. ఏలూరు జిల్లా కలదిండి మండలం మట్టగుంట గ్రామానికి చెందిన అశోక్ బైక్పై వెళ్తుండగా రోడ్డు మధ్యలో గొతి ఉండడంతో పడిపోగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు.
కృష్ణా: కృష్ణానదిలో గల్లంతై యువకుడు మృతి చెందాడు. శనివారం చల్లపల్లి మండలం నిమ్మగడ్డకు చెందిన మేడేపల్లి తేజా బాబు (21) సీతపీడలంకలో పొలానికి వెళ్లి తిరిగివస్తూ.. నదిలో మునిగి గల్లంతయ్యాడు. ఎప్పుడూ వెళ్లే దారి అయినప్పటికీ నీటిలో పక్కనే ఉన్న ఊబిలో అడుగేసి కూరుకుపోయాడు. పోలీసులు పడవలపై గాలిస్తూ ఈతగాళ్లతో వలలతో గాలించి మృతదేహం గుర్తించారు.
కోనసీమ: ఆలమూరు మండలం మూలస్థానం కూడలి దగ్గరలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట మండలం శీలంవారిపాలానికి చెందిన తల్లి, కొడుకు గాయపడ్డారు. కొత్తపేట నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్లో వారిని ఆసుపత్రికి తరలించారు.
SRCL: ఓ యువకుడు క్షణికావేశంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతుల అరవింద్( 21) హైదరాబాద్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్ఘర్ జిల్లా బిబల్ధర్ గ్రామంలోని మైనర్ బాలికతో నీలేష్ దోంగ్డాకు పెళ్లి నిశ్చయమైంది. అయితే బాలిక తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి దూరి పెళ్లికి ముందే తనతో శృంగారం చేయాలని అతను బలవంతం చేశాడు. దానికి బాలిక ఒప్పుకోకపోవడంతో అత్యాచారం చేసి, హత్య చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నీలేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
VSP: చోడవరం సబ్ జైలు నుంచి తప్పించుకున్న రిమాండ్ ఖైదీలను విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం చోడవరం సబ్ జైలు సిబ్బందిపై దాడి చేసి పారిపోయిన నిందితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ రైల్వే, బస్ స్టేషన్లు, బస ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శనివారం వారిని అరెస్ట్ చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైవేపై ట్రాలీ ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. దోమకొండకు చెందిన యువకులు గణేష్ నిమజ్జనం కోసం ట్రాలీ ట్రాక్టర్ తీసుకెళ్తుండగా లారీ ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్ తరలించగా ఇద్దరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అదిస్తోన్నారు.
KMM: కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు నూకల మల్లయ్య కుమారుడు సాయికిరణ్ యాదవ్ శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో వెనుకున్న వాహనం ముందు భాగం దెబ్బతిని ఆ వాహనంలో ఉన్న మహిళ ముఖానికి గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
E.G: నల్లజర్ల మండలంలోని పోతవరం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: నారాయణపేటలో వినాయక నిమజ్జన ఉత్సవాల సమయంలో అపశృతి చోటుచేసుకుంది. బురుడు వాడి శాసనపల్లి శేఖర్(45) గుండెపోటుతో మృతి చెందాడు. మున్సిపాలిటీ నీటి సరఫరా విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి అయిన శేఖర్ నృత్యం చేస్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై, మాజీ ఛైర్మన్ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అధిక శబ్దం కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని ఆరోపణలు వస్తున్నాయి.
TG: హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు అయింది. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మేడ్చల్లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని ముంబై థానే క్రైమ్ బ్రాంచ్ సీజ్ చేసింది.
MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి-ధర్మారం మధ్యలో బైక్ కాలువలో పడి పూడూరి నరేష్ మృతి చెందాడని స్థానిక ఎస్సై అనూష తెలిపారు. బీర్పూర్కు చెందిన నరేష్, విష్ణువర్ధన్ బాదంపల్లిలోని అక్క ఇంటికి వచ్చి రాత్రి తిరిగి వెళుతున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కాల్వలో పడడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. విష్ణువర్ధన్ కు గాయాలయ్యాయని ఎస్సై అనూష వివరించారు.
VSP: స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడు శనివారం మృతి చెందాడు. పెద గంట్యాడ నడుపూర్కు చెందిన సిహెచ్ అప్పలనాయుడు సీడీసీపీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు 30 అడుగుల ఎత్తు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు ఆసుపత్రికి తరలించారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.