TG: నిర్మల్ జిల్లాలోని ఇచ్చోడ మండలం సోంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 18 మందికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.